ఈ వ్యాసం వలన మా తరం వారికి ఆ తరం విశేషాలు తెలిశాయి. బేగం అక్తర్ లా బాల సరస్వతి గారు తిరిగి పాడలేక పోవటం మీరు సబబు గా చెప్పినట్లు మన తెలుగు జాతి కి సంస్కృతి, కళలపై ఉన్న వైఖరికి తార్కాణం గా ఉంది.
నమస్తే.
కథ బాగా రాసారు.నవ్విస్తూనే, నేటి సామాజిక, కుటుంబ వ్యవస్థ తీరుతెన్నుల పై వ్యంగ్యం బాణాలు గుప్పించారు. బాగుంది. మీరు మరిన్ని హాస్య రచన లు చేయాల ని అభిలషిస్తూ..
ఆర్.దమయంతి.
ఈ మధ్యే మీ “ఈమాట” చూసాను. చాల బాగుంది. ప్రవాస తెలుగు వారిని సాహిత్య ప్రపంచంతో సంబంధం కొనసాగించడం లో మీ ప్రయాస విజయవంతం అయ్యింది.
నా పేరు రామచందర్ దీకొండ. నేను సాహితీ ప్రియున్ని అని చెప్పుకుంటాను. సంస్కృత తెలుగు, ఉర్దూ భాషలలో ప్రవేశముంది. నేను గాలిబ్ దివాన్ లోని కొన్ని నాకిష్టమైన షేర్లను తెలుగులోకి అనువదించాను. మిత్రులు బాగా ఉన్నాయన్నారు. కొందరయితే మూలం లోని భావానికి అతి దగ్గరగా ఉన్నాయన్నారు. ఉర్దూ ప్రపంచం లో పెరిగి పెద్దవాన్నయినందు వల్ల ఉర్దూ భాష idiom ని తెలుగులోని తేవడం లో మిగతా అనువాదాలకంటే భిన్నంగా ఒచ్చాయని భావిస్తున్నాను. నేను ఇంతవరకు ఏ పత్రికకు వీటిని పంపలేదు.
పాఠకుల అభిప్రాయాలు అన్న పేజీలో ఈ కథ పై మోహన గారి అభిప్రాయం పైన ఉన్న ఈ కథ లింకు పట్టుకుని వస్తే ఈ కథ మూడో పేజీలోకి వచ్చాను. అదే మొదలనుకుని చదవడం మొదలెట్టాను. కొంచెం చదవగానే కథలో ఏదో చిన్న లోటున్నా, “ఓహో సంపాదకులు మరీ ఎడిట్ చేశేశేరేమో, పాత్రలని పరిచయం గట్రా చేసే పేరాగ్రాఫులు నరికేసేరేమో!” అనుకున్నాను. కథ మాత్రం అర్థమయింది, లోటేమీ అనిపించలేదు. కిందదాకా వచ్చేక, ముందరొక రెండు పేజీలు ఉన్నాయని తెలిసింది. మొత్తం కథంతా చదివాక “క్లీషే”లతో నిండిన పాత్ర చిత్రణ, వాతావరణ కల్పన చూసేక “ముందు రెండు పేజీలు చదవకపోయినా పరవాలేదులే” అనిపించింది.
ఈ సిరీస్ (శ్రేఢి?)లో కథలు సరళంగా చదివించగలిగేలా ఉన్నాయి, కథకి కావలసిన లక్షణాలు అవిమాత్రమే కాదు. ఈ కథలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పుస్తకంగా వేస్తారనుకుంటాను. (అందుకు ఈ సైట్ లో పైలట్ టెస్ట్ చేస్తున్నారనుకుంటాను) అన్ని కథలు ఓకే వాతావరణంలో ఒకే సామాజిక/ఆర్థిక వర్గాలకి చెందిన వారి కథలు, అన్నీ first person narration లో ఉన్నవి అయినప్పుడు కథలన్నీ ఇలా మూసలో పోసినట్లు ఉంటే మొహం మొత్తడం ఖాయం. వైవిధ్యం చాలా అవసరం. భిన్న దృక్పథాలనించి చెప్పడం– కాదు నడిపించడం– చాలా అవసరం.
