ఆరుద్ర గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఆయన గొంతుని అందించి మంచి పని చేశారు. రచయితల సంఘం, సాహిత్య వర్గీకరణ అవసరాల గురించి ఆరుద్ర స్పష్టంగా చెప్పడం బాగుందిశంఆయన నిబద్దతను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అభిప్రాయం ఉపయోగ పడుతుంది. తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం రచనావిధానంలో పాలకుల పద్దతిని ఎందుకు పాటించారో కూడా బాగా వివరించారు. దీన్నివివరిస్తూ నా పరిశోధనలో ఆరుద్రగారిది మార్క్సిస్టు దృక్పథం అన్నాను. http://dspace.vidyanidhi.org.in:8080/dspace/handle/2009/1171
మొత్తం మీద సేకరించిన పరుచూరి శ్రీనివాస్ గార్కి, అందించిన ఈమాట వార్కి నా అభినందనలు. అలాగే ఇంటర్వ్యూ చేసిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు మంచి ప్రశ్నలను అడిగారు. అయితే.. ఆరుద్ర ఎదురు ప్రశ్న వేసిన తరువాత భాగం ఏమైంది? దొరికితే దాన్ని కూడా పెట్టే ప్రయత్నం చేయండి.ఏది ఏమైనా
ఇది సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ఇంటర్వ్యూ కాగలదు!
డా//దార్ల వెంకటేశ్వరరావు,
లెక్చరర్, తెలుగుశాఖ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి,హైదరాబాదు-500046,. భారతదేశం
మీ ఘంటసాల
గురించి nishtala Subrahmanyam అభిప్రాయం:
07/03/2008
1:27 am
మీ కృషి అభినందనీయం. మీలాంటి వాళ్ళుండ బట్టే ఈ ప్రపంచం లో తరువాతి తరాల వారికి చరిత్ర తెలుస్తుంది. మీకు నా నమశ్శతాంజలి
ప్రింటు చెయ్యడానికి దాదాపు 9 రూపాయల ఖర్చు అయ్యే దినపత్రికని, కేవలం 2-3 రూపాయలకు ఇవ్వగలగటంలో, ఏ విధమైన బిజినెస్ సెన్స్ లేదు. మరి అలాంటిది ఈ పత్రికా యాజమాన్యాలు ఇన్నాళ్ళూ ఎలా నెగ్గుకొస్తున్నారూ? అంటే, ఇక్కడ పత్రికను అడ్డం పెట్టుకుని వేరే విధానాలలో డబ్బు సంపాదిస్తున్నారన్నమాట.
మన పత్రిక పరిస్థితి ఇంత తేటతెల్లంగా కనబడుతుంటే, మళ్ళీ దానికొక philosophical చర్చ అవసరమా? చర్చించినా అది మన ఆత్మతృప్తికే గానీ అసలు సమస్యని మనం ఆర్చలేమూ, తీర్చలేము. “వార్తల్ని వార్తలుగా రాస్తే 10 రూపాయలిచ్చి కొనడానికి మేను సిద్దం, లేకపోతే అస్సలు దిన పత్రికలు కొనం” అని ఒక నిర్ణయానికొద్దామా? అది మన వల్ల కాదు. ఎందుకంటే, ఈ ‘సరదా’ వార్తా పత్రికలకి మనం అలవాటుపడిపోయాం. పొద్దున్నే ఈ అవాకులు చదవకపోతే మనకూ తోచదు. రోజంతా చర్చించుకోవడానికి కొన్ని విషయాలు మనకూ కావాలిగా!
అందుకే, ‘గాయం’ సినిమాలో “నిగ్గ దీసి అడుగు, ఈ సిగ్గులేని జనాన్ని. నిప్పుతోటి కడుగు, ఈ సమాజ జీవఛవాన్ని. మారదు లోకం, మారదు కాలం” అని ‘సిరివెన్నెల’ చేత మన రాంగోపాల్ వర్మ పాడించేశాడు. అప్పటికీ ఇప్పటి స్థితిలో మార్పులేదు, ఇంకా చెడటం తప్ప.
