పుస్తకాలు చదివే ఎవరికైనా విజయవాడ, ఏలూరు రోడ్డులో 2017 వరకు ఉన్న “నవోదయ” గురించి తెలియకుండా ఉండదు. 2009 వ సంవత్సరం నుండి వదలకుండా “విజయవాడ పుస్తక మహోత్సవానికి” వెళ్ళడం నాకు అలవాటు. గత సంవత్సరం కూడా అదే సందర్భముగా కారులో మా పుస్తకాల షాపు వద్దకు వచ్చినప్పుదు కలిశాను, చిరునవ్వుతో పలకరించారు. పుస్తక మహోత్సవములో 2017 వరకు వారి షాపు, మాది పక్కపక్కనే ఉండేవి. ముప్పై సంవత్సరాల పాటు “జనవరి 1 – 11 లేదా 12 వ తారీఖు” వరకు క్రమం తప్పకుండా, తారీఖు మారకుండా జరిగింది. ఈ సంవత్సరం ఆయనా లేరు, పుస్తక మహోత్సవం మొదలయిన తారీఖు మారింది. ( జనవరి 03, 2020 – 12,2020 ). మూడు సంవత్సరాల క్రితం వరకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా, 320 పైచిలుకు పుస్తకాల షాపులతో ఒక పండగలా ఈ మహోత్సవం జరిగేది. గత రెండు మూడేళ్ళగా సరిగ్గా జరగడం లేదు. ఈ సంవత్సరమయితే మాటల్లో చెప్పలేనంత పేలవంగా జరిగింది. దానికి కొంత వర్షం కారణమయితే, 80% నిబద్దతా లోపం.
ఇప్పుడు అసలు విషాయానికి వస్తాను. ప్రతి సంవత్సరం అన్ని షాపులు తిరిగి నాక్కావలసిన పుస్తకాలు జల్లెడ పట్టడం నా పని. 2014 లో అలా నేను ఒక చుట్టు వేయబోయే ముందు మా షాపులో వారు “రామ్మోహనరావు” గారికి ఏవో పుస్తకాలు కావాలంటే వెళ్ళి ఆయన్ని కలిశాను. అప్పుడు నా చేతిలో ఒక చిన్న చీటి పెట్టి, దానిలో ఉన్న ఏ పుస్తకం దొరికినా కావాలి / తీసుకొమ్మని అన్నారు. ఆ చీటిలో ఉన్న పుస్తకాల జాబితా ఇదే!
1. శస్త్రదాస్యం – కొప్పరపు సుబ్బారావు
2. తారాశశాంకం ( నాటకం ) – కొప్పరపు సుబ్బారావు
3. హితసూచని – సామినేని ముద్దునరసింహ నాయుడు
మొదటి పుస్తకం అక్కడే ఒక షాపులో దొరికింది, తీసుకొచ్చి ఆయనికిస్తే ఆ మూడింటిలో ఒక్కటైనా దొరికినందుకు సంతోషించారు. ఆ తరువాత విజయవాడలోని సోషల్ సైన్సెస్ లైబ్రరికి, పోలండ్ దేశం నుండి రెండవ ప్రపంచ యుద్ధ సమయం వరకు వచ్చిన గొప్ప కవిత్వానికి సంబంధించి ఒక పుస్తకముంటే తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఉన్న పుస్తకాలన్నిటిని గమనిస్తుంటే “మూడవ” పుస్తకం దొరికింది. అది వెంటనే తీసుకుని, కాపి చేయించి ఏలూరు రోడ్డులో ఉన్న షాపుకెళ్ళి ఆయనకిచ్చాను, నవ్వారు, నేనూ నవ్వి చివరి పుస్తకం కుడా దొరికితే అందజేస్తానని చెప్పి వెళ్ళిపొయాను. విజయవాడ నుండి వెళ్ళిపోయిన తరువాత అంతర్జాలములో గాలిస్తే “రెండవ” పుస్తకం దొరికింది, అది ఆయనకి “జనవరి 29, 2014” న వారి ఈ-మెయిల్ ( vjw_booklink@yahoo.co.in ) కి పంపించాను. దానికి బదులు సమాధానంగా ఇలా వ్రాసి పంపారు “8, ఫిబ్రవరి, 2014” న…
