కొడవళ్ళ హనుమంతరావు గారి “చక్కెర గుళిక” చదివాను. “ఆర్టిఫిషియల్ స్వీట్ నర్” అనే అనిపించింది. ఒక విమర్శకి ఎంత డొంక తిరుగుడుగా జవాబు రాయొచ్చో కూడా తెలిసింది.
మొదటగా చేరాకీ, కుటుంబరావుకీ నా విమర్శలో వున్న లంకె ఏమిటీ అని చూద్దాం.
హనుమంతరావు గారి దృష్టిలో అది, “ఆ రచయితలిద్దరూ రంగనాయకమ్మని విమర్శించడం!”. సరే! వదిలేద్దాం! ఎవరి తెలివి తేటలని బట్టి వారికి అర్థమవుతుంది మరి. నిజానికి అసలు లంకె ఏమిటీ? ఆ ఇద్దరు రచయితలూ తాము ఒకలా రాసి, కొంత కాలం పోయాక దాని ప్రసక్తి లేకుండా వేరేలా రాశారు. అప్పుడు అది పరిణామ క్రమం అవదు. వెనుక చేసిన తప్పులను దిద్దుకుంటూ, వాటి గురించి ప్రస్తావిస్తూ, కొత్త విషయాల గురించి రాస్తే, అందులో వున్న అభివృద్ధి అర్థం అవుతుంది. కానీ అలా రాయడం రచయితలకెంత మింగుడు పడని విషయమో, వారి సమర్థకులకూ అంతే మింగుడు పడని విషయం. కాబట్టి ఆ రచయితలు గురివింద గింజల్లా, తాము రాసిన నలుపుని పట్టించుకోకుండా, గొప్పగా రాస్తారు. వారి సమర్థకులు ఆ గురివింద గింజల్ని చక్కెర గుళికల్లా భావించి సేవిస్తారు. మనల్ని కూడా సేవించ మంటారు. ఎవరి చైతన్యం వారిది మరి!
ఒకే విషయంలో ఒకేలా ప్రవర్తించిన ఇద్దరు రచయితల గురించి ప్రస్తావిస్తే, వాటికి లంకేమిటీ అని అడుగుతున్న హనుమంతరావు గారి అమాయక ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు.
“రంగనాయకమ్మ చేరాని ఎప్పుడు, ఏమని విమర్శించారూ” అన్న విషయం ఇక్కడ అసందర్భం. చేరా కూడా ఎటువంటి విమర్శలతో జవాబిచ్చారూ అన్నది కూడా వేరే విషయం.
హనుమంతరావు గారు చెప్పినట్టే, కాలాను క్రమణ చూడండి.
1. 1989 లో చేరా “వెటకారం వాద పద్ధతి కాదు” అనే వ్యాసం రాశారు. అందులో నేను చెప్పినట్టుగా, రచయిత్రి పేరు లేకుండా వ్యాసం అంతా రాశారు.
2. రంగనాయకమ్మ గారు చేరాని విమర్శించారు అని అన్నది 1991 లో. అంటే రెండేళ్ళు జవాబివ్వకుండా రంగనాయకమ్మ వూరుకున్నారా? “వాడుక భాషే రాస్తున్నామా?” అనే పుస్తకం 1990 లోనే బయటికి వచ్చేసింది. అందులోనే చేరాకి కావల్సిన సమాధానాలున్నాయి.
3. “చేరాత మీద ఓ విమర్శ” అనే పేరుతో 1989 లోనే నేను ఆంధ్రజ్యోతి లో ఒక వ్యాసం కూడా రాశాను.
ఈ వివరాల్ని బట్టి చూస్తే, ఏం తెలుస్తోందీ? హనుమంతరావు గారి కాలాను క్రమణ సరిగా లేదనీ, అర్థం పర్థం లేకుండా వుందనీ!
ఈ విషయంలో నా విమర్శ ఏమిటీ? చేరా ఒకసారి తప్పుగా రాశారు కాబట్టి, ఇక ఆయనకి “నిష్కృతి” లేదనా? మరి హనుమంతరావు గారికి అలాగే అర్థం అయింది మరి.
