శ్రీనివాస్ గారు, Thanks for responding to my request. పాట సగమే ఉన్నట్లనిపించింది. మిమ్మల్ని అడగక మునుపే మరొక వెబ్ సైట్ లో కూడా ఇలా సగమే దొరికింది. అదే సైట్ లో మరొక ఆణిముత్యం, “ఏ గాలి వడి రాలి ఏ ధూళిదోగినదొ, ఏ కబరి ముడి సడలి ఈ దారి జారినదొ, ఎత్తవో నీ కేల ఈ బేల సుమబాల” అనే పాట కూడా దొరికింది. నేను దాదాపు ఇరవై ఏళ్ళుగా ఈ పాట కోసం వెతుకుతుంటే, అనుకోకుండా దొరికింది. ఈ సైట్ maintain చేస్తున్నవారి తండ్రిగారు AIR Hyderabad లో ఇంజనీరుగా పని చేసేవారట. ఆయన ఫిలిప్స్ 6″ tapes మీద ఈ పాటలు radio లో ప్రసారమైనపుడు record చేసారట. వాటిని digitize చేసి ఈ సైట్లో ఉంచడం జరిగింది. AIR Hyderabad వాళ్ళు ఇలాంటి మంచి పాటలని archives లో కప్పేట్టేసి ఉంచడం ఇటు శ్రోతలకూ, అటు radio కళాకారులకూ, గేయ రచయిత(త్రు)లకూ పెద్ద disservice.
ఏది ఏమైనా మీకు మరోసారి ధన్యవదాలు.
గూగుల్ లోనో యాహూలోనో idangai, valangai అని టైపు చేస్తే ఈ కుడి ఎడమల జాతి వివరణలు తెలుస్తాయి. బ్రిటిషువారి పరిపాలనలో ఒకప్పుడు కోమటులకు శెట్టికులము వారికి తగాదాలు చాలా తీవ్రంగా మదరాసులో వచ్చిందట. ఇళ్లను వాకిళ్లను తగలబెట్టారట. దానిని సరి చేయడానికి బ్రాహ్మణులను కొందరిని పంపారట. దక్షిణాంధ్రలో కూడా ఇట్టివి ఉండేవని చదివి ఉన్నాను. కుడి జాతివారి స్త్రీలు ఎడమవైపు పైట వేసికొనేవారట, ఎడమజాతివారు కుడివైపు వేసికొనేవారట. గొల్ల కులాలవారు రెండు వైపులా వేసికొనే్ వారట. బ్రాహ్మణుల ఆధిఖ్యాన్ని విశ్వబ్రాహ్మణ కులం వారు ఎదురుకొనేవారు. అందుకే వారు జందెం వేసికొని ఆచార్యులని పేరు పెట్టుకొనేవారు. అదృష్ట వశాత్తు ఈ రోజు ఇవన్నీ లేవు అందుకు మనం సంతోషించాలి! ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదు.
విధేయుడు – మోహన
“అయితే ఏ మంచికి హాని చేస్తున్నావోఁ, ఏ చెడుకి మంచి చేస్తున్నావోఁ తెలుసుకుంటే హాయి హాయి గా సాగుతుంది ఆమని.”
బాబ్జీలు గారి అభిప్రాయాలతో పేచీ పడేంత చదువు నాకు లేదు. కానీ వారన్న పై మాట నాకు అర్ధం కాలేదు. ఈ పుస్తకం ప్రచురించడానికి తోడ్పడి కొడవళ్ళ గారు హాని చేశారనా? ఎవరికి?ఈ పుస్తకం ప్రచురించడం చెడు పనా? ఏది చెడు, ఎవరు దానికి మంచి చేస్తున్నారు? పోనీ వేరే పుస్తకాలేమన్నా అచ్చేస్తే మంచికి మంచి జరిగేట్టయితే ఉదాహరణలేమన్నా చెబ్తారా? ఈ మంచి చెడుల ప్రస్తావన నాకు అంతుబట్టలేదు.
ఏమనుకోకపోతే ఇంకో చిన్నమాట – పైమాట ఒక్కటే కాదు. చాలా సార్లు వారు దేనిగురించి మాట్లాడుతున్నారో అర్ధం కాదు. వారి ఉద్దేశాలు అంతుపట్టవు. బాబ్జీలు గారి అభిప్రాయాల్ని ఉత్సాహంగా చదివి అర్ధం అయినంతమటుకూ ఆనందించే ఈమాట పాఠకుల్లో నేనూ ఒకణ్ణి. అందువల్ల వారు చెప్పదలచుకున్నది వారి ‘ధోరణి’ లో కాకుండా సరళంగా చెబితే నాబోటి వాళ్ళకు అర్ధమౌతుందని, నా చిన్న రిక్వెస్టు. అన్యధా భావించరని ఆశిస్తున్నాను.
– గిరి
I read this after a long time. One way to understand the infinities is to consider a hotel with infinite rooms, with infinite guests. If one more guest comes, how do you accommodate? [Ask the first guest to move to the next room and the guest in that room to next and so on; use the first room for the new guest.] If another infinite hotel had a fire problem and you want to accommodate them how would you?
This series of mappings illustrate the concept of infinities to kids. Now, an enterprising soul can come with analogies to all the equations in terms of hotels and rooms and guests :-).
I did not understand the complexity in reductio ad absurdum. Philosophically, people may have issues with law of excluded middle, but other than that it is a desire to see the system not be inconsistent.
హనుమంతరావూ, నిజంగా మొదటినుంచీ చివరి వరకూ ఆగలేకుండా చదివాను. చాలవరకు తెలిసిన విషయాలయినా ఇంకా బాగా అవగాహన కలిగించింది ఈ వ్యాసం.
As an old intuitionist (I prefer the constructionism brand), I loved this discussion. Again, I wish that I had this to read when I was young; my life would have been different!
When I read about the people like Hilbert who pushed the limits of human knowledge, life seems noble for a brief period.
Couple of issues: Hilbert is wrong to compare the constuctionism to counting the hairs of people. All you need an existential proof that may not need to count hairs of people.
Speaking of hairs, intellectually, constructionism is the heir to aristolitianism, which asks for an existential proof for falsification. This is as opposed to platonic view of the world. I see these two dichotemies playing in every mathematical approach that I read about. Funny thing is that both approaches are needed. [Like in programming languages, denotational is more like Hilbert’s view and the operational is more like Brouwer’s]. In any case, I remember a friend telling me about Brouwer and his fan following. Apparently, people used to photograph the blackboard before he erased!
This is the stuff to curl up to on a rainy day! I am eagerly looking forward to other parts and I hope that someday all of this is published in AP (perhaps in an extended form, with some indepth appendix with genetic introduction to these problems so that people can sink their teeth into).
ఈ సమీక్ష లో శ్రీకాంత్ శర్మ గారి కంటే కూడా నారాయణ్రావు గారి సొంత అభిప్రాయాలు ఎక్కువున్నట్టు అనిపించింది.. ఈ ఎడమచేతి కుడిచేతి కులాలను గూర్హి తెలుగులో విన్నట్టు లెదు. “గ్రంథం ద్వారా. ఒక భాష బతికి వుందా, చచ్చిపోయిందా అన్న విషయం భాషాగతమైనది కాదనీ, ఆ భాష వాడేవాళ్ళ సామర్థ్యానికి సంబంధించిన విషయమనీ బోధపడుతుంది ఈ పుస్తకం చదివితే.” హిందీ ఎక్కువ వెలుగులో వుండడానికి గల ముఖ్య కారణం వాడుక భాషకి పుస్తకాల భాషకి దూరం తక్కువ వుండడమె అని నా అభిప్రాయం. ఆ దృష్టితో ఆలొచిస్తే తెలుగు సాహిత్యం మామూలు ప్రజలకి దూరమవ్వడా నికి గల కారణాలు ఎమిటి అనేది బొధపడవచ్చు. తెలుగు వెలగాలని ఎంత్ మంది కొరుకుంటున్నారో ఇన్ని వ్యాఖ్యానాలు చూస్తే తెలుస్తోంది. ఆధునిక కవుల వలన తెలుగు పాడయ్యింది అనడం సమంజసం కాదు. పైన కామేశ్వర రావుగారు రాసినట్టు కాలాణుగుణం గా వచ్హే మార్పులను గ్రహించలేక పోవడం మన పాత తరం తప్పు.కొత్త అవసరాలకు సరిపడా మాటలు తయారుచెయ్యాల్సిన భాధ్యత మీరనే పండితులదే. వాళ్ళు తెలుగు కొత్త పదాలకు బదులు సంస్కృతాన్ని వాడడం వల్లె ఈదుస్తితి తలెత్తింది. పాత కవులు గొప్ప వాళ్ళే కాని జన నాడి గ్రహించలేదనిపిస్తోంది.
