అమెరికాకి విశ్వవిద్యాలయంలో పై చదువులకి కాక, నేరుగా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిడానికి వచ్చిన నాకు సురేశ్ గారి వ్యాసం చదివి ఉండక పోతే, అంతర్జాలాన్ని గురించిన ఇంత చరిత్ర తెలిసి ఉండేది కాదు. తొంభై దశకం మొదట్లో, నేను పని చేసిన కంపెనీలు ఏవీ Internet connectivity మీద ఆసక్తి చూపడం నాకు గుర్తు లేదు (understandably so). చదివిన చదువుకీ చేసే ఉద్యోగానికీ ఎటూ సంబంధం లేదు, మళ్ళీ అమెరికాలో పై చదువులు అవసరమా అని తర్కించుకుంటూ తాపించుకుంటూ Computer Science అధ్యయనం చేసేనాటికి Internet Revolution ముదిరి పరిస్థితి చాలా మారిపోయింది. అందువలన ఈ విషయంలోసురేశ్లాంటి వాళ్ళకున్న అనుభవం, అవగాహన నాకు ఉండే అవకాశం లేదు. May be that is the reason I am able to fully appreciate his essay.
ఓపికగా సురేశ్ గారు తన అనుభవాలు ఈ వ్యాసం ద్వారా పంచుకున్నందుకు, కొత్త విషయాలు తెలిపినందుకు, ముఖ్యంగా తెలుగు Font విషయంలో కృషి చేసిన ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసినందుకు నెనర్లు.
పిల్లి మెడలో గంట కట్టేదెవరు? -వేలూరి వేంకటేశ్వర రావు
అంటే? అందరికీ పనికొచ్చే ఆ పుస్తకం ఎవరు రాస్తారూ అనేనా? మీరే :-)ఎందుకంటే మీకు చిన్నయ సూరి వ్యాకరణము అంతా అర్థమవుతుంది.
That grammar book also appears to me, as a simplified manual, small in size, written to give guidance to the writers of his time. If it is outdated, update it. Such technical manuals need updating.
Take cinnaya suri’s grammar -simplify, modify, modernize the rules. Discard and add rules , as you see fit and give us the new Telugu grammar/style book / ‘తెలుగులో రాయటమెలా?’ అన్న పుస్తకం.
What is so hard about that? And who says no, if you want to do it? Not me.
తోచిన సూచనలిచ్చింది నిజమే కాని, ముఖ్యంగా నేను చెప్పిన దొక్కటి మాత్రం పూర్తిగా వదిలేసారు సురేశ్. అందుకే చెప్పుకోవడం.
సంస్కృత శ్లోకాలు, పోతన పద్యాలు మొదలగునవేవీ ఇంటెర్నెట్టులో లభించని రోజుల్లో వాటిని అందించి, అర్థ వివరాలను తెలిపి, అన్వయించుకోవడానికి ఆనందించడానికి అప్పట్లో సాయపడిన వారిలో గుర్తున్నంతవరకు సురేశ్ పేరే మొట్టమొదటిగా తడుతుంది. అంతే గాక, సురేశ్ అప్పట్లో SCIT కి “తెలుసా” గ్రూపులకు bridge తయారు చేసారు. దాన్ని వాడినవారికి కూడా తెలుసో లేదో.
WordPress ద్వారా “ఈ మాట” ను ప్రచురించే సాంకేతికపరమైన వివరాలను ఇంకెంతోమంది తెలుగు వారికి కూడా ఉపయోగపడాలనే పెద్ద మనసుతో, “పొద్దు”, “భూమిక”, “ప్రాణహిత” మొదలగు సైట్ల నిర్మాణానికి కూడా దాచుకోకుండా అందజేయడం, వారు చెప్పడం దాచారు కాబట్టి చెప్పడం. శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!
జ్ఞాపకాలు తెలుపుకోవడంలో ఒక ప్రమాదం ఉంది. రాసిన గంటకో రెండ్రోజులకో అయ్యో ఫలానా సంగతే చెప్పడం ఎట్లా మరిచాను అనిపించడం. అట్లా అని చాంతాడంత రాస్తూపోతే మొహమెత్తవచ్చు, తీపి కూడా ఎక్కువైతే అయినట్లు. గుర్తుకొచ్చినవాటికీ, రానివాటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.
