గలగల పారే గోదారిలా సవ్వడి చేస్తూ సాగిన సంద్రాలు సంభాషణల్లో నుండి హఠాత్తుగా ఫ్లాపీలూ, సీడీలూ, పిడియఫ్ ల గందరగోళంలో పడి సజీవంగా సాగుతున్న కథ కాస్తా నిర్జీవమైన సాంకేతిక వ్యాసంగా మారిపోయింది!
“చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ”. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి.”
“మహాప్రస్థానం” ముందో “ఏవి తల్లీ!” ముందో నాకు గుర్తు లేదు కాని,
“చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?”
ఈ భావ చౌర్యం బెడద అన్నమాచార్యకీ తప్ప లేదు. ఈ భావ చౌర్యం చేసిన వాళ్ళకి “ఛాయాపహారులు” అన్న ముద్దు పేరు కూడా పెట్టి చురకలేసాడా వాగ్గేయకారుడు.
వెర్రులాల మీకు వేడుక గలితేను
అర్రు వంచి తడుకల్లంగ రాదా?
ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యముగాదు
కుడుచి వేసిన పుల్లె కుడువుగా గాదు
బడి నొకరు జెప్పిన బ్రతి జెప్పబోతేను
ఆడరి శ్రీ హరి కది అరుహము గాదు
ఉమిసిన తమ్మలో నొక కొంత కప్రము
సంకూర్చి చవిగొని చప్పరింపనేల
అమరంగ ఛాయాపహారము చేసుక
తమ మాట గూర్చితే దైవము నగడా
ఇలా దాదాపు ఓ పది చరణాలు పైగా దుమ్మెత్తి పోసాడు, తన పద కవితలని కాపీ కొట్టిన వాళ్ళని. ఆయన వాళ్ళని “ఛాయాపహారులు” అంటూ నిందించాడు. ఈ కీర్తన పూర్తిగా పధం -దృక్పధం లో చదవగలరు
కాబట్టి కాపీరాయుళ్ళు ఈ మధ్యనే పుట్టుకొచ్చేరనుకోనక్కరలేదు. ముందునుంచీ ఉన్నారనుకోవచ్చు.
ఉదాహరణ ఇచ్చినా మీకు అలా అనిపించక పోతే నేనేమీ చెయ్యలేను. మీ అందరికీ నచ్చితే మంచిదే ! జిహ్వ కో రుచి.
నా అభిప్రాయం చెప్పాను. అభాండాలు వేరుగా ఉంటాయి. రాసిందేమో నాలుగు లైన్ల కవిత అందులో రెండు వేరే దానితో పోలిక ఉంటే దాన్ని ఏవో రెండు లైన్లు కలిసాయి దానికింత రాద్ధాంతమా అని అంటే నేనేమీ చేసేది లేదు.
ఒకవేళ ఆ సినిమా పాట రాసిన వాళ్ళకి తెలియదు అనుకుందాం, కానీ బహుమతి ఇచ్చిన వారిలో ఒక్కరికీ తెలియదు అంటే కాస్త నమ్మబుద్ది కావడం లేదు నాకు. పోనీ అది అంత ప్రాచుర్యం పొందిన పాట కాదూ అనుకోడానికీ లేదు. ఏభై ఏళ్ళ తరవాత కూడా ఇంకా టీవీ లో వస్తోంది. కాస్త ఇక్కడ గూగ్లింగ్ చేస్తే ఎవరైనా వినచ్చు:
మీ వ్యాఖ్యలు చూసాకా, కవిత్వంలో ఒకటి అరా లైన్లు వేరే కవితతో కలిసినా ఫర్వాలేదన్న కొత్త విషయం తెలిసింది. ఈ మధ్యనే ఆంధ్రభూమిలో ఉగాది కవితల పోటీకి రెండో బహుమతి ఇచ్చిన కవిత మక్కీకి మక్కీ లాగించేసి, ఇది నా సొంతమే అని ఒక వ్యక్తి హామీ పత్రం రాసి పంపారు. తీరా కవితని ప్రచురించాకా, ఇది నా కవితా అంటూ ఇంకో పెద్దమనిషి లబోదిబో మన్నాడు. ఆంధ్రభూమి వాళ్ళు ఇచ్చిన బహుమతి వెనక్కి తీసుకున్నారు. దీనికి కొసమెరుపేమిటంటే, ఆ పెద్దమనిషి కవిత ఆంధ్రభూమిలోనే అచ్చు వేసుకున్నారు, కొన్ని నెలల క్రితం.
సరిపెట్టుకుంటే సర్వమూ సుందరంగానే కనిపిస్తుంది.
మీరందరూ విజ్ఞులే! నా బుద్ధే కాస్త మందగించింది.
బాగానే వుంది కధ. ఇది చదువుతుంటే, చిన్నప్పటి విషయం ఒకటి గుర్తొచ్చింది.