బాబ్జీలు-గారు: మీరు రాసే తెలుగు నాకు అర్థం కాదు. అందువల్ల మీ కామెంట్లు నేను చదవను. మీరు నన్నేదో ప్రశ్నడిగారని తెలిసినవాళ్ళు mail పంపితేనే చూడడమ్ జరిగింది. మీ ప్రశ్నకు క్లుప్తంగా… 1983-89 మధ్యల్లో సెలవల్లో యింటికి వెళ్ళినప్పుడు AIR నుండి రికార్డు చేసుకున్నవి అధిక భాగం. కొన్ని లలిత గీతాలు రజని, పాలగుమ్మిలతో గల పరిచయం కారణంగా వారిద్దరినుండి పొందినవి.
చివరిగా “రమ” గారి కామెంటుపై: de gustibus non est disputandum
రవికిరణ్ గారూ! ఎడమ చేతి కులాలూ..కుడిచేతి కులాలూ అన్న విభజన ఎ.కె.రామానుజన్ తమిళ సమాజంలో ఉన్న ట్టు చెప్పారు. అటువంటి విభజన ఏదీ తెలుగు సమాజంలో ఉన్న ట్టు కన్పించదు. నారాయణ్రావు గారి అభిప్రాయాలు మీరు సందేహపడదగినట్టుగా లేకపోలేదు సుమా!
నోట్ టు ఉమ: మీకు సాహిత్యంతో అంత పరిచయం ఉన్న ట్టు లేదని మీ అభిప్రాయం చూస్తే అర్ధమౌతుంది. మీకు అర్ధమైన పధ్ధతిలోనే నా అభిప్రాయం అనేకులకి అర్ధం అవ్వాలని లేదు. విషయం ముఖ్యం. మీకు నారాయణ్రావు గారం టే ఇష్టం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అందువలనే ఇతరులు ఆయన్ని ప్రశ్నించకూడదని కూడా లేదు. నేను కాకుంటే ఇటువంటి సందేహం ఇంకెవరైనా కూడా ప్రకటించవొచ్చు. వెక్కిరించడం బల హీనతకి కొండగుర్తు. నా పేరు…రమాప్రభ కాదు. మీ ఇతర వ్యంగ్యాలకి జవాబు ఇవ్వవలసిన ఆవశ్యకత నాకు లేదు. అందులో అభిరుచి లేదు గనక.
ఇది పదుహేడవ శతాబ్ధపు కావ్యమని వేల్చూరి గారు చెబుతున్నారు. ఆ కాలంలో దక్షిణ భారత దేశంలో, తమిళనాడులో అధికారంలో వున్న నాయక రాజులు విజయనగర ప్రభువుల వారి రాజ్యంలో వారి ఆస్థాన వుద్యోగులుగా, తమిళ దేశంలో రాయల వారి ప్రతినిధులుగా, రాయల వారితో బంధుత్వాలు వున్నటువంటి తెలుగు నాయక రాజులు కదా. వారు సామాజికంగా పెద్ద ప్రాధాన్యత లేని కులాల వారవటం ఏవిటి? రాజాస్థానోద్యోగులు, రాజ బంధువులు, రాజ ప్రతినిధులు ఊరూ పేరూ లేని కులాల కి చెందిన వారని చెప్పటం సబబా? వొకవేళ మీరు మాట్లాడే నాయక రాజులు వేరు అని అనుకుందాం. అయినా సరే పదిహేడవ శతాబ్ధంలో పెద్దగా ప్రాధాన్యం లేని కులాల వాళ్ళు, సమర్ధులైన వ్యాపారులుగా మారటానికి ఎన్ని తరాల సమయం పడుతుందో ఆలోచించారా. ఎవరో ఒకరో ఇద్దరో కాదు వొక కులవంతా సామాజిక, ఆర్ధిక పరిస్థితులని (భూమి ముఖ్య ఆదాయ వనరుగా వున్న సమాజంలో, ప్రాధాన్యత లేని కులాలకి వున్న ఆర్ధిక బలం అతి బలహీనంగానే వుంటుంది) తమకనుకూలంగా మార్చుకుని, సమాజంలో వ్యాపార పరంగా గానీ, సామాజికంగా గాని, రాజ్యాలు స్థాపించే స్థాయికి ఎదగడం వొకరోజులో, ఒక జెనరేషన్లో అయ్యే పని కాదు కదా. భూమే ప్రధానమైన ఆదాయ వనరుగా, రాజుకైనా, సామాన్యుడికైనా వున్న సమాజంలో, భూస్వామ్యంతో సంబంధం లేకుండా రాజ్యాధికారానికి రావడం, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకోవడం ఎంత వాస్తవవిరుద్దంగా వుందో చూడండి. ఒకవేళ ఆ ప్రాధాన్యత లేని కులాల వారె, పరిణామ క్రమంలో, వ్యాపారులుగా, భూస్వాములుగా, రాజ ప్రముఖులుగా, రాజ ప్రతినిధులుగా ఎదగగలిగినప్పుడు, వారి కులం ప్రాధాన్యతని సంతరించుకుని ఒక ప్రముఖ కులంగా, సామాజిక వర్గంగా మార్పుచెందుతుంది కదా (ఇక్కడ ఏ వొక్క వ్యక్థి అభివృద్దో కాదు, మొత్తం కొన్ని కులాల సామాజిక పరిణామం). కాబట్టి అప్పటి వరకు పెద్ద ప్రాధాన్యం లేని కులాల వారు కాదు, అప్పటికే ప్రాధాన్యతని సంతరించుకున్న కులాలు అయ్యుండాలి వాళ్ళవి.
ఇక ఎడమ చేతి కులాలు, కుడి చేతి కులాల ప్రశక్తి ఒకటి తెచ్చారు. వీరి ఆచార వ్యవహారాలు పరస్పర విరుద్దాలన్నారు. అసలు భావ మాత్రమైన, ఎప్పుడూ జన బాహుళ్యం అనుసరించని, శాస్త్రాలకి, సాహిత్యానికి పరిమితవైన చాతుర్వర్ణ వ్యవస్థ, మీరు చెప్పిన ఎడమ చేతి కులాలు అధికారంలోకి వచ్చేప్పటికి కుప్పకూలి పొయ్యె పరిస్థితి ఎందుకు తలెత్తిందో మీరే చెప్పాలి. అసలు సమాజం పాటించని భావం సమాజంలో ఒక సాజిక వర్గం ఎదుగుదలతో కుప్పకూలి పోవటవేవిటో మీరే వివరించాలి. అసలు కుల వ్యవస్థతో జన్య జనక సంబంధం లేనటువంటి, ఆకాశంలోనో, పాతాళంలోనో, ఉత్తుత్తి ఊహల ఉయ్యాలల్లోనో వుండే చాతుర్వర్ణ వ్యవస్థకి ఎడమ చేతి కులాలతో ఎందుకు తంటానో మరి?