______
విధేయుడు
-Srinivas
మొత్తం మీద సురేష్ చాలా సమాచారం సేకరించి పొందుపరచారు ఈమాటలో! దీని ఉపయోగం ముందుముందు ఇంకా బాగా తెలుస్తుంది. అమెరికాలో ఉన్న తెలుగువారు చాలా మందికి ఉన్న కంప్యూటర్ (ఇన్ఫర్మేషన్) టెక్నాలజీతో పరిచయం కూడా ఇంటర్నెట్లో తెలుగు వికాసానికి తోడ్పడింది. రోహిణీప్రసాద్ గారన్నట్టు, తెలుగు యూనీకోడ్ లో సురేష్ కృషి వివరాలు కూడా అక్షరబద్ధం కావాలి!
అతి చక్కని వ్యాసానికి అద్భుతమైన పాటల సేకరణ! మనం మరచిపోతున్న ఒక మంచి గాయకుడిని కృష్ణ మోహన రావు, శ్రీనివాస్ గార్లు మళ్ళీ గుర్తుకు తెచ్చారు. అన్నట్టు, 1993 సంవత్సరం తానా సభలకి వచ్చిన లీల, జిక్కీ వంటి గాయనిలతో పాటు వచ్చిన రాజా కుమారుడు (పేరు చంద్రశేఖర్ అని గుర్తు) గొంతు అచ్చు రాజా గొంతులా ఉండటం నేను ప్రత్యక్షంగా గమనించాను. వీరు రాసింది నిజమే!
రాజా పచ్చయప్ప కాలేజిలో చదువుతూండగా పాటల పోటీలో ఘంటసాల, భానుమతి లైలామజ్నూలో పాడిన చెలునిగని అనే పాట పాడి మొదటి బహుమతి పొందాడట. న్యాయనిర్ణేతగా ఘంటసాలే వచ్చారట.
రాజా గురించి తన ఒక వ్యాసంలో పి.బి.శ్రీనివాస్ ఆసక్తికరమైన విషయాలు రాశారు.
విప్రనారాయణ తీసే రోజుల్లో ఘంటసాలకు చుట్ట కాల్చే అలవాటుండేదట. అప్పట్లో యుగళగీతాలకు ఒకే మైక్ వాడేవారు కనక ఆ వాసన పడని భానుమతి ఘంటసాలతో పాడనని అన్నదట. అది రాజాకు వరప్రసాదం అయింది.
అలాగే విజయావారు చంద్రహారం టైములో సినీనిర్మాణంలో అనేక డిపార్ట్మెంట్లు మొదలుపెట్టి నెల జీతాలు ఏర్పాటు చేశారట. ఉదాహరణకు కళాదర్శకుడు గోఖలే. అందులో వడ్రంగుల దగ్గర్నుంచీ అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలూ, నెల జీతాలూ. అలాగే సంగీతానికి ఘంటసాల. అయితే నిబంధన ఏమిటంటే వీళ్ళెవ్వరూ మరే సంస్థకూ పనిచెయ్యకూడదు. అప్పటికే అగ్రహీరోలిద్దరూ ఘంటసాల పాడకపోతే నటించము అని చెప్పే స్థితికి చేరుకున్నారట. ఇది గమనించిన ఘంటసాల విజయావారిని ఒక పెద్ద మొత్తం ఇమ్మని అడిగారట. అది సమ్మతం కాకపోవడంతో విజయావారు ఆయనను తమ ‘ఆస్థాన విద్వాంసుడి’ స్థానం నుంచి తొలగించి, మిస్సమ్మకు రాజేశ్వరరావును పెట్టుకున్నారట. ఇక పాడడానికి ఘంటసాలను పిలవడం ఇబ్బంది అవుతుందని రాజాను పిలిచారట. ఆ పాటలు సాధించిన విజయం రాజేశ్వరరావు ప్రతిభకూ, రాజా కంఠానికీ కూడా మంచి నిదర్శనం.
కల్యాణ పరిశు విజయం తరవాత రాజాకు అహం పెరిగి, ఎక్కువ పారితోషికం అడగడం మొదలుపెట్టాడనీ, ఆ కారణంగా అతనికి అవకాశాలు తగ్గాయనీ అప్పట్లో మేము మద్రాసులో విన్నాం. శ్రీధర్ తీసిన తేన్ నిలవు సినిమాపాటలు కూడా బాగా జనాదరణ పొందాయి. కల్యాణపరిశు విజయం తలకెక్కిన హాస్యనటుడు తంగవేలు కూడా శివాజీ గణేశన్ తో సమానంగా పారితోషికం అడగనారంభించాడనీ, దానితో అతన్ని పక్కన పెట్టారనీ విన్నాం.