నిజానికి అది నా విమర్శ కానే కాదు. చేరా ఒకప్పుడు తాను ఆ తప్పు చేశాననీ, అది సరైనది కాదనీ, విపులంగా వ్యాసాలు రాసేటప్పుడు పేర్లతో స్పష్టంగా రాయడమే కరెక్టు పద్ధతి అనీ రాస్తే, ఒప్పుకోని దెవరు? అలా చెయ్యకుండా, గతంలో తాను రాసిన విషయాల్ని వదిలేసి, కొత్తగా వ్యతిరేక విషయం చెబితే, అదెంత గొప్ప విషయమైనా పాఠకులు ప్రశ్నలు అడుగుతారూ, విమర్శిస్తారూ. దబాయింపులు విమర్శని నొక్కెయ్య లేవు.
ఇక్కడ ఓ ముఖ్య విషయం. “రచయితలు గతంలో తాము తప్పుగా చెప్పిన విషయాల్ని దిద్దుబాట్లతో చెప్పాలా కొత్తగా నేర్చుకున్న జ్ఞానంతో మంచి విషయాలు చెప్పేటప్పుడూ?” అని ఎవరన్నా అడగవచ్చు. మామూలు రచయితలకి ఇది అవసరం కాకపోవచ్చు. కానీ మార్కిస్టు దృక్పథంతో రాసే రచయితలకి ఇది చాలా ముఖ్యం.
“జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరాని ఇప్పుడు తప్పుబడుతున్నారు” అని హనుమంతరావు గారి ఉవాచ. 1989 లోనే చేరాని విమర్శిస్తూ రాసిన నా వ్యాసం అంధ్రజ్యోతిలో వచ్చింది, చేరాతకి దగ్గర్లో. దీన్ని బట్టి అర్థమయ్యే దేమంటే, హనుమంతరావు గారికి చాలా విషయాలు తెలియవని. నిజానికి ఎవరికీ అన్నీ తెలియనక్కర్లేదు. అందరూ అన్ని వ్యాసాలూ చదివి వుండక్కర్లేదు. కానీ విమర్శించే వ్యక్తులు ఆ విషయానికి సంబంధించిన విషయాలను తెలుసుకోకుండా ఏమన్నా రాస్తే, అది దూషణగా వుంటుందే తప్ప, విజ్ఞాన పరంగా వుండదు.
ఒకవేళ 1989 లోనే ఆ చేరాతని నేను విమర్శించలేదనుకోండి. నేను రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతిలో రాలేదనుకోండి. అయితే ఏమిటి? ఆ చేరాతని విమర్శించడానికి ఏమన్నా కాల పరిమితి వుంటుందా? దాని కేమన్నా కాల దోషం పడుతుందా? అప్పుడు విమర్శించి వుండక పోయినా, ఇప్పుడు విమర్శించడంలో తప్పేమీ వుండదు. వందల యేళ్ళ కిందటి విషయాలను ఇప్పుడు కూడా విమర్శిస్తూ వుంటాము. ఎందుకని? అవి ఇప్పటి కాల మాన పరిస్థితులకి కూడా వర్తిస్తాయి కాబట్టి.
“ఇన్నేళ్ళ తర్వాత కూడా చేరా తాను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు!” హనుమంతరావు గారి వెటకార ఉవాచ.
అలా నేనన లేదు. హనుమంతరావు గారు ఊహించుకున్నారంతే! అయినా, తాను తప్పు చేశానని చేరా ఎప్పుడూ అనలేదు. హనుమంతరావు గారే అంటున్నారు. తన తప్పుని చెప్పుకుని, వొప్పుకుని, అప్పుడు మంచి విషయం చెప్పడం మాత్రమే సాహిత్య పరంగా సరైన విషయం. తప్పు గురించి ప్రస్తావన లేకుండా, ఓ గొప్ప విషయం చెప్తే, అడిగే వాళ్ళుండరూ? తప్పు గురించి చెప్పకపోతే, అది సాహిత్యపు టెత్తుగడ అవుతుంది మరి!
ఇక కుటుంబరావు గారి విషయంలో కాలాను క్రమణ చూద్దాం:
1. 1937 లో ఆయన “అశోక వనం” కధ రాశారు. అందులో ఆర్య ద్రావిడ ద్వేషాల్ని గ్రహించడం చెప్పారు.
2. 1944 లో ఆయన, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” అనే వ్యాసం రాశారు. దాంట్లో, “రామాయణంలో ఆర్యులూ, అనార్యులూ” గురించి రాశారు.
3. 1945 లో “మార్క్సిజం చదివిం తర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు” అనీ అన్నారు.
4. విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు, “సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంధం కాద”న్నారు.
ఇప్పుడు ఈ విషయాల గురించి ప్రశ్నలు మొదలు పెడదాం.
1. మార్క్సిజం తెలుసుకోక ముందు నేర్చుకున్న విషయాలన్నీ తప్పుగానే వుంటాయా? కొన్నైనా సమాజంలో మంచి విషయాలుగా వుండవా రచయితలకు? మార్క్సిజం చదవని రచయితలెవ్వరూ అభివృద్ధి కరంగా రచనలు చెయ్యలేదా ఎప్పుడూ?
2. 1945 లో మార్క్సిజం చేర్చుకున్నాక, కుటుంబరావు 1937లో రాసిన తన “అశోక వనం” కధనీ, 1944 లో రాసిన తన “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” వ్యాసాన్నీ వ్యతిరేకించారా ఎక్కడన్నా? అలా ఎక్కడా అననప్పుడు, అవి తప్పు విషయాలని ఆయన అనుకున్నారనీ, కాబట్టే 1974-75 లో “రామాయణం ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంధం కాదన్నారనీ” హనుమంతరావు గారు ఎలా నిర్ధారిస్తున్నారూ?
3. “అశొక వనం” కధ తప్పుగా రాశానని దాన్ని ముద్రణ లోంచి తీసేశారా కుటుంబరావు? అలాగే, తన “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” వ్యాసాల్ని కూడా ఉపసంహరించుకున్నారా, కనీసం దిద్దుకుని కొత్త ముందు మాట రాశారా? మరి అలాంటివేమీ జరగనప్పుడు, గురివింద గింజ సామెత ఎందుకు వర్తించదూ?
నేను చేసిన విమర్శలో వున్న ఒకే ఒక్క ముఖ్య విషయం: ఒక రచయిత (రచయిత్రి) ఒకసారి తాను రాసిన దానికి వ్యతిరేకంగా ఇంకో సారి రాస్తే (అదీ తన తప్పును ప్రస్తావించకుండా, దాన్ని దిద్దుకోకుండా), పాఠకులు ప్రశ్నిస్తారనీ, విమర్శిస్తారనీ.
రంగనాయకమ్మ రాసిన విషయాలు గానీ, కుటుంబరావు రాసిన విషయాలు గానీ, చేరా రాసిన విషయాలు గానీ ఇక్కడ చర్చకు తీసుకు రావడం లేదు. అవి అనవసరం ఇక్కడ. కాలాను క్రమంలో వారు తాము రాసిన వాటిని ఎలా, ఎంత స్పష్టంగా, ఎంత డైరెక్టుగా, ఎంత ఓపెన్ గా దిద్దుకున్నారూ, అభివృద్ధి కరంగా కొత్త జ్ఞానంతో కొత్త విషయాలు ఎలా చెప్పారన్నదే పాయింటు. అసలు పాయింటు వదిలేసి ఎంత రాసినా అది పిడకల వేటే అవుతుంది.
గురివింద గింజ మింగినా చైతన్యం రాదు. చక్కెర గుళిక మింగినా చైతన్యం రాదు. నల్ల మందు మింగినా చైతన్యం రాదు. అభివృద్ధి కరమైన సాహిత్య ప్రక్రియల వల్లా, వాటి పఠనాల వల్లా మాత్రమే చైతన్యం వస్తుంది. ఏది మింగాలీ అన్నది ఎవరి కున్న చైతన్యాన్ని బట్టి వారే నిర్థారించు కోవాలి.
– జె. యు. బి. వి. ప్రసాద్
[ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]
బహుశా హేతువాదులుగా మారిన తర్వాత బతుకులో అధ్యాయనాన్ని, మార్పుని సహించరేవో. ఈ నెల కౌముదిలో హేతువాదం మీద ప్రసాదు గారి వ్యాసం చదవండి, పిడివాదవంటే ఏవిటో తెలుస్తుంది.
[ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]
జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరా ని ఇప్పుడు తప్పు పడుతున్నారు కాని రంగనాయకమ్మ “ఇదంతా డిగ్రీల అహంకారమే!” అని చేరా ని ఘాటుగా విమర్శించింది. ఎప్పుడు? 1991 లో. ఇన్నేళ్ళ తర్వాత గూడా చేరా తను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు! ప్రసాద్ గారి ప్రపంచంలో చేరా కి నిష్కృతి లేదు.