“బాపుగారు అడిగిన 3 పుస్తకాలు సంపాదించిపెట్టినందుకు ధన్యవాదాలు. బాపుగారు చాలా సంతొషించారు.’మిసిమి’ ఫిబ్రవరి ఇష్యులో బాపుగారు ‘లెటర్ టు ది ఎడిటర్’ వ్రాశారు. చుశారా? ”
మధ్యలో అయనతో ఫోనులో మాట్లాడినప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన అడిగిన అన్ని పుస్తకాలు ఇవ్వలేకపొయాను. చాలాకాలం తరువాత అడిగిన మూడు పుస్తకాలు ఇవ్వగలిగాను అని సంతోషంగా చెప్పారు. ఆయన ఈ-మెయిల్లోనే ఉన్నట్ట్లుగా “ఆయనకి పుస్తకాలకి, పుస్తకాలు కావలసిన వాళ్ళకి ఆయనకి లింకు”. నాతో ఫోనులో మాట్లాడినప్పుడు ఆ మూడు పుస్తకాలు అందజేయగలిగినందుకు ఆయన గళంలో ధ్వనించిన సంతోషం ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది.
ఒక అరుదైన మనిషి. విజయవాడ పుస్తక ప్రచురణ రంగంలో మేరుశిఖరం.
‘పదివేల పేజీలు.. యెవరికీ అర్థంకాని’ – నెట్ లో ఉంది. ఒకసారి చూడండి. I did it. ‘Capitalism based’- అన్న అభ్యంతరం లేకపొతే, మనది అద్భుతమైన రాజ్యాంగం అని నా అభిప్రాయం.
నేరం చేసాడో లేదో తెలియదు అనే ముక్క పట్టుకుని కధ రాసారులా ఉంది. కానీ నిర్భయ కేసునుంచి ఈ రోజు వరకూ జరిగినవి చూస్తే తెలిసేదేమంటే, ఎంత వెధవైనా సరే వాడికి ప్రాణం మీద “అతి” తీపి. నేను అమాయకుణ్ణీ అని చెప్పుకోవాలనే తాపత్రయం; ఏదో ఒక లొసుగు ఉండకపోదా తప్పించుకోవడానికి అనే ఆశ. ఇవన్నీ కూడా రేప్ చేసినప్పుడూ, ఆ తర్వాతా గుర్తుకురాకపోవడం, ఇంతటి నీచమైన పనిచేసినా దానికి ఒప్పుకుని పశ్చాత్తాపం పడకపోవడం దారుణం. ఇదంతా ఒక ఎత్తైతే మన అద్భుతమైన న్యాయ వ్యవస్థా, దాదాపు పదివేల పేజీల – దాదాపు ఎవరికీ అర్ధంకాని, గుర్తు ఉండని – రాజ్యాంగం ఎంతకీ తేలని కోర్టు కేసులూ మరో ఎత్తు. నిర్భయ అమ్మగారు ఏమన్నారో ఎవరైనా విన్నారా? “నా కూతురు పోయి ఏడేళ్ళు దాటుతోంది. ఏడవడానికి కన్నీళ్ళు కూడా ఎండిపోయాయి” అంటున్నారు. మరి ఆవిడ క్షోభో? ఈ ఏడేళ్లలో పాపం ఆవిడ ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపిందో, ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగిందో, ఎంత దారుణంగా ఆ బాధ గుండెల్లో నొక్కుకుందో ఎవరైనా ఆలోచించారా?
