eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
పాఠకుల అభిప్రాయాలు
హనుమంతరావు results: 290
ఛందోధర్మము
గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/27/2008
10:33 am
హనుమంతరావు గారికి,
వ్యక్తిగత విషయాలూ,వ్యక్తిత్వాలూ రెండూ వేర్వేరు. మీరు ఈనవల మీ ప్రేయసి పోయినప్పుడు రాసారట కదా అన్నది వ్యక్తిగత విషయం. కులం గురించి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తూ కాస్ట్ ఫీలింగ్ చూపడం వ్యక్తిత్వం. ఏ రచనయినా బాగుందనిపిస్తే ఆయా రచయితలగురించి ఆరా తీయడం సహజం. అప్పుడప్పుడు ఈ వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిత్వాలు కూడా వద్దన్నా బయటకొస్తాయి. వాటితోనే
( రచయితలతోనూ, వారి రచనలతోనూ) పాఠకులకి పేచీ!
నేను నాకు నచ్చింది రాస్తానూ, నా జీవితం నా ఇష్టం / నచ్చితే చదువు / లేదా వదిలేయి / రచన్నీ, రచయిత జీవితాన్ని కలిపిచూడద్దు / అని రచయితే చెప్పడం ( ముక్కు సూటి వ్యవహారంలా కనిపించచ్చు ) ఎంతవరకూ సబబు? ఏ రచనయినా రాసేవాళ్ళ దృక్పథాన్ని బట్టే కదా వచ్చేది? సొంత అనుభవాల్లోచో లేదా పక్కవాళ్ళ జీవితాల్లాంచో రచనలు పుడతాయి. వీటిని యథాతథంగా రాయడం వేరు. వేరే దృక్పథంలో చెప్పడం వేరు. రెండూ ఒకటి కాదు. అప్పుడే రచయిత వ్యక్తిత్వం బయల్పడేది. చేతిలో సిగరెట్టు వెలిగించి, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడంలా ఉంటుంది. నాస్తికులు పురాణ కథని చెబితే చెప్పిన దానస్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు పాఠకులకుండదా? నాగురించి కళ్ళు మూసుకో. వస్తువునే చూడు అని చెబితే ఎంతమంది ఒప్పుకుంటారు?
నెను శ్రీ శ్రీ దేవుణ్ణి నమ్మరని విన్నాను. ఆయన అనేక భక్తి డబ్బింగ్ సినిమాలకి రచనలు చేసారు. నేను మూల రచనని యథాతథంగా రాసానంతే – రాయడం నా వృత్తి – నమ్మకం వేరు – జీవనోపాధి వేరు అనని శ్రీ శ్రీయే చెప్పడం డబాయింపులా కనిపిస్తుంది కానీ సంజాయిషీ అవదు. ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.
ఇది జె.యు.బి.వి. ప్రసాద్ గారి అబిప్రాయంపై నా స్పందన. పాతికేళ్ళ క్రితం ఆంద్రజ్యోతిలో అనుక్షణికం సీరియల్ చివరకొస్తుండగా, పాఠకులతో ప్రశ్న-జవాబుల ముచ్చట ముగిస్తూ, వడ్డెర చండీదాస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి:
“చాలా మంది పాఠకులు నా గురించి (‘పర్సనల్’ విషయాలు) అడుగుతూ వొచ్చారు. మీరు మీ నవలలో కులాలను కులాలుగా స్పష్టంగా చిత్రించారు కదా. మీది యే కులం. మీ సొంత కులాన్ని మీరు ఏ విధంగా చిత్రించారో తెలుసుకోవాలనుంది / మీ భార్య చనిపోయినప్పుడు “హిమజ్వాల”, ప్రేయసి చనిపోయినప్పుడు “అనుక్షణికం” రాశారట కదా / మీరు కన్వెర్టెడ్ క్రిస్టియన్నట కదా / మీ జీవితంలో కులతత్వాల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ వొచ్చారు / మీరు తిరుగుబోతట కదా / మీది కులాంతరమట కదా / మీరు తిక్కమనిషట కదా / మీరు దేవుడిలాంటివారట కదా / మీరు అవివాహితులట కదా / మీకు ఇద్దరు భార్యలట కదా / మీరు బ్రహ్మచారులట కదా, యిలా యెన్నో. వాటికి వేటికీ జవాబు లివ్వలేదు. నచ్చితే నా రచన చదవండి. నా జీవితాన్ని అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ కలిపి పరిశీలించతగిన రచయితనైతే అందుకు యింకా వ్యవధి వుంది….
ఐతే. నా జీవితం – అందులో అల్పత్వాలున్నా మహత్వాలున్నా అసహ్యతలున్నా అభినందనీయాలున్నా అభిశంసనీయాలున్నా నా జీవితం నా జీవితంగా యధాతధంగా పరిశీలించాల్సిన వేళ వొస్తే ఆనాడు తప్పక అలా యధాతధంగా లభ్యమవుతుంది.”
చండీదాస్ లాంటి రచయితలు అరుదు. కాని ఆయనన్నది అందరికీ వర్తిస్తుందనుకుంటాను. యండమూరి, శ్రీశ్రీ, శివారెడ్ది, పసంద్ రెడ్డి (?) – వాళ్ళ రచనలు అసలు ముందర చదవదగ్గవో కావో పరిశీలించండి. చదవదగ్గవి కాకపోతే, వాళ్ళ జీవితం లో కెళ్ళడం వ్యర్థం. చదవదగ్గవే కాక, ఉన్నతమైన రచనలైతే, వాళ్ళ జీవితాల్లో కెళ్ళండి. వారి అల్పత్వాలని బయల్పరచి వాటి మూలంగా ఒకప్పుడు విలువైనవనుకున్న రచనలు ఇప్పుడు పాఠకులు ఎందుకు విసిరి పారెయ్యాలో వివరించండి. వెంటనే పాఠకులలో మార్పు వచ్చి సమాజంలో నీతీ న్యాయం పెరుగుతాయనుకోను గాని, మీ ఆక్రోశానికి మాత్రం సాహితీ గౌరవం లభిస్తుంది.