“ఇది ఎలా ఉంటుందంటే,” అంటూ మనకి సులభంగా బోధపడటానికన్నట్లు కుటుంబరావుని లాక్కొచ్చారు. చేరా అన్న దానికీ కొకు అన్న దానికీ ఏమిటి లంకె? రంగనాయకమ్మని వేర్వేరు సందర్భాల్లో విమర్శించడం తప్ప.
విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంథం కాదన్నాడు. అన్న తర్వాత “ఆశోక వనం” రాయలేదు – ఆకథ 1937లో వచ్చింది. రామాయణంలో ఆర్యులూ అనార్యులూ గురించి, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం,” అని రాసింది 1944లో. “నా కథా రచన” అన్న వ్యాసంలో తను మార్క్సిజం చదివింతర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు,” (1945) అన్నారు. కాలానుక్రమాన్ని పాటిస్తూ కుటుంబరావుని విమర్శిస్తే సరిగా ఉంటుంది.
కుటుంబరావు రాసిన సమీక్షలో కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి – ఎపిక్ లక్షణాలు, నాటి ఆచార వ్యవహారాలని నేటి విలువలతో అంచనా కట్టటం. వీటికి రంగనాయకమ్మ దీర్ఘమైన ఘాటైన జవాబే ఇచ్చింది. ఇద్దరు చెప్పినవీ కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలే.
లోతుగా పోవడానికి ఎవరికి టైముంది? అని నిరాశ పడొద్దు. వాటి సారాంశాన్నంతా, ప్రసాద్ గారు గురువింద గింజంత చక్కెర గుళికగా ఇచ్చారు. మింగి చైతన్యవంతులమవుదాం.
ఈయనే, ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక చేరాతలో, “కధలూ, నవలలూ రాయటం మీద చాలా అనుభవం ఉన్న ఒక రచయిత్రి వాడుక భాష రాసే పద్ధతి గురించి వ్యాస పరంపర ప్రకటిస్తున్నారు.” అంటూ డొంక తిరుగుడుగా ఒక వ్యాసం రాశారు. అందులో ఆ రచయిత్రి ఎవరో, పేరు ఏమిటో ఎక్కడా లేదు.
మరిప్పుడు ఇలా అంటున్నారు ఆయన.
గురివింద గింజ సామెత గుర్తొస్తూ వుంటుంది ఇలాంటివి చదివి నప్పుడు.
ఇది ఎలా వుంటుందంటే, “రాయాయణం కధ ఏ సామాజిక విషయాల్నీ తెలుగుకోవడానికి పనికి రాదు” అని అన్న కొడవగంటి కుటుంబరావు, “అశోక వనం” అన్న కధ రాసి, ఆ కధ ద్వారా “ఆర్య ద్రావిడ ద్వేషాల్ని గ్రహించడం” చెప్పి, “రామాయణంలో ఆర్యులూ, అనార్యులూ అనే జాతి భేదాలు వున్నట్టు”గా తన వ్యాసాల్లో రాసి, “రామాయణ కధ ఏ సమాజాన్నీ చూపించడానికి పనికి రాదు” అని అనడం లాగా.
ఇలాంటి విషయాలు ఇక పాఠకుల చైతన్యానికి వదిలెయ్యడమే సరైన పద్ధతి.
కవిత్వం లో “నేను” గురించి bollojubaba గారి అభిప్రాయం:
10/01/2008 2:41 am
“నేను” వాడకం అభివ్యక్తి కి అడ్డంకా, లేక ద్విగుణీకృతం చేస్తుందా?
బొల్లోజు బాబా
ఇస్మాయిల్ గారితో నా పరిచయం గురించి bollojubaba గారి అభిప్రాయం:
10/01/2008 2:28 am
ఇస్మాయిల్ గారిని మరలా గుర్తుచేసారు. ఈ హేంగోవర్ కొంతకాలం తప్పదు తీయగా అనుభవించాల్సిందే.
బొల్లోజు బాబా
కవిత్వంలో అనూహ్యత గురించి bollojubaba గారి అభిప్రాయం:
10/01/2008 1:11 am
అద్బుతమైన వ్యాసము
బొల్లోజు బాబా
తెలుగు సినిమాలు స్త్రీ గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
09/29/2008 7:18 pm
కొడవళ్ళ హనుమంతరావు గారి “చక్కెర గుళిక” చదివాను. “ఆర్టిఫిషియల్ స్వీట్ నర్” అనే అనిపించింది. ఒక విమర్శకి ఎంత డొంక తిరుగుడుగా జవాబు రాయొచ్చో కూడా తెలిసింది.