పెద్ద బ్రామ్హలైనా, చిన్ని బ్రామ్హలైనా, ఒక్క బ్రామ్హణులకే వేదాధ్యాయన అర్హత అని కాదనలేని సత్యం. శారీరకవైన, ఆర్ధికవైన స్వశక్థి లేని సామాజిక వర్గం, దాతల మీద, దానాల మీద అధార పడ్డ కులం అధికారాన్ని సంపాదించి, దాన పత్రం చేత పట్టిన ఎవిరినైనా ఆశీర్వదించడానికి, వారికి క్షాత్రపు పోగు తొడగడానికి లైన్ కట్టి వుంటారనడానికి అభ్యంతర వుండదనుకుంటాను. దానికి పైనుంచో, క్రింద నుంచో పిలిపించుకోవాల్సిన అవసరం వుందని నేననుకోను. అందువలననే, రాజ పీఠం ఎక్కిన ప్రతి వక్కరు క్షత్రియులయ్యారు. భారత దేశంలో నానా కులాల వాళ్ళు, బయటనుంచి వచ్చిన, శకులు, గ్రీకులు, తురుష్కులు, ఆంగ్లేయులు, మన దక్షిణంలో రెడ్లు, బలిజలు, వెలమలు, నానా రకాల రాజులు అందరూ క్షత్రియులై, క్షాత్రం ఒలకబోసిన వాళ్ళే. ఐతే ప్రాచీన రాజ్యాల నుంచి, బ్రిటీషు క్షత్రియుల వరకు, వారు బౌద్ద మతావలంబులు కానీ, తురుష్కులు కాని, సముద్రాలవతల నుంచి వచ్చిన మ్లేచ్చులు గానీయండి దేవుడిని, బ్రామ్మడిని తోసిరాజని, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకుని, పూజలందుకున్న రాజులు కూడా కావ్యాల్లో, కథల్లో వున్నరేవోగాని, చరిత్రలో వున్నట్టు తోచదు.
రాజు సామాజిక వర్గం పూర్వవెప్పుడో వర్తక వ్యాపారాలు చేసున్నా, వ్యవసాయాలే చేసున్నా, వేదాలే చదివున్నా, కర్రసాములే చేసున్నా, రాజుకి ఎప్పుడూ ధనం ప్రాధాన్యవే. ప్రత్యేకంగా ఎడమచేతి కులపు రాజులే విత్త ప్రాధాన్యాన్ని పెంచి పోషించేరనడం మీ స్వకపోల సిద్దాంతవేనని నా నమ్మకం. నూటికి తొంభైతొమ్మిది శాతం ప్రజలు భూమి మీద ఆధార పడిన పదిహేడో శతాబ్ధంలో, వ్యాపారం చేసి హటాత్తుగా పైకొచ్చి రాజ్యాలు చేపట్టిన కులాలు కూడా మీరు నమ్మినట్టు చాతుర్వర్ణ వ్యవస్థ లాగే ఊహల్లో వుండి వుంటే వుండి వుండొచ్చు.
ఇటువంటి కుల సంఘర్షన కాలంలో వ్రాసిందే వేంకటాధ్వరి గారు వ్రాసిన కావ్యమని చెప్పేరు. కావ్యం నేను చదవలేదు. ఐతే మీరు పరిచయం చేసిన కావ్యాంశాలని ఒక సారి పరికిద్దాం. మీ పరిచయం ప్రకారం అప్పటి సమాజంలో పెద్ద మార్పు సంభవించింది. ఎడమ చేతి కులపు వాళ్ళు రాజ్యాధికారం సంతరించుకున్నారు. వాళ్ళు రాజ్యాధికారంతో ఆగిపోకుండా తమని తాము భగవంతులుగా ప్రకటించుకున్నారు. వాళ్ళు పూర్వాశ్రమంలో వ్యాపారులుగుట చేత, సమాజంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిపొయ్యి, కులం కాకుండా, దబ్బు సంపాదన అనే గుణం సమాజంలో ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది (బలవంతులవుతున్ననవాబులు, అప్పుడప్పుడే దోపిడికి మార్గాలేస్తున్న బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ తప్ప ఆ కాలంలో అంత సమాజాన్నికల్లోలం చేసిన మార్పులేవీ జరగలేదు చరిత్ర ప్రకారం). కాబట్టి ఆ డబ్బు సంపాదన కలిగిన (ఎలా సంపాదించారో మరి, భూమి పుట్ర లేని క్రింది కులస్థులు) క్రింది కులస్థులు కూడా సమాజంలో గౌరవమైన స్థానం సంపాదించ గలిగేరు. ఎలాటి స్థానం, బ్రామ్హణులు కూడా అసూయ పడగలిగే గౌరవ స్థానాన్ని పొందగలిగేరు. దానికి చారిత్రక ఋజువు ఈ సుమతీ శతక పధ్యం. సుమతీ శతక పధ్యం ఆ కాలానిదని చెప్పడానికి, ఏకాలానిదో చెప్పడానికి ఏ ఋజువులు లేవు, కాబట్టి దాన్ని వదిలేస్తాం.
అటువంటి సంఘర్షణల సమాజంలోంచి వచ్చిన కావ్యం, ఆ సంఘర్షణని వివరించే కావ్యం ఈ విశ్వగుణాదర్శం. ఈ కావ్యంలో అధునికులు అనుకునే విమర్శనాత్మక దృక్పథం ఆ కాలానికే వుందనివేల్చూరిగారి ఉవాచ. ఎలా? ఇద్దరు గంధర్వుల సంభాషణని రెండు విరుద్ద అభిప్రాయాలుగా మలచడం ద్వారా, ఆ విమర్శనాత్మకథని రచయిత నెలకొల్పుతాడు. కాకపోతే రెండు అభిప్రాయాలుకూడా తురకలు వీరులని చెప్పటంలో, ఆంగ్లేయులు నీతివంతులని వొప్పుకోవడం లాంటి కొన్ని విషయాల్లో వేరైనా, నారాయణ రావు గారి ఉదాహరణల్లో ఇద్దరి అభిప్రాయాలు కూడా, తరిగిపోతున్న బ్రామ్హణ ప్రాబల్యాన్ని గురించి చింత పడటవే కనిపిస్తుంది. పెరిగిపోతున్న శూద్ర కులాల ప్రాభల్యానికి విచారించడవే గోచరిస్తుంది. పాపం తురుష్కులలో, తెల్లొళ్ళల్లో వీరత్వాన్ని, నీతిని చూడ గలిగిన గాంధర్వులకి, క్రింది కులాలు రాజ్యాధికారానికి రావటం మాత్రం అంత నచ్చినట్టు లేదు. ఇదేదో అప్పుడే మొదలయ్యినట్టు, భూసురులు ఇంతకుముందెప్పుడూ లౌకిక వృత్తుల్లో లేనట్టు, ఎప్పుడూ అగ్రహారం కోసం దోసిలి పట్టనట్టు గాంధర్వులు యమ బాధపడిపోతారు.
ఇంకా విచిత్రవైన విషయం ఏవిటంటే, గంధర్వుల విమర్శనాత్మక దృక్పథాన్ని మరింత ఎత్తుకి తీసుకపొయ్యే ఉద్దేశంతో ఇచ్చిన ఉదాహరణ. వీరు సంస్కృతాన్ని కూడా విమర్శించడానికి కాదు ఈసడించడానికి కూడా వెనుదియ్యరు. నారాయణ రావు గారు, బాపనోళ్ళలో కూడా మహాత్ములుంటారంటే ఉద్దేశం బ్రామ్హణులు మహాత్ములని కాదండి, వాళ్ళు జనరల్ గా మహాత్ములు కాకపోయినా, ఎక్కడో ఎప్పుడో వాళ్ళలో కూడా మహాత్ములుంటారని అర్థం, కాదనగలరా. ద్రవిడ భాషల్లొ మంచి వుంటే పరిగ్రహించవలసిందే, చెడ్డ విషయం సంస్కృతంలో చెప్పినా పరిహరించ వలసిందే అంటే ద్రవిడ భాషలు ప్రామాణికవైనవి, గౌరవించవలసినవి కాకపోయినా, మంచి చెప్తే తీసుకోవలసిందే, సంస్కృతం దేవ భాష, ప్రామాణికవైన భాష అయినప్పటికి చెడ్ద చెప్తే ఆచరించనవసరం లేదు అనే కదా. ఇందులో ద్రవిడ భాషల్ని సున్నితంగా (సున్నితవేం సున్నితం, అదేదో అదైనప్పటికి అది అదే కదా అన్నడట వాడెవ్వడో) కించపరచడవే కదా.