మిమ్మల్నీ, భైరవభట్ల కామేశ్వర రావు గారినీ, రోహిణీప్రసాదు గారినీ, వైదేహీ శశిధర్ గారినీ, పామర్తి వారినీ, రవికిరణ్ గారినీ, మురళి గారినీ, మూలా సుబ్రహ్మణ్యం గారినీ, లక్ష్మన్న గారినీ మీ అందర్నీ మించి ఉదయకళ గారినీ, వగైరాలతో పోలిస్తే మీ పక్కన నిలబడ గలిగే అర్హత లేదు నాకు. అది నాకు తెలుసు. ఎందుకంటే, ఈ అభిప్రాయాలు రాయకముందు “నథింగ్ టు రైట్ అబౌట్”.
కావాలని మారు పేరుతో అభిప్రాయాల్ని రాయటం లేదు.
2006లో ఈమాట ని మావగాడు పరిచయం చేసినా పట్టించుకోలేదు. అది నా దురద్రుష్టం. ఈ ఏడాది మళ్ళీ న్యూయార్క్ నుంచి వచ్చి తిట్లుతిట్టి “మీ అభిప్రాయం తెలిచేయండి” ని చూపించేడు, మావ గాడు. వున్న వ్యసనాలని మించి ఈమాట చదవడం, అభిప్రాయాలు రాయడం వ్యసనవైపోయింది.
నా ప్రవర చెప్పమని “జయప్రభ” గారన్నారు. ఇదీ వరస.
నా మట్టుకి నేను, నా గురించి “సహస్ర శిరఛ్చేద అపూర్వ చింతామణి” లో దొంగ సన్యాసిననీ, “ఆషాఢభూతి” గురువుగారిననీ, “మందుల భీముడి” మేనల్లుడిననీ, “ముంగేరీలాల్ కె హసీన్ సప్నే” లోని రఘువీర్ యాదవ్ ననీ, “బైరాగినా, అసిరిగాడినా” అన్న సందిగ్ధంలో వున్నవాడిననీ, “సింహాచలాన్నా,అడ్డబుర్రనా” అన్నఅనుమానంలో వున్నవాడిననీ ఖచ్చితంగా నమ్ముతున్నవాడిని. “ధర్మవ్యాధుడిలా” బతకాలని తెలిసికూడా అదెలాగో తెలియనివాణ్ణని అనుకుంటున్నాను.
“రాయని భాస్కరుణ్ణని” మొదట తెగ ఫీలయిపోయీవాడిని.ఎందుకంటే “క్రుశా” గురించి శ్రీశ్రీ అలా అన్నాడు కాబట్టి. తరవాత తెలిసింది రాయడం “చేతకాని” భాస్కరుణ్ణని.
నా పేరు భాస్కర్. సివిల్ ఇంజినీర్ని, మూడేళ్ళయి హైద్రాబాదులో వుంటున్నను. అంతకుముందు, దేశం అంతా తిరిగేను. బొంబాయిలో పదకొండేళ్ళు వున్నాను. చదవడం ఎంత వ్యసనం అంటే, బొంబాయి లోకల్ ట్రైన్లో కూడా, క్రిక్కిరిసిన జనం మధ్య కూడా నిలబడి చదివీ వాడిని. ఇది నా “స్ట్రెంగ్త్” అని నా అనుమానం.
ఈ మాట “ఫార్మాట్” లో వున్న సులువువల్ల తెగించి అభిప్రాయాలు రాసేస్తున్నాను, అంతే.
ధర్మవ్యాధుడిలాటి కొడవళ్ళ హనుమంతరావు గారిని, మీ అందరితో పాటూ స్మరించకపోవడం నా తప్పు.
దాదాపు ఇరవై ఏళ్ళపాటు సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా గడిపేసి, కాస్త బుద్ధొచ్చింతర్వాత, కొంచం దగ్గరయాను. చండీదాస్ చనిపోయినప్పుడు బాధపడి రాసిన వ్యాసం నా మొదటి రచన. మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు.
పతంజలి గారన్న మాటకి అర్థం తెలియలేదు. నిఘంటువులో వెతికి అవాక్కయ్యాను.
రావిశాస్త్రిని చండీదాస్ రచనలు చదివారా అని అడిగితే, బుచ్చిబాబులా రాయాలనుకునే రచయిత రచనలని చదవాల్సిన అవసరం తనకు లేదన్నాడు!
ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వీలు చూసుకొని “అనుక్షణికం” మీద మరో వ్యాసం రాయాలన్నది నా కోరిక కూడా.
మృణాళిని గారి విలువైన ఉపన్యాసాన్ని సేకరించినందుకు బ్రహ్మానందం గారికి చాలా కృతజ్ఞతలు. ఒక మనవి. సాహితీవేత్తలైన వక్తలు అమెరికా వచ్చినప్పుడు, వారికి అభ్యంతరం లేకపోతే ఈమాటలోనో రచ్చబండలోనో ఓ చిన్న ప్రకటన వెయ్యండి. వీలయితే వాళ్ళని సాహితీప్రియులు తమ తమ ఊళ్ళకి పిలిపించుకోవచ్చు.
మృణాళిని ఉపన్యాసం కేవలం డాక్టరేటు కోసం చేసిన పరిశోధన నుండి వచ్చినట్లు లేదు. లోతైన పరిశీలనతోబాటు తాదాత్మ్యంతో కూడిన విస్తృత పఠనంతో చేకూరిన అనుభూతితో సాధికారంగా మన నవలా చరిత్రని చెప్పి రక్తి కట్టించారు. ఎటు చూసినా కవితలూ, కథలూ, వాటి మీద చర్చావేదికలే కాని నవల గురించి మాట్లాడే వాళ్ళే తక్కువ. గత పాతికేళ్ళుగా స్తబ్ధుగా ఉండిపోయిన తెలుగు నవలా రంగానికి విశిష్ట చరిత్ర ఉందనీ, పాఠకుల సంస్కారానికి కథా కవితలకన్నా నవలలే ఎక్కువ దోహదిస్తాయనీ, ఆవేదనతో కూడిన ఉత్సాహంతో గంటన్నర పైగా అనర్గళంగా ఉపన్యసించి ఆకట్టుకున్నారు. గురజాడా, శ్రీశ్రీ రచనలకి సముచిత ఆదరణ వచ్చినా వారికే మాత్రమూ తీసిపోని నవలా రచయితల పేర్లన్నా ఇప్పటి వాళ్ళకి తెలియదే, కనీసం వారి రచనల ప్రస్తావన గూడా సాహితీ చర్చల్లో లేశమైనా కనబడదే అని గట్టిగా విమర్శించారు – ఎందువల్ల ఈ చిన్న చూపు?