ఆరవ తరగతి చదివే రోజుల్లో, ఒక రోజు స్కూలి నించి ఇంటికి వస్తున్నాను. మా సందులో సగం దూరం వచ్చే సరికి, తెలిసున్న వాళ్ళింటి దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. ఆ ఇంటి వాళ్ళబ్బాయి మా క్లాసుమేటే. వాడేదో తుంటరి పని చేశాడని, వాళ్ళ ఎదురింటి వాళ్ళు వాళ్ళింటి మీదకి గొడవకి వచ్చారు. మా క్లాసుమేట్ వాళ్ళమ్మ ఆ ఎదురింటి వాళ్ళతో శివంగిలాగా, హోరాహోరీగా పోట్టాడుతోంది కొడుకుని వెనకేసుకుని. అక్కడ మూగిన జనానికి కాస్సేపట్లోనే తెలిసింది తుంటరి పని చేసింది మా క్లాసుమేటని. అయినా సరే, వాళ్ళమ్మ తగ్గకుండా వాళ్ళతో పోట్టాడి, తన కొడుకుని లోపలకి తీసుకుని వెళ్ళింది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక, ఏదో చేశానని మా అమ్మ నన్ను తిట్టింది. అప్పుడు నేను, “ఫలానా వాళ్ళమ్మ చూడు, వాడు తప్పు చేసినా వాడిని వెనకేసుకొచ్చి, అందరితోనూ దెబ్బలాడింది. నువ్వేమో నేను చేసిన చిన్న తప్పుకే, సవతి తల్లిలా తిడుతున్నావు. నాకెన్ని కష్టాలో బాబూ!” అంటూ వాపోయాను.సినిమాల ప్రభావం ఎక్కువగా వుండేది నా మీద ఆ రోజుల్లో. మా అమ్మ నవ్వి, “వెదవా! వెధవ సినిమా వాగుళ్ళు నేర్చావు. అయినా ఆవిడ మీ క్లాస్ మేట్ సొంత తల్లి కాదు. సవతి తల్లి. నేను నిజంగా నీకు సొంత తల్లిని” అంది. ఆశ్చర్యపోయాను. అంత మంచి సవతి తల్లులుంటారని ఎప్పుడూ ఎరగను. అప్పటి నించీ, వాళ్ళింటి ముందు నించీ వెళ్ళేటప్పుడు, ఆవిడని చాలా కుతూహలంగా పరిశీలిస్తూ వుండేవాడిని. అన్ని విషయాల్లోనూ అందరి లాగానే వుండేదావిడ. దీనికి వ్యతిరేకంగ మా ఇంటి ఎదురింటావిడ, వాళ్ళ సొంత పిల్లలు ఏ తప్పూ చెయ్యకపోయినా, ఎవరన్నా వచ్చి, వాళ్ళ పిల్లల మీద ఏమన్నా కాస్త చెడుగా అంటే, తన పిల్లల్ని అక్కడే వాళ్ళ ఎదురుగానే చావబాదేది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈ లలిత లాంటి వాళ్ళకి అంత సంస్కారం, మంచితనం ఎక్కడ నించీ అలవడ్డాయా అని. సవతి తల్లులు చెడ్డగా వుంటే, చాలా సులభంగా అర్థం అయిపోతుంది సంగతి. వారు చాలా మంచిగా వున్నారంటే, వారి వెనుక నున్న చరిత్ర తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది. ఈ కధలో రచయిత్రి లలిత అంత వున్నతంగా ప్రవర్తించడానికి కారణాలు ఏమన్నా చెప్పి వుంటే బాగుణ్ణనిపించింది. చిన్నప్పటి నించీ చదువుతున్న ఉత్తమ సాహిత్యమా, ఇంట్లోని ప్రేమతో కూడిన వాతావరణమా, మరేమన్నానా అని ఆలోచించాలి.
కధ చాలా పాజిటివ్ గా వుంది.
“గ్రంధచౌర్యం గురించి రాసిన వేలూరి గారి సంపాదకీయానికి ఉదాహరణ గా అనిపించింది ఈ కవిత నాకు.
– సాయి బ్రహ్మానందం గొర్తి ”
ఎక్కడో వకటి, అరా లైన్లు కలిస్తే దానికి గ్రంధచౌర్యం అనే మాట వాడాల్సిన అవసరం లేదు. దానికోసం అక్షరం అక్షరం పోలికలవసరం లేదు. సాయి గారు ఎంత సున్నితంగా తమ అభిప్రాయం చెప్పారనుకున్నా, వేసిన అభాంఢం పెద్దది. సరి ఐన పరిశీలన లేకుండానే అపవాదు వేశారని నా అభిప్రాయం.
రెండు కవితలు జోల పాట బాణీలో వ్రాసినవే. కవితలో భావం, కవిలో భావావేశం లో పోలికలున్నప్పుడు, భాషలో కొంత పోలికలుండటం సహజవే. ఈ కవితలో ఆ పోలికలు హద్దులు మించలేదని నా అభిప్రాయం.
సాయి గారు ఇంత పెద్ద ఆరోపణని పత్రికా ముఖంగా ఇంత తేలిగ్గా చెయ్యటం నాకైతే విజ్ఞత అనిపించడం లేదు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో వున్న చౌర్యాల ఉదాహరణలు కూడా కొన్ని ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పేరున్న రచయితల రచనల గురించి.
చాలా కాలం కిందట నేను, సూర్యదేవర రామమోహనరావు రాసిన నవల, “నైమిష”, మద్రాసులో వుండే రోజుల్లో కొని చదివాను. చక్కటి థ్రిల్లర్ అని కూడా అనుకున్నాను. అమెరికాకి వచ్చాక, షిడ్నీ షెల్డన్ రాసిన, “ఇఫ్ టుమారో కమ్స్” (If Tomorrow Comes) అనే నవల చదివాను. అరే ఈయన నైమిష నవలని బాగా కాపీ కొట్టాడే అని చాలా ఆశ్చర్యపోయాను. నాకు తెలిసీ నేను చదివిన కాపీ నవల (అంత బాగా కాపీ కొట్టిన) అదొక్కటే. మిగిలినవి వినడమే గానీ, చదవలేదు. కానీ చాలా వుండే వుంటాయి.
నేను సాధారణంగా కవిత్వం జోలికి పోను. నాకు బాగా అర్థం కాదు. ఈ పాట నాకు చాలా ఇష్టం. అందుకని ఈ కవిత కూడా చదివాను. ఎవరినీ నొప్పించకుండా నా అభిప్రాయం చెబుదామని నా తాపత్రయం.
కవితలో మొదటి రెండు లైన్లు:
“సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే”
పాటలో మొదటి రెండు లైన్లు:
“సడి సేయకో గాలి సడి సేయ బోకే
బడిలి వడిలో రాజు పవళించెనే”
నాకు మొదటి లైనులో తప్ప, రెండో లైనులో సారూప్యత కనబడలేదు.
కవితలోని మిగిలిన లైన్లు అన్నీ వేరుగానే వున్నాయి.
“సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!” అని అంటే, అర్థం కాలేదు. ఎందుకంటే, కవితలో రెండవలైనులోని మొదటి పదం “సవ్వడి” అయితే, పాటలో రెండవ లైను లోని మొదటి పదం “బడిలి”. పాటని కోట్ చేసేటప్పుడు, ఒక లైనుని రెండు లైన్లుగా విడగొట్టారు. అలా చేస్తే, సారూప్యత పోతోంది. కవితలో మొదటి లైను “సడిసేయకే గాలి సడిసేయకే” అని వుంటే, పోలిక కోసం, పాటలో మొదటి లైను, “సడి సేయకో గాలి సడి సేయ బోకే” గానే వుండాలి. కాబట్టి “సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!” అని అనడం కరెక్టు కాదని అనుకుంటున్నాను.
ఇక మొదటి లైనుకి వస్తే, కవితలో, “సడి సేయకే” అని వుంటే, పాటలో, “సడి సేయబోకే” అని వుంది. ఒక్క పిసర తేడా వుంది.
మొత్తానికి మొదటి లైను తప్పితే, ఇంకేదీ పోలికతో కనబడలేదు. అలాంటప్పుడూ, దీన్ని “గ్రంధ చౌర్యం” లాంటి పెద్ద పదాలతో చెప్పొచ్చా అన్నది నా ప్రశ్న.
అసలు కవి గారు ఈ పాట ఎప్పుడన్నా విన్నారో లేదో. ఎప్పటిదో పాత పాట. కవి వివరణ కూడా వుంటే బాగుండేది. మిగిలిన కవిత అంతా ఇంత తేడాగా రాసి నప్పుడు, మొదటి లైను మాత్రం చౌర్యం అయి వుంటుందా? కాస్త ఆశ్చర్యమే. కవికి కూడా ఇదే లైను తోచి వుండ కూడదా?
ఏమో! నాకు అనిపించింది చెప్పాను. ఎవరినీ చిన్నబుచ్చాలని కాదు.
కవి గారు తన అభిప్రాయం చెబితే బాగుంటుంది. నాకయితే ఇది చౌర్యం అని అనిపించడం లేదు. బహుశా నా విజ్ఞత తక్కువయి వుంటుంది. 🙂
– ప్రసాద్
వేలూరి గారు నవ్వెయ్య గలరనే ఉద్దేశంతో, వారి అనుమతిలేకుండా వారి కథకి చిన్న పొడిగింపు.
రవి.
“అని అన్నాడు చెన్నయ్య చిరునవ్వు నవ్వుతూ, చినభూషయ్య బుజంతడుతూ!”
డేగా చెన్నయ్యతోపాటే వొచ్చి, అప్పటినుంచీ నోరెత్తకుండా ఈ మాటలన్నీ ఇంటున్న కండసీవమ్మ చెన్నయ్య సలా ఇని కళ్ళు చిట్లిస్తా లేసి నిలబడింది. ఎక్కడో నక్కలు ఊళలేసిన శబ్ధవొచ్చింది (మనలో మాట అది నక్కల ఊళ కాదని, మిస్సైల్ సైలో నించొచ్చే ఈలని, కండమ్మ లేసినా కూర్చున్నా భూమండలంలో ఎక్కడో ఒకదగ్గర కనీసం నలుగురన్నా పెభువు దగ్గరకెల్తారని, కండమ్మ సావాసగాళ్ళకి సావాసగాడొకాయన ఆ మధ్య వొక మందు పారిటీలో రకశ్యంగా చెప్పి, భక్తిగా నవ్వేడు). లేచి నించున్న కండసీవమ్మ, చిన బూసయ్యని, డేగా చెన్నయ్యని వొకసారి భక్తిగా చూసి ఇట్టా సెప్పింది.
మన పెదరాజు చిన బూసయ్యా, చిన రాజు డేగా చెన్నయ్యా ఏది సెప్పినా సక్కగా సెప్తారు, ఏది సేసినా నిస్సర్ధంగా మనకోసవే సేస్తారు. ఐతే ఇప్పుడు సెప్పిన ఇసయంలో మాత్రం సిన్న సిక్కుంది. అసల మనవేందుకు ఆ ఆగ్నేయమూక మీదకి దాడి సెసేవో మరసిపోయ్యారు. మనకి గుగ్గిళ్ళకోసవైతే ఆ మూక మనకి గుగ్గిళ్ళు అమ్మతానే వుండేరు కదా. వాళ్ళమ్మలేదని, మనకు గుగ్గిళ్ళు దొరక్క కాదు కదా మనం ఆ మూకమీదికి పోయింది. ఆ దేశంలో గుగ్గిళ్ల పంటమీద మనోళ్ల పెత్తనం లేదనికదా మనం బాద పడింది. ఆ పెత్తనవే మనోళ్ళకుంటే ఆ లాబాలేయో మనోళ్ళే తింటారని కదా మనవీ పెంటనెత్తికెత్తుకుంది. ఎంతమంది పెజలు సచ్చినా, ఎంత పెజాదనం కరుసయినా మనోళ్లబాగుకోసవే కదా మనవింత కాలం పాటుపడింది. ఇప్పుడు మీరు మల్లా ఆ సావనసాయోల్లమీదకి పోదావంటున్నారు. ఎందుకు, వాల్ల గుగ్గిళ్ళు మనయే కదా. వాళ్ళ రాజు మన్ను ముకుడు మన సెంసానే కదా. ఇంకా మనోళ్లనమీద నన్నా ఎప్పుడన్నా వనుమానం వస్తదేవో గానీ, మన్ను ముకుడు, మన అతివీర, పరమవీర, మహావీర పేమికుడు కదా. మనం కూసో అంటె కూసోని, నిలూ అంటే నిలిసేటోడు కదా. ఆడ యాపారాలన్నీ కోంచేం, కోంచెంగా అన్నీ మనోళ్ళ సేతుల్లోకే కదా వస్తున్నాయ్. ఆడ వాళ్ల నీళ్ళు వాళ్ళకే ఎయ్యో, రెండేలో పెరశెంతు నాబానికి వాళ్ళకే అమ్ముతుంటే నోరు మూసుకోని కోంటున్నారు కదా. రేపు వాళ్ళ బియ్యం, వాళ్ళ ఉప్పు, వాళ్ళకి మన గోడమారుటోడే కదా అమ్మాబొయ్యేది. వాళ్ల పిలగోళ్ళకి సోపులు, వాళ్ళాడోళ్ళకి సోకులూ, వాళ్ళకి సదువులూ, సట్టుబండలూ, వాల్లేసుకోడానికి గుడ్డలూ, వాల్లు తిరగడానికి జటకా బళ్ళు, డబ్బున్నోళ్ళకి సిన్న గుర్రాలూ, పెద్ద గుర్రాలూ, ఒకటేంది, అన్నీ మనోల్లే కదా అమ్మబొయ్యేది. ఆ లాబాలన్నీ మనకే కదా రాబొయ్యేది. ఈ రోజు కాకపోతే, రేపైనా ఆడ గుగ్గిళ్లమీద పెత్తనం కూడా మనోల్లదే కదా అవబొయ్యేది. అందు కని వాల్ల నెత్తిన బాంబెయ్యటం కాదు పరిస్కారం. వాల్ల యాపారవంతా మనోల్ల పెత్తనం కిందకు రావటవే ముక్కెం.