మీరిచ్చిన ఉదాహరణలన్నీ బ్రామ్హణ కుల సంబంధవైనవే, పొనీ అగ్రకులాల అలజడి గురించి ముచ్చటించారు, అప్పుడైనా మరోకుల ప్రశక్తి లేదుకదా. మీ పరిచయం చదివిన తర్వాత ఇది ఒకే ఒక్క అగ్రకులపేడుపని నేననుకుంటే నా తప్పుందని నేననుకోను.
ఇంత నిస్సంకోచంగా మీరెలాగ అసత్యాన్ని సత్యంగా చేయబూనుకున్నారు? కులాలతో సంబంధం లేకుండా వున్నటు వంటి చాతుర్వర్ణ వ్యవస్థ, వేదం చదవడం ద్వారానే కులలతో సంబంధం లేకుండా వర్ణ వ్యవస్థలోకి
ఎదిగిన పెద్ద బ్రామ్హణులు (పాపం బ్రామ్హణ కులంలో చిక్కు పడిపోయిన చిన్న బ్రామ్హణులు) ఇలా అందంగా పుట్టే తక్కువ కులాల ఆడవాళ్ళని చూసి ఏడవడంవవేనా ఆధునికత? సంస్కృత సాహిత్యం ఆధునికం, ఆధునికత్వానికి దూరం కాదని చెప్పడానికి ఇవా మీ ఉదాహరణలు. సమాజంలో మరేరకవైన ఘర్షణ, మార్పు కనిపించలేదా ఉదాహరించడానికి, లేకపొతే కవి గారి ఆధునికత, ఆయన విమర్శనాత్మక దృక్పథం ఆయన ముక్కు దగ్గరే ఆగిపోయిందా? కవిత్వ శొభగుల సంగతి నాకు తెలీదు, మీరు ఏవీ చెప్పినట్టు లేరు, కానీ మీరిచ్చిన ఉదాహరణలే ఆ కావ్యానికి వస్తువైతే, ఆ గంధర్వుల, వారి ద్వారా మీరు పరిచయం చేసిన విమర్శనాత్మక దృక్పథం నిజంగా విచారింపదగిన విషయం. ఐతే అందులో నాకేవీ ఆశ్చర్యం లేదు, మీ కన్యాశుల్కానువాదానికి మీ వెనుక మాట మీద వేలూరివారిచ్చిన పరిచయం చదివేను (కన్యాశుల్కాన్ని మళ్ళీ ఎందుకు చదవాలంటే, వేలూరి వెంకటేశ్వరరావు – సెప్టంబరు 2007), కన్యా శుల్కాన్ని అంతగా వక్రీకరించగలిగిన మీనుంచి మరొకటి ఆశించటం తప్పే కదా.
చివరగా కొడవళ్ళ హనుమంత రావు గారు, అది ప్రాచీనవైనా, అధినికవైనా, అధునికాంతరవైనా మరేదైనా, సాహిత్యాన్ని పదుగురికి అందుబాటులోకి తేవాలనే మీ సంకల్పం అనుమానం లేకుండా అభినందించదగినది. ఐతే బాబ్జీలు తన అభిప్రాయం చివర్లో చెప్పిన విషయం కూడా మనసులో పెట్టుకోదగినదని నా అభిప్రాయం.
మోహన్ గారూ !!
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను నిన్న చెప్పిన అభిప్రాయానికి ఇది కొనసాగింపు. ముందుగా మీ observation సరైంది. ఇవాళ ఇంగ్లీషులో ఎంతపాటి పాండిత్యం మనవాళ్ళు సంపాదించారో నాకు తెలీదుగానీ..దేశిభాషల్లోనూ..సంస్కృతంలోనూ..మాత్రం్ చాలా నష్ట పోయేరు.ఇలా నష్టపోవడానికి..రెండు కారణాలు. మొదటిది. ఆధునికంగా కన్పించడం్ ..అలాంటి వేష భాషలు ధరించడం్ గొప్ప గా చలామణీ కానిచ్చారు. కన్యాశుల్కం్ లోనే ఈ పరిస్థితి మీద ప్రస్తావన ఉంది.దేశీయ పాండిత్యాన్ని చిన్న చూపు చూసేరు ఆధునికులు. ఆధునికమైన చదువులు
చదివిన వాళ్ళతో పాలన జరిపించుకునే ప్రభుత్వాలూను. రాజుల పోషణ పోయింది. ప్రజల్నించి ఆదరణ కరువైంది. మన తెలుగునేల ఈ భాషల్లో విశ్వవిద్యాలయాలు చేవ ఉన్నవాళవానీ..సామర్ధ్యం ఉన్న వాళ్ళనీ కాక..ఎక్కువశాతం mediocres తో నింపేసేరు. చాటపెయ్యల్లా తయారుచేసేరు వాటిని. పైరవీగాళ్ళూ..పలుకుబడి గల్గినవాళ్ళూ..మాత్రమే అక్కడ చొరబడ్డారు. కాదు అలాంటి వాళ్ళని చొరబడనిచ్చేరు.జో హుజూర్ గాళ్ళు అన్నమాట. ఒకసారి తెలుగుశాఖల్ని వెళ్ళి చూడండి. ఇంక సంస్కృతం వచ్చి డొక్కశుధ్ధి ఉన్న వాళ్ళు సంఖ్యలో తక్కువ. ఉన్న కాసింత మందీ తెలుగు టీవీ చానళ్ళలో “పురాణ ప్రవచనాలు” చెప్పుకు కాలక్షేపం చేసుకుంటున్నారు.
ఏ కాలంలోనైనా పాండిత్యానికి కొనసాగింపు ఉండాలీ అంటే..ముందు నేర్పేవాళ్ళుండాలి. మనం గురువుల్ని గౌరవించుకోలేదు.వాళ్ళ పేదరికాలకి కారణం అయ్యేం. శిష్యుల్నీ తయారుచేసుకోగల వీలు వాళ్ళకి మనం కల్పించలేదు. వాళ్ళ బతుక్కి ఎటువంటి ఆధారమూ ఈ సమాజం చూపించలేదు. ఏ ఉగాది సమయాల్లోనో పిలిచి ఒక శాలువా కప్పి వెయ్యినూట పధార్లు చేతిలో పెట్టి పంపించాం!!. పాశ్చాత్య భాషల మీది మోజుతో..వాళ్ళకి అనుకరణల్తో ఇప్పటికి ఒక 50 ఏళ్ళు గడిపీసేము. ఇవాళ కళ్ళుతెరిచి పాండిత్యం కోసం వెతుక్కుంటే ఎక్కడ కన్పిస్తుందీ??తెలుగులో మంచి పుస్తకాలు రాస్తున్న వాళ్ళు చాలా మంది ఏ ఉద్యోగాలూ లేని వాళ్ళు. యూనివర్సిటీల్లోంచి చెప్పుకోదగ్గ పరిశోధన ఏదీ?? పనిచెయ్యని వారికి అవకాశాలూ..పనిచేసేవాళ్ళకి కష్టాలూను. అసలు ఇలాటి చోట పాండిత్యాన్ని గురించిన పరితాపంలో అర్ధం ఉందా??…రమ.
కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar గారి అభిప్రాయం:
03/03/2009 7:34 pm
శ్రీనివాస్ గారు, Thanks for responding to my request. పాట సగమే ఉన్నట్లనిపించింది. మిమ్మల్ని అడగక మునుపే మరొక వెబ్ సైట్ లో కూడా ఇలా సగమే దొరికింది. అదే సైట్ లో మరొక ఆణిముత్యం, “ఏ గాలి వడి రాలి ఏ ధూళిదోగినదొ, ఏ కబరి ముడి సడలి ఈ దారి జారినదొ, ఎత్తవో నీ కేల ఈ బేల సుమబాల” అనే పాట కూడా దొరికింది. నేను దాదాపు ఇరవై ఏళ్ళుగా ఈ పాట కోసం వెతుకుతుంటే, అనుకోకుండా దొరికింది. ఈ సైట్ maintain చేస్తున్నవారి తండ్రిగారు AIR Hyderabad లో ఇంజనీరుగా పని చేసేవారట. ఆయన ఫిలిప్స్ 6″ tapes మీద ఈ పాటలు radio లో ప్రసారమైనపుడు record చేసారట. వాటిని digitize చేసి ఈ సైట్లో ఉంచడం జరిగింది. AIR Hyderabad వాళ్ళు ఇలాంటి మంచి పాటలని archives లో కప్పేట్టేసి ఉంచడం ఇటు శ్రోతలకూ, అటు radio కళాకారులకూ, గేయ రచయిత(త్రు)లకూ పెద్ద disservice.
ఏది ఏమైనా మీకు మరోసారి ధన్యవదాలు.
రాజాశంకర్
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి mOhana గారి అభిప్రాయం:
03/03/2009 6:00 pm
గూగుల్ లోనో యాహూలోనో idangai, valangai అని టైపు చేస్తే ఈ కుడి ఎడమల జాతి వివరణలు తెలుస్తాయి. బ్రిటిషువారి పరిపాలనలో ఒకప్పుడు కోమటులకు శెట్టికులము వారికి తగాదాలు చాలా తీవ్రంగా మదరాసులో వచ్చిందట. ఇళ్లను వాకిళ్లను తగలబెట్టారట. దానిని సరి చేయడానికి బ్రాహ్మణులను కొందరిని పంపారట. దక్షిణాంధ్రలో కూడా ఇట్టివి ఉండేవని చదివి ఉన్నాను. కుడి జాతివారి స్త్రీలు ఎడమవైపు పైట వేసికొనేవారట, ఎడమజాతివారు కుడివైపు వేసికొనేవారట. గొల్ల కులాలవారు రెండు వైపులా వేసికొనే్ వారట. బ్రాహ్మణుల ఆధిఖ్యాన్ని విశ్వబ్రాహ్మణ కులం వారు ఎదురుకొనేవారు. అందుకే వారు జందెం వేసికొని ఆచార్యులని పేరు పెట్టుకొనేవారు. అదృష్ట వశాత్తు ఈ రోజు ఇవన్నీ లేవు అందుకు మనం సంతోషించాలి! ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదు.
విధేయుడు – మోహన
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి గిరి గారి అభిప్రాయం:
03/03/2009 12:13 pm
బాబ్జీలు గారి అభిప్రాయాలతో పేచీ పడేంత చదువు నాకు లేదు. కానీ వారన్న పై మాట నాకు అర్ధం కాలేదు. ఈ పుస్తకం ప్రచురించడానికి తోడ్పడి కొడవళ్ళ గారు హాని చేశారనా? ఎవరికి?ఈ పుస్తకం ప్రచురించడం చెడు పనా? ఏది చెడు, ఎవరు దానికి మంచి చేస్తున్నారు? పోనీ వేరే పుస్తకాలేమన్నా అచ్చేస్తే మంచికి మంచి జరిగేట్టయితే ఉదాహరణలేమన్నా చెబ్తారా? ఈ మంచి చెడుల ప్రస్తావన నాకు అంతుబట్టలేదు.
ఏమనుకోకపోతే ఇంకో చిన్నమాట – పైమాట ఒక్కటే కాదు. చాలా సార్లు వారు దేనిగురించి మాట్లాడుతున్నారో అర్ధం కాదు. వారి ఉద్దేశాలు అంతుపట్టవు. బాబ్జీలు గారి అభిప్రాయాల్ని ఉత్సాహంగా చదివి అర్ధం అయినంతమటుకూ ఆనందించే ఈమాట పాఠకుల్లో నేనూ ఒకణ్ణి. అందువల్ల వారు చెప్పదలచుకున్నది వారి ‘ధోరణి’ లో కాకుండా సరళంగా చెబితే నాబోటి వాళ్ళకు అర్ధమౌతుందని, నా చిన్న రిక్వెస్టు. అన్యధా భావించరని ఆశిస్తున్నాను.
– గిరి
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి Ramarao Kanneganti గారి అభిప్రాయం:
03/03/2009 11:21 am
I read this after a long time. One way to understand the infinities is to consider a hotel with infinite rooms, with infinite guests. If one more guest comes, how do you accommodate? [Ask the first guest to move to the next room and the guest in that room to next and so on; use the first room for the new guest.] If another infinite hotel had a fire problem and you want to accommodate them how would you?
This series of mappings illustrate the concept of infinities to kids. Now, an enterprising soul can come with analogies to all the equations in terms of hotels and rooms and guests :-).
I did not understand the complexity in reductio ad absurdum. Philosophically, people may have issues with law of excluded middle, but other than that it is a desire to see the system not be inconsistent.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి Ramarao Kanneganti గారి అభిప్రాయం:
03/03/2009 11:06 am
హనుమంతరావూ, నిజంగా మొదటినుంచీ చివరి వరకూ ఆగలేకుండా చదివాను. చాలవరకు తెలిసిన విషయాలయినా ఇంకా బాగా అవగాహన కలిగించింది ఈ వ్యాసం.
As an old intuitionist (I prefer the constructionism brand), I loved this discussion. Again, I wish that I had this to read when I was young; my life would have been different!
When I read about the people like Hilbert who pushed the limits of human knowledge, life seems noble for a brief period.
Couple of issues: Hilbert is wrong to compare the constuctionism to counting the hairs of people. All you need an existential proof that may not need to count hairs of people.
Speaking of hairs, intellectually, constructionism is the heir to aristolitianism, which asks for an existential proof for falsification. This is as opposed to platonic view of the world. I see these two dichotemies playing in every mathematical approach that I read about. Funny thing is that both approaches are needed. [Like in programming languages, denotational is more like Hilbert’s view and the operational is more like Brouwer’s]. In any case, I remember a friend telling me about Brouwer and his fan following. Apparently, people used to photograph the blackboard before he erased!
This is the stuff to curl up to on a rainy day! I am eagerly looking forward to other parts and I hope that someday all of this is published in AP (perhaps in an extended form, with some indepth appendix with genetic introduction to these problems so that people can sink their teeth into).
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి Akeela Ramakrishna గారి అభిప్రాయం:
03/03/2009 9:35 am
ఈ సమీక్ష లో శ్రీకాంత్ శర్మ గారి కంటే కూడా నారాయణ్రావు గారి సొంత అభిప్రాయాలు ఎక్కువున్నట్టు అనిపించింది.. ఈ ఎడమచేతి కుడిచేతి కులాలను గూర్హి తెలుగులో విన్నట్టు లెదు. “గ్రంథం ద్వారా. ఒక భాష బతికి వుందా, చచ్చిపోయిందా అన్న విషయం భాషాగతమైనది కాదనీ, ఆ భాష వాడేవాళ్ళ సామర్థ్యానికి సంబంధించిన విషయమనీ బోధపడుతుంది ఈ పుస్తకం చదివితే.” హిందీ ఎక్కువ వెలుగులో వుండడానికి గల ముఖ్య కారణం వాడుక భాషకి పుస్తకాల భాషకి దూరం తక్కువ వుండడమె అని నా అభిప్రాయం. ఆ దృష్టితో ఆలొచిస్తే తెలుగు సాహిత్యం మామూలు ప్రజలకి దూరమవ్వడా నికి గల కారణాలు ఎమిటి అనేది బొధపడవచ్చు. తెలుగు వెలగాలని ఎంత్ మంది కొరుకుంటున్నారో ఇన్ని వ్యాఖ్యానాలు చూస్తే తెలుస్తోంది. ఆధునిక కవుల వలన తెలుగు పాడయ్యింది అనడం సమంజసం కాదు. పైన కామేశ్వర రావుగారు రాసినట్టు కాలాణుగుణం గా వచ్హే మార్పులను గ్రహించలేక పోవడం మన పాత తరం తప్పు.కొత్త అవసరాలకు సరిపడా మాటలు తయారుచెయ్యాల్సిన భాధ్యత మీరనే పండితులదే. వాళ్ళు తెలుగు కొత్త పదాలకు బదులు సంస్కృతాన్ని వాడడం వల్లె ఈదుస్తితి తలెత్తింది. పాత కవులు గొప్ప వాళ్ళే కాని జన నాడి గ్రహించలేదనిపిస్తోంది.