ఈ రోజు వచ్చిన వార్త ప్రకారం ఈ నిర్భయ కేసులో ఒకడు క్యూరేటివ్ పిటిషన్ అనే కేసు ఏదో వేశాట్ట ఆఖరు అస్త్రంగా. వాడిని పోలీసులు తీసుకెళ్తున్నట్టూ ఒక బొమ్మ – కలర్ దే – వేసారు. కండలు పెంచి వస్తాదులాగా ఉన్నాడు. జైల్లో ఉచితంగా పెట్టే కోడికూరా బిర్యానీలు బాగా వంటబట్టినట్టున్నాయ్. రేప్ చేసినప్పుడు, ఆవిడ రక్తం కారుతూ చేతులెత్తి మొరపెట్టినప్పుడూ, ఆవిడని బస్సులోంచి తోసేసినప్పుడూ వీళ్లకి లేశమాత్రమైనా లేని కనికరం వీడికి ఎందుకు చూపించాలిట? ఇవి చాలవన్నట్టూ ఈ ముష్టి వెధవల తరపు వాదించడానికో లాయరు తయారు. ఓ సారి గుండెలమీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు లాయర్ అయితే ఇటువంటి కేస్ వాదిస్తారా ఎన్ని డబ్బులిచ్చినా? అలా వచ్చే డబ్బులూ, పేరూనా మీరు లాయర్ గా కోరుకునేది?
ఆ చచ్చిపోయిన అమ్మాయి మీవాళ్లైతే/ఏ మంత్రి గారి కూతురో అయితే ఎలా స్పందిస్తారు? అప్పుడు ఈ న్యాయం అనేది అటవికమా, అన్యాయమా అనేది ఎవరు నిర్ణయం చేస్తారు? అసలీ నిర్భయ కేసు ఇంతకాలం ఇలా బుధ్ధి లేకుండా లాగబట్టే ఇటువంటి రోజు రోజుకీ ఎక్కువౌతున్నాయి. ఇటువంటివే రాగింగ్, చిన్న పిల్లల్ని స్కూల్లో కొట్టడం అనేవి. రాగింగ్ జాడ్యం మనకి ఎక్కువగా ఉండేది కొంతకాలం క్రితం. బాగా రూల్స్ పెట్టి స్ట్రిక్ట్ చేసాం అని చెప్పుకుంటున్నా ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నై. కాలేజీలు తెరవగానే ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో పాపం అనుకోవడం ఆవిడ పోయిన రోజున. మర్నాటినుంచి మళ్ళీ అంతా మామూలే.
అసలీ దరిద్రాలు ఎప్పటికి వదుల్తాయి? ఇటివంటివి జరుగుతున్నందుకు మనం సిగ్గుపడితే పడతాం గాక కానీ ఈ కేసు ఇప్పటికీ తేల్చనందుకు ఏ ఒక్క రాజకీయనాయకుడూ కూడా సిగ్గుతో తలదించుకోలేదు. [భగవంతుడా, ఇది 2020 సంవత్సరం, 1745 కాదు] ఇది చాలక ‘మేరా భారత్ మహాన్ రండ్రండి వచ్చి పెట్టుబడులు పెట్టండి’ అని ఆగని సాగర ఘోష.
అన్నింటికన్నా దరిద్రం ఏమిటంటే ఇవన్నీ జరిగినవి ప్రథానమైన నగరాల్లో కనక అవి బయటకొచ్చాయి. రోజువారీ పల్లెల్లో జరిగేవి ఎన్నిఉన్నై? పూర్వకాలంలో కొరత అనేది ఉండేదంటారు. నేరస్తుణ్ణి శూలం మీద గుచ్చి శ్మశానంలో వదిలేస్తారు. వీళ్లని ఎందుకలా చేయకూడదు? “అమానుషం” అయిపోతుందిట. అయ్యో పాపం అమానుషం “మనుషులకి కాదుటండీ?” ఒకప్పుడు రేప్ చేసినా వీడూ “ఒక మనిషే!” నిజమేనా? ని-జ-మే——-నా?” ని….ని…..ని…..నిజంగానేనా?
