నిజం గా ఇది ఆలోచించాల్సిన విషయం. రమాదేవి గారు రాసినట్లు పెళ్ళిని పక్కన పెట్టేసే రోజు తొందరలోనే వస్తుందేమో! అప్పుడు కుటుంబం అంటే తెలియకుండా పోతుందేమో! “సేవ్ ఎర్త్ ” ఆర్గనైజేషన్స్ ఇంక మొదలెట్టాలేమో! కధలో గమనించాల్సింది భార్య భర్త ఫ్రెష్ గా కోరుకుటాడని, దోశ ఇడ్లి లాటివి కావాలనుకుటాడని దాని పై స్థాయి అసలు తను మాత్రమే వంట గురిచి టిఫిన్ గురిచి పట్టించుకోవాలి అని అనుకోకపోవడము……..హనుమంత రావు గారు హాస్యం గా రాశాననుకుంటున్నారేమో కాని అది చేదు నిజం. పచ్చిపాలు etc తో చాలా మంచి భర్త అయిపోయాననుకునే అలాంటి భర్తలే చాలా ప్రోగ్రెస్సివ్ అనుకోవాలేమో! కాలేజీల్లో కంప్యూటర్ ప్రోగ్రాములూ, వేవ్ ఈక్వేషన్స్ తో బాటు సాటి మనిషితో ఎలా బతకాలి, అసలు కుటుంబం ప్రారంభించగల స్కిల్స్ నేర్పించి, సర్టిఫికేట్ ఇచ్చే వ్యవస్థ కావాలేమో! రమాదేవి గారు చెప్పినట్లు పిల్లవాడు అరుణ్ వాళ్ళ నాన్నలా కాకుండా వేరే విధం గా వుండే అవకాశాలు తక్కువ. We are half genetic and half from environment. Here both are suggesting that the child becomes another raaghava!!!!!!!!!! But what is the solution? How to change this? How many legal changes can bring a change in this sort of mentalities? 90% of the society expects a woman to be with the husband since as Mr Hanumantha Rao expressed ” కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు.” కానీ సంసారమంటే ఇదేనా! చలం మైదానం రాసి ఎన్ని యేళ్ళు గడిచాయి? కానీ ఇంకా అదే వుపేక్ష స్త్రీ కి వుహూ, భార్యకి ఏమి కావాలో అర్ధం చేసికోవడంలో! ఇది ఫామిలీ/కుటుంబ వ్యవస్థని వాతావరణం లో ఓజోన్ రంధ్రం కంటే పెద్ద హాని కలగచెయ్యగలదని ఎందుకు అనిపించట్లేదో అని దిగులేస్తోంది.
దేనికొసమో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. జనరంజని – సావిత్రి సమర్పించిన ఈ ప్రత్యేక జనరంజని వింటున్నాను. “ఆవిడ ముఖములోని అమాయకత్వం ఆవిడ సుమధురమైన గొంతులో ప్రతిబింబించింది.” అన్నది అక్షరాలా నిజం! మంచి పాటలు చాలా ఉన్నాయి కానీ, ఆ చక్కని గొంతూ, ఆషామాషీ (ఆవిడ మాట!) మాటవరసా, ఆ పాటలన్నీ తీసేసినా తిరిగి తిరిగి వినాలనిపించేట్టుగా ఉన్నాయి.
శ్రీనివాస్ – థాంక్సు.
కవిత్వంలో శబ్దం, శిల్పం రెండు ముఖ్యమే. పచ్చిగా రాస్తే అది depth వున్న కవిత్వం అని కొద్ది మంది పెద్దవాళ్ళ కవిత్వమం చదివితే కలిగే తొందరపాటు నిర్ణయం. “Poetry is the economy of words” అన్నడు చలమ్. నాకు తెలిసి propriety of words is THE fundamental. ఖడ్గం సినిమాలొ “నువ్వు నువ్వు” పాట్లొ “మెత్తని ముల్లై గిల్లె తొలి చినుకె నువ్వు” అని రాసాడు కవి. అదే విషయాన్ని పచ్చిగా రాస్తే చదవడానికి నోరు రాదు. కవిలో మర్యాదస్థున్ని చదవాలి, కవిత్వం అబ్బిన వాడికి మర్యాద అబ్బకపొదు.
