సినిమాల గురించి రాయడానికి నాకు కనీస అర్హత గూడా లేదు. అయినా దీంట్లో ఇతరులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉంటుందనే ఆశ. ఇది మంచి వ్యాసం. అయిటే దీంట్లో ఉన్న పెద్ద లోపం – విమర్శించిన సినిమాల పేర్లు మన ఊహకి వదిలెయ్యడం!
చలసాని ప్రసాద్ “సాహిత్య వ్యాసాలు” కి చేరా ఇచ్చిన కితాబు మొన్ననే చదివాను. చివర్లో చేరా అన్న మాటలు గుర్తొచ్చాయి:
“కొందరు తెలుగు రచయితల కున్న ఒక జబ్బు ప్రసాదులో కూడా నాకు నచ్చలేదు. విరసం చరిత్ర అనే వ్యాసంలో మొదటి పేరాలో ఒక పత్రిక రాసింది అంటాడు. ఆ పత్రిక పేరు ఎందుకు చెప్పకూడదు? తెరవెనుక కన్యాశుల్కం అనే వ్యాసంలో మొదటే ఒక పారశీక కవి అంటాడు. ఎవరా పారశీక కవి? ఒక వ్యాసంలో పేరు చెప్పకుండా ఒక వార పత్రిక అంటాడు. అదే వ్యాసం చివర కొన్ని ఎలుకలూ, పిల్లులూ అంటాడు. ఎవరీ పిల్లులు, ఎలుకలూ?”
అర్థంలేని మర్యాదలకీ, ముసుగులో గుద్దులాటలకీ తెలుగు రచయితలు స్వస్తి చెప్పాలి.
పోయినేడు రచ్చబండలో ఒకరు అడిగారు – దాశరథి రంగాచార్య నవల “చిల్లర దేవుళ్ళు” కి ముందుమాట రాసిన “రహి” ఎవరు? అని. హరిగా “ప్రసిద్ధి” గాంచిన సూరపనేని హరిపురుషోత్తమరావు అన్నారు నవోదయ రామమోహనరావు. ఆపేరు వినడం నాకదే మొదటిసారి. ఆయన రచనల కోసం వెతికితే ఏమీ కనబడలేదు.. ఇంతలో “హరి” చనిపోయారు. “విభిన్న” పేరిట ఆయన రచనలని కొన్నిటిని ఇటివలే పర్స్పెక్టివ్ వాళ్ళు ప్రచురించారు.
సినిమా, సాహిత్యం ఆయనకి ఇష్టమైన రంగాలు. నాటి రఘుపతి వెంకయ్య మొదలు నేటి రామానాయుడు దాకా, మన సినిమాలలో కథానాయిక పాత్రలో పెద్ద మార్పేమీ లేదు. ఏమిటా పాత్ర అంటే పతివ్రత పాత్ర! “పొందిగ్గా చీరకట్టుకుని, సూర్యబింబం లాంటి బొట్టుపెట్టుకుని, భర్తగారి సేవకూ, అత్తమామల ఊడిగానికీ అంకితమైన ఆదర్శ భారతనారి” కి మించి స్త్రీ కి వేరే వ్యక్తిత్వం ఉన్న పాత్రలు దాదాపు శూన్యం అంటారాయన.
చివరగా, పోయిన ఆదివారం డెట్రాయిట్ లో జరిగిన సాహితీ సభలో, “నడిచే విజ్ఞానసర్వస్వం” గా పేరున్న పరుచూరి శ్రీనివాస్ మన సినిమా చరిత్ర మీద సాధికారికమైన ప్రసంగమిచ్చారు. కొన్ని PhD లకి సరిపడా ముడిసరుకు పరుచూరి దగ్గరుంది – వాడుకునే వాళ్ళుంటే. 1987 తర్వాత వచ్చిన తెలుగు సినిమాలేవీ చూడలేదన్నారాయన. ఎందుకో మన ఊహకి వదిలేద్దాం.
