ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన ఇటువంటి వ్యాసాలు చదివినప్పుడల్లా హృదయం అమందానంద సందోహ కందళిత మై ఉత్తేజితమౌతుంది. మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. విభక్తులగురించి షష్ఠ్యంతాలు గురించి బాగా వివరించారు. ఏకో కవిః పోతన ఏవ అని భావించే నాకు ఆయన షష్ఠ్యంతాలు వదలక ఉదహరించడం ఆనందం కలిగించింది. పోతన తరువాత నాకెక్కువ అభిమాన పాత్రుడై కవిత్వంలోనూ విద్వత్తులోనూ అద్వితీయుడైన సురభి మాధవరాయల షష్ఠ్యంతాలు కొన్ని నా స్మృతిపధంలో వున్నవి మీతో పంచుకోడానికి ఉత్సహిస్తాను
భాషాధివ, శెషాహివ,
భాషా భూషాయితాత్మ పటుగుణ తతికిన్
దోషాచర, దోషాచర,
దోషాచర చక్ర కలిత దోర్బల ధృతికిన్
నేను కూడా నా కొడుకు గురించి చాలా ఆలోచనలు, ఆశలు పెట్టుకుని ఉన్నాను.. నాకింకా పెళ్లి కాకుండానే.. అత్యాశే అయినా ఇది నిజం. కానీ, మీ కథ చదివాకా నా ఆలోచనతీరు మారుతుందేమో..
మీ వ్యాసంలో – “త్యాగరాజస్వామి చని పోయిన దినము పుష్య బహుళ పంచమి. తాను బ్రదికి ఉన్నంతవరకు త్యాగరాజు మనుమడైన త్యాగరాజు తన తాతకు తద్దినము పెట్టేవాడు. అతని పిదప త్యాగరాజ శిష్యపరంపర ఈ కార్యాలను చేస్తుండేది….” అంటూ రాసారు.
ఇది సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే త్యాగరాజు మనవడు ఆయన కంటే ముందే చనిపోయాడు. త్యాగరాజు 1847 లో చనిపోతే, ఈయన మనవడు 1843 ప్రాంతంలో పోయాడు.
ఈమాటలో కామెంట్ చూసేక మరోసారి ఈ వ్యాసం చదివితే ఇది కనిపించింది.
నాకున్న శాస్త్ర పరిజ్ఞానం ఈ వ్యాసం అర్ధం చేసుకోడానికి చాల లేదు. ఖగోళ, రసాయనిక, జీవ శాస్త్రాలలో వున్నంతటి ప్రాధమిక పరిచయం కూడా ఈ రంగంలో లేకపోవడం కారణం. మీరు వ్రాసిన విషయంలో ప్ర్రాధమిక పరిజ్ఞానం సమ్పాదించడానికి ఏమైనా పుస్తకాలు సూచించగలరా?
విద్యా సుందరి (సుందరి ఐన సరస్వతి) అనే శీర్షిక నాగ రత్నమ్మ గారి బిరుద నామమౌనో కాదో తెలియదు గానీ, ఆమెకు అన్వర్ధ నామం అని నాకు అనిపిస్తోంది. మహాత్ములైన వారు ఏ కులానికి, జాతికి, మతానికి సంబంధించరు. వారు మా కులం, మా జాతి, మా మతం అని వేరే వారు అతిశయపడాలే గానీ, వారు సర్వ ప్రపంచానికి సంబంధించిన వారు. అట్టి మహోన్నతమైన వ్యక్తిత్వాలకు ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతుంది. నివాళులర్పిస్తుంది. స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత చరిత్ర తెలుసుకుని ధన్యుడనయ్యాను. కృతజ్ఞతలు. ఆమె ఆర్జించిన, విశిష్టపరచుకున్న అనర్ఘ గుణసాహస్రంలో దేవదాసీ విధానాన్ని సమర్ధించడం, రాధికా సాంత్వనం వంటి పరమ బూతు కావ్యాన్ని పట్టుదలగా ముద్రింపించడం వంటి 1-2 విషయాలు నాకు అణుమాత్రం రుచింపకున్నా ఆమె పట్ల గౌరవం ఇసుమంత తగ్గలేదు.
ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః
ఇంకొక మాట. వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు రసిక మనో రంజనం అనే ఒక బూతు కావ్యంగా వ్రాసారని తెలిసి ఆయన మీద ఇదివరకుండే గౌరవం లుప్తమైంది. మరి ఆయన ముందు ఇదివరకు విలపించిన సరస్వతి ఇది విని సంతోషించింది కాబోలు.
పై పద్యంలో ధార, భావం అన్నీ బాగా వున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను. మీకీ పద్యం అవగతం కాలేదన్నారు లేదా భావోత్కృష్టత అంత ప్రశంసనీయం గా మీ కనిపించలేదన్నారు కనుక, నా అల్ప మేధస్సుకి అది ఎందుకు అనర్ఘంగా తోచిందో వివరింప ప్రయత్నిస్తాను.
ధనము శాశ్వతము కాదు. శరీరం క్షణ భంగురము. జీవనము తత్వార్ధముల వలె (అహమ్ బ్రహ్మస్మి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి వగైరా) నిత్యము కాదు. కాల పాశానికి ఏ నిముషమైనా చిక్కవచ్చు. కావున మనుషులైన వారు దీని వ్యావృతిని నమ్మక, మహాత్ముడైన అమ్మెన ప్రెగ్గడ వలె పేర్మితో వరార్ధము (భగవచ్చింతన), ఎన్నడునూ చేటు లేని ధర్మార్ధము (ధర్మ నిరతి) చేయవలయును.
ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. మిగిలిన పదాలు, ధార అవధరిస్తే కవి అసమర్ధుడుగా భాసించడు. ఆ లోపాలు సమ్యగ్రీతిని సంస్కరిస్తే ఈ పద్యం మీకు కూడా హృద్యంగానే వుంటుందని అనుకుంటాను. ఆ విధంగా సంస్కరింపబడినా కూడా అది అంత మంచి పద్యం అని మీకనిపించక పోతే అది మీ అభిరుచి. లోకో భిన్న రుచిః నాలాంటి కొందరికి నచ్చిన దాన్నే ఉత్తమ సాహిత్యమని పలకడం దుస్సాహసమౌతుంది గదా.
ఈ వ్యాసం ఎంతో బాగుంది. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికే గాక, ఇది వరకే తెలిసిన విషయాలలో అవగాహన ఇంకా పెరగడానికి దోహదపడింది. వ్యాసకర్తకీ రంగంలో వున్న అభినివేశం, అభిరుచి, సాధికారత, ప్రామాణికత్వం శ్లాఘనీయమైనది. లక్షణాలకు లక్ష్యాలను స్వయంగా సమకూర్చడంలో (సర్వ) జన వేద్యమైన సరళ సంస్కృత భాషా పద ప్రయోగం అమోఘం. ఆదిలోనే ఉదహరించిన శ్లేషాలంకార సహితమైన మాఘుని సంస్కృత చంపకమాల ఆకట్టుకుంది. చంపకమాల, ఉత్పలమాల, కందం, తేటగీతి, మధ్యాక్కర, సీసం వగైరా వృత్తాల సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ సృష్టించిన (చిత్ర విస్తర కవిత్వాలలో ఒకటిగా చెప్పబడిన) గర్భ కవిత్వం ప్రశంసార్హం. ఈ గర్భిత వృత్తాలలో భిన్న వృత్తాలలో భిన్న భావాలు ప్రదర్శించే అద్భుత నైపుణ్యాన్ని ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలిపివుండాలనిపించింది. ఉదాహరణకి ఈ క్రింది పద్యాన్ని చూడండి
శ్రీరామ స్తుతి
గురు కరుణాకరా! సమద కుంజర దానవ శక్తి హార సం
భరిత మనా! త్రయీ భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన! ఈ
శ్వర గురు ధర్మ భంజన! నిశాచర వర్ధన శస్త శూల! క్ష్మా
ధర వర! జానకీ సతి హృదంతర మందిర! సర్వ పాలకా!