నోట్లోకి ఈగ దూరిన సంగతి కూడా గమనించకుండా ఇంటున్నాడు చెన్నయ్య. చిన బూసయ్య కి ఇట్టాటి ఇసయాలేవీ బుర్రలోకి దూరవు. అందుకని ఈలోపు కళ్ళు తెరుసుకునే వొక సిన్న నిద్రేశాడు. సంగత్తెలిసిన కండమ్మ చెన్నయ్యని చూస్తా మల్లా ఇట్టా మాట్టాడసాగింది.
ఈరోజు మన్ను ముకుడున్నాడు ఈడు మనోడే, ఐతే రేపే ముకుడొస్తాడో ఏందో అని బాద పడబళ్ళే. ఏ ముకుడొచ్చినా, మూడు రంగుల ముకుడో, కాసాయం ముకుడో కదా వస్తారు. ఈళ్ళింతకుముందు వచ్చినోల్లే కదా. మనకు కావాల్సినోల్లే కదా. వొక వేల కోంపతీసి ఎర్ర ముకుడోచ్చినా బయపడబల్లే. మనవాల్రెడీ పసుప్పచ్చోల్ల ఇలాకాలో ఈ ఎర్రోల్లని మేనేజ్ సెయ్యటం నేర్చుకున్నం కదా. ఎవడోచ్చినా పీకేదేంలేదు. ఎవరికి కావాల్సింది, రావాల్సిందీ వాల్లకి పడేస్తాం. మనవే అంత సోర్దపరులం కాదు. “గోబరైజేసన్” కోంచెం జోరుగా నడిపిస్తే పోయే. ఎట్టా మన ఓలుడు బేంకీ, ఐ.ఎమ్.ఎఫ్ఫూ నాలుగు అప్పులుఇచ్చి, తలుపులన్నీ బార్లా తెరిపించేస్తున్నారు కదా. డాలరు నోటుతో పొయ్యెదానికి, బాంబులకి పోయ్యి జోబీలో డబ్బు కరుసు సేసుకోవడవేందుకు తీరి కూసోని. కాకపోతే ఏ ముకవోడైనా ఐదేళ్లకోక సారి, ఎలచ్చన్ల ముందు ఏదో పేదోల్లని పేమిస్తావని అడావుడు చేస్తారు. మన గురించి ఏయో కూతలు కూస్తారు. ఐనా పెభువే చెప్పేడు కదా పేదోల్లని పేమించమని, అందుకనే ఐదేల్లకొకసారి వాల్లతోపాటూ మనం కూడా పేదోల్లని పేమిస్తే సరిపోయే. ఆ నాలుగు రోజులూ, ఆ నాలుక్కూతలు పట్టించుకోక పోతే మల్లా ఇంకో ఐదేల్లూ మన రాజ్జివే. రాజు మనం కాకపోయినా రాజ్జం మందే. ఏవంటారు పెద రాజు గారూ? అని కూరుసుంది కండసీవమ్మ.
వులిక్కి పడి నిదర లేసిన పెద రాజు సిన బూసయ్య, మామూలుగానే సిన రాజు డేగా చెన్నయ్య ముఖారవిందం వైపు చూశాడు. కండ చెప్పింది సబబుగానే వుంది అన్నాడు చెన్నయ్య. ఈ నిద్ర ఆపుకోలేకుండా వచ్చి పడింది, ఏం చెప్పిందో ఏందో ఈ కండమ్మ, ఖర్మ. సరేలే ఏం చెప్పినా మన బుర్రకెట్లాగా ఎక్కదు కదా, అందులోనూ చెన్నయ్య కూడా బాగుందన్నడు అనుకున్న పెద రాజు చిన బూసయ్య, సరే నాక్కూడా అలాగే అనిపించింది, ఆ విధంగానే ముందుకు పోతాం అన్నాడు.
ఓ మలి సంధ్య దృశ్యం గురించి ashalatha అభిప్రాయం:
05/02/2008 10:48 pm
అద్భుతం. చాలా బాగుంది. సూపర్ కంపేరిజన్.
అక్షరం పరమం పదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/02/2008 9:04 pm
సంద్రాలూ, శ్రీఫాంట్లూ
గలగల పారే గోదారిలా సవ్వడి చేస్తూ సాగిన సంద్రాలు సంభాషణల్లో నుండి హఠాత్తుగా ఫ్లాపీలూ, సీడీలూ, పిడియఫ్ ల గందరగోళంలో పడి సజీవంగా సాగుతున్న కథ కాస్తా నిర్జీవమైన సాంకేతిక వ్యాసంగా మారిపోయింది!
“చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ”. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి.”
“మహాప్రస్థానం” ముందో “ఏవి తల్లీ!” ముందో నాకు గుర్తు లేదు కాని,
“చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?”
మాత్రం కలకాలం నిలిచే కవిత.