కొండ నుంచి కడలి దాకా గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
03/03/2009 9:26 am
rajasankar-గారు: “నదీసుందరి” పాటనిక్కడ వినవచ్చు. http://www.freewebs.com/rburra/Nadi_Sundari.mp3
మీరు ప్రస్తావించిన రెండో పాట వీలు చూసుకొని ఈమాటకు పంపుతాను.
బాబ్జీలు-గారు: మీరు రాసే తెలుగు నాకు అర్థం కాదు. అందువల్ల మీ కామెంట్లు నేను చదవను. మీరు నన్నేదో ప్రశ్నడిగారని తెలిసినవాళ్ళు mail పంపితేనే చూడడమ్ జరిగింది. మీ ప్రశ్నకు క్లుప్తంగా… 1983-89 మధ్యల్లో సెలవల్లో యింటికి వెళ్ళినప్పుడు AIR నుండి రికార్డు చేసుకున్నవి అధిక భాగం. కొన్ని లలిత గీతాలు రజని, పాలగుమ్మిలతో గల పరిచయం కారణంగా వారిద్దరినుండి పొందినవి.
చివరిగా “రమ” గారి కామెంటుపై: de gustibus non est disputandum
— శ్రీనివాస్
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/03/2009 6:22 am
రవికిరణ్ గారూ! ఎడమ చేతి కులాలూ..కుడిచేతి కులాలూ అన్న విభజన ఎ.కె.రామానుజన్ తమిళ సమాజంలో ఉన్న ట్టు చెప్పారు. అటువంటి విభజన ఏదీ తెలుగు సమాజంలో ఉన్న ట్టు కన్పించదు. నారాయణ్రావు గారి అభిప్రాయాలు మీరు సందేహపడదగినట్టుగా లేకపోలేదు సుమా!
నోట్ టు ఉమ: మీకు సాహిత్యంతో అంత పరిచయం ఉన్న ట్టు లేదని మీ అభిప్రాయం చూస్తే అర్ధమౌతుంది. మీకు అర్ధమైన పధ్ధతిలోనే నా అభిప్రాయం అనేకులకి అర్ధం అవ్వాలని లేదు. విషయం ముఖ్యం. మీకు నారాయణ్రావు గారం టే ఇష్టం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అందువలనే ఇతరులు ఆయన్ని ప్రశ్నించకూడదని కూడా లేదు. నేను కాకుంటే ఇటువంటి సందేహం ఇంకెవరైనా కూడా ప్రకటించవొచ్చు. వెక్కిరించడం బల హీనతకి కొండగుర్తు. నా పేరు…రమాప్రభ కాదు. మీ ఇతర వ్యంగ్యాలకి జవాబు ఇవ్వవలసిన ఆవశ్యకత నాకు లేదు. అందులో అభిరుచి లేదు గనక.
రమ.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:
03/02/2009 9:12 pm
ఇది పదుహేడవ శతాబ్ధపు కావ్యమని వేల్చూరి గారు చెబుతున్నారు. ఆ కాలంలో దక్షిణ భారత దేశంలో, తమిళనాడులో అధికారంలో వున్న నాయక రాజులు విజయనగర ప్రభువుల వారి రాజ్యంలో వారి ఆస్థాన వుద్యోగులుగా, తమిళ దేశంలో రాయల వారి ప్రతినిధులుగా, రాయల వారితో బంధుత్వాలు వున్నటువంటి తెలుగు నాయక రాజులు కదా. వారు సామాజికంగా పెద్ద ప్రాధాన్యత లేని కులాల వారవటం ఏవిటి? రాజాస్థానోద్యోగులు, రాజ బంధువులు, రాజ ప్రతినిధులు ఊరూ పేరూ లేని కులాల కి చెందిన వారని చెప్పటం సబబా? వొకవేళ మీరు మాట్లాడే నాయక రాజులు వేరు అని అనుకుందాం. అయినా సరే పదిహేడవ శతాబ్ధంలో పెద్దగా ప్రాధాన్యం లేని కులాల వాళ్ళు, సమర్ధులైన వ్యాపారులుగా మారటానికి ఎన్ని తరాల సమయం పడుతుందో ఆలోచించారా. ఎవరో ఒకరో ఇద్దరో కాదు వొక కులవంతా సామాజిక, ఆర్ధిక పరిస్థితులని (భూమి ముఖ్య ఆదాయ వనరుగా వున్న సమాజంలో, ప్రాధాన్యత లేని కులాలకి వున్న ఆర్ధిక బలం అతి బలహీనంగానే వుంటుంది) తమకనుకూలంగా మార్చుకుని, సమాజంలో వ్యాపార పరంగా గానీ, సామాజికంగా గాని, రాజ్యాలు స్థాపించే స్థాయికి ఎదగడం వొకరోజులో, ఒక జెనరేషన్లో అయ్యే పని కాదు కదా. భూమే ప్రధానమైన ఆదాయ వనరుగా, రాజుకైనా, సామాన్యుడికైనా వున్న సమాజంలో, భూస్వామ్యంతో సంబంధం లేకుండా రాజ్యాధికారానికి రావడం, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకోవడం ఎంత వాస్తవవిరుద్దంగా వుందో చూడండి. ఒకవేళ ఆ ప్రాధాన్యత లేని కులాల వారె, పరిణామ క్రమంలో, వ్యాపారులుగా, భూస్వాములుగా, రాజ ప్రముఖులుగా, రాజ ప్రతినిధులుగా ఎదగగలిగినప్పుడు, వారి కులం ప్రాధాన్యతని సంతరించుకుని ఒక ప్రముఖ కులంగా, సామాజిక వర్గంగా మార్పుచెందుతుంది కదా (ఇక్కడ ఏ వొక్క వ్యక్థి అభివృద్దో కాదు, మొత్తం కొన్ని కులాల సామాజిక పరిణామం). కాబట్టి అప్పటి వరకు పెద్ద ప్రాధాన్యం లేని కులాల వారు కాదు, అప్పటికే ప్రాధాన్యతని సంతరించుకున్న కులాలు అయ్యుండాలి వాళ్ళవి.
ఇక ఎడమ చేతి కులాలు, కుడి చేతి కులాల ప్రశక్తి ఒకటి తెచ్చారు. వీరి ఆచార వ్యవహారాలు పరస్పర విరుద్దాలన్నారు. అసలు భావ మాత్రమైన, ఎప్పుడూ జన బాహుళ్యం అనుసరించని, శాస్త్రాలకి, సాహిత్యానికి పరిమితవైన చాతుర్వర్ణ వ్యవస్థ, మీరు చెప్పిన ఎడమ చేతి కులాలు అధికారంలోకి వచ్చేప్పటికి కుప్పకూలి పొయ్యె పరిస్థితి ఎందుకు తలెత్తిందో మీరే చెప్పాలి. అసలు సమాజం పాటించని భావం సమాజంలో ఒక సాజిక వర్గం ఎదుగుదలతో కుప్పకూలి పోవటవేవిటో మీరే వివరించాలి. అసలు కుల వ్యవస్థతో జన్య జనక సంబంధం లేనటువంటి, ఆకాశంలోనో, పాతాళంలోనో, ఉత్తుత్తి ఊహల ఉయ్యాలల్లోనో వుండే చాతుర్వర్ణ వ్యవస్థకి ఎడమ చేతి కులాలతో ఎందుకు తంటానో మరి?