ఇలా పారంభమైన ఉపన్యాసం వినడంతోటే నాకు ప్రముఖ కవి Auden రాసిన “Letter to Lord Byron” అన్న కవిత గుర్తొచ్చింది:
I don’t know whether
You will agree, but novel writing is
A higher art than poetry altogether
In my opinion, and success implies
Both finer character and faculties
Perhaps that’s why real novels are as rare
As winter thunder or a polar bear.
…
The average poet by comparison
Is unobservant, immature, and lazy.
You must admit, when all is said and done,
His sense of other people’s very hazy,
His moral judgements are too often crazy,
A slick and easy generalization
Appeal too well to his imagination.
కందుకూరి తో మొదలైన మన నవలలు సంఘ సంస్కరణకీ, భావ విప్లవానికీ, మానసిక వికాసానికీ బాట వేశాయనీ, దాదాపు వందేళ్ళ క్రితమే ఉన్నవ రాసిన మాలపల్లి ని ఆకాశానికెత్తేశారు. అసలాకాలానికి మన దేశభాషలు వేటిలోనూ అంతటి గొప్ప నవల రాలేదని ఇతర రాష్ట్రీయులు మెచ్చుకున్నా, తెలుగువాళ్లలో చాలా మందికి ఉన్నవ పేరు కూడ తెలియదని బాధపడ్డారు. చలం నవలలు చదిలోతే చెడిపోతారన్నవాళ్ళు ఆయనని సరిగా అర్థం చేసుకోలేదనీ, ఆయన రాసిన స్త్రీ, బిడ్డల శిక్షణ చదివితే గాని చలం భావ విప్లవం అర్థం కాదన్నారు. మైదానం కి వ్యతిరేకంగా విశ్వనాథ రాసిన చెలియలికట్ట ని ప్రస్తావిస్తూ, వీరిద్దరూ గొప్ప ప్రతిభావంతులనీ, వాళ్ళ మధ్య పోటీ సాహిత్యానికి మేలుచేసిందే కాని కీడు చెయ్యలేదన్నారు.
పల్లెటూరి జీవితాన్ని మరీ ఆదర్శప్రాయంగా కాక రాజకీయాలతో ఎలాముడిపడి ఉందో చిత్రీకరించిన జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, మొట్ట మొదటిగా విశాలమైన ఉన్నతభావాలతో స్త్రీ పాత్రని ప్రవేశపెట్టిన ఉప్పల లక్శ్మణరావు అతడు-ఆమె, ఒక్క వ్యర్థ పదం కూడా లేకుండా గోపీచంద్ రాసిన గొప్ప మనోవైజ్ఞానిక నవల అసమర్థుని జీవయాత్ర, మనిషి జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనా సంస్కార పరిణామానికి ఎలా దారితీస్తుందో చిత్రీకరించిన బుచ్చిబాబు చివరకు మిగిలేది, ఇలా అనేక పేరున్న తెలుగు నవలల గురింఛి, క్లుప్తంగా నయినా మనసుకి హత్తుకు పొయ్యేట్లు చెప్పి, అవి చదివిన వాళ్ళకి మరోసారి ఉద్విగ్నత కలిగించారు.
ఇంతటి ప్రాభవం ఉన్న నవలా ప్రక్రియ ఎనభయ్యో శతాబ్దం నాటికి వ్యాపార నవలలు విజృంబించడంతో ఓ ఊపు ఊగి, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల వరవడిలో చదివే పాఠకులు లేకా, పాఠకులేరని రాసే వాళ్ళు లేకా కుంటుబడిందన్నారు. ఉద్యమాల ప్రభావం గురించి మృణాళిని చేసిన వ్యాఖ్య చాలా ఆలోచించదగ్గది: ఉద్యమాల మూలంగా వచ్చే రచనల్లో ఆవేశం పాలెక్కువ. అందుకు కవిత్వానికి మించిన సాహితీ ప్రక్రియ లేదు. అయితే నవలకి కావలసింది స్పష్టతతో కూడిన ఆలోచన, మానవజీవితం గురించి సమగ్రమైన పరిశీలన – వీటితో రసవంతంగా ఏవో నాలుగు పాదాలు కాక కట్టదిట్టంగా నాలుగయిదొందల పేజీల సాహిత్యం సృష్టించాలంటే మాటలు కాదు. మరలా Auden రాసిన “The Novelist” అన్న కవితొకటి గుర్తొస్తుంది:
Encased in talent like a uniform,
The rank of every poet is well known;
They can amaze us like a thunderstorm,
Or die so young, or live for years alone.
They can dash forward like hussars: but he
Must struggle out of his boyish gift and learn
How to be plain and awkward, how to be
One after whom none think it worth to turn.
For, to achieve his lightest wish, he must
Become the whole of boredom, subject to
Vulgar complaints like love, among the Just
Be just, among the Filthy filthy too,
And in his own weak person, if he can,
Must suffer dully all the wrongs of Man.
ఉపన్యాసం అయింతర్వాత చాలా మంది మంచి ప్రశ్నలే వేశారు. మన సాహిత్యం ఉద్యమాలకే ఎందుకు పరిమితమైందని ఒకరడిగారు. మృణాళిని ఉద్యమాల వలన కలిగిన మంచిని గుర్తిస్తూనే, ప్రస్తుత సాహితీ వాతావరణంలో ఏదో ఒక గ్రూపుకి చెందకుండా మనడం కష్టమయిందన్నారు. చంద్రలత రాసిన రేగడివిత్తులు మంచి నవలే అయినా అది రచయిత కోస్తా ప్రాంత దృష్టితో రాసిందని విమర్శించి, సాహితీపరమైన విలువలకి విమర్శకులే తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి వాతావరణం నెలకొని ఉండటం చాలా విచారకరమన్నారు.
ఇది సాహితీ అభిమానులందరూ తప్పక వినవలసిన ఉపన్యాసం. ఇచ్చిన మృణాళిని గారికీ, సేకరించిన బ్రహ్మానందం గారికి మరోసారి కృతజ్ఞ్తలతో,
హనుమంతరావు గారూ,
మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఈ శాస్త్ర విషయాలు, వాటితో పాటే శాస్త్రవేత్తల జీవిత విశేషాలూ కమ్మటి తెలుగులో చదువూతూంటే … ఎంత ఆనందంగా వుందో.