కొడవళ్ళ హనుమంతరావు
గ్రంథచౌర్యం గురించి … గురించి Sai Brahmanandam Gorthi అభిప్రాయం:
05/02/2008 8:47 pm
ఈ భావ చౌర్యం బెడద అన్నమాచార్యకీ తప్ప లేదు. ఈ భావ చౌర్యం చేసిన వాళ్ళకి “ఛాయాపహారులు” అన్న ముద్దు పేరు కూడా పెట్టి చురకలేసాడా వాగ్గేయకారుడు.
వెర్రులాల మీకు వేడుక గలితేను
అర్రు వంచి తడుకల్లంగ రాదా?
ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యముగాదు
కుడుచి వేసిన పుల్లె కుడువుగా గాదు
బడి నొకరు జెప్పిన బ్రతి జెప్పబోతేను
ఆడరి శ్రీ హరి కది అరుహము గాదు
ఉమిసిన తమ్మలో నొక కొంత కప్రము
సంకూర్చి చవిగొని చప్పరింపనేల
అమరంగ ఛాయాపహారము చేసుక
తమ మాట గూర్చితే దైవము నగడా
ఇలా దాదాపు ఓ పది చరణాలు పైగా దుమ్మెత్తి పోసాడు, తన పద కవితలని కాపీ కొట్టిన వాళ్ళని. ఆయన వాళ్ళని “ఛాయాపహారులు” అంటూ నిందించాడు. ఈ కీర్తన పూర్తిగా పధం -దృక్పధం లో చదవగలరు
కాబట్టి కాపీరాయుళ్ళు ఈ మధ్యనే పుట్టుకొచ్చేరనుకోనక్కరలేదు. ముందునుంచీ ఉన్నారనుకోవచ్చు.
– సాయి బ్రహ్మానందం గొర్తి
సడిచేయకే గాలి గురించి Sai Brahmanandam Gorthi అభిప్రాయం:
05/02/2008 8:11 pm
ఉదాహరణ ఇచ్చినా మీకు అలా అనిపించక పోతే నేనేమీ చెయ్యలేను. మీ అందరికీ నచ్చితే మంచిదే ! జిహ్వ కో రుచి.
నా అభిప్రాయం చెప్పాను. అభాండాలు వేరుగా ఉంటాయి. రాసిందేమో నాలుగు లైన్ల కవిత అందులో రెండు వేరే దానితో పోలిక ఉంటే దాన్ని ఏవో రెండు లైన్లు కలిసాయి దానికింత రాద్ధాంతమా అని అంటే నేనేమీ చేసేది లేదు.
ఒకవేళ ఆ సినిమా పాట రాసిన వాళ్ళకి తెలియదు అనుకుందాం, కానీ బహుమతి ఇచ్చిన వారిలో ఒక్కరికీ తెలియదు అంటే కాస్త నమ్మబుద్ది కావడం లేదు నాకు. పోనీ అది అంత ప్రాచుర్యం పొందిన పాట కాదూ అనుకోడానికీ లేదు. ఏభై ఏళ్ళ తరవాత కూడా ఇంకా టీవీ లో వస్తోంది. కాస్త ఇక్కడ గూగ్లింగ్ చేస్తే ఎవరైనా వినచ్చు:
మీ వ్యాఖ్యలు చూసాకా, కవిత్వంలో ఒకటి అరా లైన్లు వేరే కవితతో కలిసినా ఫర్వాలేదన్న కొత్త విషయం తెలిసింది. ఈ మధ్యనే ఆంధ్రభూమిలో ఉగాది కవితల పోటీకి రెండో బహుమతి ఇచ్చిన కవిత మక్కీకి మక్కీ లాగించేసి, ఇది నా సొంతమే అని ఒక వ్యక్తి హామీ పత్రం రాసి పంపారు. తీరా కవితని ప్రచురించాకా, ఇది నా కవితా అంటూ ఇంకో పెద్దమనిషి లబోదిబో మన్నాడు. ఆంధ్రభూమి వాళ్ళు ఇచ్చిన బహుమతి వెనక్కి తీసుకున్నారు. దీనికి కొసమెరుపేమిటంటే, ఆ పెద్దమనిషి కవిత ఆంధ్రభూమిలోనే అచ్చు వేసుకున్నారు, కొన్ని నెలల క్రితం.
సరిపెట్టుకుంటే సర్వమూ సుందరంగానే కనిపిస్తుంది.
మీరందరూ విజ్ఞులే! నా బుద్ధే కాస్త మందగించింది.
అమ్మ గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
05/02/2008 7:05 pm
బాగానే వుంది కధ. ఇది చదువుతుంటే, చిన్నప్పటి విషయం ఒకటి గుర్తొచ్చింది.
