ఈ సమస్యకి పరిష్కారం గురించి ఆలోచన చేసి అందరు ముందుకు వస్తే బాగుంటుంది.
“If there is darkness in the room, and we cry there is darkness, nothing will happen,
bring in light and the darkness will disappear.”… Swamy Vivekananda.
నాకు తోచిన కొన్ని పరిష్కారాలు:
1. సెన్సార్ వారిని సిరియస్ గా పనిష్ చెయ్యాలి.
2. గాంధిగిరి ద్వారా వారి బాధ్యత గుర్తు చెయ్యాలి.
3. మన సంస్కృతిని, మాతృభాషను కాపాడాలనే ఆకాంక్షించే వారందరూ ఇటువంటి వాటిని ఎదురుకోవటానికి నడుం బిగించాలి. మనమందరము ఒక ఉద్యమం లేవదీయాలి.
4. రావణాసురుడికి అయిదు తలలు సినిమా వాళ్ళైతే మరో అయిదు తలలు రాజకీయాలు. మనము ఉడతతో సమానం. రాముడు వీరిని నిజంగా గెలవగలడు. మన తెలుగు కళామతల్లిని కాపాడగలడు.
“కులం అనేది మన జీవితాల్ని ఇంకా శాసిస్తూనే ఉంది. కులం అనేది భారతీయుల మైండ్లలో పాతుకు పోయింది” కానీ భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
కుల వివక్ష భరించలేకే మత మార్చుకున్నారని భారతదేశ మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక ఇచ్చారు:-
న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్ పీటీఐకి చెప్పారు.
‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్ చెప్పారు.
పంజాబ్వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).
కృష్ణమోహన్ గారూ, నమస్తే.
వాడుక భాషలో ప్రస్తుతం ఎవరూ పద్యాలు రాయట్లేదు. విశాలాంధ్ర లో కాగడా పట్టుకుని వెతికినా కనబడరు. బహుశా చేతకాక అయ్యుండొచ్చు.
ఛందస్సు వగైరాల మీద పట్టున్న మీరూ, కామేశ్వర రావు గారూ, ఇంకా మీ లాటి వారు “వాళ్ళూ వీళ్ళూ రాసిన” ఛందోబద్ధమైన పద్యాల గురించి రాస్తూనే, వాడుక భాషలోనో, చిన్నయ సూరి భాషలోనో, ఇంకొ దాంట్లోనో పద్యాలెందుకు రాయరు?
“ఎవరో రాస్తారని, ఏదో చేస్తారని” ఎందుకు ఎదురు చూస్తున్నారు?
ఈ మంచి వ్యాసం చదివాక (ఎవడి గొడవ వాడిది అన్న పద్ధతిలో) నాకు సంగీతంలో దీనికొక పోలిక కనిపించింది. వాడుకభాషను ఛందస్సులో బిగించినట్టే శాస్త్రీయరాగాలను లైట్ మ్యూజిక్ లో ఇమిడించడం. భైరవి, తోడి వగైరా కర్నాటక రాగాలు మరీ గంభీరం. వాటిలో తేలిక ట్యూన్లు చెయ్యడం చాలా కష్టం. అయితే వాటిని ఆ రూపంలో గుర్తుపట్టడం కష్టం. ఉదా. పెండ్యాల చేసిన “నీవుండే దాకొండపై” అనే పాట ఆనందభైరవి అని చప్పున గుర్తుకు రాదు. ఈ కుస్తీతో పోలిస్తే వాడుకభాషలో వృత్తాలు రాయడమే చాలా సులువు!
నాకు తెలుసున్నంత వరకూ త్యాగరాజు తమిళం లో ఒక్క కృతీ రాయలేదు. మొదట్లో కొన్ని సంస్కృత రచనలు చేసినా, సింహ భాగం తెలుగులోనే రాసారు. త్యాగరాజుకి తమిళం ఖచ్చితంగా వచ్చే ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న శిష్యులు చాలామంది తమిళులే ! వారందరికీ తెలుగు వచ్చిందన్న నమ్మకం కలిగిన తరువాతే ఆయన స్వీయ రచనలు నేర్పాడు.
అప్పట్లో తెలుగు, తమిళం రెండూ రాజభాషలుగానే చెలామణీ అయ్యాయి. ముఖ్యంగా సాహిత్యభాషగా తెలుగుకి పెద్ద పీటే వేసారు తంజావూరు రాజులు.
త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు – మోహన
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగమురళి అభిప్రాయం:
10/30/2008 4:50 am
Rama M.V గారికీ, సత్యసాయి కొవ్వలి గారికీ ధన్యవాదాలు. మీ కామెంట్లు నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.
నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి Navin అభిప్రాయం:
10/30/2008 12:21 am
నమస్కారం.
ఈ సమస్యకి పరిష్కారం గురించి ఆలోచన చేసి అందరు ముందుకు వస్తే బాగుంటుంది.
“If there is darkness in the room, and we cry there is darkness, nothing will happen,
bring in light and the darkness will disappear.”… Swamy Vivekananda.
నాకు తోచిన కొన్ని పరిష్కారాలు:
1. సెన్సార్ వారిని సిరియస్ గా పనిష్ చెయ్యాలి.
2. గాంధిగిరి ద్వారా వారి బాధ్యత గుర్తు చెయ్యాలి.
3. మన సంస్కృతిని, మాతృభాషను కాపాడాలనే ఆకాంక్షించే వారందరూ ఇటువంటి వాటిని ఎదురుకోవటానికి నడుం బిగించాలి. మనమందరము ఒక ఉద్యమం లేవదీయాలి.