ఔరంగజేబు సంగతి వొదిలెయ్యొచ్చేమో, కానీ ఆయన చెప్పినవి పెరుగన్నం మూటలు. అర్థం పర్థం లేని విషయాలు పిల్లలకి చెప్పడం. అవి వాళ్ళు కంఠతా పట్టలేదని బాధపడ్డం ఇప్పుడే అనుకుంటున్నాను. అప్పట్లో కూడానా?
కొమర్రాజు లక్ష్మణరావు గారు పడ్డ బాధ, ఇప్పటికీ వుండడం ఆశ్చర్యం కలిగించీ విషయం.
ఔరంగజేబు గురువులు, ఈ తరంలో “యూనివెర్సిటీల్లో” కుదురుకున్నారు కాబోలు.
అయితే, ఈ బాధ పరాయి పాలనలో వున్న దేశాలకి ఎక్కువేమో?
స్వధర్మో నిధనం శ్రేయః/పరధర్మో భయావహః అన్నది వొప్పుకుందావంటే, కాలంతో పాటూ మారిపోయీ ధర్మాన్ని పట్టుకోడం మామూలు గురువుల తరం కాదు.
కొమర్రాజు లక్ష్మణరావుగారి పుణ్యవాఁని, ఒకటి ఋజువైపోయింది, పిల్లలు విశ్వనాథ వారి వేయిపడగలూ, శ్రీశ్రీ మహాప్రస్థానం కంఠతా పెట్టినా పనికిరారని తెలిసిపోయింది. మా పిల్లలకి అ ఆ లూ, ఒంట్లూ, వాటికన్నా ముందుగా,”ఎందుకు? ఎక్కడ? ఎలా? ఎప్పుడు?” అని “క్రొశ్నించడం” మాత్రం నేర్పుతాను.
కొడవళ్ళ వారికి,
కుటుంబరావుగారి రచనా ప్రపంచం వస్తుందన్న ఆనందం, నిజంగా ఆనందవేఁ.
మాకందరికీ, ఇవాల్టికికూడా, మమ్మల్ని వుధ్ధరించడానికి, ఆలోచన రేకెత్తించే అక్షరం వస్తోందంటే, ” దేవ దేవ రమ్ము, కావుమయ్య మమ్ము” అని చిన్నప్పుడు చదువుకున్న పెద్దబాలశిక్ష మళ్ళీ చదువుకుంటున్నాం.
“ఆయన” పుస్తకాలు, outdated అయిపోలేదు. అందుకు కారణం మేవేఁ. మేం మారం గాక మారం. అది మా దగుల్బాజీతనవేఁనని నా నమ్మకం. ఈసారైనా “ఆయన” అక్షరాలు, మాలో కొంతమందినైనా వుధ్ధరించాలని ఆశిస్తున్నాను.
అయితే, “ఆయన” పేర సభలకీ మిగతావాటికీ తగలెట్టే ధనాన్ని, ఆయొక్క సభలకీ గట్రాలకీ తగలెట్టకుండా, “బోల్డు” పుస్తకాలూ అచ్చేసి, “ప్రెపెంచెం” మీదకొదిలేస్తే, “అ, ఆ” లు నేర్చుకొనేవాళ్ళు, ఆలోచింపచేసే “అ, ఆ” లని నేర్చుకుంటారు.
అదేకదా “ఆయనకి” కావల్సింది. అదేకదా కాళిదాసుకి మల్లినాధసూరి చేసింది.
రోహిణీ ప్రసాద్ గారికి,
పాలూ నీళ్ళూ వేరు చేసీసేరు. ఖచ్చితంగా చెప్పేరు.
అయితే, పడక్కుర్చీ విమర్శకుల విలువ, informed (?) public opinion, సాహిత్య సేవ, ఎక్కువ తక్కువలయినా, ఎలాగో విపులీకరించి విశ్లేషించాలి దయచేసి.