శ్రీపాద, మ.రా, శాస్త్రి, రావి శాస్త్రి, ఆర్.కే. నారాయణ్ లాంటి వాళ్ళ కథల్లో ఈ విధమయిన మూస ధోరణి కనిపించదు.
ఇన్ని కథలు రాసినా అచ్చు తప్పులమీద దృష్టి పెట్టకపోవడం విచారకరం. “వ్యాహ్యాళి” తప్పు. కొన్ని చోట్ల “విశ్వనాధం” అనీ కొన్ని చోట్ల “విశ్వనాథం” అనీ అన్నారు. ఇలాంటివే మరికొన్ని.
మార్చ్ 11 న జపాన్ లో జరిగిన బీభత్సం తర్వాత..ఆ వూళ్ళో ఏమీ మిగ ల్లేదు. ప్రాణ నష్టం, తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు నిరాశ్రయులయ్యరు. ఇల్లూ వాకిలీ లేదు. వర్తకాలు లేవు, వుద్యోగాలూ లేవు. పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో తెలీదు. కాలూ చేయీ ఎప్పటికి కూడుతుందో తెలీదు. సునామీ సృస్ఠించిన విధ్వంసానికి ప్రత్యక్ష మూగ సాక్షి లా మిగిలింది ఆ వూరు.
నిజమే, ఆ వూరు వూరంతా నీరవుతోంది. కన్నీరు మున్నీరౌతోంది. ఐతే, వాళ్ళు విలపిస్తోంది. తమకు జరిగిన అన్యాయానికి కాదు!
సముద్ర తీరాన వందడుగుల ఎత్తులో రెండొందలేళ్ళ చరిత్ర గల్గిన డెభై వేల దేవదారు వృక్ష సమూహాల చిక్కని తోపుని – సునామీ వొచ్చి ఆ పళంగా తుడుచిపెట్టుకు పోయినందుకూ కాదు!
మరెందుకంటే- తమను సైనికుల్లా కాపాడిన దేవదారు సైన్య దళం మొత్తం ప్రాణ త్యాగం చేసి పోతూపోతూ సెల్యూట్ గా మిగిల్చి పోయిన ఒకే ఒకే ఒక్క చెట్టుని..చూస్తూ..దుఖిస్తున్నారు.
తమ ప్రాణాలు ఒడ్డి ఐనా సరే దాన్ని బ్రతికించుకోవాలని తపిస్తున్నారు. అందుకు ఒక రిటైర్డ్ మాస్టారు తన సర్వ శక్తిని ధార పోస్తున్న వైనం..ఈ వ్యాసం.
ఎంత అద్భుతం! ఇంతద్భుతమైన సజీవ కథని ఈ మధ్య కాలం లో విని వుండం!
ఇన్ని వేల కళ్ళ చెమరింపుకి… ఇన్ని కోట్ల హృదయ స్పందనలకి అతని గుండె చప్పుడొక్కటే కారణం.. అంటే అతిశయోక్తి కాదు.
ఈ వొంటరి వృక్షాన్ని చూస్తూ వుంటే. రణ భూమిలో అయిన వారందర్నీ పోగుట్టుకున్న అర్జుని విలాపం గుర్తోస్తోంది.
దాని దుఖాన్ని చూస్తే – ఆత్రేయ తన సాహిత్యాన్ని తిరగ రాసుకునే వాడే మోననిపిస్తుంది. (మానూ, మాకును కాను..అనే పాట)
కష్టాలు కుంగదీయడం, దుఖాలు కమ్ముకోడం..హఠాత్తుగా ఒక్కరమై మిగిలిపోడం…అసలివేవి కావు విషాదకరాలు..అలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం పక్కనెవరూ లేక పోడమే నిజమైన విషాదం మనిషికి! అలాంటి దుర్దశకు, దురవస్థకు, నిరాశకు, నిస్పృహ కు లోను కాకుండ అతను- ఆ చెట్టు కి చేయూత నివ్వడమే ఇక్కడ మనల్ని కదిలించే విషయం, సన్ని వేశం!