అమరసందేశం సినిమాకు సంగీతాన్నిచ్చినది మా గురువుగారు ఎల్.ఆర్. కేళ్కర్. ఆయన మరాఠీవాడు కనక ఆయనకు తెలియకుండా ఆయనకు అసిస్టెంటుగా పనిచేసిన ప్రసాదరావు పేరు వేశారట (తెలుగు పేరు కదా అని). ఆ తరవాత ఆ సంగతి తెలిసి కేళ్కర్ గారు సినిమావాళ్ళని శాపనార్థాలు పెట్టి, సంగీతం టీచరుగా మాత్రమే మద్రాసులో కొనసాగారు. సినిమా ఫ్లాప్ అయింది. బైజూ బావ్రాలాగా పోటీ పాట పెట్టారుగాని రాజాకు అంతటి పటిమ లేదు. రఘునాథ్ పాణిగ్రాహితో పోటీ పాట మానస లాలస సంగీతం.
రాజా కాస్త అనుమానం మనిషనీ, దగ్గరున్న రైలుపెట్టెలో ఎక్కకుండా జిక్కీ ఉన్న బోగీనే అందుకోవడానికి ప్రయత్నించి అనవసరంగా దుర్మరణం పాలయాడనీ అన్నారు. 1993లో న్యూయార్క్లో ఒక కార్యక్రమంలో రాజా కుమారుడూ, కోడలూ పాడారుగాని అంత ఇమ్ప్రెసివ్ గా అనిపించలేదు.
అక్బర్ ఆస్థానంలో పనిచేసిన అబుల్ ఫజల్ అక్బర్నామా అనే మూడు సంపుటాల చరిత్ర రాశాడు. లియో తల్స్తోయ్ యుద్ధమూ శాంతి అనే తన ప్రసిద్ధ నవలలో తనకు రెండు తరాల ముందు జరిగిన నెపోలియన్ నాటి సంఘటనలను వర్ణించాడు. సురేశ్ గారి ఈ అద్భుతమైన వ్యాసం వాటిని మించుతుంది. సమకాలీన చరిత్రను నమోదు చెయ్యడంలోని లాభాలన్నీ ఈ రచనలో కనిపిస్తాయి.
ఈ వ్యాసం చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనసులో మెదిలాయి. జర్నలిజంలోనూ, సినిమాల నిర్మాణంలోనూ ఇలా ఏ రంగంలోనైనా మొదట కృషి చేసినవారంతా మేధావుల్లా అనిపిస్తారు. కొత్త పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, తమ శక్తులని వినియోగించే ప్రయత్నాలు చేస్తారు. వారి కృషి ఫలితంగా ఆ పరిజ్ఞానం అందరికీ సులువుగా ఉపయోగపడుతుంది. ఇక ఆ తరవాత మజ్జిగ పలచనవడం ప్రారంభిస్తుంది! తాటాకులూ, గంటాల రోజుల్లో అపూర్వమైన సాహిత్యాన్ని సృష్టించగలిగినవారే రచనలకు పూనుకునేవారు. ఆరణాల కలాలు అందుబాటులోకి వచ్చాక రచయితల సంఖ్య పెరిగిపోతుంది. మళ్ళీ వారిలో ‘పుణ్యపురుషులు’ ఎవరో తేల్చుకోవటానికి సమయం పడుతుంది.
ఈ వ్యాసంలో వర్ణించిన సంఘటనల క్రమం, కొందరి పేర్లూ అన్నీ భవిష్యత్తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. టెక్నాలజీతోనూ, తెలుగుభాషతోనూ, సాహిత్యంతోనూ సాన్నిహిత్యం ఉన్న సురేశ్ వంటి వ్యక్తులు ఎంత అరుదో వేరే చెప్పనక్కర్లేదు. ఆయన అంతగా చెప్పుకోకపోయినప్పటికీ యూనీకోడ్ వగైరా అంశాలమీద ఆయన చేసిన కృషి చాలా గొప్పది. దాన్ని గురించి ఒక చిన్న వ్యాసాన్నైనా రాయమని నేను ఈమాట సంపాదకులను కోరుతున్నాను. అబుల్ ఫజల్ సంగతి కూడా ఎవరైనా రాయాలి కదా!