మొదటగా చేరాకీ, కుటుంబరావుకీ నా విమర్శలో వున్న లంకె ఏమిటీ అని చూద్దాం.
హనుమంతరావు గారి దృష్టిలో అది, “ఆ రచయితలిద్దరూ రంగనాయకమ్మని విమర్శించడం!”. సరే! వదిలేద్దాం! ఎవరి తెలివి తేటలని బట్టి వారికి అర్థమవుతుంది మరి. నిజానికి అసలు లంకె ఏమిటీ? ఆ ఇద్దరు రచయితలూ తాము ఒకలా రాసి, కొంత కాలం పోయాక దాని ప్రసక్తి లేకుండా వేరేలా రాశారు. అప్పుడు అది పరిణామ క్రమం అవదు. వెనుక చేసిన తప్పులను దిద్దుకుంటూ, వాటి గురించి ప్రస్తావిస్తూ, కొత్త విషయాల గురించి రాస్తే, అందులో వున్న అభివృద్ధి అర్థం అవుతుంది. కానీ అలా రాయడం రచయితలకెంత మింగుడు పడని విషయమో, వారి సమర్థకులకూ అంతే మింగుడు పడని విషయం. కాబట్టి ఆ రచయితలు గురివింద గింజల్లా, తాము రాసిన నలుపుని పట్టించుకోకుండా, గొప్పగా రాస్తారు. వారి సమర్థకులు ఆ గురివింద గింజల్ని చక్కెర గుళికల్లా భావించి సేవిస్తారు. మనల్ని కూడా సేవించ మంటారు. ఎవరి చైతన్యం వారిది మరి!
ఒకే విషయంలో ఒకేలా ప్రవర్తించిన ఇద్దరు రచయితల గురించి ప్రస్తావిస్తే, వాటికి లంకేమిటీ అని అడుగుతున్న హనుమంతరావు గారి అమాయక ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు.
“రంగనాయకమ్మ చేరాని ఎప్పుడు, ఏమని విమర్శించారూ” అన్న విషయం ఇక్కడ అసందర్భం. చేరా కూడా ఎటువంటి విమర్శలతో జవాబిచ్చారూ అన్నది కూడా వేరే విషయం.
హనుమంతరావు గారు చెప్పినట్టే, కాలాను క్రమణ చూడండి.
1. 1989 లో చేరా “వెటకారం వాద పద్ధతి కాదు” అనే వ్యాసం రాశారు. అందులో నేను చెప్పినట్టుగా, రచయిత్రి పేరు లేకుండా వ్యాసం అంతా రాశారు.
2. రంగనాయకమ్మ గారు చేరాని విమర్శించారు అని అన్నది 1991 లో. అంటే రెండేళ్ళు జవాబివ్వకుండా రంగనాయకమ్మ వూరుకున్నారా? “వాడుక భాషే రాస్తున్నామా?” అనే పుస్తకం 1990 లోనే బయటికి వచ్చేసింది. అందులోనే చేరాకి కావల్సిన సమాధానాలున్నాయి.
3. “చేరాత మీద ఓ విమర్శ” అనే పేరుతో 1989 లోనే నేను ఆంధ్రజ్యోతి లో ఒక వ్యాసం కూడా రాశాను.
ఈ వివరాల్ని బట్టి చూస్తే, ఏం తెలుస్తోందీ? హనుమంతరావు గారి కాలాను క్రమణ సరిగా లేదనీ, అర్థం పర్థం లేకుండా వుందనీ!
ఈ విషయంలో నా విమర్శ ఏమిటీ? చేరా ఒకసారి తప్పుగా రాశారు కాబట్టి, ఇక ఆయనకి “నిష్కృతి” లేదనా? మరి హనుమంతరావు గారికి అలాగే అర్థం అయింది మరి.