2003 నుండి రామ్మోహనరావు గారితో నా అనుబంధమూ ఇలాంటిదే! డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి కి కావలసిన పుస్తకాలన్నీ ఆయన చేతిమీదుగానే వచ్చేవి (రెండేళ్ళ క్రితం వరకు). ప్రచురించిన పుస్తకం దేశంలో ఎక్కడ ఉన్నా సాధించి పెట్టేవారు. లేకపోతే ఫోటోకాపీ పంపించేవారు. ‘ఫోటోకాపీ చేస్తే రచయితకు నష్టం కదా’ అంటే ‘రచయిత మరిన్ని కాపీలు ప్రింట్ చేశాక మీరు డబ్బులిద్దురుగాని’ అని చమత్కరించేవారు. 2007 లో తానా సభలకు వచ్చినప్పుడు వారం రోజులపాటు ఝాన్సీ గారితోనూ, రామమోహనరావు గారితోనూ మా సాహితీ సమితి మిత్రులందరం డిట్రాయిట్ లో గడపడం కళ్ళ ముందు మెదిలే తీపి జ్నాపకాలు.
నవోదయతో నా రుణానుబంధం గురించి RD అభిప్రాయం:
01/15/2020 5:10 am
పుస్తకాలు చదివే ఎవరికైనా విజయవాడ, ఏలూరు రోడ్డులో 2017 వరకు ఉన్న “నవోదయ” గురించి తెలియకుండా ఉండదు. 2009 వ సంవత్సరం నుండి వదలకుండా “విజయవాడ పుస్తక మహోత్సవానికి” వెళ్ళడం నాకు అలవాటు. గత సంవత్సరం కూడా అదే సందర్భముగా కారులో మా పుస్తకాల షాపు వద్దకు వచ్చినప్పుదు కలిశాను, చిరునవ్వుతో పలకరించారు. పుస్తక మహోత్సవములో 2017 వరకు వారి షాపు, మాది పక్కపక్కనే ఉండేవి. ముప్పై సంవత్సరాల పాటు “జనవరి 1 – 11 లేదా 12 వ తారీఖు” వరకు క్రమం తప్పకుండా, తారీఖు మారకుండా జరిగింది. ఈ సంవత్సరం ఆయనా లేరు, పుస్తక మహోత్సవం మొదలయిన తారీఖు మారింది. ( జనవరి 03, 2020 – 12,2020 ). మూడు సంవత్సరాల క్రితం వరకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా, 320 పైచిలుకు పుస్తకాల షాపులతో ఒక పండగలా ఈ మహోత్సవం జరిగేది. గత రెండు మూడేళ్ళగా సరిగ్గా జరగడం లేదు. ఈ సంవత్సరమయితే మాటల్లో చెప్పలేనంత పేలవంగా జరిగింది. దానికి కొంత వర్షం కారణమయితే, 80% నిబద్దతా లోపం.
ఇప్పుడు అసలు విషాయానికి వస్తాను. ప్రతి సంవత్సరం అన్ని షాపులు తిరిగి నాక్కావలసిన పుస్తకాలు జల్లెడ పట్టడం నా పని. 2014 లో అలా నేను ఒక చుట్టు వేయబోయే ముందు మా షాపులో వారు “రామ్మోహనరావు” గారికి ఏవో పుస్తకాలు కావాలంటే వెళ్ళి ఆయన్ని కలిశాను. అప్పుడు నా చేతిలో ఒక చిన్న చీటి పెట్టి, దానిలో ఉన్న ఏ పుస్తకం దొరికినా కావాలి / తీసుకొమ్మని అన్నారు. ఆ చీటిలో ఉన్న పుస్తకాల జాబితా ఇదే!