అయ్యా! ఈ మాటలో రామాయణ విషవృక్షం కూడా ప్రచురిస్తారా? అది కూడా చాలా చోట్ల అమితంగా హాస్య రసాన్ని ఒలికించి పాఠకుల్ని నవ్విస్తుంది. గతితార్కిక భౌతిక వాదంతో (దీని అర్థం నాకంతగా తెలియదిప్పుడు) కూడిన రచయిత్రి విమర్శలు ఆలోచింపజేస్తాయి. ఏమైనా వీటిద్వారా చెప్పదలచుకున్న విషయం నచ్చింది.
ఐనా మనం ఏదైనా చెప్పదలుచుకుంటె దానికి ఎక్కువమంది ప్రజలు హృదయంలో నిలిపి అమిత భక్తితో ఆరాధించే పురాణపాత్రలను అపహాస్యం చేయడం యుక్తమైన మార్గమేనా? దయచేసి ఇటువంటివి ప్రచురించి కొందరిని దూరం/విముఖం చేసుకోరాదని విన్నపం. శ్రీరామాదులు ఐతిహాసిక పురుషులవునో కాదో చెప్పలేముకానీ, జగతి సుగుణ రాశి జడగట్టి ముడివెట్టి
మలచి నట్టి దివ్య మనుజ మూర్తి గా కొందరి భావనలో నిలిచిఉన్నాడు గదా.
పుస్తకంలో ఇదే నవలపై రచయిత రాసిన కామెంట్ లోని లింక్ ద్వారా ఇక్కడకొచ్చేను. వ్యాసమ్ చదివాను. ఎంతో సానుభూతితో రాసిన పరిచయం బాగుంది. కాని, నాకనిపించింది ఏమిటంటే మన చూట్టూ మనల్ని నిండా ముంచీసేలా వున్న బ్రామ్మన సాహిత్యం మన మనసులను ఎలా ఆక్రమించిందో చూడండి. ఈ వ్యాసంలొనే ‘పురాణం’, ‘భారత భాగవతాల్ని సూతుడు శౌనకాది మునులకి కూర్చోబెట్టి చెప్పినట్టు’, ‘ఉప్మాలో జీడిపప్పు పలుకుల్లా’ లాంటి మాటలు.. నాకెందుకో ఇక్కడ ఎబ్బెట్టుగా అనిపించాయి. ఎందుకిలా అనిపించిందంటే ఈ నెల “అరుణతార” చదవడం వల్లనా? లేదంటే ప్రస్తుతం బి.ఎస్. రాములుగారి “కన్యాశుల్కంను ఇప్పుడెలా చూడాలి” వ్యాసం చదువుతున్నందుకా? వీరి వ్యాసం నిజానికి నాకు నచ్చింది. గానీ, ఎందుకో పదజాలంలో మరో వాసన కనిపిస్తోంది. ఈ విషయంలో నా ఆలోచనలు అస్పష్టంగానే వున్నాయనుకోండి. అదే ఇక్కడ చెప్పాలనిపించింది. తప్పయితే మన్నించండి.
రంగ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మీరు చెప్పింది సమంజసమే అనిపిస్తుంది. శ్రీ నృసింహావిర్భావ ఘట్టంలో పోతన గారి పద్యం గుర్తు చేశారు. నతజన సఖముల్ అనుకుంటాను.
చింతయామి ఉత్తమ పురుషైక వచనానికి సంబంధించిన క్రియ. యూయం మధ్యమ పురుష బహు వచనం. కాబట్టి ఇక్కడ చింతయామో వయం (చింతయామః వయం = మేము చింతన చేస్తున్నాము) అనే పాఠం గ్రాహ్యం అని అనుకుంటున్నాను.
