నమస్కారం
ఇట్లాంటివి చదవడానికే ఓపిక, సమయం పడితే, వ్రాయడానికింకెంత ఓపిక, పరిశ్రమ,పరిశోధన ముఖ్యంగా విషయంపై విశేషమైన ఆసక్తి ఉండాలో, కాదు ఉంటేనే తప్ప ఇట్లాంటివి వ్రాయడం సాధ్యం కాదు అనిపిస్తుంది.
“వేణు గాన లోలుని కన వేయి కనులు కావలెనే” అన్నది త్యాగరాజ కృతి అని తెలుసుకొని ఆశ్చర్యపడ్డాను. సుశీలగారి కమ్మని గళంలో ఉన్న సినిమా పాట “వేణు గాన లోలుని గన వేయి కనులు చాలవులే” అన్నదానికి త్యాగరాజు కృతి ప్రేరకమే అయినప్పటికినీ, ‘వేయి కన్నులు కావలెనే’, అనడంకంటే, ‘వేయికను(లైనా) చాలవులే’ అని ఎంతో రసరమ్యంగా రాసారు రచయిత ఎవరో _ సినారె/ఆత్రేయ/ఆరుద్ర?!!
త్యాగరాజుకు పూర్వులు, సమకాలీనులు, తెలుగు సంస్కృతాలలోనే కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే, (నాకు) తెలిసినంతలో ఎంతోమంది మహానుభావులు, పూర్వకవులను స్తుతించడం, ఇతరులకు కృతజ్ఞతలందించడం లాంటివి ఉన్నా, “ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు” అని అంత సింపుల్గా, స్పష్టంగా, సాత్వికంగా, సువర్ణానికి సువాసనబ్బినట్లు, సంగీతపరంగా గళమెత్తి పలికింది, పాడింది ఒక్క త్యాగరాజే అనుకుంటాను. ఎన్నో వివరాలందించినందుకు వందనాలు.
====
విధేయుడు
-Srinivas
బాబ్జీలు మొషోయ్,
I quote your words: “పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.” ఇవి బాబాగారి అభిప్రాయమ్మీద తమరుగారు వెలువరించిన అభిప్రాయం కాదా? ఇట్టాంటి పుంజీడు వ్యాఖ్యల్ని చూస్తే గరికపాటి వారికి బాధ కలగదా?
అయినా కవితాత్మని ఎవరో ఎందుకు ఆవిష్కరించాలి? కవి చెప్పాల్సింది చెప్పాడు. ఆవిష్కరించాల్సిందేదో ఆయనే ఆవిష్కరించాడు (దాచి ఉంచాల్సిందాన్ని చూపించేశాడనే గదా, అస్లీలం అని మొత్తుకునేది జనాలు). ఆ ఆవిష్కరించింది ఆత్మకాదు, అది దెయ్యం బూతం పిశాచం అని కొందరు సహృదయులు సెర్టిఫై చేసేశారు గదా. తమరుగారికి తృప్తికాలేదా? హబ్భే, మీరనవసరంగా దాన్నొక కొరివిదయ్యమని భయపడుతున్నారు, అది ఒక దీపమే అని చూపించడానికి ప్రయత్నించిన బొల్లోజుబాబా మీద పుంజీడు పేణ్ణీళ్ళు చల్లింది తమరుగారు కాదా? ఇంకా యేల ఈ ఆత్మల వేట?
ముందుగా బాబ్జీలు గారికి – ఈ మాత్రానికి కాపీ అనుకోనక్కర్లేదు. ఆనందభైరవి, మధ్యమావతి, సురటి, ఇలాంటి రాగఛ్ఛాయలున్న సాంప్రదాయక పాటలు (స్త్రీల పాటలు లాలి పాటలు ఇత్యాది) బోలెడున్నాయి. త్యాగరాజు ఉత్సవ సాంప్రదాయ కృతుల్నీ, దివ్యనామ సంకీర్తనల్నీ ఇదే ఉద్దేశంతో (సంగీతం నేర్చుకోని వాళ్ళయినా పాడుకోగలిగేట్టు) రాశారని నా నమ్మకం. అంచేత ఇటువంటి సాంప్రదాయ బాణీలు కొన్ని ఈ కృతుల్లో కనిపిస్తాయి.