కొడవళ్ళ హనుమంతరావు గారికి,
“ఎడ్మెంటు” సంగతి వదిలెయ్యండి. అది మీరెవరూ చూసే చాన్సు లేదు.మీకు చికాకు కలిగించినట్టు రాయడం నా చేతకాని తనం. “శ్రధ్ధ” “సబూరి” లేకపోతే ఇన్ని ఇబ్బందులు.మొదటి సారి రాసినపుడు, సరిగ్గా రాయలేకపోడానికి, కర్ణుడి చావుకున్న కారణాల్లా లక్షాతొంభైయున్నాయి. వాటినొదిలెయ్యండి.
క్షమించాలి.
రోహిణీ ప్రసాదు గారు సరిగ్గా పట్టీసేరు. అదే నా “ప్రెశ్న”?
ఖానా గట్టు మీద బీడీలు కాల్చుకుంటూ “ప్రెపెంచకాన్ని” గుప్పు గుప్పు మని విమర్శంచడం రైటేనా? ఖానా గట్ల గురించి, సందేహం వుంటే, భైరవభట్ల వారు పూర్తిగా తీర్చగలరు. బీడీల గురించి సందేహంవుంటే, నాలాటి వాడెవడైనా తీర్చగలడని అనుకుంటున్నాను.సాఫ్ సాఫ్ గా అడుగుతున్నాను. ఎవరైనా ఎందుకు రాయాలి? ఎందుకు రాస్తారు?
రజనీ గారడిగిన ప్రశ్నకి చలం గారు సమాధానమిస్తూAIR ఇంటర్వ్యూలో:
“నన్ను, నాలో ఏఏ మచ్చలున్నాయో, వాటిని నేను గట్టిగా తిట్టుకోడంతో, వాటిని గట్టిగా గోక్కోడంలో, ఆ పుస్తకాలు-నేను వ్రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి. అవి మిమ్మల్ని అనుకుని మీరు చాలా కోప్పడ్డారు. మిమ్మల్ని కాదు- నన్ను నేను తిట్టు కున్నది.”
ఇందుకేనా రాస్తారు? ఇందుకేనా రాయాలి? ఇలా రాయకపోతే విమర్శకులు “కోర్ కోర్ శరణు కోర్” అని గగ్గోలెట్టడం రైటేనా? అలా గగ్గోలెట్టకపోతే తప్పా?
ఈ మాట రచయిత(త్రు)లకీ, అభిప్రాయాలు రాసీవాళ్ళకీ వున్న సుఖం మిగిలిన పత్రికలకి రాసీ వాళ్ళకి లేదు. మా బతుకులు మేం బతుకుతూ, తీరికున్నపుడు “బాగా రాసేరు” అని అభిప్రాయమ్ముక్క పడేస్తే ఈ మాట వాళ్ళు, చక్కగా వేస్తారు. కొంపదీసి ఇదా సాహిత్య సేవ?
తెలుగు సినిమాలు స్త్రీ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/26/2008 9:00 pm
సినిమాల గురించి రాయడానికి నాకు కనీస అర్హత గూడా లేదు. అయినా దీంట్లో ఇతరులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉంటుందనే ఆశ. ఇది మంచి వ్యాసం. అయిటే దీంట్లో ఉన్న పెద్ద లోపం – విమర్శించిన సినిమాల పేర్లు మన ఊహకి వదిలెయ్యడం!
చలసాని ప్రసాద్ “సాహిత్య వ్యాసాలు” కి చేరా ఇచ్చిన కితాబు మొన్ననే చదివాను. చివర్లో చేరా అన్న మాటలు గుర్తొచ్చాయి:
“కొందరు తెలుగు రచయితల కున్న ఒక జబ్బు ప్రసాదులో కూడా నాకు నచ్చలేదు. విరసం చరిత్ర అనే వ్యాసంలో మొదటి పేరాలో ఒక పత్రిక రాసింది అంటాడు. ఆ పత్రిక పేరు ఎందుకు చెప్పకూడదు? తెరవెనుక కన్యాశుల్కం అనే వ్యాసంలో మొదటే ఒక పారశీక కవి అంటాడు. ఎవరా పారశీక కవి? ఒక వ్యాసంలో పేరు చెప్పకుండా ఒక వార పత్రిక అంటాడు. అదే వ్యాసం చివర కొన్ని ఎలుకలూ, పిల్లులూ అంటాడు. ఎవరీ పిల్లులు, ఎలుకలూ?”