ఇప్పుడా చెట్టుకి అతనొక సేవకుడు. ఒక తండ్రి. ఒక నేస్తం. ఒక ఆయువు. ఒక ఆత్మీయుడు. ఒక మానవుడు. ఒక దేవుడు. అదిన్నాళ్ళు తన ఎత్తు చూసి మురిసింది కానీ, తనకంటే ఎత్తైన మనిషి ఒకడున్నాడనీ, అతని హృదయ వైభవాన్ని చూడ్డం కోసమే తను మిగిలున్నాని అనుకుంటుందేమో ఆ చెట్టు !
ఈ ఒక్క చెట్టే కాదు, హృదయమున్న ప్రతి వారూ ఆ మాష్టర్ గార్ని అభినందిస్తారు.ఆ ఊన్నత హృదయానికి వందనమంటారు.
కొన్ని ప్రత్యేకమైన్ శాస్త్రీయ పద్ధతుల ద్వారా..ఈ వృక్ష జాతి మొక్కలు నాటుకుంటున్నాయి నర్సరీ లో. కొత్త ప్రాణాలు పోసుకుంటూ, కొత్త మొక్కలవుతున్నాయి. వాటిని మళ్ళీ ఈ తీరాన నాటి, దట్టమైన దేవదారు వనం చేయాలని అక్కడి ప్రజ కంకణం కట్టుకుని వుంది.అది అడవిలా విస్తరిస్తుంది. పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఐతే, ఇదంతా జరగడానికి మరో ఇరవై యేళ్ళు పడుతుంది. సందేహంలేదు. కాని, జపాన్ చరిత్ర లో మాత్రం జరిగిపోయిన విషాద సంఘటన కంటే, మాస్టారి మానవత్వపు విలువే గొప్పదిగా నిలిస్తుంది అని చెప్పాలి. !
ఆ దుర్ఘటనలో తాను ఇల్లూ, కారూ , సర్వం కోల్పోయినా…నిలువ నీడ లేకున్నా…..ఆ చెట్టు క్షేమం కోసం నిలువునా కృషి చేస్తున్న ఆ మాస్టారి సేవకు అందరూ జోహార్ అనక తప్పదేమో!మనిషి హృదయ వై శా ల్యాన్ని కొలిచేం దుకు ఒక్కో సారి ఆకాశం కూడా వెనకాడుతుంది . లేకుంటే, వందడుగుల దేవదారు, వొంగి వందనం చేయగలదా ఆ మాష్టారికి!?
ఇన్నాళ్ళు ఆ భూమి – నూరడుగుల చెట్లతో ఆకాశం మీద కవితలు రాసుకునేదిట! ఇప్పుడతని పేరు రాస్తుందేమో!!
నిజానికి ఈ జపాన్ పైన్ ఒక చిన్న వార్త. మన వార్త పత్రికలోమహా ఐతే ఒక బాక్స్ ఐటం కూడా కాదేమో! ‘ఒక వార్తని వార్త లా చెప్పడం వల్ల అది కేవలం చదివించడం వరకే పనికొస్తుంది. కాని, అదే ఒక కధ లా చెప్పడం వల్ల, ఆ వార్త ఎంతమందినో కదిలిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ప్రతిస్పందింపచేస్తుంది..సమాజ ప్రయోజనానికి ఉపకరిస్తుంది’ అని చెబుతూ వుండే వారు జర్నలిజం క్లాస్ లో మా మాస్టార్! ఆయన మాటలు అక్షర సత్యాలులా తోస్తున్నాయి ఇప్పుడిది చదువుతూ వుంటే!
మీ జపాన్ పైన్ చదివుతూనే..జపాన్ ని నాలుగు చెఱగులా చదివొచ్చా. పని లో పని గా ‘క్లబ్బు చప్టా సమాధి’ లో ఇంకా సజీవంగా వున్న ‘నిద్ర గన్నేరు నీ’ చూసొచ్చా. బావుంది. కొత్త పాఠకులకు మీరిలాంటి సౌలభ్యాన్ని కలిగిస్తున్న ఈ ప్రయోగమూ బావుంది. !