సాయిబ్రహ్మానందం గారూ – మీరు మళ్ళీ పొరబడ్డారని చెప్పడానికి విచారిస్తున్నాను. త్యాగరాజ కృతుల్లో రెండో అక్షర ప్రాస రెండు విడతలుగా అమలు అవుతుంది. పల్లవికీ అనుపల్లవికీ కలిపి ఒక ప్రాస. చరణానికి ఇంకో ప్రాస. ఒకటికంటే ఎక్కువ చరణాలుంటే ప్రతి చరణానికీ వేరే ప్రాస ఉండొచ్చు. కొన్ని కృతుల్లో పల్లవిలో ఉపయోగించిన ప్రాసనే చరణంలోనూ వాడ్డం ఉంది. ఉదా:
పల్లవి: ఎందరో మహానుభావులు; అను: చందురూ వర్ణుని
పల్లవి: నను పాలింప; అను: వనజ నయన
పాట అంతా ఒకటే ప్రాస: పల్లవి: నగుమోము గనలేని; అను: నగరాజ ధర; చరణం: ఖగరాజు, గగనానికి, జగమేలే, వగ జూపకు
ఇక, ఒక తాళ ఆవృత్తము = ఒక పాదము అనే సూత్రం. నగుమోమునే తీసుకోండి. పల్లవీ అనుపల్లవీ కూడా ఆదితాళంలో రెండేసి ఆవృత్తాలు పడతాయి. కానీ పాదం ఒక్కటే.
మీరు మొదట ఉదహరించిన వాసుదేవయని కృతి యైనా అంతే. చరణంలోనూ అంతే. ఒక్కో పాదమూ రెండేసి ఆవృత్తాలు సాగుతుంది. అదే రెండుకళల చౌక పద్ధతిలో పాడారనుకోండి, ఈ పాదం మొత్తమూ ఒక తాళ ఆవృత్తంలోనే ఇముడుతుంది. సాహిత్యపు వరుసకీ తాళానికీ ఉన్న సంబంధం సాపేక్షమే గానీ అబ్సొల్యూటు కాదుగదా. నా ఉద్దేశంలో చివరికి పాదం ఎక్కడ అంతమైంది అనేది ఆయా కృతిలో అనుసరించిన ఛందస్సుని బట్టి ఉంటుంది. ఇక ఆయన రాసిన కొన్ని పద్యాల్లో ఛందస్సు సరిపోలేదన్న మూలాన త్యాగరాజు ఛందస్సుని పట్టించుకోలేదనే వ్యాఖ్య కూడా పేలవంగా కనిపిస్తుంది. శాస్త్రాలు ఏమీ చదువుకోని నేనే రాయగలను అర్ధవంతమైన కందపద్యాలూ, సీసపద్యాలూ. సంస్కృతాంధ్రాల్లో పండితుడైన త్యాగరాజు ఆమాత్రం సీస పద్యం ఛందోనియమాలన్నీ పాటిస్తూ రాయలేదనేది ఏమీ నమ్మేట్టుగా లేదు. మరి మన చేతికి అందిన ప్రతుల్లో ఆ తప్పులు ఎందుకు ఉన్నాయో పైవాడికి తెలియాలి.