అర్థంలేని మర్యాదలకీ, ముసుగులో గుద్దులాటలకీ తెలుగు రచయితలు స్వస్తి చెప్పాలి.
పోయినేడు రచ్చబండలో ఒకరు అడిగారు – దాశరథి రంగాచార్య నవల “చిల్లర దేవుళ్ళు” కి ముందుమాట రాసిన “రహి” ఎవరు? అని. హరిగా “ప్రసిద్ధి” గాంచిన సూరపనేని హరిపురుషోత్తమరావు అన్నారు నవోదయ రామమోహనరావు. ఆపేరు వినడం నాకదే మొదటిసారి. ఆయన రచనల కోసం వెతికితే ఏమీ కనబడలేదు.. ఇంతలో “హరి” చనిపోయారు. “విభిన్న” పేరిట ఆయన రచనలని కొన్నిటిని ఇటివలే పర్స్పెక్టివ్ వాళ్ళు ప్రచురించారు.
సినిమా, సాహిత్యం ఆయనకి ఇష్టమైన రంగాలు. నాటి రఘుపతి వెంకయ్య మొదలు నేటి రామానాయుడు దాకా, మన సినిమాలలో కథానాయిక పాత్రలో పెద్ద మార్పేమీ లేదు. ఏమిటా పాత్ర అంటే పతివ్రత పాత్ర! “పొందిగ్గా చీరకట్టుకుని, సూర్యబింబం లాంటి బొట్టుపెట్టుకుని, భర్తగారి సేవకూ, అత్తమామల ఊడిగానికీ అంకితమైన ఆదర్శ భారతనారి” కి మించి స్త్రీ కి వేరే వ్యక్తిత్వం ఉన్న పాత్రలు దాదాపు శూన్యం అంటారాయన.
చివరగా, పోయిన ఆదివారం డెట్రాయిట్ లో జరిగిన సాహితీ సభలో, “నడిచే విజ్ఞానసర్వస్వం” గా పేరున్న పరుచూరి శ్రీనివాస్ మన సినిమా చరిత్ర మీద సాధికారికమైన ప్రసంగమిచ్చారు. కొన్ని PhD లకి సరిపడా ముడిసరుకు పరుచూరి దగ్గరుంది – వాడుకునే వాళ్ళుంటే. 1987 తర్వాత వచ్చిన తెలుగు సినిమాలేవీ చూడలేదన్నారాయన. ఎందుకో మన ఊహకి వదిలేద్దాం.
కొడవళ్ళ హనుమంతరావు
ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి baabjeelu గారి అభిప్రాయం:
09/26/2008 8:14 am
ఔరంగజేబు సంగతి వొదిలెయ్యొచ్చేమో, కానీ ఆయన చెప్పినవి పెరుగన్నం మూటలు. అర్థం పర్థం లేని విషయాలు పిల్లలకి చెప్పడం. అవి వాళ్ళు కంఠతా పట్టలేదని బాధపడ్డం ఇప్పుడే అనుకుంటున్నాను. అప్పట్లో కూడానా?
కొమర్రాజు లక్ష్మణరావు గారు పడ్డ బాధ, ఇప్పటికీ వుండడం ఆశ్చర్యం కలిగించీ విషయం.
ఔరంగజేబు గురువులు, ఈ తరంలో “యూనివెర్సిటీల్లో” కుదురుకున్నారు కాబోలు.
అయితే, ఈ బాధ పరాయి పాలనలో వున్న దేశాలకి ఎక్కువేమో?