నిజానికి అది నా విమర్శ కానే కాదు. చేరా ఒకప్పుడు తాను ఆ తప్పు చేశాననీ, అది సరైనది కాదనీ, విపులంగా వ్యాసాలు రాసేటప్పుడు పేర్లతో స్పష్టంగా రాయడమే కరెక్టు పద్ధతి అనీ రాస్తే, ఒప్పుకోని దెవరు? అలా చెయ్యకుండా, గతంలో తాను రాసిన విషయాల్ని వదిలేసి, కొత్తగా వ్యతిరేక విషయం చెబితే, అదెంత గొప్ప విషయమైనా పాఠకులు ప్రశ్నలు అడుగుతారూ, విమర్శిస్తారూ. దబాయింపులు విమర్శని నొక్కెయ్య లేవు.
ఇక్కడ ఓ ముఖ్య విషయం. “రచయితలు గతంలో తాము తప్పుగా చెప్పిన విషయాల్ని దిద్దుబాట్లతో చెప్పాలా కొత్తగా నేర్చుకున్న జ్ఞానంతో మంచి విషయాలు చెప్పేటప్పుడూ?” అని ఎవరన్నా అడగవచ్చు. మామూలు రచయితలకి ఇది అవసరం కాకపోవచ్చు. కానీ మార్కిస్టు దృక్పథంతో రాసే రచయితలకి ఇది చాలా ముఖ్యం.
“జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరాని ఇప్పుడు తప్పుబడుతున్నారు” అని హనుమంతరావు గారి ఉవాచ. 1989 లోనే చేరాని విమర్శిస్తూ రాసిన నా వ్యాసం అంధ్రజ్యోతిలో వచ్చింది, చేరాతకి దగ్గర్లో. దీన్ని బట్టి అర్థమయ్యే దేమంటే, హనుమంతరావు గారికి చాలా విషయాలు తెలియవని. నిజానికి ఎవరికీ అన్నీ తెలియనక్కర్లేదు. అందరూ అన్ని వ్యాసాలూ చదివి వుండక్కర్లేదు. కానీ విమర్శించే వ్యక్తులు ఆ విషయానికి సంబంధించిన విషయాలను తెలుసుకోకుండా ఏమన్నా రాస్తే, అది దూషణగా వుంటుందే తప్ప, విజ్ఞాన పరంగా వుండదు.
ఒకవేళ 1989 లోనే ఆ చేరాతని నేను విమర్శించలేదనుకోండి. నేను రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతిలో రాలేదనుకోండి. అయితే ఏమిటి? ఆ చేరాతని విమర్శించడానికి ఏమన్నా కాల పరిమితి వుంటుందా? దాని కేమన్నా కాల దోషం పడుతుందా? అప్పుడు విమర్శించి వుండక పోయినా, ఇప్పుడు విమర్శించడంలో తప్పేమీ వుండదు. వందల యేళ్ళ కిందటి విషయాలను ఇప్పుడు కూడా విమర్శిస్తూ వుంటాము. ఎందుకని? అవి ఇప్పటి కాల మాన పరిస్థితులకి కూడా వర్తిస్తాయి కాబట్టి.
“ఇన్నేళ్ళ తర్వాత కూడా చేరా తాను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు!” హనుమంతరావు గారి వెటకార ఉవాచ.
అలా నేనన లేదు. హనుమంతరావు గారు ఊహించుకున్నారంతే! అయినా, తాను తప్పు చేశానని చేరా ఎప్పుడూ అనలేదు. హనుమంతరావు గారే అంటున్నారు. తన తప్పుని చెప్పుకుని, వొప్పుకుని, అప్పుడు మంచి విషయం చెప్పడం మాత్రమే సాహిత్య పరంగా సరైన విషయం. తప్పు గురించి ప్రస్తావన లేకుండా, ఓ గొప్ప విషయం చెప్తే, అడిగే వాళ్ళుండరూ? తప్పు గురించి చెప్పకపోతే, అది సాహిత్యపు టెత్తుగడ అవుతుంది మరి!
ఇక కుటుంబరావు గారి విషయంలో కాలాను క్రమణ చూద్దాం:
1. 1937 లో ఆయన “అశోక వనం” కధ రాశారు. అందులో ఆర్య ద్రావిడ ద్వేషాల్ని గ్రహించడం చెప్పారు.
2. 1944 లో ఆయన, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” అనే వ్యాసం రాశారు. దాంట్లో, “రామాయణంలో ఆర్యులూ, అనార్యులూ” గురించి రాశారు.
3. 1945 లో “మార్క్సిజం చదివిం తర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు” అనీ అన్నారు.
4. విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు, “సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంధం కాద”న్నారు.
