కథలు పుట్టేవి
వెచ్చని రెక్కల కుర్రాడు
మంచులో మునిగిన కథ
మంచు తెర మీద విరిసిన
కాంతి పూల కథ
సుంకర గోపాలయ్య
నెల్లూరు
తాడేపల్లిగూడెం
అధ్యక్షులు, తెలుగు శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తాడేపల్లిగూడెం
జీవిత విశేషాలు
సుంకర గోపాలయ్య గత 15 సంవత్సరాలనుంచీ కవిత్వం రాస్తున్నారు. ‘మా నాయన పాట’ పేరుతో కవితాసంకలనం వెలువరించారు. ఇది రెండు ముద్రణలు పొందింది. ‘రొట్టమాకురేవు’ అవార్డు, కవి సంధ్య, పురస్కారం పెన్నా పురస్కారం, ఇలా ప్రస్తుతానికి 12 పురస్కారాలు వచ్చాయి. అన్ని పత్రికలలోనూ సాహిత్య విమర్శా వ్యాసాలు వచ్చాయి. ‘కవి సంగమం’లో కవిత్వకాంతి శీర్షికతో వ్యాసాలు రాస్తున్నారు.
సుంకర గోపాలయ్య రచనలు
పైన పోతున్న పక్షుల గుంపు
పచ్చదనాన్ని పాటగా
గూట్లోకి తీసుకెళ్తున్నాయి
పాటలు వింటున్న పీతలు
బొరియల్లో
మాగన్నుగా కునుకు తీశాయి
ఆ నది ముందున్న చెట్టు మీద
వాన చినుకులా వాలిన పిట్ట
గాథా సప్త శతిలా ధ్వనిస్తోంది
కూత కూతకి గొంతు
సానబెట్టిన కత్తి అంచులా
మోగుతోంది
తడి తడిగా కబుర్లు చెప్పుకుంటూ
కదులుతున్న కాలువ నీళ్ళు
గెనం మీద పచ్చిక ఒడిలో
కునుకేసి కలలు కంటున్న మిడత
నా ఎత్తు ఎదిగిన చెరుకు తోటలో
ఎగిరి పోతున్న చిలకల జంట
మిట్టమధ్యాహ్నం
అన్ని కిరణాలు పోగుచేసుకుని
జమ్మి చెట్టు మీద పెట్టుకున్నా
ఎవడైనా
నా జోలికొస్తే
అస్త్ర శస్త్రాలు సిద్ధం