ఆరవ తరగతి చదివే రోజుల్లో, ఒక రోజు స్కూలి నించి ఇంటికి వస్తున్నాను. మా సందులో సగం దూరం వచ్చే సరికి, తెలిసున్న వాళ్ళింటి దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. ఆ ఇంటి వాళ్ళబ్బాయి మా క్లాసుమేటే. వాడేదో తుంటరి పని చేశాడని, వాళ్ళ ఎదురింటి వాళ్ళు వాళ్ళింటి మీదకి గొడవకి వచ్చారు. మా క్లాసుమేట్ వాళ్ళమ్మ ఆ ఎదురింటి వాళ్ళతో శివంగిలాగా, హోరాహోరీగా పోట్టాడుతోంది కొడుకుని వెనకేసుకుని. అక్కడ మూగిన జనానికి కాస్సేపట్లోనే తెలిసింది తుంటరి పని చేసింది మా క్లాసుమేటని. అయినా సరే, వాళ్ళమ్మ తగ్గకుండా వాళ్ళతో పోట్టాడి, తన కొడుకుని లోపలకి తీసుకుని వెళ్ళింది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక, ఏదో చేశానని మా అమ్మ నన్ను తిట్టింది. అప్పుడు నేను, “ఫలానా వాళ్ళమ్మ చూడు, వాడు తప్పు చేసినా వాడిని వెనకేసుకొచ్చి, అందరితోనూ దెబ్బలాడింది. నువ్వేమో నేను చేసిన చిన్న తప్పుకే, సవతి తల్లిలా తిడుతున్నావు. నాకెన్ని కష్టాలో బాబూ!” అంటూ వాపోయాను.సినిమాల ప్రభావం ఎక్కువగా వుండేది నా మీద ఆ రోజుల్లో. మా అమ్మ నవ్వి, “వెదవా! వెధవ సినిమా వాగుళ్ళు నేర్చావు. అయినా ఆవిడ మీ క్లాస్ మేట్ సొంత తల్లి కాదు. సవతి తల్లి. నేను నిజంగా నీకు సొంత తల్లిని” అంది. ఆశ్చర్యపోయాను. అంత మంచి సవతి తల్లులుంటారని ఎప్పుడూ ఎరగను. అప్పటి నించీ, వాళ్ళింటి ముందు నించీ వెళ్ళేటప్పుడు, ఆవిడని చాలా కుతూహలంగా పరిశీలిస్తూ వుండేవాడిని. అన్ని విషయాల్లోనూ అందరి లాగానే వుండేదావిడ. దీనికి వ్యతిరేకంగ మా ఇంటి ఎదురింటావిడ, వాళ్ళ సొంత పిల్లలు ఏ తప్పూ చెయ్యకపోయినా, ఎవరన్నా వచ్చి, వాళ్ళ పిల్లల మీద ఏమన్నా కాస్త చెడుగా అంటే, తన పిల్లల్ని అక్కడే వాళ్ళ ఎదురుగానే చావబాదేది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈ లలిత లాంటి వాళ్ళకి అంత సంస్కారం, మంచితనం ఎక్కడ నించీ అలవడ్డాయా అని. సవతి తల్లులు చెడ్డగా వుంటే, చాలా సులభంగా అర్థం అయిపోతుంది సంగతి. వారు చాలా మంచిగా వున్నారంటే, వారి వెనుక నున్న చరిత్ర తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది. ఈ కధలో రచయిత్రి లలిత అంత వున్నతంగా ప్రవర్తించడానికి కారణాలు ఏమన్నా చెప్పి వుంటే బాగుణ్ణనిపించింది. చిన్నప్పటి నించీ చదువుతున్న ఉత్తమ సాహిత్యమా, ఇంట్లోని ప్రేమతో కూడిన వాతావరణమా, మరేమన్నానా అని ఆలోచించాలి.
కధ చాలా పాజిటివ్ గా వుంది.
– ప్రసాద్
సడిచేయకే గాలి గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
05/02/2008 6:39 pm
“గ్రంధచౌర్యం గురించి రాసిన వేలూరి గారి సంపాదకీయానికి ఉదాహరణ గా అనిపించింది ఈ కవిత నాకు.
– సాయి బ్రహ్మానందం గొర్తి ”
ఎక్కడో వకటి, అరా లైన్లు కలిస్తే దానికి గ్రంధచౌర్యం అనే మాట వాడాల్సిన అవసరం లేదు. దానికోసం అక్షరం అక్షరం పోలికలవసరం లేదు. సాయి గారు ఎంత సున్నితంగా తమ అభిప్రాయం చెప్పారనుకున్నా, వేసిన అభాంఢం పెద్దది. సరి ఐన పరిశీలన లేకుండానే అపవాదు వేశారని నా అభిప్రాయం.
రెండు కవితలు జోల పాట బాణీలో వ్రాసినవే. కవితలో భావం, కవిలో భావావేశం లో పోలికలున్నప్పుడు, భాషలో కొంత పోలికలుండటం సహజవే. ఈ కవితలో ఆ పోలికలు హద్దులు మించలేదని నా అభిప్రాయం.
సాయి గారు ఇంత పెద్ద ఆరోపణని పత్రికా ముఖంగా ఇంత తేలిగ్గా చెయ్యటం నాకైతే విజ్ఞత అనిపించడం లేదు.
గ్రంథచౌర్యం గురించి … గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
05/02/2008 5:52 pm
ఆధునిక తెలుగు సాహిత్యంలో వున్న చౌర్యాల ఉదాహరణలు కూడా కొన్ని ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పేరున్న రచయితల రచనల గురించి.
చాలా కాలం కిందట నేను, సూర్యదేవర రామమోహనరావు రాసిన నవల, “నైమిష”, మద్రాసులో వుండే రోజుల్లో కొని చదివాను. చక్కటి థ్రిల్లర్ అని కూడా అనుకున్నాను. అమెరికాకి వచ్చాక, షిడ్నీ షెల్డన్ రాసిన, “ఇఫ్ టుమారో కమ్స్” (If Tomorrow Comes) అనే నవల చదివాను. అరే ఈయన నైమిష నవలని బాగా కాపీ కొట్టాడే అని చాలా ఆశ్చర్యపోయాను. నాకు తెలిసీ నేను చదివిన కాపీ నవల (అంత బాగా కాపీ కొట్టిన) అదొక్కటే. మిగిలినవి వినడమే గానీ, చదవలేదు. కానీ చాలా వుండే వుంటాయి.
– ప్రసాద్
సడిచేయకే గాలి గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
05/02/2008 5:44 pm
నేను సాధారణంగా కవిత్వం జోలికి పోను. నాకు బాగా అర్థం కాదు. ఈ పాట నాకు చాలా ఇష్టం. అందుకని ఈ కవిత కూడా చదివాను. ఎవరినీ నొప్పించకుండా నా అభిప్రాయం చెబుదామని నా తాపత్రయం.
కవితలో మొదటి రెండు లైన్లు:
“సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే”
పాటలో మొదటి రెండు లైన్లు:
“సడి సేయకో గాలి సడి సేయ బోకే
బడిలి వడిలో రాజు పవళించెనే”
నాకు మొదటి లైనులో తప్ప, రెండో లైనులో సారూప్యత కనబడలేదు.
కవితలోని మిగిలిన లైన్లు అన్నీ వేరుగానే వున్నాయి.
“సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!” అని అంటే, అర్థం కాలేదు. ఎందుకంటే, కవితలో రెండవలైనులోని మొదటి పదం “సవ్వడి” అయితే, పాటలో రెండవ లైను లోని మొదటి పదం “బడిలి”. పాటని కోట్ చేసేటప్పుడు, ఒక లైనుని రెండు లైన్లుగా విడగొట్టారు. అలా చేస్తే, సారూప్యత పోతోంది. కవితలో మొదటి లైను “సడిసేయకే గాలి సడిసేయకే” అని వుంటే, పోలిక కోసం, పాటలో మొదటి లైను, “సడి సేయకో గాలి సడి సేయ బోకే” గానే వుండాలి. కాబట్టి “సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!” అని అనడం కరెక్టు కాదని అనుకుంటున్నాను.
ఇక మొదటి లైనుకి వస్తే, కవితలో, “సడి సేయకే” అని వుంటే, పాటలో, “సడి సేయబోకే” అని వుంది. ఒక్క పిసర తేడా వుంది.
మొత్తానికి మొదటి లైను తప్పితే, ఇంకేదీ పోలికతో కనబడలేదు. అలాంటప్పుడూ, దీన్ని “గ్రంధ చౌర్యం” లాంటి పెద్ద పదాలతో చెప్పొచ్చా అన్నది నా ప్రశ్న.
అసలు కవి గారు ఈ పాట ఎప్పుడన్నా విన్నారో లేదో. ఎప్పటిదో పాత పాట. కవి వివరణ కూడా వుంటే బాగుండేది. మిగిలిన కవిత అంతా ఇంత తేడాగా రాసి నప్పుడు, మొదటి లైను మాత్రం చౌర్యం అయి వుంటుందా? కాస్త ఆశ్చర్యమే. కవికి కూడా ఇదే లైను తోచి వుండ కూడదా?
ఏమో! నాకు అనిపించింది చెప్పాను. ఎవరినీ చిన్నబుచ్చాలని కాదు.
కవి గారు తన అభిప్రాయం చెబితే బాగుంటుంది. నాకయితే ఇది చౌర్యం అని అనిపించడం లేదు. బహుశా నా విజ్ఞత తక్కువయి వుంటుంది. 🙂
– ప్రసాద్
సడిచేయకే గాలి గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
05/02/2008 2:10 pm
ఈ క్రింది పాటనీ, ఈ కవితనీ తరచి చూడండి.
దేనికేది మూలం అన్నది ఎవరి విజ్ఞతకి వారిని వదిలేస్తున్నాను.
సడి సేయకో గాలి
సడి సేయ బోకే
బడిలి వడిలో రాజు పవళించెనే
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదిరి చూసేనే
నిదుర చెదిరిందంటే నేనూరు కోనే
పండు వెన్నెలనడిగి – పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు – నిదుర తేరాదే
విరుల వీవెన బూని – విసిరి పోరాదే
ఇది రాజమకుటం సినిమాలో పాట.
ఈ కవిత మొదటి రెండు లైన్లూ ఒకేలా అనిపించడం లేదూ –
సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే
సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!
గ్రంధచౌర్యం గురించి రాసిన వేలూరి గారి సంపాదకీయానికి ఉదాహరణ గా అనిపించింది ఈ కవిత నాకు.
– సాయి బ్రహ్మానందం గొర్తి
గుర్రాలు – గుగ్గిళ్ళు, మరో సారి… గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
05/02/2008 1:58 pm
వేలూరి గారు నవ్వెయ్య గలరనే ఉద్దేశంతో, వారి అనుమతిలేకుండా వారి కథకి చిన్న పొడిగింపు.
రవి.
“అని అన్నాడు చెన్నయ్య చిరునవ్వు నవ్వుతూ, చినభూషయ్య బుజంతడుతూ!”
డేగా చెన్నయ్యతోపాటే వొచ్చి, అప్పటినుంచీ నోరెత్తకుండా ఈ మాటలన్నీ ఇంటున్న కండసీవమ్మ చెన్నయ్య సలా ఇని కళ్ళు చిట్లిస్తా లేసి నిలబడింది. ఎక్కడో నక్కలు ఊళలేసిన శబ్ధవొచ్చింది (మనలో మాట అది నక్కల ఊళ కాదని, మిస్సైల్ సైలో నించొచ్చే ఈలని, కండమ్మ లేసినా కూర్చున్నా భూమండలంలో ఎక్కడో ఒకదగ్గర కనీసం నలుగురన్నా పెభువు దగ్గరకెల్తారని, కండమ్మ సావాసగాళ్ళకి సావాసగాడొకాయన ఆ మధ్య వొక మందు పారిటీలో రకశ్యంగా చెప్పి, భక్తిగా నవ్వేడు). లేచి నించున్న కండసీవమ్మ, చిన బూసయ్యని, డేగా చెన్నయ్యని వొకసారి భక్తిగా చూసి ఇట్టా సెప్పింది.