ఒక నిజ సమాచారం తో బాటు ఒక సందేశాత్మక మైన వ్యాసాన్ని అందించిన సంపాదకులకు అభినందనలతో..
– ఆర్.దమయంతి.
మీ మాట 99 శాతం ఒప్పుకుంటాను. ఆ మిగిలిన ఒక్క శాతం సిలికానాంధ్ర భర్తీ చేస్తోంది. సిలికాన్ వేలీలో రాజకీయ, సినిమా వాసనలు లేని కార్యక్రమాలతో మాకు కొంత ఊరట కలుగుతోంది.
ఈ మధ్య తెలుగు కవితలు చదివి చాలా రోజులయ్యి ఏదో కవితాలోకంలో కాసేపు విహరిద్దామని కవితలు చదవదడం ఆరంభించా. కొన్ని పంక్తులు చదివాక నేను చదువుతున్నది కవితో కథో అర్థంకాలేదు. ఏమిటో! కవితలంటే ఇప్పుడు ఇంతేనేమో.
రావు బాలసరస్వతీదేవి గురించి prasad అభిప్రాయం:
09/05/2011 2:47 pm
ఈ వ్యాసం వలన మా తరం వారికి ఆ తరం విశేషాలు తెలిశాయి. బేగం అక్తర్ లా బాల సరస్వతి గారు తిరిగి పాడలేక పోవటం మీరు సబబు గా చెప్పినట్లు మన తెలుగు జాతి కి సంస్కృతి, కళలపై ఉన్న వైఖరికి తార్కాణం గా ఉంది.
తిక్కన భారతంలో పలుకులపొందు గురించి N.Vijayaramulu అభిప్రాయం:
09/05/2011 10:01 am
భద్రిరాజు కృష్ణమూర్తి గారి కలము నుండి ఎన్నో ఈలాంటి వ్యాసాలను ఆశించే అభిమానుల్లో నేనొకణ్ణి.
-విజయ రాములు.
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
09/05/2011 12:50 am
నమస్తే.
కథ బాగా రాసారు.నవ్విస్తూనే, నేటి సామాజిక, కుటుంబ వ్యవస్థ తీరుతెన్నుల పై వ్యంగ్యం బాణాలు గుప్పించారు. బాగుంది. మీరు మరిన్ని హాస్య రచన లు చేయాల ని అభిలషిస్తూ..
ఆర్.దమయంతి.
About eemaata గురించి Ramchander Deekonda అభిప్రాయం:
09/05/2011 12:12 am
నమస్తే,
ఈ మధ్యే మీ “ఈమాట” చూసాను. చాల బాగుంది. ప్రవాస తెలుగు వారిని సాహిత్య ప్రపంచంతో సంబంధం కొనసాగించడం లో మీ ప్రయాస విజయవంతం అయ్యింది.
నా పేరు రామచందర్ దీకొండ. నేను సాహితీ ప్రియున్ని అని చెప్పుకుంటాను. సంస్కృత తెలుగు, ఉర్దూ భాషలలో ప్రవేశముంది. నేను గాలిబ్ దివాన్ లోని కొన్ని నాకిష్టమైన షేర్లను తెలుగులోకి అనువదించాను. మిత్రులు బాగా ఉన్నాయన్నారు. కొందరయితే మూలం లోని భావానికి అతి దగ్గరగా ఉన్నాయన్నారు. ఉర్దూ ప్రపంచం లో పెరిగి పెద్దవాన్నయినందు వల్ల ఉర్దూ భాష idiom ని తెలుగులోని తేవడం లో మిగతా అనువాదాలకంటే భిన్నంగా ఒచ్చాయని భావిస్తున్నాను. నేను ఇంతవరకు ఏ పత్రికకు వీటిని పంపలేదు.
మీరు పంపమంటే కొన్ని అనువాదాలు మచ్చు కు పంపుతాను.
మీ,
రామచందర్ దీకొండ
హైదరాబాద్, 9966354106
[తప్పకుండా. రచయితలకు సూచనలు అన్న లంకెలో వివరించినట్లుగా submissions@eemaata.com కు పంపగలరు. సం.]