I am sure it is just a slight perversion before the perfection and you CAN write better than what you did. So రవికిరణ్ గారూ Best of luck !!
రాగం, తానం, పల్లవి అనే పదాలలో రాగం, పల్లవి పదాలకు సంగీత పరమైన నిర్వచనం కాకపోయినా, సామాన్య జన గ్రాహ్యమైన అర్ధం తెలుసు కానీ తానం అంటే ఏమిటో తెలియదు. మూడిటికీ సంగీత పరమైన అర్ధం వివరించరా.
అత్యద్భుతం గురువు గారూ, మీ ఈ పరిశ్రమ సుశ్లాఘ్యం, సర్వ రసజ్ఞ జనమనో రంజకం. ఆపాత మధురమైన సంగీతం గొప్పదా లేక జీవితాంతం ఆలోచించినంత కొలది ఊట చెలమలాగా రసానందం సృజించే శాశ్వతానంద దాయకమైన సాహిత్యం గొప్పదా అని వివాదం కలిగించేలా ఘంటసాలగారు=కరుణశ్రీ గారు స్వర పరచి పాడిన=రచించిన కుంతీ కుమారి అద్భుతంగా జోడించి మాకందించారు. మీ ఈ కృషికి ఈమాట రసజ్ఞ హృదయులైన పాఠకులంతా ఋణపడిఉంటారు.
ఇది పద్యం బిదియే కవిత్వ మిదెపో ఇంపైన సాహిత్య మం
చిది గాన మ్మిదియే రస మ్మిదియపో ఇంపైన సంగీత మం
చెద తా భావ రసాద్భుతామర ఝరీ హేలా విలోలార్భటీ
విదితానంద మరందమై చెలగె సంప్రేహ్యేంద్రియారామమై
మీరు చెప్పిన మహా విద్వాంసుడు మన తొలి ఆస్థాన విద్వాంసుడు శ్రీ కాశీ కృష్ణాచార్యులేమో! నాకు తెలిసిన తెలుగు వారిలో ఆ తరంలో అటు సంస్కృతంలోనూ ఇటు సంగీతం, తబలా వాయిద్యంలోనూ అసామాన్య ప్రతిభ కలిగిన తెలుగు వ్యక్తి శ్రీ కాశీ కృష్ణాచారులు గారే!
మృదంగ విద్వాంసులలో యెల్లా వెంకటేశ్వరరావు సోలో కచేరీల్లో రకరకాల ధ్వనులు మృదంగం మీద పలికిస్తారు. నోటితో బోల్ (కొనగోలు) విన్యాసాలను వినిపించి, ఆ తరవాత తాళవాద్యం పై దాన్నే పలికించే సంప్రదాయం ఉత్తర, దక్షిణ సంగీతపద్ధతులు రెంటిలోనూ ఉంది. ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పనికొస్తాయే తప్ప ప్రావీణ్యానికి ఉదాహరణలు కావు. ఎందుకంటే రాగప్రస్తారాన్ని విన్నంత ఆసక్తితో తాళవిన్యాసాలని విని ఆనందించేవారు తక్కువే.
అయితే తబలా కన్నా మృదంగ విన్యాసాలు నిస్సందేహంగా జటిలమైనవి. “జాకిర్ హుసేన్కు ఎక్కువ గ్లామర్ ఉండవచ్చుగాని ఏ మృదంగ కళాకారుడైనా అతనికి సాటిరాగలడని చాలామందికి తెలియకపోవచ్చు” అంటూ బొంబాయి సంగీత విమర్శకుడొకడు రాశాడు.