పొరబాటయింది. మీ బ్లాగు చూశాను కాని, ఏపీ వీక్లీ చదివే అలవాటు లేక, అభాసు పాలయ్యాను. మూడు వందల వ్యాసాలే?! మీ పుస్తకం తెప్పించుకుంటున్నాను. మీనుంచి మరిన్ని పుస్తకాలొస్తాయని ఆసిస్తాను.
నేను హాల్డేన్ మాటలు ఉటంకించింది ఆయన వ్యాసం, “How to Write a Popular Scientific Article,” నుండని చెప్పడం మరిచాను.
హనుమంతరావుగారూ, ఎంత మాటన్నారు! 🙂
ఏపీవీక్లీలో గత నాలుగేళ్ళకు పైగా వారానికో సైన్సు వ్యాసం చొప్పున రాస్తున్నాను. నా మొత్తం వ్యాసాల సంఖ్య 300 పైనే ఉంటుందేమో. ‘ఇంకా’ రాయమనడం భావ్యమా?!
‘బహుముఖప్రజ్ఞ’ మాట ఎలా ఉన్నా నలుగురికీ పనికొచ్చే విషయాల గురించి సులువైన పద్ధతిలో ఎవరు రాసినా మంచిదే.
నిజానికి నాకున్న తక్కువ వ్యవధివల్లనే మీ వ్యాసాలన్నీ చదివి తాపీగా అభిప్రాయం రాయలేకపోతున్నాను. ఈమధ్యనే జనసాహితివాళ్ళు నా 53 వ్యాసాల సంకలనం ఒకటి విడుదల చేశారు. మీవంటివారు తేలిక భాషలో ఎన్ని పత్రికల్లో సమాచారాన్ని అందించగలిగితే అంత మంచిది. మన రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువగా కనబడింది. మహా అయితే ఈ మెయిల్స్ చదువుతారేమో. అందుచేత తెలుగులో అచ్చయే పత్రికలని మనం మరిచిపోకూడదు.
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకి కృతజ్ఞతలు.
నాగమురళి గారూ,
మిమ్మల్ని ఏకబిగిన చదివింప చేసిందన్నారు. సంతోషం. నా తెలుగు మూలన పడిందని నాకు భయం. రోజూ పది నిముషాలు మా ఆవిడతో తెలుగులో మాట్లాడటం మినహా, నిత్యజీవితంలో నా తెలుగు వాడకం పుస్తకాలు చదవడానికే పరిమితం.
ప్రస్తుతానికి వేరే విషయాల మీద రాసే ఆలోచన లేదు. ఆయా రంగాలలో అనుభవం ఉన్నవాళ్ళు తెలుగువాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరైనా పూనుకొని రాస్తే ఎంతో సేవ చేసిన వారవుతారు.
లక్ష్మన్న గారూ,
నేను ఇంజనీరింగులో అత్యుత్తమ స్థాయికి చెందినవాడిని కాదు. మీరన్నట్లు మన దేశంలో విజ్ఞానశాస్త్రాలలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. కాని వాటిని సామాన్యప్రజలకి పరిచయం చేసినవాళ్ళు తక్కువ. తెలుగులో మహీధర నళినీమోహన్ చెప్పుకోదగ్గవాడు. బహుముఖ ప్రతిభావంతులైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇంకా ఎక్కువ రాస్తే బావుంటుంది.
ఈ వ్యాసాలు తెలుగు దినపత్రికలలో వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయన్నది నాఆశ కూడా. ఆంధ్రజ్యోతి కి రాశాను – జవాబు లేదు!
సిలికాన్ మహత్యం మీద మీరు రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రాయండి.
సాధ్యమైనంతవరకు కవితలకు దూరంగా ఉండమని సూచన ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, నా విభేదాన్ని తెలుపుతాను. కవితయినా, మరేదయినా, అసందర్భంగా ఉటంకిస్తే తప్పుపట్టాల్సిందే. కాని సైన్సు వ్యాసాలలో కవితలుంటే నష్టం లేదు. ఆలోచనకి అడ్డురావనీ, ఆసక్తి కలిగించి అవగాహనని పెంచుతాయనీ నా విశ్వాసం. దీని మీద గతంలో నాగులపల్లి శ్రీనివాస్ గారికి సమాధానమిస్తూ పలుగురు పేర్లని వాడుకున్నాను. ఇప్పుడూ మరొకరి పేరు చెప్పి సమర్థించుకుంటాను.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జీవశాస్త్రవేత్త, తెలుగువాళ్ళకి కాస్త దగ్గ్గరయిన (మరణానంతరం ఆయన దేహాన్ని పరిశోధనలకై కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాల కిచ్చారు), జె బి యస్ హాల్డేన్ అన్న మాటలు:
“In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavor, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.” [1]
చివరిగా, నా వ్యాసాలని గడువు దాటి పంపినా, తామెంత పని వత్తిడిలో ఉన్నా, ఓపిగ్గా చదివి, ప్రశ్నలేసి, సరిదిద్ది, సాయం చేస్తున్న సంపాదకులకి, ముఖ్యంగా ఇంద్రగంటి పద్మగారికీ, కొలిచాల సురేశ్ కీ కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్: [1] “On Being the Right Size and other Essays,” by J.B.S Haldane. Edited by John Maynard Smith. Oxford University Press, 1985.
హనుమంతరావు గారు చెప్పింది నిజమే, విశ్వనాధ గొప్పదనం చెప్పడానికి ఇంకొకరిని కించపరచాల్సిన పనిలేదు. ఎవరి గొప్ప వారిది. విశ్వనాధ గొప్పదనం చాలాతక్కువ మందికి తెలుసని బాధపదటం వేరే విషయం.
నాకు తెలిసి విశ్వనాధ శ్రీశ్రీ ని గానీ, శ్రీశ్రీ విశ్వనాధను అగౌరవపరచుకొన్నది, ఖండించినదీ లేదు. ఒకరి మహాకవిత్వాన్ని, మరొకరు మౌనంగా అంగీకరించినట్లే కనబడ్డారు. వారి గురించి మనం తగూ పడటం సరికాదు.
ఛందోధర్మము గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/27/2008 10:33 am
హనుమంతరావు గారికి,
వ్యక్తిగత విషయాలూ,వ్యక్తిత్వాలూ రెండూ వేర్వేరు. మీరు ఈనవల మీ ప్రేయసి పోయినప్పుడు రాసారట కదా అన్నది వ్యక్తిగత విషయం. కులం గురించి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తూ కాస్ట్ ఫీలింగ్ చూపడం వ్యక్తిత్వం. ఏ రచనయినా బాగుందనిపిస్తే ఆయా రచయితలగురించి ఆరా తీయడం సహజం. అప్పుడప్పుడు ఈ వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిత్వాలు కూడా వద్దన్నా బయటకొస్తాయి. వాటితోనే
( రచయితలతోనూ, వారి రచనలతోనూ) పాఠకులకి పేచీ!