దేవీ స్తుతి
కరుణాకరా! సమద కుం జర దానవ శక్తి హార సంభరిత మనా!
గురు ధర్మ భంజన! నిశా
చర వర్ధన శస్త శూల! క్ష్మాధర వరజా!
శివ స్తుతి
సమద కుంజర దానవ శక్తి హార
భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన!
జన! నిశాచర వర్ధన శస్త శూల!
సతి హృదంతర మందిర! సర్వ పాల!
తరువాత అగ్ని ర గణం అని, సూర్య జ గణం అని, చంద్ర భగణం అని, ఇంద్ర నగణం అని తెలిపారు. మిగిలిన గణాలు అంటే య, మా, తా, స, వ, లఘు గురువులకు ఏవి వర్తిస్తాయో తెలుపవలసినదిగా ప్రార్ధన.
చివరగా
అనుపమ మద్భుతావహ మనన్య జనాచరితం బమోఘమున్
అనితర మన్య దుర్లభ మనంత మనోజ్ఞ రసాభిరామమై
దనరెడు మీ వచో నిపుణతా, కవితాతుల రీతి మెత్తు, మో
హన కవితా వశీకృత దిగంత సుధీజన! కృష్ణ మోహనా!
భవదీయుడు
రాజకీయలపై కన్నేసి వుంచేవాళ్ళకి అవే కనపడ్డాయి. కులం, మతం కవితల్లో ఆసక్తివున్నోళ్ళకి అదే కనపడింది. అంచాత చర్చ కూడా నానాజాతి సమితి శిఖరాగ్ర సమావేశంలా సాగుతూనే వుంది.
జననీ శివకామిని పాట నాకు చాలా ఇష్టం. సావిత్రి గారి మాట వింటుంటే మళ్ళీ ఆ మహానటిని చూస్తున్నట్టే ఉంది. ఇంత మంచి ప్రోగ్రాం ని పెట్టినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.
సముద్రం గురించి Swapna అభిప్రాయం:
04/21/2009 11:48 am
అంత ధైర్యంగా నిజం చెప్పిన అమ్మాయి చివరికి సముద్రం లోకి దూకడం ఎమిటీ? This story is very depressing and unconvincing.
షష్ఠ్యంతములు గురించి M.S.Prasad అభిప్రాయం:
04/21/2009 3:29 am
ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన ఇటువంటి వ్యాసాలు చదివినప్పుడల్లా హృదయం అమందానంద సందోహ కందళిత మై ఉత్తేజితమౌతుంది. మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. విభక్తులగురించి షష్ఠ్యంతాలు గురించి బాగా వివరించారు. ఏకో కవిః పోతన ఏవ అని భావించే నాకు ఆయన షష్ఠ్యంతాలు వదలక ఉదహరించడం ఆనందం కలిగించింది. పోతన తరువాత నాకెక్కువ అభిమాన పాత్రుడై కవిత్వంలోనూ విద్వత్తులోనూ అద్వితీయుడైన సురభి మాధవరాయల షష్ఠ్యంతాలు కొన్ని నా స్మృతిపధంలో వున్నవి మీతో పంచుకోడానికి ఉత్సహిస్తాను
భాషాధివ, శెషాహివ,
భాషా భూషాయితాత్మ పటుగుణ తతికిన్
దోషాచర, దోషాచర,
దోషాచర చక్ర కలిత దోర్బల ధృతికిన్
పాపాయిత, కోపాయత
భూపాయిత దనుజ మధన పూజిత మతికిన్
గోపాలన, గోపాలన,
గోపాలన నిబిడ రతికి, గోహిత మతికిన్
కమలాస జనక నాభికి,
కమలన్మోహాంధ తమస కమలాంకునకున్
కమలాలయ, కమలాలయ,
కమలాలయ శయన ధృతికి, కాంతాకృతికిన్
శరణాగత పరిరక్షణ
చరణ ప్రవణాత్మ చిత్త సరసీజునకున్
నరకాసుర, నరకాసుర,
నరకాసుర బాణహృతికి, నరసారధికిన్
సమధికమైన ప్రతిభ, విద్వత్తు కలిగిన మీ లేఖిని నుండి ఇటువంటి అనేక వ్యాసాలు జాలువారి రసజ్ఞ హృదయాలనలరింపజేయాలని ఆశిస్తూ
భవదీయుడు
అసమర్థులు గురించి Sree అభిప్రాయం:
04/20/2009 11:25 pm
నేను కూడా నా కొడుకు గురించి చాలా ఆలోచనలు, ఆశలు పెట్టుకుని ఉన్నాను.. నాకింకా పెళ్లి కాకుండానే.. అత్యాశే అయినా ఇది నిజం. కానీ, మీ కథ చదివాకా నా ఆలోచనతీరు మారుతుందేమో..