‘పత్రికా స్వాతంత్ర్యం’ అనే ఉసుగులో కొన్ని ప్రముఖ వార్తా పత్రికలు తమ రాజకీయ, ఆర్థిక పబ్బాలు గడుపుకోవడం మొదలైనప్పుటి నుంచీ, మన రాష్ట్రంలో వాటి credibility ప్రశ్నార్థకంగా మారింది. ఇక ‘సాక్షి’ లాంటి బ్రాండెడ్ రాజకీయ పత్రికలు రావడం ఈ స్థితికి చరమాకంగా మారింది. పత్రిక యాజమాన్యాలు తమ బలిమికి ఉపయోగకరంగా పత్రికల్ని ఉపయోగించుకుని, పత్రికా స్వాతంత్ర్యం అనే ముసుగు తగిలించుకుని ఇష్టారాజ్యం చెయ్యాలంటే ఎలా?
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన సంపాదకులు కావాలి. కానీ ఉద్యోగం చేసే సంపాదకులేగానీ, ఉద్యమంగా పత్రికల్ని నడిపే సంపాదకులు ఇప్పుడు లేరుగా! అందుకే, యాజమాన్యాలు చెప్పిందే వేదం, రాయమన్నదే వార్త. మరి పత్రికా స్వాతంత్ర్యం గురించి ఒకే మూసలో మనం మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నామా?
మోహనరావుగారు: “మేలుకొనుమీ భరతపుత్రుడ” అన్నది మంగిపూడి వెంకటశర్మ రచన. ఈ పాట పూర్తిపాఠం, రచయిత యింటిపేరు (మాత్రమే) మీ గ్రంథసూచిలో పేర్కొన్న “జాతీయగీతాలు – గురజాడ రాఘవశర్మ” అన్న పుస్తకంలో (12 పే) వున్నాయి. ఇదే సంచికలో ఆ పాటలోని మొదటి రెండు చరణాలను “తెలుగు వార్తాపత్రికలు” అన్న ప్రసంగంలో శ్రీరంగం గోపాలరత్నం కంఠంలో వినవచ్చు.
– కొల్లాయి గట్టితేనేమి” పాఠం సినిమాలో స్వల్పమైన మార్పులకు గురయ్యింది.
నిజమే. సభ్య సమాజంలో హింసకు, దాడులకు చోటు లేదు. కాదని హింసకు, దాడులకు చోటిస్తే సభ్య సమాజం ఉనికికే చేటు. హింస జరిపిన వారికన్నా వారిని ఉపేక్షించే చట్టాలు, న్యాయ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం వల్లనే ఎక్కువ హాని. దాడి చేసిన వాళ్ళ దౌష్ట్యం ఆ దాడికే పరిమితం. ఉపేక్షించి నిరోధించని వ్యవస్థ, మరిన్ని దాడులకు అవకాశం ఇస్తుంది. దాడులను మించిన క్రియాశీలతతో, న్యాయ వ్యవస్థ, పాలనా యంత్రాంగాలను దిద్దుకోనంతవరకు పత్రికా స్వేచ్చకే కాదు, పౌరుల స్వేచ్చకూ ఇటువంటి పోట్లు, తిప్పలు తప్పవేమో.
విధేయుడు
-Srinivas
ఆరుద్ర తో ముఖాముఖీ గురించి Dr.Darla VenkateswaraRao అభిప్రాయం:
07/03/2008 1:56 am
ఆరుద్ర గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఆయన గొంతుని అందించి మంచి పని చేశారు. రచయితల సంఘం, సాహిత్య వర్గీకరణ అవసరాల గురించి ఆరుద్ర స్పష్టంగా చెప్పడం బాగుందిశంఆయన నిబద్దతను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అభిప్రాయం ఉపయోగ పడుతుంది. తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం రచనావిధానంలో పాలకుల పద్దతిని ఎందుకు పాటించారో కూడా బాగా వివరించారు. దీన్నివివరిస్తూ నా పరిశోధనలో ఆరుద్రగారిది మార్క్సిస్టు దృక్పథం అన్నాను. http://dspace.vidyanidhi.org.in:8080/dspace/handle/2009/1171
మొత్తం మీద సేకరించిన పరుచూరి శ్రీనివాస్ గార్కి, అందించిన ఈమాట వార్కి నా అభినందనలు. అలాగే ఇంటర్వ్యూ చేసిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు మంచి ప్రశ్నలను అడిగారు. అయితే.. ఆరుద్ర ఎదురు ప్రశ్న వేసిన తరువాత భాగం ఏమైంది? దొరికితే దాన్ని కూడా పెట్టే ప్రయత్నం చేయండి.ఏది ఏమైనా
ఇది సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ఇంటర్వ్యూ కాగలదు!