ఇప్పుడు ఈ విషయాల గురించి ప్రశ్నలు మొదలు పెడదాం.
1. మార్క్సిజం తెలుసుకోక ముందు నేర్చుకున్న విషయాలన్నీ తప్పుగానే వుంటాయా? కొన్నైనా సమాజంలో మంచి విషయాలుగా వుండవా రచయితలకు? మార్క్సిజం చదవని రచయితలెవ్వరూ అభివృద్ధి కరంగా రచనలు చెయ్యలేదా ఎప్పుడూ?
2. 1945 లో మార్క్సిజం చేర్చుకున్నాక, కుటుంబరావు 1937లో రాసిన తన “అశోక వనం” కధనీ, 1944 లో రాసిన తన “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” వ్యాసాన్నీ వ్యతిరేకించారా ఎక్కడన్నా? అలా ఎక్కడా అననప్పుడు, అవి తప్పు విషయాలని ఆయన అనుకున్నారనీ, కాబట్టే 1974-75 లో “రామాయణం ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంధం కాదన్నారనీ” హనుమంతరావు గారు ఎలా నిర్ధారిస్తున్నారూ?
3. “అశొక వనం” కధ తప్పుగా రాశానని దాన్ని ముద్రణ లోంచి తీసేశారా కుటుంబరావు? అలాగే, తన “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” వ్యాసాల్ని కూడా ఉపసంహరించుకున్నారా, కనీసం దిద్దుకుని కొత్త ముందు మాట రాశారా? మరి అలాంటివేమీ జరగనప్పుడు, గురివింద గింజ సామెత ఎందుకు వర్తించదూ?
నేను చేసిన విమర్శలో వున్న ఒకే ఒక్క ముఖ్య విషయం: ఒక రచయిత (రచయిత్రి) ఒకసారి తాను రాసిన దానికి వ్యతిరేకంగా ఇంకో సారి రాస్తే (అదీ తన తప్పును ప్రస్తావించకుండా, దాన్ని దిద్దుకోకుండా), పాఠకులు ప్రశ్నిస్తారనీ, విమర్శిస్తారనీ.
రంగనాయకమ్మ రాసిన విషయాలు గానీ, కుటుంబరావు రాసిన విషయాలు గానీ, చేరా రాసిన విషయాలు గానీ ఇక్కడ చర్చకు తీసుకు రావడం లేదు. అవి అనవసరం ఇక్కడ. కాలాను క్రమంలో వారు తాము రాసిన వాటిని ఎలా, ఎంత స్పష్టంగా, ఎంత డైరెక్టుగా, ఎంత ఓపెన్ గా దిద్దుకున్నారూ, అభివృద్ధి కరంగా కొత్త జ్ఞానంతో కొత్త విషయాలు ఎలా చెప్పారన్నదే పాయింటు. అసలు పాయింటు వదిలేసి ఎంత రాసినా అది పిడకల వేటే అవుతుంది.
గురివింద గింజ మింగినా చైతన్యం రాదు. చక్కెర గుళిక మింగినా చైతన్యం రాదు. నల్ల మందు మింగినా చైతన్యం రాదు. అభివృద్ధి కరమైన సాహిత్య ప్రక్రియల వల్లా, వాటి పఠనాల వల్లా మాత్రమే చైతన్యం వస్తుంది. ఏది మింగాలీ అన్నది ఎవరి కున్న చైతన్యాన్ని బట్టి వారే నిర్థారించు కోవాలి.
– జె. యు. బి. వి. ప్రసాద్
[ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]
తెలుగు సినిమాలు స్త్రీ గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
09/29/2008 1:33 pm
చాలా బాగ వ్రాశారండీ హనుమంత రావు గారు.
బహుశా హేతువాదులుగా మారిన తర్వాత బతుకులో అధ్యాయనాన్ని, మార్పుని సహించరేవో. ఈ నెల కౌముదిలో హేతువాదం మీద ప్రసాదు గారి వ్యాసం చదవండి, పిడివాదవంటే ఏవిటో తెలుస్తుంది.
[ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]
“చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/29/2008 8:40 am
బి. విశ్వనాథరెడ్డిగారు చందమామను గురించి చెప్పిన విశేషాలు సెప్టెంబర్, 28 ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో చదవవచ్చు.