మరొక్కసారి కృతజ్ఞతలతో
భవదీయుడు
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
05/01/2009 2:22 pm
అమెరికాకి విశ్వవిద్యాలయంలో పై చదువులకి కాక, నేరుగా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిడానికి వచ్చిన నాకు సురేశ్ గారి వ్యాసం చదివి ఉండక పోతే, అంతర్జాలాన్ని గురించిన ఇంత చరిత్ర తెలిసి ఉండేది కాదు. తొంభై దశకం మొదట్లో, నేను పని చేసిన కంపెనీలు ఏవీ Internet connectivity మీద ఆసక్తి చూపడం నాకు గుర్తు లేదు (understandably so). చదివిన చదువుకీ చేసే ఉద్యోగానికీ ఎటూ సంబంధం లేదు, మళ్ళీ అమెరికాలో పై చదువులు అవసరమా అని తర్కించుకుంటూ తాపించుకుంటూ Computer Science అధ్యయనం చేసేనాటికి Internet Revolution ముదిరి పరిస్థితి చాలా మారిపోయింది. అందువలన ఈ విషయంలోసురేశ్లాంటి వాళ్ళకున్న అనుభవం, అవగాహన నాకు ఉండే అవకాశం లేదు. May be that is the reason I am able to fully appreciate his essay.
ఓపికగా సురేశ్ గారు తన అనుభవాలు ఈ వ్యాసం ద్వారా పంచుకున్నందుకు, కొత్త విషయాలు తెలిపినందుకు, ముఖ్యంగా తెలుగు Font విషయంలో కృషి చేసిన ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసినందుకు నెనర్లు.
భవదీయుడు,
రాజాశంకర్ కాశీనాథుని.
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి lyla yerneni అభిప్రాయం:
05/01/2009 2:10 pm
పిల్లి మెడలో గంట కట్టేదెవరు? -వేలూరి వేంకటేశ్వర రావు
అంటే? అందరికీ పనికొచ్చే ఆ పుస్తకం ఎవరు రాస్తారూ అనేనా? మీరే :-)ఎందుకంటే మీకు చిన్నయ సూరి వ్యాకరణము అంతా అర్థమవుతుంది.
That grammar book also appears to me, as a simplified manual, small in size, written to give guidance to the writers of his time. If it is outdated, update it. Such technical manuals need updating.
Take cinnaya suri’s grammar -simplify, modify, modernize the rules. Discard and add rules , as you see fit and give us the new Telugu grammar/style book / ‘తెలుగులో రాయటమెలా?’ అన్న పుస్తకం.
What is so hard about that? And who says no, if you want to do it? Not me.
లైలా
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
05/01/2009 7:44 am
తోచిన సూచనలిచ్చింది నిజమే కాని, ముఖ్యంగా నేను చెప్పిన దొక్కటి మాత్రం పూర్తిగా వదిలేసారు సురేశ్. అందుకే చెప్పుకోవడం.
సంస్కృత శ్లోకాలు, పోతన పద్యాలు మొదలగునవేవీ ఇంటెర్నెట్టులో లభించని రోజుల్లో వాటిని అందించి, అర్థ వివరాలను తెలిపి, అన్వయించుకోవడానికి ఆనందించడానికి అప్పట్లో సాయపడిన వారిలో గుర్తున్నంతవరకు సురేశ్ పేరే మొట్టమొదటిగా తడుతుంది. అంతే గాక, సురేశ్ అప్పట్లో SCIT కి “తెలుసా” గ్రూపులకు bridge తయారు చేసారు. దాన్ని వాడినవారికి కూడా తెలుసో లేదో.
WordPress ద్వారా “ఈ మాట” ను ప్రచురించే సాంకేతికపరమైన వివరాలను ఇంకెంతోమంది తెలుగు వారికి కూడా ఉపయోగపడాలనే పెద్ద మనసుతో, “పొద్దు”, “భూమిక”, “ప్రాణహిత” మొదలగు సైట్ల నిర్మాణానికి కూడా దాచుకోకుండా అందజేయడం, వారు చెప్పడం దాచారు కాబట్టి చెప్పడం. శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!
జ్ఞాపకాలు తెలుపుకోవడంలో ఒక ప్రమాదం ఉంది. రాసిన గంటకో రెండ్రోజులకో అయ్యో ఫలానా సంగతే చెప్పడం ఎట్లా మరిచాను అనిపించడం. అట్లా అని చాంతాడంత రాస్తూపోతే మొహమెత్తవచ్చు, తీపి కూడా ఎక్కువైతే అయినట్లు. గుర్తుకొచ్చినవాటికీ, రానివాటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.