విద్యాసుందరి గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
04/20/2009 6:53 am
మోహన గారూ,
మీ వ్యాసంలో – “త్యాగరాజస్వామి చని పోయిన దినము పుష్య బహుళ పంచమి. తాను బ్రదికి ఉన్నంతవరకు త్యాగరాజు మనుమడైన త్యాగరాజు తన తాతకు తద్దినము పెట్టేవాడు. అతని పిదప త్యాగరాజ శిష్యపరంపర ఈ కార్యాలను చేస్తుండేది….” అంటూ రాసారు.
ఇది సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే త్యాగరాజు మనవడు ఆయన కంటే ముందే చనిపోయాడు. త్యాగరాజు 1847 లో చనిపోతే, ఈయన మనవడు 1843 ప్రాంతంలో పోయాడు.
ఈమాటలో కామెంట్ చూసేక మరోసారి ఈ వ్యాసం చదివితే ఇది కనిపించింది.
-సాయి బ్రహ్మానందం
ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) గురించి M.S.Prasad అభిప్రాయం:
04/20/2009 3:32 am
నాకున్న శాస్త్ర పరిజ్ఞానం ఈ వ్యాసం అర్ధం చేసుకోడానికి చాల లేదు. ఖగోళ, రసాయనిక, జీవ శాస్త్రాలలో వున్నంతటి ప్రాధమిక పరిచయం కూడా ఈ రంగంలో లేకపోవడం కారణం. మీరు వ్రాసిన విషయంలో ప్ర్రాధమిక పరిజ్ఞానం సమ్పాదించడానికి ఏమైనా పుస్తకాలు సూచించగలరా?
విద్యాసుందరి గురించి M.S.Prasad అభిప్రాయం:
04/20/2009 2:50 am
విద్యా సుందరి (సుందరి ఐన సరస్వతి) అనే శీర్షిక నాగ రత్నమ్మ గారి బిరుద నామమౌనో కాదో తెలియదు గానీ, ఆమెకు అన్వర్ధ నామం అని నాకు అనిపిస్తోంది. మహాత్ములైన వారు ఏ కులానికి, జాతికి, మతానికి సంబంధించరు. వారు మా కులం, మా జాతి, మా మతం అని వేరే వారు అతిశయపడాలే గానీ, వారు సర్వ ప్రపంచానికి సంబంధించిన వారు. అట్టి మహోన్నతమైన వ్యక్తిత్వాలకు ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతుంది. నివాళులర్పిస్తుంది. స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత చరిత్ర తెలుసుకుని ధన్యుడనయ్యాను. కృతజ్ఞతలు. ఆమె ఆర్జించిన, విశిష్టపరచుకున్న అనర్ఘ గుణసాహస్రంలో దేవదాసీ విధానాన్ని సమర్ధించడం, రాధికా సాంత్వనం వంటి పరమ బూతు కావ్యాన్ని పట్టుదలగా ముద్రింపించడం వంటి 1-2 విషయాలు నాకు అణుమాత్రం రుచింపకున్నా ఆమె పట్ల గౌరవం ఇసుమంత తగ్గలేదు.
ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః
ఇంకొక మాట. వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు రసిక మనో రంజనం అనే ఒక బూతు కావ్యంగా వ్రాసారని తెలిసి ఆయన మీద ఇదివరకుండే గౌరవం లుప్తమైంది. మరి ఆయన ముందు ఇదివరకు విలపించిన సరస్వతి ఇది విని సంతోషించింది కాబోలు.
చంపకోత్పలమాలల కథ గురించి M.S.Prasad అభిప్రాయం:
04/20/2009 1:37 am
లైలా గారికి
అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్
పై పద్యంలో ధార, భావం అన్నీ బాగా వున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను. మీకీ పద్యం అవగతం కాలేదన్నారు లేదా భావోత్కృష్టత అంత ప్రశంసనీయం గా మీ కనిపించలేదన్నారు కనుక, నా అల్ప మేధస్సుకి అది ఎందుకు అనర్ఘంగా తోచిందో వివరింప ప్రయత్నిస్తాను.
ధనము శాశ్వతము కాదు. శరీరం క్షణ భంగురము. జీవనము తత్వార్ధముల వలె (అహమ్ బ్రహ్మస్మి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి వగైరా) నిత్యము కాదు. కాల పాశానికి ఏ నిముషమైనా చిక్కవచ్చు. కావున మనుషులైన వారు దీని వ్యావృతిని నమ్మక, మహాత్ముడైన అమ్మెన ప్రెగ్గడ వలె పేర్మితో వరార్ధము (భగవచ్చింతన), ఎన్నడునూ చేటు లేని ధర్మార్ధము (ధర్మ నిరతి) చేయవలయును.
ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. మిగిలిన పదాలు, ధార అవధరిస్తే కవి అసమర్ధుడుగా భాసించడు. ఆ లోపాలు సమ్యగ్రీతిని సంస్కరిస్తే ఈ పద్యం మీకు కూడా హృద్యంగానే వుంటుందని అనుకుంటాను. ఆ విధంగా సంస్కరింపబడినా కూడా అది అంత మంచి పద్యం అని మీకనిపించక పోతే అది మీ అభిరుచి. లోకో భిన్న రుచిః నాలాంటి కొందరికి నచ్చిన దాన్నే ఉత్తమ సాహిత్యమని పలకడం దుస్సాహసమౌతుంది గదా.
చంపకోత్పలమాలల కథ గురించి M.S.Prasad అభిప్రాయం:
04/20/2009 12:07 am
ఈ వ్యాసం ఎంతో బాగుంది. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికే గాక, ఇది వరకే తెలిసిన విషయాలలో అవగాహన ఇంకా పెరగడానికి దోహదపడింది. వ్యాసకర్తకీ రంగంలో వున్న అభినివేశం, అభిరుచి, సాధికారత, ప్రామాణికత్వం శ్లాఘనీయమైనది. లక్షణాలకు లక్ష్యాలను స్వయంగా సమకూర్చడంలో (సర్వ) జన వేద్యమైన సరళ సంస్కృత భాషా పద ప్రయోగం అమోఘం. ఆదిలోనే ఉదహరించిన శ్లేషాలంకార సహితమైన మాఘుని సంస్కృత చంపకమాల ఆకట్టుకుంది. చంపకమాల, ఉత్పలమాల, కందం, తేటగీతి, మధ్యాక్కర, సీసం వగైరా వృత్తాల సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ సృష్టించిన (చిత్ర విస్తర కవిత్వాలలో ఒకటిగా చెప్పబడిన) గర్భ కవిత్వం ప్రశంసార్హం. ఈ గర్భిత వృత్తాలలో భిన్న వృత్తాలలో భిన్న భావాలు ప్రదర్శించే అద్భుత నైపుణ్యాన్ని ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలిపివుండాలనిపించింది. ఉదాహరణకి ఈ క్రింది పద్యాన్ని చూడండి
శ్రీరామ స్తుతి
గురు కరుణాకరా! సమద కుంజర దానవ శక్తి హార సం
భరిత మనా! త్రయీ భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన! ఈ
శ్వర గురు ధర్మ భంజన! నిశాచర వర్ధన శస్త శూల! క్ష్మా
ధర వర! జానకీ సతి హృదంతర మందిర! సర్వ పాలకా!