1. శస్త్రదాస్యం – కొప్పరపు సుబ్బారావు
2. తారాశశాంకం ( నాటకం ) – కొప్పరపు సుబ్బారావు
3. హితసూచని – సామినేని ముద్దునరసింహ నాయుడు
మొదటి పుస్తకం అక్కడే ఒక షాపులో దొరికింది, తీసుకొచ్చి ఆయనికిస్తే ఆ మూడింటిలో ఒక్కటైనా దొరికినందుకు సంతోషించారు. ఆ తరువాత విజయవాడలోని సోషల్ సైన్సెస్ లైబ్రరికి, పోలండ్ దేశం నుండి రెండవ ప్రపంచ యుద్ధ సమయం వరకు వచ్చిన గొప్ప కవిత్వానికి సంబంధించి ఒక పుస్తకముంటే తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఉన్న పుస్తకాలన్నిటిని గమనిస్తుంటే “మూడవ” పుస్తకం దొరికింది. అది వెంటనే తీసుకుని, కాపి చేయించి ఏలూరు రోడ్డులో ఉన్న షాపుకెళ్ళి ఆయనకిచ్చాను, నవ్వారు, నేనూ నవ్వి చివరి పుస్తకం కుడా దొరికితే అందజేస్తానని చెప్పి వెళ్ళిపొయాను. విజయవాడ నుండి వెళ్ళిపోయిన తరువాత అంతర్జాలములో గాలిస్తే “రెండవ” పుస్తకం దొరికింది, అది ఆయనకి “జనవరి 29, 2014” న వారి ఈ-మెయిల్ ( vjw_booklink@yahoo.co.in ) కి పంపించాను. దానికి బదులు సమాధానంగా ఇలా వ్రాసి పంపారు “8, ఫిబ్రవరి, 2014” న…
“బాపుగారు అడిగిన 3 పుస్తకాలు సంపాదించిపెట్టినందుకు ధన్యవాదాలు. బాపుగారు చాలా సంతొషించారు.’మిసిమి’ ఫిబ్రవరి ఇష్యులో బాపుగారు ‘లెటర్ టు ది ఎడిటర్’ వ్రాశారు. చుశారా? ”
(https://misimi1990.files.wordpress.com/2017/03/misimi_2014_02.pdf) – 3వ పేజి.
మధ్యలో అయనతో ఫోనులో మాట్లాడినప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన అడిగిన అన్ని పుస్తకాలు ఇవ్వలేకపొయాను. చాలాకాలం తరువాత అడిగిన మూడు పుస్తకాలు ఇవ్వగలిగాను అని సంతోషంగా చెప్పారు. ఆయన ఈ-మెయిల్లోనే ఉన్నట్ట్లుగా “ఆయనకి పుస్తకాలకి, పుస్తకాలు కావలసిన వాళ్ళకి ఆయనకి లింకు”. నాతో ఫోనులో మాట్లాడినప్పుడు ఆ మూడు పుస్తకాలు అందజేయగలిగినందుకు ఆయన గళంలో ధ్వనించిన సంతోషం ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది.
ఒక అరుదైన మనిషి. విజయవాడ పుస్తక ప్రచురణ రంగంలో మేరుశిఖరం.
భయం – భక్తి గురించి Anwar అభిప్రాయం:
01/14/2020 3:45 am
ఎంత మంచి కథో!
నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి sudhakar అభిప్రాయం:
01/13/2020 4:00 am
markandeyulu గారు..
మంచి పద్యం audio లింక్ అందించారు. Source please
హెచ్చరిక గురించి Amarendra అభిప్రాయం:
01/12/2020 8:18 pm
‘పదివేల పేజీలు.. యెవరికీ అర్థంకాని’ – నెట్ లో ఉంది. ఒకసారి చూడండి. I did it. ‘Capitalism based’- అన్న అభ్యంతరం లేకపొతే, మనది అద్భుతమైన రాజ్యాంగం అని నా అభిప్రాయం.
శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్ చరిత్ర: అశ్వపర్వం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
01/12/2020 2:21 pm
మీ చమత్కార సంభాషణా శైళీ అశ్వపర్వం బ్రహ్మాండం, బ్రహ్మాండం.
ఇక అశ్వమేధ పర్వము (అశ్వమేధ యాగం) చదివే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాం చిట్టిరాజు గోరండి.
పుస్తక పరిచయాలు గురించి Mula Ravi Kumar అభిప్రాయం:
01/10/2020 1:26 pm
Nice review. Have to read it.