______
విధేయుడు
-Srinivas
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/01/2009 7:21 am
మొత్తం మీద సురేష్ చాలా సమాచారం సేకరించి పొందుపరచారు ఈమాటలో! దీని ఉపయోగం ముందుముందు ఇంకా బాగా తెలుస్తుంది. అమెరికాలో ఉన్న తెలుగువారు చాలా మందికి ఉన్న కంప్యూటర్ (ఇన్ఫర్మేషన్) టెక్నాలజీతో పరిచయం కూడా ఇంటర్నెట్లో తెలుగు వికాసానికి తోడ్పడింది. రోహిణీప్రసాద్ గారన్నట్టు, తెలుగు యూనీకోడ్ లో సురేష్ కృషి వివరాలు కూడా అక్షరబద్ధం కావాలి!
అభినందనలతో,
లక్ష్మన్న
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/01/2009 7:04 am
అతి చక్కని వ్యాసానికి అద్భుతమైన పాటల సేకరణ! మనం మరచిపోతున్న ఒక మంచి గాయకుడిని కృష్ణ మోహన రావు, శ్రీనివాస్ గార్లు మళ్ళీ గుర్తుకు తెచ్చారు. అన్నట్టు, 1993 సంవత్సరం తానా సభలకి వచ్చిన లీల, జిక్కీ వంటి గాయనిలతో పాటు వచ్చిన రాజా కుమారుడు (పేరు చంద్రశేఖర్ అని గుర్తు) గొంతు అచ్చు రాజా గొంతులా ఉండటం నేను ప్రత్యక్షంగా గమనించాను. వీరు రాసింది నిజమే!
అభినందనలతో,
లక్ష్మన్న
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Rohiniprasad అభిప్రాయం:
05/01/2009 6:42 am
మంచి వ్యాసం. మరికొన్ని ముచ్చట్లు.
రాజా పచ్చయప్ప కాలేజిలో చదువుతూండగా పాటల పోటీలో ఘంటసాల, భానుమతి లైలామజ్నూలో పాడిన చెలునిగని అనే పాట పాడి మొదటి బహుమతి పొందాడట. న్యాయనిర్ణేతగా ఘంటసాలే వచ్చారట.
రాజా గురించి తన ఒక వ్యాసంలో పి.బి.శ్రీనివాస్ ఆసక్తికరమైన విషయాలు రాశారు.
విప్రనారాయణ తీసే రోజుల్లో ఘంటసాలకు చుట్ట కాల్చే అలవాటుండేదట. అప్పట్లో యుగళగీతాలకు ఒకే మైక్ వాడేవారు కనక ఆ వాసన పడని భానుమతి ఘంటసాలతో పాడనని అన్నదట. అది రాజాకు వరప్రసాదం అయింది.
అలాగే విజయావారు చంద్రహారం టైములో సినీనిర్మాణంలో అనేక డిపార్ట్మెంట్లు మొదలుపెట్టి నెల జీతాలు ఏర్పాటు చేశారట. ఉదాహరణకు కళాదర్శకుడు గోఖలే. అందులో వడ్రంగుల దగ్గర్నుంచీ అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలూ, నెల జీతాలూ. అలాగే సంగీతానికి ఘంటసాల. అయితే నిబంధన ఏమిటంటే వీళ్ళెవ్వరూ మరే సంస్థకూ పనిచెయ్యకూడదు. అప్పటికే అగ్రహీరోలిద్దరూ ఘంటసాల పాడకపోతే నటించము అని చెప్పే స్థితికి చేరుకున్నారట. ఇది గమనించిన ఘంటసాల విజయావారిని ఒక పెద్ద మొత్తం ఇమ్మని అడిగారట. అది సమ్మతం కాకపోవడంతో విజయావారు ఆయనను తమ ‘ఆస్థాన విద్వాంసుడి’ స్థానం నుంచి తొలగించి, మిస్సమ్మకు రాజేశ్వరరావును పెట్టుకున్నారట. ఇక పాడడానికి ఘంటసాలను పిలవడం ఇబ్బంది అవుతుందని రాజాను పిలిచారట. ఆ పాటలు సాధించిన విజయం రాజేశ్వరరావు ప్రతిభకూ, రాజా కంఠానికీ కూడా మంచి నిదర్శనం.
కల్యాణ పరిశు విజయం తరవాత రాజాకు అహం పెరిగి, ఎక్కువ పారితోషికం అడగడం మొదలుపెట్టాడనీ, ఆ కారణంగా అతనికి అవకాశాలు తగ్గాయనీ అప్పట్లో మేము మద్రాసులో విన్నాం. శ్రీధర్ తీసిన తేన్ నిలవు సినిమాపాటలు కూడా బాగా జనాదరణ పొందాయి. కల్యాణపరిశు విజయం తలకెక్కిన హాస్యనటుడు తంగవేలు కూడా శివాజీ గణేశన్ తో సమానంగా పారితోషికం అడగనారంభించాడనీ, దానితో అతన్ని పక్కన పెట్టారనీ విన్నాం.