About eemaata గురించి Ramchander అభిప్రాయం:
09/05/2011 12:04 am
Please do not write “peer” as పీర్. It is pronounced as “peeyar” like beer, here and near.
Thanks
Ramchander
కోనసీమ కథలు: సత్తెవతి గురించి na’ma’t’a అభిప్రాయం:
09/04/2011 2:37 am
పాఠకుల అభిప్రాయాలు అన్న పేజీలో ఈ కథ పై మోహన గారి అభిప్రాయం పైన ఉన్న ఈ కథ లింకు పట్టుకుని వస్తే ఈ కథ మూడో పేజీలోకి వచ్చాను. అదే మొదలనుకుని చదవడం మొదలెట్టాను. కొంచెం చదవగానే కథలో ఏదో చిన్న లోటున్నా, “ఓహో సంపాదకులు మరీ ఎడిట్ చేశేశేరేమో, పాత్రలని పరిచయం గట్రా చేసే పేరాగ్రాఫులు నరికేసేరేమో!” అనుకున్నాను. కథ మాత్రం అర్థమయింది, లోటేమీ అనిపించలేదు. కిందదాకా వచ్చేక, ముందరొక రెండు పేజీలు ఉన్నాయని తెలిసింది. మొత్తం కథంతా చదివాక “క్లీషే”లతో నిండిన పాత్ర చిత్రణ, వాతావరణ కల్పన చూసేక “ముందు రెండు పేజీలు చదవకపోయినా పరవాలేదులే” అనిపించింది.
ఈ సిరీస్ (శ్రేఢి?)లో కథలు సరళంగా చదివించగలిగేలా ఉన్నాయి, కథకి కావలసిన లక్షణాలు అవిమాత్రమే కాదు. ఈ కథలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పుస్తకంగా వేస్తారనుకుంటాను. (అందుకు ఈ సైట్ లో పైలట్ టెస్ట్ చేస్తున్నారనుకుంటాను) అన్ని కథలు ఓకే వాతావరణంలో ఒకే సామాజిక/ఆర్థిక వర్గాలకి చెందిన వారి కథలు, అన్నీ first person narration లో ఉన్నవి అయినప్పుడు కథలన్నీ ఇలా మూసలో పోసినట్లు ఉంటే మొహం మొత్తడం ఖాయం. వైవిధ్యం చాలా అవసరం. భిన్న దృక్పథాలనించి చెప్పడం– కాదు నడిపించడం– చాలా అవసరం.
శ్రీపాద, మ.రా, శాస్త్రి, రావి శాస్త్రి, ఆర్.కే. నారాయణ్ లాంటి వాళ్ళ కథల్లో ఈ విధమయిన మూస ధోరణి కనిపించదు.
ఇన్ని కథలు రాసినా అచ్చు తప్పులమీద దృష్టి పెట్టకపోవడం విచారకరం. “వ్యాహ్యాళి” తప్పు. కొన్ని చోట్ల “విశ్వనాధం” అనీ కొన్ని చోట్ల “విశ్వనాథం” అనీ అన్నారు. ఇలాంటివే మరికొన్ని.
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
09/04/2011 1:34 am
సౌమ్య గార్కి,
పాండు కొల్లరపు గార్కి,
వంశీ గార్కి,
నా కధ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
జపనీస్ పైన్ చెట్టు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
09/03/2011 10:49 pm
.
ఎంత ఎదిగి పోయావయ్యా !
***
మార్చ్ 11 న జపాన్ లో జరిగిన బీభత్సం తర్వాత..ఆ వూళ్ళో ఏమీ మిగ ల్లేదు. ప్రాణ నష్టం, తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు నిరాశ్రయులయ్యరు. ఇల్లూ వాకిలీ లేదు. వర్తకాలు లేవు, వుద్యోగాలూ లేవు. పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో తెలీదు. కాలూ చేయీ ఎప్పటికి కూడుతుందో తెలీదు. సునామీ సృస్ఠించిన విధ్వంసానికి ప్రత్యక్ష మూగ సాక్షి లా మిగిలింది ఆ వూరు.