మన పెదరాజు చిన బూసయ్యా, చిన రాజు డేగా చెన్నయ్యా ఏది సెప్పినా సక్కగా సెప్తారు, ఏది సేసినా నిస్సర్ధంగా మనకోసవే సేస్తారు. ఐతే ఇప్పుడు సెప్పిన ఇసయంలో మాత్రం సిన్న సిక్కుంది. అసల మనవేందుకు ఆ ఆగ్నేయమూక మీదకి దాడి సెసేవో మరసిపోయ్యారు. మనకి గుగ్గిళ్ళకోసవైతే ఆ మూక మనకి గుగ్గిళ్ళు అమ్మతానే వుండేరు కదా. వాళ్ళమ్మలేదని, మనకు గుగ్గిళ్ళు దొరక్క కాదు కదా మనం ఆ మూకమీదికి పోయింది. ఆ దేశంలో గుగ్గిళ్ల పంటమీద మనోళ్ల పెత్తనం లేదనికదా మనం బాద పడింది. ఆ పెత్తనవే మనోళ్ళకుంటే ఆ లాబాలేయో మనోళ్ళే తింటారని కదా మనవీ పెంటనెత్తికెత్తుకుంది. ఎంతమంది పెజలు సచ్చినా, ఎంత పెజాదనం కరుసయినా మనోళ్లబాగుకోసవే కదా మనవింత కాలం పాటుపడింది. ఇప్పుడు మీరు మల్లా ఆ సావనసాయోల్లమీదకి పోదావంటున్నారు. ఎందుకు, వాల్ల గుగ్గిళ్ళు మనయే కదా. వాళ్ళ రాజు మన్ను ముకుడు మన సెంసానే కదా. ఇంకా మనోళ్లనమీద నన్నా ఎప్పుడన్నా వనుమానం వస్తదేవో గానీ, మన్ను ముకుడు, మన అతివీర, పరమవీర, మహావీర పేమికుడు కదా. మనం కూసో అంటె కూసోని, నిలూ అంటే నిలిసేటోడు కదా. ఆడ యాపారాలన్నీ కోంచేం, కోంచెంగా అన్నీ మనోళ్ళ సేతుల్లోకే కదా వస్తున్నాయ్. ఆడ వాళ్ల నీళ్ళు వాళ్ళకే ఎయ్యో, రెండేలో పెరశెంతు నాబానికి వాళ్ళకే అమ్ముతుంటే నోరు మూసుకోని కోంటున్నారు కదా. రేపు వాళ్ళ బియ్యం, వాళ్ళ ఉప్పు, వాళ్ళకి మన గోడమారుటోడే కదా అమ్మాబొయ్యేది. వాళ్ల పిలగోళ్ళకి సోపులు, వాళ్ళాడోళ్ళకి సోకులూ, వాళ్ళకి సదువులూ, సట్టుబండలూ, వాల్లేసుకోడానికి గుడ్డలూ, వాల్లు తిరగడానికి జటకా బళ్ళు, డబ్బున్నోళ్ళకి సిన్న గుర్రాలూ, పెద్ద గుర్రాలూ, ఒకటేంది, అన్నీ మనోల్లే కదా అమ్మబొయ్యేది. ఆ లాబాలన్నీ మనకే కదా రాబొయ్యేది. ఈ రోజు కాకపోతే, రేపైనా ఆడ గుగ్గిళ్లమీద పెత్తనం కూడా మనోల్లదే కదా అవబొయ్యేది. అందు కని వాల్ల నెత్తిన బాంబెయ్యటం కాదు పరిస్కారం. వాల్ల యాపారవంతా మనోల్ల పెత్తనం కిందకు రావటవే ముక్కెం.
నోట్లోకి ఈగ దూరిన సంగతి కూడా గమనించకుండా ఇంటున్నాడు చెన్నయ్య. చిన బూసయ్య కి ఇట్టాటి ఇసయాలేవీ బుర్రలోకి దూరవు. అందుకని ఈలోపు కళ్ళు తెరుసుకునే వొక సిన్న నిద్రేశాడు. సంగత్తెలిసిన కండమ్మ చెన్నయ్యని చూస్తా మల్లా ఇట్టా మాట్టాడసాగింది.
ఈరోజు మన్ను ముకుడున్నాడు ఈడు మనోడే, ఐతే రేపే ముకుడొస్తాడో ఏందో అని బాద పడబళ్ళే. ఏ ముకుడొచ్చినా, మూడు రంగుల ముకుడో, కాసాయం ముకుడో కదా వస్తారు. ఈళ్ళింతకుముందు వచ్చినోల్లే కదా. మనకు కావాల్సినోల్లే కదా. వొక వేల కోంపతీసి ఎర్ర ముకుడోచ్చినా బయపడబల్లే. మనవాల్రెడీ పసుప్పచ్చోల్ల ఇలాకాలో ఈ ఎర్రోల్లని మేనేజ్ సెయ్యటం నేర్చుకున్నం కదా. ఎవడోచ్చినా పీకేదేంలేదు. ఎవరికి కావాల్సింది, రావాల్సిందీ వాల్లకి పడేస్తాం. మనవే అంత సోర్దపరులం కాదు. “గోబరైజేసన్” కోంచెం జోరుగా నడిపిస్తే పోయే. ఎట్టా మన ఓలుడు బేంకీ, ఐ.ఎమ్.ఎఫ్ఫూ నాలుగు అప్పులుఇచ్చి, తలుపులన్నీ బార్లా తెరిపించేస్తున్నారు కదా. డాలరు నోటుతో పొయ్యెదానికి, బాంబులకి పోయ్యి జోబీలో డబ్బు కరుసు సేసుకోవడవేందుకు తీరి కూసోని. కాకపోతే ఏ ముకవోడైనా ఐదేళ్లకోక సారి, ఎలచ్చన్ల ముందు ఏదో పేదోల్లని పేమిస్తావని అడావుడు చేస్తారు. మన గురించి ఏయో కూతలు కూస్తారు. ఐనా పెభువే చెప్పేడు కదా పేదోల్లని పేమించమని, అందుకనే ఐదేల్లకొకసారి వాల్లతోపాటూ మనం కూడా పేదోల్లని పేమిస్తే సరిపోయే. ఆ నాలుగు రోజులూ, ఆ నాలుక్కూతలు పట్టించుకోక పోతే మల్లా ఇంకో ఐదేల్లూ మన రాజ్జివే. రాజు మనం కాకపోయినా రాజ్జం మందే. ఏవంటారు పెద రాజు గారూ? అని కూరుసుంది కండసీవమ్మ.
వులిక్కి పడి నిదర లేసిన పెద రాజు సిన బూసయ్య, మామూలుగానే సిన రాజు డేగా చెన్నయ్య ముఖారవిందం వైపు చూశాడు. కండ చెప్పింది సబబుగానే వుంది అన్నాడు చెన్నయ్య. ఈ నిద్ర ఆపుకోలేకుండా వచ్చి పడింది, ఏం చెప్పిందో ఏందో ఈ కండమ్మ, ఖర్మ. సరేలే ఏం చెప్పినా మన బుర్రకెట్లాగా ఎక్కదు కదా, అందులోనూ చెన్నయ్య కూడా బాగుందన్నడు అనుకున్న పెద రాజు చిన బూసయ్య, సరే నాక్కూడా అలాగే అనిపించింది, ఆ విధంగానే ముందుకు పోతాం అన్నాడు.