అమరసందేశం సినిమాకు సంగీతాన్నిచ్చినది మా గురువుగారు ఎల్.ఆర్. కేళ్కర్. ఆయన మరాఠీవాడు కనక ఆయనకు తెలియకుండా ఆయనకు అసిస్టెంటుగా పనిచేసిన ప్రసాదరావు పేరు వేశారట (తెలుగు పేరు కదా అని). ఆ తరవాత ఆ సంగతి తెలిసి కేళ్కర్ గారు సినిమావాళ్ళని శాపనార్థాలు పెట్టి, సంగీతం టీచరుగా మాత్రమే మద్రాసులో కొనసాగారు. సినిమా ఫ్లాప్ అయింది. బైజూ బావ్రాలాగా పోటీ పాట పెట్టారుగాని రాజాకు అంతటి పటిమ లేదు. రఘునాథ్ పాణిగ్రాహితో పోటీ పాట మానస లాలస సంగీతం.
రాజా కాస్త అనుమానం మనిషనీ, దగ్గరున్న రైలుపెట్టెలో ఎక్కకుండా జిక్కీ ఉన్న బోగీనే అందుకోవడానికి ప్రయత్నించి అనవసరంగా దుర్మరణం పాలయాడనీ అన్నారు. 1993లో న్యూయార్క్లో ఒక కార్యక్రమంలో రాజా కుమారుడూ, కోడలూ పాడారుగాని అంత ఇమ్ప్రెసివ్ గా అనిపించలేదు.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి Rohiniprasad అభిప్రాయం:
05/01/2009 6:01 am
అక్బర్ ఆస్థానంలో పనిచేసిన అబుల్ ఫజల్ అక్బర్నామా అనే మూడు సంపుటాల చరిత్ర రాశాడు. లియో తల్స్తోయ్ యుద్ధమూ శాంతి అనే తన ప్రసిద్ధ నవలలో తనకు రెండు తరాల ముందు జరిగిన నెపోలియన్ నాటి సంఘటనలను వర్ణించాడు. సురేశ్ గారి ఈ అద్భుతమైన వ్యాసం వాటిని మించుతుంది. సమకాలీన చరిత్రను నమోదు చెయ్యడంలోని లాభాలన్నీ ఈ రచనలో కనిపిస్తాయి.
ఈ వ్యాసం చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనసులో మెదిలాయి. జర్నలిజంలోనూ, సినిమాల నిర్మాణంలోనూ ఇలా ఏ రంగంలోనైనా మొదట కృషి చేసినవారంతా మేధావుల్లా అనిపిస్తారు. కొత్త పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, తమ శక్తులని వినియోగించే ప్రయత్నాలు చేస్తారు. వారి కృషి ఫలితంగా ఆ పరిజ్ఞానం అందరికీ సులువుగా ఉపయోగపడుతుంది. ఇక ఆ తరవాత మజ్జిగ పలచనవడం ప్రారంభిస్తుంది! తాటాకులూ, గంటాల రోజుల్లో అపూర్వమైన సాహిత్యాన్ని సృష్టించగలిగినవారే రచనలకు పూనుకునేవారు. ఆరణాల కలాలు అందుబాటులోకి వచ్చాక రచయితల సంఖ్య పెరిగిపోతుంది. మళ్ళీ వారిలో ‘పుణ్యపురుషులు’ ఎవరో తేల్చుకోవటానికి సమయం పడుతుంది.
ఈ వ్యాసంలో వర్ణించిన సంఘటనల క్రమం, కొందరి పేర్లూ అన్నీ భవిష్యత్తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. టెక్నాలజీతోనూ, తెలుగుభాషతోనూ, సాహిత్యంతోనూ సాన్నిహిత్యం ఉన్న సురేశ్ వంటి వ్యక్తులు ఎంత అరుదో వేరే చెప్పనక్కర్లేదు. ఆయన అంతగా చెప్పుకోకపోయినప్పటికీ యూనీకోడ్ వగైరా అంశాలమీద ఆయన చేసిన కృషి చాలా గొప్పది. దాన్ని గురించి ఒక చిన్న వ్యాసాన్నైనా రాయమని నేను ఈమాట సంపాదకులను కోరుతున్నాను. అబుల్ ఫజల్ సంగతి కూడా ఎవరైనా రాయాలి కదా!