థిరక్వా కచేరీ గొప్పగా ఉందని నేనంటే ప్రసిద్ధ సారంగీ విద్వాంసుడు రామ్ నారాయణ్ అదే అతివిశిష్ట కళాకారులు కలిగించే ప్రభావం అని నాతో అన్నారు.
మరొక ముచ్చట. నేను హాజరయిన థిరక్వా కచేరీకి ప్రసిద్ధ సంగీతదర్శకుడు మదన్మోహన్ కూడా హాజరవడం గమనించాను. అతను ఆ ఏడాదే మరణించినట్టు గుర్తు (1975).
మరొక్క మహోన్నత కళాభాస్కరుని అంధత్వంలో వున్న మాకు పరిచయం చేస్తూ స్ఫూర్తి దాయకమైన సమాచారాన్ని అందజేసినందుకు హార్దిక ధన్య వాదాలు.
ఏ తాళ వాద్యకారుని గూర్చిన ప్రశంస విన్నా లేక వారి వాదనాన్నివినే భాగ్యానికినోచుకున్నా నా చిన్నతనంలో (1962-64మధ్యలో) మా ఊరి త్యాగరాజోత్సవాలలో విన్న ఒక మహా విద్వాంసుని తబలా వాదన ఇప్పటికీ స్మృతిలో చిరనూతనంగా ఉంటూ గుర్తుకు వస్తుంది. ఆనాదు ఆ 90 ఏళ్ళ వృద్ధ విద్వాంసుడు ఒక గంటసేపు తబలా వాదనతో మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేయడమే కాక చివరలో ఒక అద్భుత ప్రక్రియ (నైపుణ్యం) ప్రదర్శించాడు. విఘ్నేశ్వరుని సంస్తుతించే సంస్కృత శ్లోకానికి ఒకరు రాగ యుక్తంగా ఒక్కొక్క పదం పాడుతూంటే ఆ పదాలని ఆయన తన తబలా పైన పలికించారు. తంత్రీ వాద్యాలకు, గాత్రానికి మాత్రమే సాధ్యమైన రాగాలను ఒక తాళ వాద్యంపై పలికింపజేసే ఆ ప్రక్రియ ను నేను మళ్ళీ ఎక్కడా వినలేదు. కనలేదు. ఐతే నేను వేరే ఏ తాళ వాద్య కచేరి ఇంతవరకు వినలేదని చెప్పడం కూడా ఈ సందర్భంలో అత్యవసరం. నేను చూసిన ఈ ప్రక్రియ/నైపుణ్యం ఒకింత ప్రతిభ గల వారెవరైనా చేయగలుగుతారా లేక ఇది ఒక అసాధారణ నైపుణ్యమా చెప్పగలరా. ఎందుకంటే మీ వ్యాసంలో ఇటువంటి చాతుర్యంపై ప్రసక్తి రాలేదు.