నేను నాకు నచ్చింది రాస్తానూ, నా జీవితం నా ఇష్టం / నచ్చితే చదువు / లేదా వదిలేయి / రచన్నీ, రచయిత జీవితాన్ని కలిపిచూడద్దు / అని రచయితే చెప్పడం ( ముక్కు సూటి వ్యవహారంలా కనిపించచ్చు ) ఎంతవరకూ సబబు? ఏ రచనయినా రాసేవాళ్ళ దృక్పథాన్ని బట్టే కదా వచ్చేది? సొంత అనుభవాల్లోచో లేదా పక్కవాళ్ళ జీవితాల్లాంచో రచనలు పుడతాయి. వీటిని యథాతథంగా రాయడం వేరు. వేరే దృక్పథంలో చెప్పడం వేరు. రెండూ ఒకటి కాదు. అప్పుడే రచయిత వ్యక్తిత్వం బయల్పడేది. చేతిలో సిగరెట్టు వెలిగించి, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడంలా ఉంటుంది. నాస్తికులు పురాణ కథని చెబితే చెప్పిన దానస్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు పాఠకులకుండదా? నాగురించి కళ్ళు మూసుకో. వస్తువునే చూడు అని చెబితే ఎంతమంది ఒప్పుకుంటారు?
నెను శ్రీ శ్రీ దేవుణ్ణి నమ్మరని విన్నాను. ఆయన అనేక భక్తి డబ్బింగ్ సినిమాలకి రచనలు చేసారు. నేను మూల రచనని యథాతథంగా రాసానంతే – రాయడం నా వృత్తి – నమ్మకం వేరు – జీవనోపాధి వేరు అనని శ్రీ శ్రీయే చెప్పడం డబాయింపులా కనిపిస్తుంది కానీ సంజాయిషీ అవదు. ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
08/26/2008 8:49 pm
రచయితలు, శ్రీరంగనీతులు
ఇది జె.యు.బి.వి. ప్రసాద్ గారి అబిప్రాయంపై నా స్పందన. పాతికేళ్ళ క్రితం ఆంద్రజ్యోతిలో అనుక్షణికం సీరియల్ చివరకొస్తుండగా, పాఠకులతో ప్రశ్న-జవాబుల ముచ్చట ముగిస్తూ, వడ్డెర చండీదాస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి:
“చాలా మంది పాఠకులు నా గురించి (‘పర్సనల్’ విషయాలు) అడుగుతూ వొచ్చారు. మీరు మీ నవలలో కులాలను కులాలుగా స్పష్టంగా చిత్రించారు కదా. మీది యే కులం. మీ సొంత కులాన్ని మీరు ఏ విధంగా చిత్రించారో తెలుసుకోవాలనుంది / మీ భార్య చనిపోయినప్పుడు “హిమజ్వాల”, ప్రేయసి చనిపోయినప్పుడు “అనుక్షణికం” రాశారట కదా / మీరు కన్వెర్టెడ్ క్రిస్టియన్నట కదా / మీ జీవితంలో కులతత్వాల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ వొచ్చారు / మీరు తిరుగుబోతట కదా / మీది కులాంతరమట కదా / మీరు తిక్కమనిషట కదా / మీరు దేవుడిలాంటివారట కదా / మీరు అవివాహితులట కదా / మీకు ఇద్దరు భార్యలట కదా / మీరు బ్రహ్మచారులట కదా, యిలా యెన్నో. వాటికి వేటికీ జవాబు లివ్వలేదు. నచ్చితే నా రచన చదవండి. నా జీవితాన్ని అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ కలిపి పరిశీలించతగిన రచయితనైతే అందుకు యింకా వ్యవధి వుంది….
ఐతే. నా జీవితం – అందులో అల్పత్వాలున్నా మహత్వాలున్నా అసహ్యతలున్నా అభినందనీయాలున్నా అభిశంసనీయాలున్నా నా జీవితం నా జీవితంగా యధాతధంగా పరిశీలించాల్సిన వేళ వొస్తే ఆనాడు తప్పక అలా యధాతధంగా లభ్యమవుతుంది.”
చండీదాస్ లాంటి రచయితలు అరుదు. కాని ఆయనన్నది అందరికీ వర్తిస్తుందనుకుంటాను. యండమూరి, శ్రీశ్రీ, శివారెడ్ది, పసంద్ రెడ్డి (?) – వాళ్ళ రచనలు అసలు ముందర చదవదగ్గవో కావో పరిశీలించండి. చదవదగ్గవి కాకపోతే, వాళ్ళ జీవితం లో కెళ్ళడం వ్యర్థం. చదవదగ్గవే కాక, ఉన్నతమైన రచనలైతే, వాళ్ళ జీవితాల్లో కెళ్ళండి. వారి అల్పత్వాలని బయల్పరచి వాటి మూలంగా ఒకప్పుడు విలువైనవనుకున్న రచనలు ఇప్పుడు పాఠకులు ఎందుకు విసిరి పారెయ్యాలో వివరించండి. వెంటనే పాఠకులలో మార్పు వచ్చి సమాజంలో నీతీ న్యాయం పెరుగుతాయనుకోను గాని, మీ ఆక్రోశానికి మాత్రం సాహితీ గౌరవం లభిస్తుంది.
కొడవళ్ళ హనుమంతరావు
ఈమాట గురించి గురించి baabjeelu అభిప్రాయం:
08/21/2008 9:50 am
క్రుష్ణమోహను గారూ,
మిమ్మల్నీ, భైరవభట్ల కామేశ్వర రావు గారినీ, రోహిణీప్రసాదు గారినీ, వైదేహీ శశిధర్ గారినీ, పామర్తి వారినీ, రవికిరణ్ గారినీ, మురళి గారినీ, మూలా సుబ్రహ్మణ్యం గారినీ, లక్ష్మన్న గారినీ మీ అందర్నీ మించి ఉదయకళ గారినీ, వగైరాలతో పోలిస్తే మీ పక్కన నిలబడ గలిగే అర్హత లేదు నాకు. అది నాకు తెలుసు. ఎందుకంటే, ఈ అభిప్రాయాలు రాయకముందు “నథింగ్ టు రైట్ అబౌట్”.