నిజమే, ఆ వూరు వూరంతా నీరవుతోంది. కన్నీరు మున్నీరౌతోంది. ఐతే, వాళ్ళు విలపిస్తోంది. తమకు జరిగిన అన్యాయానికి కాదు!
సముద్ర తీరాన వందడుగుల ఎత్తులో రెండొందలేళ్ళ చరిత్ర గల్గిన డెభై వేల దేవదారు వృక్ష సమూహాల చిక్కని తోపుని – సునామీ వొచ్చి ఆ పళంగా తుడుచిపెట్టుకు పోయినందుకూ కాదు!
మరెందుకంటే- తమను సైనికుల్లా కాపాడిన దేవదారు సైన్య దళం మొత్తం ప్రాణ త్యాగం చేసి పోతూపోతూ సెల్యూట్ గా మిగిల్చి పోయిన ఒకే ఒకే ఒక్క చెట్టుని..చూస్తూ..దుఖిస్తున్నారు.
తమ ప్రాణాలు ఒడ్డి ఐనా సరే దాన్ని బ్రతికించుకోవాలని తపిస్తున్నారు. అందుకు ఒక రిటైర్డ్ మాస్టారు తన సర్వ శక్తిని ధార పోస్తున్న వైనం..ఈ వ్యాసం.
ఎంత అద్భుతం! ఇంతద్భుతమైన సజీవ కథని ఈ మధ్య కాలం లో విని వుండం!
ఇన్ని వేల కళ్ళ చెమరింపుకి… ఇన్ని కోట్ల హృదయ స్పందనలకి అతని గుండె చప్పుడొక్కటే కారణం.. అంటే అతిశయోక్తి కాదు.
ఈ వొంటరి వృక్షాన్ని చూస్తూ వుంటే. రణ భూమిలో అయిన వారందర్నీ పోగుట్టుకున్న అర్జుని విలాపం గుర్తోస్తోంది.
దాని దుఖాన్ని చూస్తే – ఆత్రేయ తన సాహిత్యాన్ని తిరగ రాసుకునే వాడే మోననిపిస్తుంది. (మానూ, మాకును కాను..అనే పాట)
కష్టాలు కుంగదీయడం, దుఖాలు కమ్ముకోడం..హఠాత్తుగా ఒక్కరమై మిగిలిపోడం…అసలివేవి కావు విషాదకరాలు..అలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం పక్కనెవరూ లేక పోడమే నిజమైన విషాదం మనిషికి! అలాంటి దుర్దశకు, దురవస్థకు, నిరాశకు, నిస్పృహ కు లోను కాకుండ అతను- ఆ చెట్టు కి చేయూత నివ్వడమే ఇక్కడ మనల్ని కదిలించే విషయం, సన్ని వేశం!
ఇప్పుడా చెట్టుకి అతనొక సేవకుడు. ఒక తండ్రి. ఒక నేస్తం. ఒక ఆయువు. ఒక ఆత్మీయుడు. ఒక మానవుడు. ఒక దేవుడు. అదిన్నాళ్ళు తన ఎత్తు చూసి మురిసింది కానీ, తనకంటే ఎత్తైన మనిషి ఒకడున్నాడనీ, అతని హృదయ వైభవాన్ని చూడ్డం కోసమే తను మిగిలున్నాని అనుకుంటుందేమో ఆ చెట్టు !
ఈ ఒక్క చెట్టే కాదు, హృదయమున్న ప్రతి వారూ ఆ మాష్టర్ గార్ని అభినందిస్తారు.ఆ ఊన్నత హృదయానికి వందనమంటారు.