పునరపి గురించి ramaadevi godugula అభిప్రాయం:
06/13/2009 2:55 am
నిజం గా ఇది ఆలోచించాల్సిన విషయం. రమాదేవి గారు రాసినట్లు పెళ్ళిని పక్కన పెట్టేసే రోజు తొందరలోనే వస్తుందేమో! అప్పుడు కుటుంబం అంటే తెలియకుండా పోతుందేమో! “సేవ్ ఎర్త్ ” ఆర్గనైజేషన్స్ ఇంక మొదలెట్టాలేమో! కధలో గమనించాల్సింది భార్య భర్త ఫ్రెష్ గా కోరుకుటాడని, దోశ ఇడ్లి లాటివి కావాలనుకుటాడని దాని పై స్థాయి అసలు తను మాత్రమే వంట గురిచి టిఫిన్ గురిచి పట్టించుకోవాలి అని అనుకోకపోవడము……..హనుమంత రావు గారు హాస్యం గా రాశాననుకుంటున్నారేమో కాని అది చేదు నిజం. పచ్చిపాలు etc తో చాలా మంచి భర్త అయిపోయాననుకునే అలాంటి భర్తలే చాలా ప్రోగ్రెస్సివ్ అనుకోవాలేమో! కాలేజీల్లో కంప్యూటర్ ప్రోగ్రాములూ, వేవ్ ఈక్వేషన్స్ తో బాటు సాటి మనిషితో ఎలా బతకాలి, అసలు కుటుంబం ప్రారంభించగల స్కిల్స్ నేర్పించి, సర్టిఫికేట్ ఇచ్చే వ్యవస్థ కావాలేమో! రమాదేవి గారు చెప్పినట్లు పిల్లవాడు అరుణ్ వాళ్ళ నాన్నలా కాకుండా వేరే విధం గా వుండే అవకాశాలు తక్కువ. We are half genetic and half from environment. Here both are suggesting that the child becomes another raaghava!!!!!!!!!! But what is the solution? How to change this? How many legal changes can bring a change in this sort of mentalities? 90% of the society expects a woman to be with the husband since as Mr Hanumantha Rao expressed ” కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు.” కానీ సంసారమంటే ఇదేనా! చలం మైదానం రాసి ఎన్ని యేళ్ళు గడిచాయి? కానీ ఇంకా అదే వుపేక్ష స్త్రీ కి వుహూ, భార్యకి ఏమి కావాలో అర్ధం చేసికోవడంలో! ఇది ఫామిలీ/కుటుంబ వ్యవస్థని వాతావరణం లో ఓజోన్ రంధ్రం కంటే పెద్ద హాని కలగచెయ్యగలదని ఎందుకు అనిపించట్లేదో అని దిగులేస్తోంది.
జనరంజని: మహానటి సావిత్రి గురించి Ramakrishna అభిప్రాయం:
06/12/2009 1:46 pm
మరీ పిక్కీ అనుకోకపోతే, ఒక ప్రశ్న.
టైపోలు కనపడితే, వాటి గురించి చెప్పడానికి ఇక్కడ కాక ఇంకో మార్గముందా?
[ఎడిటర్స్ ఎట్ ఈమాట.కాం కు ఈమెయిల్ పంపవచ్చు – సం.]
జనరంజని: మహానటి సావిత్రి గురించి Ramakrishna అభిప్రాయం:
06/12/2009 9:18 am
దేనికొసమో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. జనరంజని – సావిత్రి సమర్పించిన ఈ ప్రత్యేక జనరంజని వింటున్నాను. “ఆవిడ ముఖములోని అమాయకత్వం ఆవిడ సుమధురమైన గొంతులో ప్రతిబింబించింది.” అన్నది అక్షరాలా నిజం! మంచి పాటలు చాలా ఉన్నాయి కానీ, ఆ చక్కని గొంతూ, ఆషామాషీ (ఆవిడ మాట!) మాటవరసా, ఆ పాటలన్నీ తీసేసినా తిరిగి తిరిగి వినాలనిపించేట్టుగా ఉన్నాయి.
శ్రీనివాస్ – థాంక్సు.
నిశ్శబ్దం గురించి Mr.Suneeth అభిప్రాయం:
06/12/2009 3:52 am
కవిత్వంలో శబ్దం, శిల్పం రెండు ముఖ్యమే. పచ్చిగా రాస్తే అది depth వున్న కవిత్వం అని కొద్ది మంది పెద్దవాళ్ళ కవిత్వమం చదివితే కలిగే తొందరపాటు నిర్ణయం. “Poetry is the economy of words” అన్నడు చలమ్. నాకు తెలిసి propriety of words is THE fundamental. ఖడ్గం సినిమాలొ “నువ్వు నువ్వు” పాట్లొ “మెత్తని ముల్లై గిల్లె తొలి చినుకె నువ్వు” అని రాసాడు కవి. అదే విషయాన్ని పచ్చిగా రాస్తే చదవడానికి నోరు రాదు. కవిలో మర్యాదస్థున్ని చదవాలి, కవిత్వం అబ్బిన వాడికి మర్యాద అబ్బకపొదు.