తెలుగు సినిమాలు స్త్రీ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/28/2008 2:24 pm
గురివింద గింజ, చక్కెర గుళిక
జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరా ని ఇప్పుడు తప్పు పడుతున్నారు కాని రంగనాయకమ్మ “ఇదంతా డిగ్రీల అహంకారమే!” అని చేరా ని ఘాటుగా విమర్శించింది. ఎప్పుడు? 1991 లో. ఇన్నేళ్ళ తర్వాత గూడా చేరా తను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు! ప్రసాద్ గారి ప్రపంచంలో చేరా కి నిష్కృతి లేదు.
“ఇది ఎలా ఉంటుందంటే,” అంటూ మనకి సులభంగా బోధపడటానికన్నట్లు కుటుంబరావుని లాక్కొచ్చారు. చేరా అన్న దానికీ కొకు అన్న దానికీ ఏమిటి లంకె? రంగనాయకమ్మని వేర్వేరు సందర్భాల్లో విమర్శించడం తప్ప.
విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంథం కాదన్నాడు. అన్న తర్వాత “ఆశోక వనం” రాయలేదు – ఆకథ 1937లో వచ్చింది. రామాయణంలో ఆర్యులూ అనార్యులూ గురించి, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం,” అని రాసింది 1944లో. “నా కథా రచన” అన్న వ్యాసంలో తను మార్క్సిజం చదివింతర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు,” (1945) అన్నారు. కాలానుక్రమాన్ని పాటిస్తూ కుటుంబరావుని విమర్శిస్తే సరిగా ఉంటుంది.
కుటుంబరావు రాసిన సమీక్షలో కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి – ఎపిక్ లక్షణాలు, నాటి ఆచార వ్యవహారాలని నేటి విలువలతో అంచనా కట్టటం. వీటికి రంగనాయకమ్మ దీర్ఘమైన ఘాటైన జవాబే ఇచ్చింది. ఇద్దరు చెప్పినవీ కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలే.
లోతుగా పోవడానికి ఎవరికి టైముంది? అని నిరాశ పడొద్దు. వాటి సారాంశాన్నంతా, ప్రసాద్ గారు గురువింద గింజంత చక్కెర గుళికగా ఇచ్చారు. మింగి చైతన్యవంతులమవుదాం.
కొడవళ్ళ హనుమంతరావు
తెలుగు సినిమాలు స్త్రీ గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
09/27/2008 10:34 am
చేరా అలా అన్నారా? అచ్చో చ్చొ చ్చొ చ్చొ!
ఈయనే, ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక చేరాతలో, “కధలూ, నవలలూ రాయటం మీద చాలా అనుభవం ఉన్న ఒక రచయిత్రి వాడుక భాష రాసే పద్ధతి గురించి వ్యాస పరంపర ప్రకటిస్తున్నారు.” అంటూ డొంక తిరుగుడుగా ఒక వ్యాసం రాశారు. అందులో ఆ రచయిత్రి ఎవరో, పేరు ఏమిటో ఎక్కడా లేదు.
మరిప్పుడు ఇలా అంటున్నారు ఆయన.
గురివింద గింజ సామెత గుర్తొస్తూ వుంటుంది ఇలాంటివి చదివి నప్పుడు.
ఇది ఎలా వుంటుందంటే, “రాయాయణం కధ ఏ సామాజిక విషయాల్నీ తెలుగుకోవడానికి పనికి రాదు” అని అన్న కొడవగంటి కుటుంబరావు, “అశోక వనం” అన్న కధ రాసి, ఆ కధ ద్వారా “ఆర్య ద్రావిడ ద్వేషాల్ని గ్రహించడం” చెప్పి, “రామాయణంలో ఆర్యులూ, అనార్యులూ అనే జాతి భేదాలు వున్నట్టు”గా తన వ్యాసాల్లో రాసి, “రామాయణ కధ ఏ సమాజాన్నీ చూపించడానికి పనికి రాదు” అని అనడం లాగా.
ఇలాంటి విషయాలు ఇక పాఠకుల చైతన్యానికి వదిలెయ్యడమే సరైన పద్ధతి.
జె. యు. బి. వి. ప్రసాద్
చంద్రోదయం గురించి M S Naidu గారి అభిప్రాయం:
09/26/2008 11:41 pm
chandrodayam is as delicate as its coming.
Thank you.
ఈమాట గురించి గురించి essemCHELLURI గారి అభిప్రాయం:
09/26/2008 9:19 pm
మీ పత్రిక పదిమందికి ఉపయోగపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.