డి.వి.గుండప్ప


సొంత ఊరు:
ములబాగళ్, మైసూరు జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
తాత్వికుడు, రచయిత, కవి, పాత్రికేయుడు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

డివిజిగా ప్రసిద్ధి చెందిన దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప (1887-1975) కన్నడ కవి, రచయిత, తత్త్వవేత్త. వీరి సుప్రసిద్ధమైన రచన మంకు తిమ్మన కగ్గ మధ్యయుగానికి చెందిన కన్నడ కవి సర్వజ్ఞుని వచనాలను పోలి ఉంటాయి. వీరు రచించిన “శ్రీమద్ భగవద్గీత తాత్పర్య” అనే పుస్తకానికి 1967లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీరి శతజయంతి సందర్భంగా వీరి సమగ్ర సాహిత్యాన్ని 11 సంపుటాలలో “డివిజి కృతి శ్రేణి” పేరుతో కన్నడ సాహిత్య అకాడమీ, కర్ణాటక ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ప్రచురించింది.


 

సమస్తమూ ఈశ్వరునిలో చేరియున్నదే. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు లోకభేదాలన్నీ ఆత్మలో ఎలా ఐక్యమవుతాయో, సాగరంలోని తరంగంలా జీవుడు పృథక్త్వ భావాన్ని వీడి పరమాత్మతో ఎలా మమేకం కావాలో డి.వి.గుండప్ప గారి ఈ పద్యాలు అద్వైత వేదాంత సారాన్ని అత్యంత సులభంగా వివరిస్తున్నాయి.

నీటిలో లీనమై కరగిన పంచదార విశదముగా పానకమునంతా వ్యాపించి రుచికర పేయమౌను. ఆ రుచి నోటికే తప్ప చేతికందదు, కనులకు అగుపడదు. లోకంలో ఆత్మవస్తువును తెలుసుకున్న మనిషి మితమైన దేహప్రకృతిని వదలి, అందరిలో, అన్నిటిలో చక్కెర పానకం కలిసిపోయినట్లు కనబడక, చేతికి చిక్కక, తన తీపిని మాత్రమే నోటికి అందించే విధంగా లోకానికి మిత్రుడవ్వాలి.

ప్రపంచం అనేది స్వతంత్రంగా ఉన్న సత్యం కాదు. అది చైతన్యంపై పడిన ప్రతిబింబం మాత్రమే. ‘దాని నీడయే ఈ జగత్తు’ అనగా అదే. నీడకు స్వంతంగా ఉనికి లేదు. నీడ ఉండాలంటే ఒక వస్తువు, కాంతి ఉండాలి. ఈ చైతన్యసత్త్వము అన్నియెడల ఉండి మనకు కనబడక ఎందుకు గూఢంగా ఉన్నది?

తన్మయుం డద్దమున కెదురుగా నిలచి లా-
వణ్యముల తిలకించి మురిసిపోవునటు
చిన్మయుడు సృష్టి చిత్రమున తన వీర్య సం-
పన్నము ననుభవించు – మంకుతిమ్మ

సరళ జీవనపు కల మంకుతిమ్మని మనసు
సరస ఋత సౌజన్య శాంతి శోభనము
సరసి తెరలేచి తుంపర చినుకులను చల్లి
మరల సరసిని జేరు – మంకుతిమ్మ

పూజ్యులైన డి.వి.గుండప్పగారి ఈ గ్రంథము ’మంకుతిమ్మని మిణుకు’ అనే ఆంధ్రానువాదానికి మూలమైన ’మంకుతిమ్మన కగ్గ’కు రెండవభాగము. ఈ రెండవ భాగం ప్రకటమైనది 1984లో, డి.వి.జి గారు గతించిన తొమ్మిది సంవత్సరాల తరువాత.