స్వధర్మో నిధనం శ్రేయః/పరధర్మో భయావహః అన్నది వొప్పుకుందావంటే, కాలంతో పాటూ మారిపోయీ ధర్మాన్ని పట్టుకోడం మామూలు గురువుల తరం కాదు.
కొమర్రాజు లక్ష్మణరావుగారి పుణ్యవాఁని, ఒకటి ఋజువైపోయింది, పిల్లలు విశ్వనాథ వారి వేయిపడగలూ, శ్రీశ్రీ మహాప్రస్థానం కంఠతా పెట్టినా పనికిరారని తెలిసిపోయింది. మా పిల్లలకి అ ఆ లూ, ఒంట్లూ, వాటికన్నా ముందుగా,”ఎందుకు? ఎక్కడ? ఎలా? ఎప్పుడు?” అని “క్రొశ్నించడం” మాత్రం నేర్పుతాను.
గుప్పెడంత మనసు గురించి essem.chelluru గారి అభిప్రాయం:
09/25/2008 3:38 am
చాలా బాగుంది. చాలా అవసరము కూడా.
నాన్నగారు కట్టిన ఇల్లు గురించి vasu M.S.C. గారి అభిప్రాయం:
09/25/2008 2:34 am
మీ ఇంటి కథ బాగుంది. ఇల్లు కట్టడము ఎంత గొప్పో చెప్పారు.
తెలుగు సినిమాలు స్త్రీ గురించి murali గారి అభిప్రాయం:
09/24/2008 9:03 pm
సినిమాలపై మీ అభిప్రాయం చాలా బాగుంది. మనది హిపోక్రసీ సమాజం. వాస్తవాల టోన్ సినిమాలు తీస్తే చూసేది యెవరు? మీ ఆవేదనాపూరితమైన అభిప్రాయం బాగుంది. – మురళి.
కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? గురించి baabjeelu గారి అభిప్రాయం:
09/24/2008 8:59 am
కొడవళ్ళ వారికి,
కుటుంబరావుగారి రచనా ప్రపంచం వస్తుందన్న ఆనందం, నిజంగా ఆనందవేఁ.
మాకందరికీ, ఇవాల్టికికూడా, మమ్మల్ని వుధ్ధరించడానికి, ఆలోచన రేకెత్తించే అక్షరం వస్తోందంటే, ” దేవ దేవ రమ్ము, కావుమయ్య మమ్ము” అని చిన్నప్పుడు చదువుకున్న పెద్దబాలశిక్ష మళ్ళీ చదువుకుంటున్నాం.
“ఆయన” పుస్తకాలు, outdated అయిపోలేదు. అందుకు కారణం మేవేఁ. మేం మారం గాక మారం. అది మా దగుల్బాజీతనవేఁనని నా నమ్మకం. ఈసారైనా “ఆయన” అక్షరాలు, మాలో కొంతమందినైనా వుధ్ధరించాలని ఆశిస్తున్నాను.
అయితే, “ఆయన” పేర సభలకీ మిగతావాటికీ తగలెట్టే ధనాన్ని, ఆయొక్క సభలకీ గట్రాలకీ తగలెట్టకుండా, “బోల్డు” పుస్తకాలూ అచ్చేసి, “ప్రెపెంచెం” మీదకొదిలేస్తే, “అ, ఆ” లు నేర్చుకొనేవాళ్ళు, ఆలోచింపచేసే “అ, ఆ” లని నేర్చుకుంటారు.
అదేకదా “ఆయనకి” కావల్సింది. అదేకదా కాళిదాసుకి మల్లినాధసూరి చేసింది.
ఈమాట గురించి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/23/2008 6:24 pm
నా మునుపటి కామెంటులో ఈ కింది వాక్యం పొరపాటున ఎగిరిపోయింది. క్షమించాలి:
‘ఈమాటలో రాస్తున్నవారూ, కామెంట్లు చేస్తున్నవారూ ఎక్కువగా తెలుగు మీది అభిమానంతో రాస్తున్నవారే’.