కొన్ని ప్రత్యేకమైన్ శాస్త్రీయ పద్ధతుల ద్వారా..ఈ వృక్ష జాతి మొక్కలు నాటుకుంటున్నాయి నర్సరీ లో. కొత్త ప్రాణాలు పోసుకుంటూ, కొత్త మొక్కలవుతున్నాయి. వాటిని మళ్ళీ ఈ తీరాన నాటి, దట్టమైన దేవదారు వనం చేయాలని అక్కడి ప్రజ కంకణం కట్టుకుని వుంది.అది అడవిలా విస్తరిస్తుంది. పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఐతే, ఇదంతా జరగడానికి మరో ఇరవై యేళ్ళు పడుతుంది. సందేహంలేదు. కాని, జపాన్ చరిత్ర లో మాత్రం జరిగిపోయిన విషాద సంఘటన కంటే, మాస్టారి మానవత్వపు విలువే గొప్పదిగా నిలిస్తుంది అని చెప్పాలి. !
ఆ దుర్ఘటనలో తాను ఇల్లూ, కారూ , సర్వం కోల్పోయినా…నిలువ నీడ లేకున్నా…..ఆ చెట్టు క్షేమం కోసం నిలువునా కృషి చేస్తున్న ఆ మాస్టారి సేవకు అందరూ జోహార్ అనక తప్పదేమో!మనిషి హృదయ వై శా ల్యాన్ని కొలిచేం దుకు ఒక్కో సారి ఆకాశం కూడా వెనకాడుతుంది . లేకుంటే, వందడుగుల దేవదారు, వొంగి వందనం చేయగలదా ఆ మాష్టారికి!?
ఇన్నాళ్ళు ఆ భూమి – నూరడుగుల చెట్లతో ఆకాశం మీద కవితలు రాసుకునేదిట! ఇప్పుడతని పేరు రాస్తుందేమో!!
నిజానికి ఈ జపాన్ పైన్ ఒక చిన్న వార్త. మన వార్త పత్రికలోమహా ఐతే ఒక బాక్స్ ఐటం కూడా కాదేమో! ‘ఒక వార్తని వార్త లా చెప్పడం వల్ల అది కేవలం చదివించడం వరకే పనికొస్తుంది. కాని, అదే ఒక కధ లా చెప్పడం వల్ల, ఆ వార్త ఎంతమందినో కదిలిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ప్రతిస్పందింపచేస్తుంది..సమాజ ప్రయోజనానికి ఉపకరిస్తుంది’ అని చెబుతూ వుండే వారు జర్నలిజం క్లాస్ లో మా మాస్టార్! ఆయన మాటలు అక్షర సత్యాలులా తోస్తున్నాయి ఇప్పుడిది చదువుతూ వుంటే!
మీ జపాన్ పైన్ చదివుతూనే..జపాన్ ని నాలుగు చెఱగులా చదివొచ్చా. పని లో పని గా ‘క్లబ్బు చప్టా సమాధి’ లో ఇంకా సజీవంగా వున్న ‘నిద్ర గన్నేరు నీ’ చూసొచ్చా. బావుంది. కొత్త పాఠకులకు మీరిలాంటి సౌలభ్యాన్ని కలిగిస్తున్న ఈ ప్రయోగమూ బావుంది. !
ఒక నిజ సమాచారం తో బాటు ఒక సందేశాత్మక మైన వ్యాసాన్ని అందించిన సంపాదకులకు అభినందనలతో..
– ఆర్.దమయంతి.
మన సంస్థలు – మన సంస్కృతి గురించి krishna అభిప్రాయం:
09/03/2011 7:22 pm
మీ మాట 99 శాతం ఒప్పుకుంటాను. ఆ మిగిలిన ఒక్క శాతం సిలికానాంధ్ర భర్తీ చేస్తోంది. సిలికాన్ వేలీలో రాజకీయ, సినిమా వాసనలు లేని కార్యక్రమాలతో మాకు కొంత ఊరట కలుగుతోంది.
నివాసం గురించి krishna అభిప్రాయం:
09/03/2011 6:40 pm
ఈ మధ్య తెలుగు కవితలు చదివి చాలా రోజులయ్యి ఏదో కవితాలోకంలో కాసేపు విహరిద్దామని కవితలు చదవదడం ఆరంభించా. కొన్ని పంక్తులు చదివాక నేను చదువుతున్నది కవితో కథో అర్థంకాలేదు. ఏమిటో! కవితలంటే ఇప్పుడు ఇంతేనేమో.