డా//దార్ల వెంకటేశ్వరరావు,
లెక్చరర్, తెలుగుశాఖ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి,హైదరాబాదు-500046,. భారతదేశం
మీ ఘంటసాల గురించి nishtala Subrahmanyam అభిప్రాయం:
07/03/2008 1:27 am
మీ కృషి అభినందనీయం. మీలాంటి వాళ్ళుండ బట్టే ఈ ప్రపంచం లో తరువాతి తరాల వారికి చరిత్ర తెలుస్తుంది. మీకు నా నమశ్శతాంజలి
బంధుత్వం గురించి S. Mallinath అభిప్రాయం:
07/03/2008 1:02 am
వంశవృక్షం ఆధారంగా బంధుత్వ సంబంధాలను నెలకొల్పే Geni.com, Amiglia వంటి వెబ్ సైట్ లకు వాణిజ్య ప్రకటనగా వాడుకోగలిగేంత బాగుందీ కవిత.
బంధుత్వం గురించి Indrani Palaparthy అభిప్రాయం:
07/03/2008 12:01 am
చాలా బాగుందీ కవిత.
స్పందన: పత్రికా ప్రభుతా మనం గురించి Rohiniprasad అభిప్రాయం:
07/02/2008 10:58 pm
మహేశ్ కుమార్ గారూ, మీకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం (Ad Revenue) గురించి తెలిసే ఉండాలి.
ఆంధ్రజ్యోతి సంఘటన గురించిన మంచి వ్యాసం:
http://kadalitaraga.wordpress.com/2008/06/26/bhavaprakatana_sweccha/
స్పందన: పత్రికా ప్రభుతా మనం గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:
07/02/2008 9:54 pm
ప్రింటు చెయ్యడానికి దాదాపు 9 రూపాయల ఖర్చు అయ్యే దినపత్రికని, కేవలం 2-3 రూపాయలకు ఇవ్వగలగటంలో, ఏ విధమైన బిజినెస్ సెన్స్ లేదు. మరి అలాంటిది ఈ పత్రికా యాజమాన్యాలు ఇన్నాళ్ళూ ఎలా నెగ్గుకొస్తున్నారూ? అంటే, ఇక్కడ పత్రికను అడ్డం పెట్టుకుని వేరే విధానాలలో డబ్బు సంపాదిస్తున్నారన్నమాట.
మన పత్రిక పరిస్థితి ఇంత తేటతెల్లంగా కనబడుతుంటే, మళ్ళీ దానికొక philosophical చర్చ అవసరమా? చర్చించినా అది మన ఆత్మతృప్తికే గానీ అసలు సమస్యని మనం ఆర్చలేమూ, తీర్చలేము. “వార్తల్ని వార్తలుగా రాస్తే 10 రూపాయలిచ్చి కొనడానికి మేను సిద్దం, లేకపోతే అస్సలు దిన పత్రికలు కొనం” అని ఒక నిర్ణయానికొద్దామా? అది మన వల్ల కాదు. ఎందుకంటే, ఈ ‘సరదా’ వార్తా పత్రికలకి మనం అలవాటుపడిపోయాం. పొద్దున్నే ఈ అవాకులు చదవకపోతే మనకూ తోచదు. రోజంతా చర్చించుకోవడానికి కొన్ని విషయాలు మనకూ కావాలిగా!