గోమెజ్ ఎప్పుడొస్తాడో! గురించి Habeeb syed అభిప్రాయం:
01/10/2020 12:39 am
అద్భుతమైన కథనం…
హెచ్చరిక గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
01/09/2020 10:32 am
నేరం చేసాడో లేదో తెలియదు అనే ముక్క పట్టుకుని కధ రాసారులా ఉంది. కానీ నిర్భయ కేసునుంచి ఈ రోజు వరకూ జరిగినవి చూస్తే తెలిసేదేమంటే, ఎంత వెధవైనా సరే వాడికి ప్రాణం మీద “అతి” తీపి. నేను అమాయకుణ్ణీ అని చెప్పుకోవాలనే తాపత్రయం; ఏదో ఒక లొసుగు ఉండకపోదా తప్పించుకోవడానికి అనే ఆశ. ఇవన్నీ కూడా రేప్ చేసినప్పుడూ, ఆ తర్వాతా గుర్తుకురాకపోవడం, ఇంతటి నీచమైన పనిచేసినా దానికి ఒప్పుకుని పశ్చాత్తాపం పడకపోవడం దారుణం. ఇదంతా ఒక ఎత్తైతే మన అద్భుతమైన న్యాయ వ్యవస్థా, దాదాపు పదివేల పేజీల – దాదాపు ఎవరికీ అర్ధంకాని, గుర్తు ఉండని – రాజ్యాంగం ఎంతకీ తేలని కోర్టు కేసులూ మరో ఎత్తు. నిర్భయ అమ్మగారు ఏమన్నారో ఎవరైనా విన్నారా? “నా కూతురు పోయి ఏడేళ్ళు దాటుతోంది. ఏడవడానికి కన్నీళ్ళు కూడా ఎండిపోయాయి” అంటున్నారు. మరి ఆవిడ క్షోభో? ఈ ఏడేళ్లలో పాపం ఆవిడ ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపిందో, ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగిందో, ఎంత దారుణంగా ఆ బాధ గుండెల్లో నొక్కుకుందో ఎవరైనా ఆలోచించారా?
ఈ రోజు వచ్చిన వార్త ప్రకారం ఈ నిర్భయ కేసులో ఒకడు క్యూరేటివ్ పిటిషన్ అనే కేసు ఏదో వేశాట్ట ఆఖరు అస్త్రంగా. వాడిని పోలీసులు తీసుకెళ్తున్నట్టూ ఒక బొమ్మ – కలర్ దే – వేసారు. కండలు పెంచి వస్తాదులాగా ఉన్నాడు. జైల్లో ఉచితంగా పెట్టే కోడికూరా బిర్యానీలు బాగా వంటబట్టినట్టున్నాయ్. రేప్ చేసినప్పుడు, ఆవిడ రక్తం కారుతూ చేతులెత్తి మొరపెట్టినప్పుడూ, ఆవిడని బస్సులోంచి తోసేసినప్పుడూ వీళ్లకి లేశమాత్రమైనా లేని కనికరం వీడికి ఎందుకు చూపించాలిట? ఇవి చాలవన్నట్టూ ఈ ముష్టి వెధవల తరపు వాదించడానికో లాయరు తయారు. ఓ సారి గుండెలమీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు లాయర్ అయితే ఇటువంటి కేస్ వాదిస్తారా ఎన్ని డబ్బులిచ్చినా? అలా వచ్చే డబ్బులూ, పేరూనా మీరు లాయర్ గా కోరుకునేది?
https://www.sakshi.com/news/national/nirbhaya-convict-files-plea-against-death-sentence-1254498
ఆ చచ్చిపోయిన అమ్మాయి మీవాళ్లైతే/ఏ మంత్రి గారి కూతురో అయితే ఎలా స్పందిస్తారు? అప్పుడు ఈ న్యాయం అనేది అటవికమా, అన్యాయమా అనేది ఎవరు నిర్ణయం చేస్తారు? అసలీ నిర్భయ కేసు ఇంతకాలం ఇలా బుధ్ధి లేకుండా లాగబట్టే ఇటువంటి రోజు రోజుకీ ఎక్కువౌతున్నాయి. ఇటువంటివే రాగింగ్, చిన్న పిల్లల్ని స్కూల్లో కొట్టడం అనేవి. రాగింగ్ జాడ్యం మనకి ఎక్కువగా ఉండేది కొంతకాలం క్రితం. బాగా రూల్స్ పెట్టి స్ట్రిక్ట్ చేసాం అని చెప్పుకుంటున్నా ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నై. కాలేజీలు తెరవగానే ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో పాపం అనుకోవడం ఆవిడ పోయిన రోజున. మర్నాటినుంచి మళ్ళీ అంతా మామూలే.