దేవీ స్తుతి
కరుణాకరా! సమద కుం జర దానవ శక్తి హార సంభరిత మనా!
గురు ధర్మ భంజన! నిశా
చర వర్ధన శస్త శూల! క్ష్మాధర వరజా!
శివ స్తుతి
సమద కుంజర దానవ శక్తి హార
భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన!
జన! నిశాచర వర్ధన శస్త శూల!
సతి హృదంతర మందిర! సర్వ పాల!
తరువాత అగ్ని ర గణం అని, సూర్య జ గణం అని, చంద్ర భగణం అని, ఇంద్ర నగణం అని తెలిపారు. మిగిలిన గణాలు అంటే య, మా, తా, స, వ, లఘు గురువులకు ఏవి వర్తిస్తాయో తెలుపవలసినదిగా ప్రార్ధన.
చివరగా
అనుపమ మద్భుతావహ మనన్య జనాచరితం బమోఘమున్
అనితర మన్య దుర్లభ మనంత మనోజ్ఞ రసాభిరామమై
దనరెడు మీ వచో నిపుణతా, కవితాతుల రీతి మెత్తు, మో
హన కవితా వశీకృత దిగంత సుధీజన! కృష్ణ మోహనా!
భవదీయుడు
బోడి పద్యం గురించి Alok అభిప్రాయం:
04/19/2009 11:19 pm
ఇప్పటికాలంలో గూడా “వచన” కవిత్వాన్ని “పద్య” మనడం జరుగుతోంది. అంచాత ఇది కవిత్వమా, పద్యమా అన్న మీమాంస అక్కర్లేదు.
చూడగా, ఇందులో నాలుగు భాగాలున్నాయి.
1. కవిత్వం పుట్టక-కవి బాధలు (1, 3, 6వ స్టాంజాలు)
2. భిన్న మతాలు – సౌహార్ద్రత (2, 4వ స్టాంజాలు)
3. కులం – వైయక్తిక వేదన (4, 5 వ స్టాంజాలు)
4. రాజకీయాలు – అభిప్రాయ ప్రకటన (కూలిన మసీదు గోడ, బ్రోచేవారెవరురా వగైరా వాక్యాలు)
యిన్నేసి భావాలు, అభిప్రాయాలు, ప్రకటనలు, నిట్టూర్పులూ వొకేచోట గుమిగూడ్డంతో కవిలోని సంకీర్ణత, అస్పష్టత పాఠకుల్లోకీ వరదలా పారాయి.
రాజకీయలపై కన్నేసి వుంచేవాళ్ళకి అవే కనపడ్డాయి. కులం, మతం కవితల్లో ఆసక్తివున్నోళ్ళకి అదే కనపడింది. అంచాత చర్చ కూడా నానాజాతి సమితి శిఖరాగ్ర సమావేశంలా సాగుతూనే వుంది.
జనరంజని: మహానటి సావిత్రి గురించి revathi అభిప్రాయం:
04/19/2009 7:53 pm
జననీ శివకామిని పాట నాకు చాలా ఇష్టం. సావిత్రి గారి మాట వింటుంటే మళ్ళీ ఆ మహానటిని చూస్తున్నట్టే ఉంది. ఇంత మంచి ప్రోగ్రాం ని పెట్టినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.