పెద్ద బ్రామ్హలైనా, చిన్ని బ్రామ్హలైనా, ఒక్క బ్రామ్హణులకే వేదాధ్యాయన అర్హత అని కాదనలేని సత్యం. శారీరకవైన, ఆర్ధికవైన స్వశక్థి లేని సామాజిక వర్గం, దాతల మీద, దానాల మీద అధార పడ్డ కులం అధికారాన్ని సంపాదించి, దాన పత్రం చేత పట్టిన ఎవిరినైనా ఆశీర్వదించడానికి, వారికి క్షాత్రపు పోగు తొడగడానికి లైన్ కట్టి వుంటారనడానికి అభ్యంతర వుండదనుకుంటాను. దానికి పైనుంచో, క్రింద నుంచో పిలిపించుకోవాల్సిన అవసరం వుందని నేననుకోను. అందువలననే, రాజ పీఠం ఎక్కిన ప్రతి వక్కరు క్షత్రియులయ్యారు. భారత దేశంలో నానా కులాల వాళ్ళు, బయటనుంచి వచ్చిన, శకులు, గ్రీకులు, తురుష్కులు, ఆంగ్లేయులు, మన దక్షిణంలో రెడ్లు, బలిజలు, వెలమలు, నానా రకాల రాజులు అందరూ క్షత్రియులై, క్షాత్రం ఒలకబోసిన వాళ్ళే. ఐతే ప్రాచీన రాజ్యాల నుంచి, బ్రిటీషు క్షత్రియుల వరకు, వారు బౌద్ద మతావలంబులు కానీ, తురుష్కులు కాని, సముద్రాలవతల నుంచి వచ్చిన మ్లేచ్చులు గానీయండి దేవుడిని, బ్రామ్మడిని తోసిరాజని, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకుని, పూజలందుకున్న రాజులు కూడా కావ్యాల్లో, కథల్లో వున్నరేవోగాని, చరిత్రలో వున్నట్టు తోచదు.
రాజు సామాజిక వర్గం పూర్వవెప్పుడో వర్తక వ్యాపారాలు చేసున్నా, వ్యవసాయాలే చేసున్నా, వేదాలే చదివున్నా, కర్రసాములే చేసున్నా, రాజుకి ఎప్పుడూ ధనం ప్రాధాన్యవే. ప్రత్యేకంగా ఎడమచేతి కులపు రాజులే విత్త ప్రాధాన్యాన్ని పెంచి పోషించేరనడం మీ స్వకపోల సిద్దాంతవేనని నా నమ్మకం. నూటికి తొంభైతొమ్మిది శాతం ప్రజలు భూమి మీద ఆధార పడిన పదిహేడో శతాబ్ధంలో, వ్యాపారం చేసి హటాత్తుగా పైకొచ్చి రాజ్యాలు చేపట్టిన కులాలు కూడా మీరు నమ్మినట్టు చాతుర్వర్ణ వ్యవస్థ లాగే ఊహల్లో వుండి వుంటే వుండి వుండొచ్చు.
ఇటువంటి కుల సంఘర్షన కాలంలో వ్రాసిందే వేంకటాధ్వరి గారు వ్రాసిన కావ్యమని చెప్పేరు. కావ్యం నేను చదవలేదు. ఐతే మీరు పరిచయం చేసిన కావ్యాంశాలని ఒక సారి పరికిద్దాం. మీ పరిచయం ప్రకారం అప్పటి సమాజంలో పెద్ద మార్పు సంభవించింది. ఎడమ చేతి కులపు వాళ్ళు రాజ్యాధికారం సంతరించుకున్నారు. వాళ్ళు రాజ్యాధికారంతో ఆగిపోకుండా తమని తాము భగవంతులుగా ప్రకటించుకున్నారు. వాళ్ళు పూర్వాశ్రమంలో వ్యాపారులుగుట చేత, సమాజంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిపొయ్యి, కులం కాకుండా, దబ్బు సంపాదన అనే గుణం సమాజంలో ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది (బలవంతులవుతున్ననవాబులు, అప్పుడప్పుడే దోపిడికి మార్గాలేస్తున్న బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ తప్ప ఆ కాలంలో అంత సమాజాన్నికల్లోలం చేసిన మార్పులేవీ జరగలేదు చరిత్ర ప్రకారం). కాబట్టి ఆ డబ్బు సంపాదన కలిగిన (ఎలా సంపాదించారో మరి, భూమి పుట్ర లేని క్రింది కులస్థులు) క్రింది కులస్థులు కూడా సమాజంలో గౌరవమైన స్థానం సంపాదించ గలిగేరు. ఎలాటి స్థానం, బ్రామ్హణులు కూడా అసూయ పడగలిగే గౌరవ స్థానాన్ని పొందగలిగేరు. దానికి చారిత్రక ఋజువు ఈ సుమతీ శతక పధ్యం. సుమతీ శతక పధ్యం ఆ కాలానిదని చెప్పడానికి, ఏకాలానిదో చెప్పడానికి ఏ ఋజువులు లేవు, కాబట్టి దాన్ని వదిలేస్తాం.
అటువంటి సంఘర్షణల సమాజంలోంచి వచ్చిన కావ్యం, ఆ సంఘర్షణని వివరించే కావ్యం ఈ విశ్వగుణాదర్శం. ఈ కావ్యంలో అధునికులు అనుకునే విమర్శనాత్మక దృక్పథం ఆ కాలానికే వుందనివేల్చూరిగారి ఉవాచ. ఎలా? ఇద్దరు గంధర్వుల సంభాషణని రెండు విరుద్ద అభిప్రాయాలుగా మలచడం ద్వారా, ఆ విమర్శనాత్మకథని రచయిత నెలకొల్పుతాడు. కాకపోతే రెండు అభిప్రాయాలుకూడా తురకలు వీరులని చెప్పటంలో, ఆంగ్లేయులు నీతివంతులని వొప్పుకోవడం లాంటి కొన్ని విషయాల్లో వేరైనా, నారాయణ రావు గారి ఉదాహరణల్లో ఇద్దరి అభిప్రాయాలు కూడా, తరిగిపోతున్న బ్రామ్హణ ప్రాబల్యాన్ని గురించి చింత పడటవే కనిపిస్తుంది. పెరిగిపోతున్న శూద్ర కులాల ప్రాభల్యానికి విచారించడవే గోచరిస్తుంది. పాపం తురుష్కులలో, తెల్లొళ్ళల్లో వీరత్వాన్ని, నీతిని చూడ గలిగిన గాంధర్వులకి, క్రింది కులాలు రాజ్యాధికారానికి రావటం మాత్రం అంత నచ్చినట్టు లేదు. ఇదేదో అప్పుడే మొదలయ్యినట్టు, భూసురులు ఇంతకుముందెప్పుడూ లౌకిక వృత్తుల్లో లేనట్టు, ఎప్పుడూ అగ్రహారం కోసం దోసిలి పట్టనట్టు గాంధర్వులు యమ బాధపడిపోతారు.
ఇంకా విచిత్రవైన విషయం ఏవిటంటే, గంధర్వుల విమర్శనాత్మక దృక్పథాన్ని మరింత ఎత్తుకి తీసుకపొయ్యే ఉద్దేశంతో ఇచ్చిన ఉదాహరణ. వీరు సంస్కృతాన్ని కూడా విమర్శించడానికి కాదు ఈసడించడానికి కూడా వెనుదియ్యరు. నారాయణ రావు గారు, బాపనోళ్ళలో కూడా మహాత్ములుంటారంటే ఉద్దేశం బ్రామ్హణులు మహాత్ములని కాదండి, వాళ్ళు జనరల్ గా మహాత్ములు కాకపోయినా, ఎక్కడో ఎప్పుడో వాళ్ళలో కూడా మహాత్ములుంటారని అర్థం, కాదనగలరా. ద్రవిడ భాషల్లొ మంచి వుంటే పరిగ్రహించవలసిందే, చెడ్డ విషయం సంస్కృతంలో చెప్పినా పరిహరించ వలసిందే అంటే ద్రవిడ భాషలు ప్రామాణికవైనవి, గౌరవించవలసినవి కాకపోయినా, మంచి చెప్తే తీసుకోవలసిందే, సంస్కృతం దేవ భాష, ప్రామాణికవైన భాష అయినప్పటికి చెడ్ద చెప్తే ఆచరించనవసరం లేదు అనే కదా. ఇందులో ద్రవిడ భాషల్ని సున్నితంగా (సున్నితవేం సున్నితం, అదేదో అదైనప్పటికి అది అదే కదా అన్నడట వాడెవ్వడో) కించపరచడవే కదా.