I am sure it is just a slight perversion before the perfection and you CAN write better than what you did. So రవికిరణ్ గారూ Best of luck !!
సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు గురించి M.S.Prasad అభిప్రాయం:
06/12/2009 12:48 am
రాగం, తానం, పల్లవి అనే పదాలలో రాగం, పల్లవి పదాలకు సంగీత పరమైన నిర్వచనం కాకపోయినా, సామాన్య జన గ్రాహ్యమైన అర్ధం తెలుసు కానీ తానం అంటే ఏమిటో తెలియదు. మూడిటికీ సంగీత పరమైన అర్ధం వివరించరా.
భవదీయుడు
ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి” గురించి M.S.Prasad అభిప్రాయం:
06/12/2009 12:18 am
అత్యద్భుతం గురువు గారూ, మీ ఈ పరిశ్రమ సుశ్లాఘ్యం, సర్వ రసజ్ఞ జనమనో రంజకం. ఆపాత మధురమైన సంగీతం గొప్పదా లేక జీవితాంతం ఆలోచించినంత కొలది ఊట చెలమలాగా రసానందం సృజించే శాశ్వతానంద దాయకమైన సాహిత్యం గొప్పదా అని వివాదం కలిగించేలా ఘంటసాలగారు=కరుణశ్రీ గారు స్వర పరచి పాడిన=రచించిన కుంతీ కుమారి అద్భుతంగా జోడించి మాకందించారు. మీ ఈ కృషికి ఈమాట రసజ్ఞ హృదయులైన పాఠకులంతా ఋణపడిఉంటారు.
ఇది పద్యం బిదియే కవిత్వ మిదెపో ఇంపైన సాహిత్య మం
చిది గాన మ్మిదియే రస మ్మిదియపో ఇంపైన సంగీత మం
చెద తా భావ రసాద్భుతామర ఝరీ హేలా విలోలార్భటీ
విదితానంద మరందమై చెలగె సంప్రేహ్యేంద్రియారామమై
మరొక్కమారు దశ సహస్ర శత కోటి అభివందనలతో
భవదీయుడు
తబలా “మాంత్రికుడు” అహ్మద్జాన్ థిరక్వా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
06/10/2009 7:53 am
ప్రసాద్ గారూ:
మీరు చెప్పిన మహా విద్వాంసుడు మన తొలి ఆస్థాన విద్వాంసుడు శ్రీ కాశీ కృష్ణాచార్యులేమో! నాకు తెలిసిన తెలుగు వారిలో ఆ తరంలో అటు సంస్కృతంలోనూ ఇటు సంగీతం, తబలా వాయిద్యంలోనూ అసామాన్య ప్రతిభ కలిగిన తెలుగు వ్యక్తి శ్రీ కాశీ కృష్ణాచారులు గారే!
విష్ణుభొట్ల లక్ష్మన్న
తబలా “మాంత్రికుడు” అహ్మద్జాన్ థిరక్వా గురించి Rohiniprasad అభిప్రాయం:
06/10/2009 5:31 am
మృదంగ విద్వాంసులలో యెల్లా వెంకటేశ్వరరావు సోలో కచేరీల్లో రకరకాల ధ్వనులు మృదంగం మీద పలికిస్తారు. నోటితో బోల్ (కొనగోలు) విన్యాసాలను వినిపించి, ఆ తరవాత తాళవాద్యం పై దాన్నే పలికించే సంప్రదాయం ఉత్తర, దక్షిణ సంగీతపద్ధతులు రెంటిలోనూ ఉంది. ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పనికొస్తాయే తప్ప ప్రావీణ్యానికి ఉదాహరణలు కావు. ఎందుకంటే రాగప్రస్తారాన్ని విన్నంత ఆసక్తితో తాళవిన్యాసాలని విని ఆనందించేవారు తక్కువే.