కావాలని మారు పేరుతో అభిప్రాయాల్ని రాయటం లేదు.
2006లో ఈమాట ని మావగాడు పరిచయం చేసినా పట్టించుకోలేదు. అది నా దురద్రుష్టం. ఈ ఏడాది మళ్ళీ న్యూయార్క్ నుంచి వచ్చి తిట్లుతిట్టి “మీ అభిప్రాయం తెలిచేయండి” ని చూపించేడు, మావ గాడు. వున్న వ్యసనాలని మించి ఈమాట చదవడం, అభిప్రాయాలు రాయడం వ్యసనవైపోయింది.
నా ప్రవర చెప్పమని “జయప్రభ” గారన్నారు. ఇదీ వరస.
నా మట్టుకి నేను, నా గురించి “సహస్ర శిరఛ్చేద అపూర్వ చింతామణి” లో దొంగ సన్యాసిననీ, “ఆషాఢభూతి” గురువుగారిననీ, “మందుల భీముడి” మేనల్లుడిననీ, “ముంగేరీలాల్ కె హసీన్ సప్నే” లోని రఘువీర్ యాదవ్ ననీ, “బైరాగినా, అసిరిగాడినా” అన్న సందిగ్ధంలో వున్నవాడిననీ, “సింహాచలాన్నా,అడ్డబుర్రనా” అన్నఅనుమానంలో వున్నవాడిననీ ఖచ్చితంగా నమ్ముతున్నవాడిని. “ధర్మవ్యాధుడిలా” బతకాలని తెలిసికూడా అదెలాగో తెలియనివాణ్ణని అనుకుంటున్నాను.
“రాయని భాస్కరుణ్ణని” మొదట తెగ ఫీలయిపోయీవాడిని.ఎందుకంటే “క్రుశా” గురించి శ్రీశ్రీ అలా అన్నాడు కాబట్టి. తరవాత తెలిసింది రాయడం “చేతకాని” భాస్కరుణ్ణని.
నా పేరు భాస్కర్. సివిల్ ఇంజినీర్ని, మూడేళ్ళయి హైద్రాబాదులో వుంటున్నను. అంతకుముందు, దేశం అంతా తిరిగేను. బొంబాయిలో పదకొండేళ్ళు వున్నాను. చదవడం ఎంత వ్యసనం అంటే, బొంబాయి లోకల్ ట్రైన్లో కూడా, క్రిక్కిరిసిన జనం మధ్య కూడా నిలబడి చదివీ వాడిని. ఇది నా “స్ట్రెంగ్త్” అని నా అనుమానం.
ఈ మాట “ఫార్మాట్” లో వున్న సులువువల్ల తెగించి అభిప్రాయాలు రాసేస్తున్నాను, అంతే.
ధర్మవ్యాధుడిలాటి కొడవళ్ళ హనుమంతరావు గారిని, మీ అందరితో పాటూ స్మరించకపోవడం నా తప్పు.
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/25/2008 11:06 pm
బాబ్జీలు గారూ,
దాదాపు ఇరవై ఏళ్ళపాటు సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా గడిపేసి, కాస్త బుద్ధొచ్చింతర్వాత, కొంచం దగ్గరయాను. చండీదాస్ చనిపోయినప్పుడు బాధపడి రాసిన వ్యాసం నా మొదటి రచన. మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు.
పతంజలి గారన్న మాటకి అర్థం తెలియలేదు. నిఘంటువులో వెతికి అవాక్కయ్యాను.
రావిశాస్త్రిని చండీదాస్ రచనలు చదివారా అని అడిగితే, బుచ్చిబాబులా రాయాలనుకునే రచయిత రచనలని చదవాల్సిన అవసరం తనకు లేదన్నాడు!
ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వీలు చూసుకొని “అనుక్షణికం” మీద మరో వ్యాసం రాయాలన్నది నా కోరిక కూడా.
కొడవళ్ళ హనుమంతరావు
సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/12/2008 2:47 pm
తెలుగు నవల బాగోగులు
మృణాళిని గారి విలువైన ఉపన్యాసాన్ని సేకరించినందుకు బ్రహ్మానందం గారికి చాలా కృతజ్ఞతలు. ఒక మనవి. సాహితీవేత్తలైన వక్తలు అమెరికా వచ్చినప్పుడు, వారికి అభ్యంతరం లేకపోతే ఈమాటలోనో రచ్చబండలోనో ఓ చిన్న ప్రకటన వెయ్యండి. వీలయితే వాళ్ళని సాహితీప్రియులు తమ తమ ఊళ్ళకి పిలిపించుకోవచ్చు.
మృణాళిని ఉపన్యాసం కేవలం డాక్టరేటు కోసం చేసిన పరిశోధన నుండి వచ్చినట్లు లేదు. లోతైన పరిశీలనతోబాటు తాదాత్మ్యంతో కూడిన విస్తృత పఠనంతో చేకూరిన అనుభూతితో సాధికారంగా మన నవలా చరిత్రని చెప్పి రక్తి కట్టించారు. ఎటు చూసినా కవితలూ, కథలూ, వాటి మీద చర్చావేదికలే కాని నవల గురించి మాట్లాడే వాళ్ళే తక్కువ. గత పాతికేళ్ళుగా స్తబ్ధుగా ఉండిపోయిన తెలుగు నవలా రంగానికి విశిష్ట చరిత్ర ఉందనీ, పాఠకుల సంస్కారానికి కథా కవితలకన్నా నవలలే ఎక్కువ దోహదిస్తాయనీ, ఆవేదనతో కూడిన ఉత్సాహంతో గంటన్నర పైగా అనర్గళంగా ఉపన్యసించి ఆకట్టుకున్నారు. గురజాడా, శ్రీశ్రీ రచనలకి సముచిత ఆదరణ వచ్చినా వారికే మాత్రమూ తీసిపోని నవలా రచయితల పేర్లన్నా ఇప్పటి వాళ్ళకి తెలియదే, కనీసం వారి రచనల ప్రస్తావన గూడా సాహితీ చర్చల్లో లేశమైనా కనబడదే అని గట్టిగా విమర్శించారు – ఎందువల్ల ఈ చిన్న చూపు?