అసలీ దరిద్రాలు ఎప్పటికి వదుల్తాయి? ఇటివంటివి జరుగుతున్నందుకు మనం సిగ్గుపడితే పడతాం గాక కానీ ఈ కేసు ఇప్పటికీ తేల్చనందుకు ఏ ఒక్క రాజకీయనాయకుడూ కూడా సిగ్గుతో తలదించుకోలేదు. [భగవంతుడా, ఇది 2020 సంవత్సరం, 1745 కాదు] ఇది చాలక ‘మేరా భారత్ మహాన్ రండ్రండి వచ్చి పెట్టుబడులు పెట్టండి’ అని ఆగని సాగర ఘోష.
అన్నింటికన్నా దరిద్రం ఏమిటంటే ఇవన్నీ జరిగినవి ప్రథానమైన నగరాల్లో కనక అవి బయటకొచ్చాయి. రోజువారీ పల్లెల్లో జరిగేవి ఎన్నిఉన్నై? పూర్వకాలంలో కొరత అనేది ఉండేదంటారు. నేరస్తుణ్ణి శూలం మీద గుచ్చి శ్మశానంలో వదిలేస్తారు. వీళ్లని ఎందుకలా చేయకూడదు? “అమానుషం” అయిపోతుందిట. అయ్యో పాపం అమానుషం “మనుషులకి కాదుటండీ?” ఒకప్పుడు రేప్ చేసినా వీడూ “ఒక మనిషే!” నిజమేనా? ని-జ-మే——-నా?” ని….ని…..ని…..నిజంగానేనా?
నవోదయతో నా రుణానుబంధం గురించి మద్దిపాటి కృష్ణారావు అభిప్రాయం:
01/04/2020 4:34 pm
2003 నుండి రామ్మోహనరావు గారితో నా అనుబంధమూ ఇలాంటిదే! డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి కి కావలసిన పుస్తకాలన్నీ ఆయన చేతిమీదుగానే వచ్చేవి (రెండేళ్ళ క్రితం వరకు). ప్రచురించిన పుస్తకం దేశంలో ఎక్కడ ఉన్నా సాధించి పెట్టేవారు. లేకపోతే ఫోటోకాపీ పంపించేవారు. ‘ఫోటోకాపీ చేస్తే రచయితకు నష్టం కదా’ అంటే ‘రచయిత మరిన్ని కాపీలు ప్రింట్ చేశాక మీరు డబ్బులిద్దురుగాని’ అని చమత్కరించేవారు. 2007 లో తానా సభలకు వచ్చినప్పుడు వారం రోజులపాటు ఝాన్సీ గారితోనూ, రామమోహనరావు గారితోనూ మా సాహితీ సమితి మిత్రులందరం డిట్రాయిట్ లో గడపడం కళ్ళ ముందు మెదిలే తీపి జ్నాపకాలు.
భారం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
01/03/2020 8:21 am
‘ఓ ప్రభూ, నేను ఈ భారం మోయలేకున్నాను!’
‘ஓ… இந்தப் பாரம்… என்னால் தாங்க முடியவில்லை!’ ఓహ్ ఇంతతాప భారం … ఎన్నాళ్ తాంగ ముడియవిల్లై
అన్నా అప్పాదురై! తంబీ అవినేని భాస్కర్!! ‘నేను ఈ భారం మోయలేకున్నాను!!!’
మిమ్మల్ని…. మీరిచ్చిన సాహిత్య సౌరభాలని, సానిత్యాన్ని నా జీవిత కాలం మరిచిపోలేను