4. రావణాసురుడికి అయిదు తలలు సినిమా వాళ్ళైతే మరో అయిదు తలలు రాజకీయాలు. మనము ఉడతతో సమానం. రాముడు వీరిని నిజంగా గెలవగలడు. మన తెలుగు కళామతల్లిని కాపాడగలడు.
తెలుగువీర లేవరా …!
మరో గుప్పెడు మొర్మొరాలు గురించి రానారె అభిప్రాయం:
10/29/2008 7:47 pm
ఒక వరసంటూ లేకుండా హాయిగా కబుర్లాడినట్టుగా బాగుందీవ్యాసం. నాలుగు కొత్తవిషయాలు తెలిశాయి. ‘సాహిత్యమొర్మొరాల’ను ఒకసారి చదవాలనిపించేలా వుంది.
కర్ణాంతాయతలోచనే … అన్నారు … కర్ణాంతాకీర్ణలోచనే అని ఒక అణా ఎక్కువగా మా పాఠాల్లో చదువుకున్నట్టు గుర్తు. అణాలు చెలామణిలో లేని రోజులా అవి!!?
విలువలు గురించి rahamthulla అభిప్రాయం:
10/29/2008 9:56 am
“కులం అనేది మన జీవితాల్ని ఇంకా శాసిస్తూనే ఉంది. కులం అనేది భారతీయుల మైండ్లలో పాతుకు పోయింది” కానీ భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
కుల వివక్ష భరించలేకే మత మార్చుకున్నారని భారతదేశ మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక ఇచ్చారు:-
న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్ పీటీఐకి చెప్పారు.
‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్ చెప్పారు.
పంజాబ్వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).
తెలుగు సినిమా? తెగులు సినిమా? గురించి venugopal.nori అభిప్రాయం:
10/29/2008 9:39 am
I do accept your opinion 100%. There is lot of change in society[viewers]. We should know our responsibility in in the country.
వాడుక భాషలో పద్యాలు గురించి baabjeelu అభిప్రాయం:
10/29/2008 7:06 am
కృష్ణమోహన్ గారూ, నమస్తే.
వాడుక భాషలో ప్రస్తుతం ఎవరూ పద్యాలు రాయట్లేదు. విశాలాంధ్ర లో కాగడా పట్టుకుని వెతికినా కనబడరు. బహుశా చేతకాక అయ్యుండొచ్చు.
ఛందస్సు వగైరాల మీద పట్టున్న మీరూ, కామేశ్వర రావు గారూ, ఇంకా మీ లాటి వారు “వాళ్ళూ వీళ్ళూ రాసిన” ఛందోబద్ధమైన పద్యాల గురించి రాస్తూనే, వాడుక భాషలోనో, చిన్నయ సూరి భాషలోనో, ఇంకొ దాంట్లోనో పద్యాలెందుకు రాయరు?
“ఎవరో రాస్తారని, ఏదో చేస్తారని” ఎందుకు ఎదురు చూస్తున్నారు?
వాడుక భాషలో పద్యాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
10/28/2008 11:30 am
ఈ మంచి వ్యాసం చదివాక (ఎవడి గొడవ వాడిది అన్న పద్ధతిలో) నాకు సంగీతంలో దీనికొక పోలిక కనిపించింది. వాడుకభాషను ఛందస్సులో బిగించినట్టే శాస్త్రీయరాగాలను లైట్ మ్యూజిక్ లో ఇమిడించడం. భైరవి, తోడి వగైరా కర్నాటక రాగాలు మరీ గంభీరం. వాటిలో తేలిక ట్యూన్లు చెయ్యడం చాలా కష్టం. అయితే వాటిని ఆ రూపంలో గుర్తుపట్టడం కష్టం. ఉదా. పెండ్యాల చేసిన “నీవుండే దాకొండపై” అనే పాట ఆనందభైరవి అని చప్పున గుర్తుకు రాదు. ఈ కుస్తీతో పోలిస్తే వాడుకభాషలో వృత్తాలు రాయడమే చాలా సులువు!
వాడుక భాషలో పద్యాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
10/28/2008 11:16 am
శ్రీశ్రీ రాసిన వచనంలాంటి కందపద్యం:
అవురా శ్రీరంగం శ్రీ
నివాసరావూ బలే మనిషివే ఇక నీ
కవితావాద్యం చాలిం
చి వెళ్ళిపొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
10/28/2008 11:07 am
నాకు తెలుసున్నంత వరకూ త్యాగరాజు తమిళం లో ఒక్క కృతీ రాయలేదు. మొదట్లో కొన్ని సంస్కృత రచనలు చేసినా, సింహ భాగం తెలుగులోనే రాసారు. త్యాగరాజుకి తమిళం ఖచ్చితంగా వచ్చే ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న శిష్యులు చాలామంది తమిళులే ! వారందరికీ తెలుగు వచ్చిందన్న నమ్మకం కలిగిన తరువాతే ఆయన స్వీయ రచనలు నేర్పాడు.
అప్పట్లో తెలుగు, తమిళం రెండూ రాజభాషలుగానే చెలామణీ అయ్యాయి. ముఖ్యంగా సాహిత్యభాషగా తెలుగుకి పెద్ద పీటే వేసారు తంజావూరు రాజులు.
-సాయి బ్రహ్మానందం
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి mOhana అభిప్రాయం:
10/28/2008 7:13 am
త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు – మోహన