ఇలా పారంభమైన ఉపన్యాసం వినడంతోటే నాకు ప్రముఖ కవి Auden రాసిన “Letter to Lord Byron” అన్న కవిత గుర్తొచ్చింది:
I don’t know whether
You will agree, but novel writing is
A higher art than poetry altogether
In my opinion, and success implies
Both finer character and faculties
Perhaps that’s why real novels are as rare
As winter thunder or a polar bear.
…
The average poet by comparison
Is unobservant, immature, and lazy.
You must admit, when all is said and done,
His sense of other people’s very hazy,
His moral judgements are too often crazy,
A slick and easy generalization
Appeal too well to his imagination.
కందుకూరి తో మొదలైన మన నవలలు సంఘ సంస్కరణకీ, భావ విప్లవానికీ, మానసిక వికాసానికీ బాట వేశాయనీ, దాదాపు వందేళ్ళ క్రితమే ఉన్నవ రాసిన మాలపల్లి ని ఆకాశానికెత్తేశారు. అసలాకాలానికి మన దేశభాషలు వేటిలోనూ అంతటి గొప్ప నవల రాలేదని ఇతర రాష్ట్రీయులు మెచ్చుకున్నా, తెలుగువాళ్లలో చాలా మందికి ఉన్నవ పేరు కూడ తెలియదని బాధపడ్డారు. చలం నవలలు చదిలోతే చెడిపోతారన్నవాళ్ళు ఆయనని సరిగా అర్థం చేసుకోలేదనీ, ఆయన రాసిన స్త్రీ, బిడ్డల శిక్షణ చదివితే గాని చలం భావ విప్లవం అర్థం కాదన్నారు. మైదానం కి వ్యతిరేకంగా విశ్వనాథ రాసిన చెలియలికట్ట ని ప్రస్తావిస్తూ, వీరిద్దరూ గొప్ప ప్రతిభావంతులనీ, వాళ్ళ మధ్య పోటీ సాహిత్యానికి మేలుచేసిందే కాని కీడు చెయ్యలేదన్నారు.
పల్లెటూరి జీవితాన్ని మరీ ఆదర్శప్రాయంగా కాక రాజకీయాలతో ఎలాముడిపడి ఉందో చిత్రీకరించిన జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, మొట్ట మొదటిగా విశాలమైన ఉన్నతభావాలతో స్త్రీ పాత్రని ప్రవేశపెట్టిన ఉప్పల లక్శ్మణరావు అతడు-ఆమె, ఒక్క వ్యర్థ పదం కూడా లేకుండా గోపీచంద్ రాసిన గొప్ప మనోవైజ్ఞానిక నవల అసమర్థుని జీవయాత్ర, మనిషి జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనా సంస్కార పరిణామానికి ఎలా దారితీస్తుందో చిత్రీకరించిన బుచ్చిబాబు చివరకు మిగిలేది, ఇలా అనేక పేరున్న తెలుగు నవలల గురింఛి, క్లుప్తంగా నయినా మనసుకి హత్తుకు పొయ్యేట్లు చెప్పి, అవి చదివిన వాళ్ళకి మరోసారి ఉద్విగ్నత కలిగించారు.
ఇంతటి ప్రాభవం ఉన్న నవలా ప్రక్రియ ఎనభయ్యో శతాబ్దం నాటికి వ్యాపార నవలలు విజృంబించడంతో ఓ ఊపు ఊగి, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల వరవడిలో చదివే పాఠకులు లేకా, పాఠకులేరని రాసే వాళ్ళు లేకా కుంటుబడిందన్నారు. ఉద్యమాల ప్రభావం గురించి మృణాళిని చేసిన వ్యాఖ్య చాలా ఆలోచించదగ్గది: ఉద్యమాల మూలంగా వచ్చే రచనల్లో ఆవేశం పాలెక్కువ. అందుకు కవిత్వానికి మించిన సాహితీ ప్రక్రియ లేదు. అయితే నవలకి కావలసింది స్పష్టతతో కూడిన ఆలోచన, మానవజీవితం గురించి సమగ్రమైన పరిశీలన – వీటితో రసవంతంగా ఏవో నాలుగు పాదాలు కాక కట్టదిట్టంగా నాలుగయిదొందల పేజీల సాహిత్యం సృష్టించాలంటే మాటలు కాదు. మరలా Auden రాసిన “The Novelist” అన్న కవితొకటి గుర్తొస్తుంది:
Encased in talent like a uniform,
The rank of every poet is well known;
They can amaze us like a thunderstorm,
Or die so young, or live for years alone.
They can dash forward like hussars: but he
Must struggle out of his boyish gift and learn
How to be plain and awkward, how to be
One after whom none think it worth to turn.
For, to achieve his lightest wish, he must
Become the whole of boredom, subject to
Vulgar complaints like love, among the Just
Be just, among the Filthy filthy too,
And in his own weak person, if he can,
Must suffer dully all the wrongs of Man.
ఉపన్యాసం అయింతర్వాత చాలా మంది మంచి ప్రశ్నలే వేశారు. మన సాహిత్యం ఉద్యమాలకే ఎందుకు పరిమితమైందని ఒకరడిగారు. మృణాళిని ఉద్యమాల వలన కలిగిన మంచిని గుర్తిస్తూనే, ప్రస్తుత సాహితీ వాతావరణంలో ఏదో ఒక గ్రూపుకి చెందకుండా మనడం కష్టమయిందన్నారు. చంద్రలత రాసిన రేగడివిత్తులు మంచి నవలే అయినా అది రచయిత కోస్తా ప్రాంత దృష్టితో రాసిందని విమర్శించి, సాహితీపరమైన విలువలకి విమర్శకులే తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి వాతావరణం నెలకొని ఉండటం చాలా విచారకరమన్నారు.
ఇది సాహితీ అభిమానులందరూ తప్పక వినవలసిన ఉపన్యాసం. ఇచ్చిన మృణాళిని గారికీ, సేకరించిన బ్రహ్మానందం గారికి మరోసారి కృతజ్ఞ్తలతో,
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్నిట్జ్ స్వప్నం గురించి ప్రసాద్ అభిప్రాయం:
07/11/2008 4:20 pm
హనుమంతరావు గారూ,
మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఈ శాస్త్ర విషయాలు, వాటితో పాటే శాస్త్రవేత్తల జీవిత విశేషాలూ కమ్మటి తెలుగులో చదువూతూంటే … ఎంత ఆనందంగా వుందో.
మీకూ ఈమాటకూ కృతజ్ఞతలు.