ఈమాట గురించి గురించి baabjeelu గారి అభిప్రాయం:
09/23/2008 9:12 am
రోహిణీ ప్రసాద్ గారికి,
పాలూ నీళ్ళూ వేరు చేసీసేరు. ఖచ్చితంగా చెప్పేరు.
అయితే, పడక్కుర్చీ విమర్శకుల విలువ, informed (?) public opinion, సాహిత్య సేవ, ఎక్కువ తక్కువలయినా, ఎలాగో విపులీకరించి విశ్లేషించాలి దయచేసి.
కొడవళ్ళ హనుమంతరావు గారికి,
“ఎడ్మెంటు” సంగతి వదిలెయ్యండి. అది మీరెవరూ చూసే చాన్సు లేదు.మీకు చికాకు కలిగించినట్టు రాయడం నా చేతకాని తనం. “శ్రధ్ధ” “సబూరి” లేకపోతే ఇన్ని ఇబ్బందులు.మొదటి సారి రాసినపుడు, సరిగ్గా రాయలేకపోడానికి, కర్ణుడి చావుకున్న కారణాల్లా లక్షాతొంభైయున్నాయి. వాటినొదిలెయ్యండి.
క్షమించాలి.
రోహిణీ ప్రసాదు గారు సరిగ్గా పట్టీసేరు. అదే నా “ప్రెశ్న”?
ఖానా గట్టు మీద బీడీలు కాల్చుకుంటూ “ప్రెపెంచకాన్ని” గుప్పు గుప్పు మని విమర్శంచడం రైటేనా? ఖానా గట్ల గురించి, సందేహం వుంటే, భైరవభట్ల వారు పూర్తిగా తీర్చగలరు. బీడీల గురించి సందేహంవుంటే, నాలాటి వాడెవడైనా తీర్చగలడని అనుకుంటున్నాను.సాఫ్ సాఫ్ గా అడుగుతున్నాను. ఎవరైనా ఎందుకు రాయాలి? ఎందుకు రాస్తారు?
రజనీ గారడిగిన ప్రశ్నకి చలం గారు సమాధానమిస్తూAIR ఇంటర్వ్యూలో:
“నన్ను, నాలో ఏఏ మచ్చలున్నాయో, వాటిని నేను గట్టిగా తిట్టుకోడంతో, వాటిని గట్టిగా గోక్కోడంలో, ఆ పుస్తకాలు-నేను వ్రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి. అవి మిమ్మల్ని అనుకుని మీరు చాలా కోప్పడ్డారు. మిమ్మల్ని కాదు- నన్ను నేను తిట్టు కున్నది.”
ఇందుకేనా రాస్తారు? ఇందుకేనా రాయాలి? ఇలా రాయకపోతే విమర్శకులు “కోర్ కోర్ శరణు కోర్” అని గగ్గోలెట్టడం రైటేనా? అలా గగ్గోలెట్టకపోతే తప్పా?
ఈ మాట రచయిత(త్రు)లకీ, అభిప్రాయాలు రాసీవాళ్ళకీ వున్న సుఖం మిగిలిన పత్రికలకి రాసీ వాళ్ళకి లేదు. మా బతుకులు మేం బతుకుతూ, తీరికున్నపుడు “బాగా రాసేరు” అని అభిప్రాయమ్ముక్క పడేస్తే ఈ మాట వాళ్ళు, చక్కగా వేస్తారు. కొంపదీసి ఇదా సాహిత్య సేవ?
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి vasu M.S.C. గారి అభిప్రాయం:
09/23/2008 6:56 am
మీరు రాసిన ఈ వ్యాసము బాగుంది.
పడవ మునుగుతోంది గురించి aswartha గారి అభిప్రాయం:
09/23/2008 4:53 am
మనసును తాకిన మానవత్వపు వాస్తవం…