అందుకే, ‘గాయం’ సినిమాలో “నిగ్గ దీసి అడుగు, ఈ సిగ్గులేని జనాన్ని. నిప్పుతోటి కడుగు, ఈ సమాజ జీవఛవాన్ని. మారదు లోకం, మారదు కాలం” అని ‘సిరివెన్నెల’ చేత మన రాంగోపాల్ వర్మ పాడించేశాడు. అప్పటికీ ఇప్పటి స్థితిలో మార్పులేదు, ఇంకా చెడటం తప్ప.
ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:
07/02/2008 9:20 pm
‘పత్రికా స్వాతంత్ర్యం’ అనే ఉసుగులో కొన్ని ప్రముఖ వార్తా పత్రికలు తమ రాజకీయ, ఆర్థిక పబ్బాలు గడుపుకోవడం మొదలైనప్పుటి నుంచీ, మన రాష్ట్రంలో వాటి credibility ప్రశ్నార్థకంగా మారింది. ఇక ‘సాక్షి’ లాంటి బ్రాండెడ్ రాజకీయ పత్రికలు రావడం ఈ స్థితికి చరమాకంగా మారింది. పత్రిక యాజమాన్యాలు తమ బలిమికి ఉపయోగకరంగా పత్రికల్ని ఉపయోగించుకుని, పత్రికా స్వాతంత్ర్యం అనే ముసుగు తగిలించుకుని ఇష్టారాజ్యం చెయ్యాలంటే ఎలా?
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన సంపాదకులు కావాలి. కానీ ఉద్యోగం చేసే సంపాదకులేగానీ, ఉద్యమంగా పత్రికల్ని నడిపే సంపాదకులు ఇప్పుడు లేరుగా! అందుకే, యాజమాన్యాలు చెప్పిందే వేదం, రాయమన్నదే వార్త. మరి పత్రికా స్వాతంత్ర్యం గురించి ఒకే మూసలో మనం మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నామా?
విలువలు గురించి subbarao అభిప్రాయం:
07/02/2008 7:26 pm
మనుషుల్లొ దేవుళ్లంటే Scott లాంటి వారే. రవి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్థూ..
వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:
07/02/2008 2:26 pm
మోహనరావుగారు: “మేలుకొనుమీ భరతపుత్రుడ” అన్నది మంగిపూడి వెంకటశర్మ రచన. ఈ పాట పూర్తిపాఠం, రచయిత యింటిపేరు (మాత్రమే) మీ గ్రంథసూచిలో పేర్కొన్న “జాతీయగీతాలు – గురజాడ రాఘవశర్మ” అన్న పుస్తకంలో (12 పే) వున్నాయి. ఇదే సంచికలో ఆ పాటలోని మొదటి రెండు చరణాలను “తెలుగు వార్తాపత్రికలు” అన్న ప్రసంగంలో శ్రీరంగం గోపాలరత్నం కంఠంలో వినవచ్చు.
– కొల్లాయి గట్టితేనేమి” పాఠం సినిమాలో స్వల్పమైన మార్పులకు గురయ్యింది.
— శ్రీనివాస్
ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
07/02/2008 11:24 am
నిజమే. సభ్య సమాజంలో హింసకు, దాడులకు చోటు లేదు. కాదని హింసకు, దాడులకు చోటిస్తే సభ్య సమాజం ఉనికికే చేటు. హింస జరిపిన వారికన్నా వారిని ఉపేక్షించే చట్టాలు, న్యాయ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం వల్లనే ఎక్కువ హాని. దాడి చేసిన వాళ్ళ దౌష్ట్యం ఆ దాడికే పరిమితం. ఉపేక్షించి నిరోధించని వ్యవస్థ, మరిన్ని దాడులకు అవకాశం ఇస్తుంది. దాడులను మించిన క్రియాశీలతతో, న్యాయ వ్యవస్థ, పాలనా యంత్రాంగాలను దిద్దుకోనంతవరకు పత్రికా స్వేచ్చకే కాదు, పౌరుల స్వేచ్చకూ ఇటువంటి పోట్లు, తిప్పలు తప్పవేమో.
విధేయుడు
-Srinivas