అయితే తబలా కన్నా మృదంగ విన్యాసాలు నిస్సందేహంగా జటిలమైనవి. “జాకిర్ హుసేన్కు ఎక్కువ గ్లామర్ ఉండవచ్చుగాని ఏ మృదంగ కళాకారుడైనా అతనికి సాటిరాగలడని చాలామందికి తెలియకపోవచ్చు” అంటూ బొంబాయి సంగీత విమర్శకుడొకడు రాశాడు.
థిరక్వా కచేరీ గొప్పగా ఉందని నేనంటే ప్రసిద్ధ సారంగీ విద్వాంసుడు రామ్ నారాయణ్ అదే అతివిశిష్ట కళాకారులు కలిగించే ప్రభావం అని నాతో అన్నారు.
మరొక ముచ్చట. నేను హాజరయిన థిరక్వా కచేరీకి ప్రసిద్ధ సంగీతదర్శకుడు మదన్మోహన్ కూడా హాజరవడం గమనించాను. అతను ఆ ఏడాదే మరణించినట్టు గుర్తు (1975).
నౌషాద్ గురించి Rohiniprasad అభిప్రాయం:
06/10/2009 5:17 am
నౌషాద్ తదితరులు సినీసంగీతానికి పరిచయం చేసిన శంశాద్ బేగం ఇంకా జీవించే ఉంది. ఆవిడ గురించిన వార్త ఇవాళే చదివాను.
http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/jun/10navya1
తబలా “మాంత్రికుడు” అహ్మద్జాన్ థిరక్వా గురించి M.S.Prasad అభిప్రాయం:
06/10/2009 3:02 am
మరొక్క మహోన్నత కళాభాస్కరుని అంధత్వంలో వున్న మాకు పరిచయం చేస్తూ స్ఫూర్తి దాయకమైన సమాచారాన్ని అందజేసినందుకు హార్దిక ధన్య వాదాలు.
ఏ తాళ వాద్యకారుని గూర్చిన ప్రశంస విన్నా లేక వారి వాదనాన్నివినే భాగ్యానికినోచుకున్నా నా చిన్నతనంలో (1962-64మధ్యలో) మా ఊరి త్యాగరాజోత్సవాలలో విన్న ఒక మహా విద్వాంసుని తబలా వాదన ఇప్పటికీ స్మృతిలో చిరనూతనంగా ఉంటూ గుర్తుకు వస్తుంది. ఆనాదు ఆ 90 ఏళ్ళ వృద్ధ విద్వాంసుడు ఒక గంటసేపు తబలా వాదనతో మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేయడమే కాక చివరలో ఒక అద్భుత ప్రక్రియ (నైపుణ్యం) ప్రదర్శించాడు. విఘ్నేశ్వరుని సంస్తుతించే సంస్కృత శ్లోకానికి ఒకరు రాగ యుక్తంగా ఒక్కొక్క పదం పాడుతూంటే ఆ పదాలని ఆయన తన తబలా పైన పలికించారు. తంత్రీ వాద్యాలకు, గాత్రానికి మాత్రమే సాధ్యమైన రాగాలను ఒక తాళ వాద్యంపై పలికింపజేసే ఆ ప్రక్రియ ను నేను మళ్ళీ ఎక్కడా వినలేదు. కనలేదు. ఐతే నేను వేరే ఏ తాళ వాద్య కచేరి ఇంతవరకు వినలేదని చెప్పడం కూడా ఈ సందర్భంలో అత్యవసరం. నేను చూసిన ఈ ప్రక్రియ/నైపుణ్యం ఒకింత ప్రతిభ గల వారెవరైనా చేయగలుగుతారా లేక ఇది ఒక అసాధారణ నైపుణ్యమా చెప్పగలరా. ఎందుకంటే మీ వ్యాసంలో ఇటువంటి చాతుర్యంపై ప్రసక్తి రాలేదు.
భవదీయుడు