మీరిచ్చిన ఉదాహరణలన్నీ బ్రామ్హణ కుల సంబంధవైనవే, పొనీ అగ్రకులాల అలజడి గురించి ముచ్చటించారు, అప్పుడైనా మరోకుల ప్రశక్తి లేదుకదా. మీ పరిచయం చదివిన తర్వాత ఇది ఒకే ఒక్క అగ్రకులపేడుపని నేననుకుంటే నా తప్పుందని నేననుకోను.
ఇంత నిస్సంకోచంగా మీరెలాగ అసత్యాన్ని సత్యంగా చేయబూనుకున్నారు? కులాలతో సంబంధం లేకుండా వున్నటు వంటి చాతుర్వర్ణ వ్యవస్థ, వేదం చదవడం ద్వారానే కులలతో సంబంధం లేకుండా వర్ణ వ్యవస్థలోకి
ఎదిగిన పెద్ద బ్రామ్హణులు (పాపం బ్రామ్హణ కులంలో చిక్కు పడిపోయిన చిన్న బ్రామ్హణులు) ఇలా అందంగా పుట్టే తక్కువ కులాల ఆడవాళ్ళని చూసి ఏడవడంవవేనా ఆధునికత? సంస్కృత సాహిత్యం ఆధునికం, ఆధునికత్వానికి దూరం కాదని చెప్పడానికి ఇవా మీ ఉదాహరణలు. సమాజంలో మరేరకవైన ఘర్షణ, మార్పు కనిపించలేదా ఉదాహరించడానికి, లేకపొతే కవి గారి ఆధునికత, ఆయన విమర్శనాత్మక దృక్పథం ఆయన ముక్కు దగ్గరే ఆగిపోయిందా? కవిత్వ శొభగుల సంగతి నాకు తెలీదు, మీరు ఏవీ చెప్పినట్టు లేరు, కానీ మీరిచ్చిన ఉదాహరణలే ఆ కావ్యానికి వస్తువైతే, ఆ గంధర్వుల, వారి ద్వారా మీరు పరిచయం చేసిన విమర్శనాత్మక దృక్పథం నిజంగా విచారింపదగిన విషయం. ఐతే అందులో నాకేవీ ఆశ్చర్యం లేదు, మీ కన్యాశుల్కానువాదానికి మీ వెనుక మాట మీద వేలూరివారిచ్చిన పరిచయం చదివేను (కన్యాశుల్కాన్ని మళ్ళీ ఎందుకు చదవాలంటే, వేలూరి వెంకటేశ్వరరావు – సెప్టంబరు 2007), కన్యా శుల్కాన్ని అంతగా వక్రీకరించగలిగిన మీనుంచి మరొకటి ఆశించటం తప్పే కదా.
చివరగా కొడవళ్ళ హనుమంత రావు గారు, అది ప్రాచీనవైనా, అధినికవైనా, అధునికాంతరవైనా మరేదైనా, సాహిత్యాన్ని పదుగురికి అందుబాటులోకి తేవాలనే మీ సంకల్పం అనుమానం లేకుండా అభినందించదగినది. ఐతే బాబ్జీలు తన అభిప్రాయం చివర్లో చెప్పిన విషయం కూడా మనసులో పెట్టుకోదగినదని నా అభిప్రాయం.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/02/2009 9:01 pm
మోహన్ గారూ !!
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను నిన్న చెప్పిన అభిప్రాయానికి ఇది కొనసాగింపు. ముందుగా మీ observation సరైంది. ఇవాళ ఇంగ్లీషులో ఎంతపాటి పాండిత్యం మనవాళ్ళు సంపాదించారో నాకు తెలీదుగానీ..దేశిభాషల్లోనూ..సంస్కృతంలోనూ..మాత్రం్ చాలా నష్ట పోయేరు.ఇలా నష్టపోవడానికి..రెండు కారణాలు. మొదటిది. ఆధునికంగా కన్పించడం్ ..అలాంటి వేష భాషలు ధరించడం్ గొప్ప గా చలామణీ కానిచ్చారు. కన్యాశుల్కం్ లోనే ఈ పరిస్థితి మీద ప్రస్తావన ఉంది.దేశీయ పాండిత్యాన్ని చిన్న చూపు చూసేరు ఆధునికులు. ఆధునికమైన చదువులు
చదివిన వాళ్ళతో పాలన జరిపించుకునే ప్రభుత్వాలూను. రాజుల పోషణ పోయింది. ప్రజల్నించి ఆదరణ కరువైంది. మన తెలుగునేల ఈ భాషల్లో విశ్వవిద్యాలయాలు చేవ ఉన్నవాళవానీ..సామర్ధ్యం ఉన్న వాళ్ళనీ కాక..ఎక్కువశాతం mediocres తో నింపేసేరు. చాటపెయ్యల్లా తయారుచేసేరు వాటిని. పైరవీగాళ్ళూ..పలుకుబడి గల్గినవాళ్ళూ..మాత్రమే అక్కడ చొరబడ్డారు. కాదు అలాంటి వాళ్ళని చొరబడనిచ్చేరు.జో హుజూర్ గాళ్ళు అన్నమాట. ఒకసారి తెలుగుశాఖల్ని వెళ్ళి చూడండి. ఇంక సంస్కృతం వచ్చి డొక్కశుధ్ధి ఉన్న వాళ్ళు సంఖ్యలో తక్కువ. ఉన్న కాసింత మందీ తెలుగు టీవీ చానళ్ళలో “పురాణ ప్రవచనాలు” చెప్పుకు కాలక్షేపం చేసుకుంటున్నారు.
ఏ కాలంలోనైనా పాండిత్యానికి కొనసాగింపు ఉండాలీ అంటే..ముందు నేర్పేవాళ్ళుండాలి. మనం గురువుల్ని గౌరవించుకోలేదు.వాళ్ళ పేదరికాలకి కారణం అయ్యేం. శిష్యుల్నీ తయారుచేసుకోగల వీలు వాళ్ళకి మనం కల్పించలేదు. వాళ్ళ బతుక్కి ఎటువంటి ఆధారమూ ఈ సమాజం చూపించలేదు. ఏ ఉగాది సమయాల్లోనో పిలిచి ఒక శాలువా కప్పి వెయ్యినూట పధార్లు చేతిలో పెట్టి పంపించాం!!. పాశ్చాత్య భాషల మీది మోజుతో..వాళ్ళకి అనుకరణల్తో ఇప్పటికి ఒక 50 ఏళ్ళు గడిపీసేము. ఇవాళ కళ్ళుతెరిచి పాండిత్యం కోసం వెతుక్కుంటే ఎక్కడ కన్పిస్తుందీ??తెలుగులో మంచి పుస్తకాలు రాస్తున్న వాళ్ళు చాలా మంది ఏ ఉద్యోగాలూ లేని వాళ్ళు. యూనివర్సిటీల్లోంచి చెప్పుకోదగ్గ పరిశోధన ఏదీ?? పనిచెయ్యని వారికి అవకాశాలూ..పనిచేసేవాళ్ళకి కష్టాలూను. అసలు ఇలాటి చోట పాండిత్యాన్ని గురించిన పరితాపంలో అర్ధం ఉందా??…రమ.