ఉత్తర కిష్కింధ (నాటిక) గురించి M.S.Prasad అభిప్రాయం:
05/01/2009 3:47 am
అయ్యా! ఈ మాటలో రామాయణ విషవృక్షం కూడా ప్రచురిస్తారా? అది కూడా చాలా చోట్ల అమితంగా హాస్య రసాన్ని ఒలికించి పాఠకుల్ని నవ్విస్తుంది. గతితార్కిక భౌతిక వాదంతో (దీని అర్థం నాకంతగా తెలియదిప్పుడు) కూడిన రచయిత్రి విమర్శలు ఆలోచింపజేస్తాయి. ఏమైనా వీటిద్వారా చెప్పదలచుకున్న విషయం నచ్చింది.
ఐనా మనం ఏదైనా చెప్పదలుచుకుంటె దానికి ఎక్కువమంది ప్రజలు హృదయంలో నిలిపి అమిత భక్తితో ఆరాధించే పురాణపాత్రలను అపహాస్యం చేయడం యుక్తమైన మార్గమేనా? దయచేసి ఇటువంటివి ప్రచురించి కొందరిని దూరం/విముఖం చేసుకోరాదని విన్నపం. శ్రీరామాదులు ఐతిహాసిక పురుషులవునో కాదో చెప్పలేముకానీ, జగతి సుగుణ రాశి జడగట్టి ముడివెట్టి
మలచి నట్టి దివ్య మనుజ మూర్తి గా కొందరి భావనలో నిలిచిఉన్నాడు గదా.
“అంటరాని వసంతం” నవల గురించి దుప్పల రవికుమార్ అభిప్రాయం:
04/30/2009 9:25 pm
పుస్తకంలో ఇదే నవలపై రచయిత రాసిన కామెంట్ లోని లింక్ ద్వారా ఇక్కడకొచ్చేను. వ్యాసమ్ చదివాను. ఎంతో సానుభూతితో రాసిన పరిచయం బాగుంది. కాని, నాకనిపించింది ఏమిటంటే మన చూట్టూ మనల్ని నిండా ముంచీసేలా వున్న బ్రామ్మన సాహిత్యం మన మనసులను ఎలా ఆక్రమించిందో చూడండి. ఈ వ్యాసంలొనే ‘పురాణం’, ‘భారత భాగవతాల్ని సూతుడు శౌనకాది మునులకి కూర్చోబెట్టి చెప్పినట్టు’, ‘ఉప్మాలో జీడిపప్పు పలుకుల్లా’ లాంటి మాటలు.. నాకెందుకో ఇక్కడ ఎబ్బెట్టుగా అనిపించాయి. ఎందుకిలా అనిపించిందంటే ఈ నెల “అరుణతార” చదవడం వల్లనా? లేదంటే ప్రస్తుతం బి.ఎస్. రాములుగారి “కన్యాశుల్కంను ఇప్పుడెలా చూడాలి” వ్యాసం చదువుతున్నందుకా? వీరి వ్యాసం నిజానికి నాకు నచ్చింది. గానీ, ఎందుకో పదజాలంలో మరో వాసన కనిపిస్తోంది. ఈ విషయంలో నా ఆలోచనలు అస్పష్టంగానే వున్నాయనుకోండి. అదే ఇక్కడ చెప్పాలనిపించింది. తప్పయితే మన్నించండి.
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి M.S.Prasad అభిప్రాయం:
04/30/2009 2:14 am
రంగ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మీరు చెప్పింది సమంజసమే అనిపిస్తుంది. శ్రీ నృసింహావిర్భావ ఘట్టంలో పోతన గారి పద్యం గుర్తు చేశారు. నతజన సఖముల్ అనుకుంటాను.
చింతయామి ఉత్తమ పురుషైక వచనానికి సంబంధించిన క్రియ. యూయం మధ్యమ పురుష బహు వచనం. కాబట్టి ఇక్కడ చింతయామో వయం (చింతయామః వయం = మేము చింతన చేస్తున్నాము) అనే పాఠం గ్రాహ్యం అని అనుకుంటున్నాను.
మరొక్కసారి కృతజ్ఞతలతో
భవదీయుడు