–ప్రసాద్
http://blog.charasala.com
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/28/2008 10:12 pm
రోహిణీప్రసాద్ గారూ,
పొరబాటయింది. మీ బ్లాగు చూశాను కాని, ఏపీ వీక్లీ చదివే అలవాటు లేక, అభాసు పాలయ్యాను. మూడు వందల వ్యాసాలే?! మీ పుస్తకం తెప్పించుకుంటున్నాను. మీనుంచి మరిన్ని పుస్తకాలొస్తాయని ఆసిస్తాను.
నేను హాల్డేన్ మాటలు ఉటంకించింది ఆయన వ్యాసం, “How to Write a Popular Scientific Article,” నుండని చెప్పడం మరిచాను.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
06/25/2008 9:07 pm
హనుమంతరావుగారూ, ఎంత మాటన్నారు! 🙂
ఏపీవీక్లీలో గత నాలుగేళ్ళకు పైగా వారానికో సైన్సు వ్యాసం చొప్పున రాస్తున్నాను. నా మొత్తం వ్యాసాల సంఖ్య 300 పైనే ఉంటుందేమో. ‘ఇంకా’ రాయమనడం భావ్యమా?!
‘బహుముఖప్రజ్ఞ’ మాట ఎలా ఉన్నా నలుగురికీ పనికొచ్చే విషయాల గురించి సులువైన పద్ధతిలో ఎవరు రాసినా మంచిదే.
నిజానికి నాకున్న తక్కువ వ్యవధివల్లనే మీ వ్యాసాలన్నీ చదివి తాపీగా అభిప్రాయం రాయలేకపోతున్నాను. ఈమధ్యనే జనసాహితివాళ్ళు నా 53 వ్యాసాల సంకలనం ఒకటి విడుదల చేశారు. మీవంటివారు తేలిక భాషలో ఎన్ని పత్రికల్లో సమాచారాన్ని అందించగలిగితే అంత మంచిది. మన రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువగా కనబడింది. మహా అయితే ఈ మెయిల్స్ చదువుతారేమో. అందుచేత తెలుగులో అచ్చయే పత్రికలని మనం మరిచిపోకూడదు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/24/2008 11:07 pm
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకి కృతజ్ఞతలు.
నాగమురళి గారూ,
మిమ్మల్ని ఏకబిగిన చదివింప చేసిందన్నారు. సంతోషం. నా తెలుగు మూలన పడిందని నాకు భయం. రోజూ పది నిముషాలు మా ఆవిడతో తెలుగులో మాట్లాడటం మినహా, నిత్యజీవితంలో నా తెలుగు వాడకం పుస్తకాలు చదవడానికే పరిమితం.
ప్రస్తుతానికి వేరే విషయాల మీద రాసే ఆలోచన లేదు. ఆయా రంగాలలో అనుభవం ఉన్నవాళ్ళు తెలుగువాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరైనా పూనుకొని రాస్తే ఎంతో సేవ చేసిన వారవుతారు.
లక్ష్మన్న గారూ,
నేను ఇంజనీరింగులో అత్యుత్తమ స్థాయికి చెందినవాడిని కాదు. మీరన్నట్లు మన దేశంలో విజ్ఞానశాస్త్రాలలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. కాని వాటిని సామాన్యప్రజలకి పరిచయం చేసినవాళ్ళు తక్కువ. తెలుగులో మహీధర నళినీమోహన్ చెప్పుకోదగ్గవాడు. బహుముఖ ప్రతిభావంతులైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇంకా ఎక్కువ రాస్తే బావుంటుంది.
ఈ వ్యాసాలు తెలుగు దినపత్రికలలో వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయన్నది నాఆశ కూడా. ఆంధ్రజ్యోతి కి రాశాను – జవాబు లేదు!
సిలికాన్ మహత్యం మీద మీరు రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రాయండి.
సాధ్యమైనంతవరకు కవితలకు దూరంగా ఉండమని సూచన ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, నా విభేదాన్ని తెలుపుతాను. కవితయినా, మరేదయినా, అసందర్భంగా ఉటంకిస్తే తప్పుపట్టాల్సిందే. కాని సైన్సు వ్యాసాలలో కవితలుంటే నష్టం లేదు. ఆలోచనకి అడ్డురావనీ, ఆసక్తి కలిగించి అవగాహనని పెంచుతాయనీ నా విశ్వాసం. దీని మీద గతంలో నాగులపల్లి శ్రీనివాస్ గారికి సమాధానమిస్తూ పలుగురు పేర్లని వాడుకున్నాను. ఇప్పుడూ మరొకరి పేరు చెప్పి సమర్థించుకుంటాను.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జీవశాస్త్రవేత్త, తెలుగువాళ్ళకి కాస్త దగ్గ్గరయిన (మరణానంతరం ఆయన దేహాన్ని పరిశోధనలకై కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాల కిచ్చారు), జె బి యస్ హాల్డేన్ అన్న మాటలు:
“In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavor, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.” [1]
చివరిగా, నా వ్యాసాలని గడువు దాటి పంపినా, తామెంత పని వత్తిడిలో ఉన్నా, ఓపిగ్గా చదివి, ప్రశ్నలేసి, సరిదిద్ది, సాయం చేస్తున్న సంపాదకులకి, ముఖ్యంగా ఇంద్రగంటి పద్మగారికీ, కొలిచాల సురేశ్ కీ కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “On Being the Right Size and other Essays,” by J.B.S Haldane. Edited by John Maynard Smith. Oxford University Press, 1985.
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Nanduri Venkata Subbarao. అభిప్రాయం:
06/19/2008 6:43 am
హనుమంతరావు గారు చెప్పింది నిజమే, విశ్వనాధ గొప్పదనం చెప్పడానికి ఇంకొకరిని కించపరచాల్సిన పనిలేదు. ఎవరి గొప్ప వారిది. విశ్వనాధ గొప్పదనం చాలాతక్కువ మందికి తెలుసని బాధపదటం వేరే విషయం.
నాకు తెలిసి విశ్వనాధ శ్రీశ్రీ ని గానీ, శ్రీశ్రీ విశ్వనాధను అగౌరవపరచుకొన్నది, ఖండించినదీ లేదు. ఒకరి మహాకవిత్వాన్ని, మరొకరు మౌనంగా అంగీకరించినట్లే కనబడ్డారు. వారి గురించి మనం తగూ పడటం సరికాదు.