బాబ్జీలు గారూ! చర్చ సరైన దిశగా నడవాలి. కొత్త, పాత లేదా మంచి..చెడ్డ కాదు.పాండిత్యం అన్నది ముఖ్యంగా కవిత్వం విషయంలో..అందునా పాత కావ్యాల విషయంలో..ఆనాటి భాష మీద పట్టూ..అందులోని విషయాన్ని విశ్లేషించగల సామర్ధ్యం మెండుగా ఇంకా వాటిల్లోని విశేషాల్ని విప్పిచెప్పగల దక్షత ..అనేక పుస్తకాల్తో పరిచయం..వాటిని సవ్యంగా పాఠకుల ముందుకి తేగల నేర్పూ..ఉన్నవాళ్ళు..వీళ్ళూ పండితులంటే!! అనేక భాషాసాహిత్యాలు అర్ధం చేసుకోగలవాళ్ళూనూ. పాతకాలంలో ఇటువంటి విద్వత్తు ఉన్నవాళ్ళ్ళు ఉండేవారు. వారిని గొప్పగా గౌరవించేవారు. అలాంటి scholarship క్రమేపీ తగ్గిపోయింది. భట్టు అనేవారు పూర్వం. అంటే ఎనిమిది భాషల్లో విశారదులై ఉండాలి. మరి ఇవాళ ఈ నిర్వచనం పరిధిలోకి వచ్చే” పండితులు” ఏరీ??
అందువలన చాలా మందివి అరకొర పాండిత్యాలే!! అయితే అందుకని పుస్తకాలు చదవకుండా ఉండలేము కదా? ఉన్నంతలో ఎవరి పుస్తకం మనలోని పఠన తృష్ణని తీరుస్తుందో దాన్ని చదువుకోవాల్సిందే కావాలనుకుంటేనే సుమా!! ఇంక వ్యాఖ్యాత భావాలు నచ్చకపోతే..చప్పగా అన్పిస్తే..అది సహజం గానే మరుగునపడి పోతుంది. పాఠకుల్ని ఎవరుగానీ మభ్యపెట్టలేరు. కష్టం.
ఇంతకీ చెప్పేదేమంటే..పుస్తకాలని రానివ్వండి. పాత సాహిత్యాన్ని చదవడానికి …ఇవాళ్టి తరంకోసం.. పాత సాహిత్యం..వాటి వ్యాఖ్యానాల్తో మళ్ళీ ప్రచురించడం అవసరం. ఆ పని ఎవరు చేసినా అందుకు స్వాగతించాలి. అథవా ఆ వ్యాఖ్యానం నాసిరకంగా ఉంటే తప్ప….ఈ పుస్తకం వట్టి దండగ అని చెప్పడానికి.. తెలివైన వారు ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు. ఏమంటారు?
రమ.
యుగంధర్ గారూ, సూర్య గారూ,
వాగుడు కాయల్నీ, moral police ల గురించీ అభిప్రాయాలు రాసే బదులు పై పెట్టె లో నున్న కవితాత్మను ఆవిష్కరింపచేయొచ్చు కదా? గరికపాటి వారు బాధపడ్డది ఇలాటి అభిప్రాయాలపై అభిప్రాయాలకే అనుకుంటాను. ఇయన్నీ వొగ్గేసి పైనున్న బోడి పద్యం మీద ఏటైనా సెప్పండి. అప్పుడు వాగుడుకాయలూ, “మోరల్” రక్షకభటులూ సిగ్గుపడిపోయి, తప్పైపోనాదని లెంపలేసుకుని బుద్దిగుంటారు.
ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.
“మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?
ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.
కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.
కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.
మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.
కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?
బాబ్జీ,
ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.
కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.
కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.
గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?
వెల్చేరు వారు పరిచయం చేసిన గ్రంథానికి పండితుల వ్యాఖ్యలు కావాలా? మధ్యలో ఈ పండితులెవరు? వీళ్ళ అర్హతలేవిటి? వెల్చేరు వారికన్నా వీరుధ్ధరించినదేమిటి? మంచి గతమున కొంచెమే. ఆ కొద్ది మంచితనాన్ని మంచిగా చెప్పేవారెవరు? “పన్”డితులు అంటే అట్నించిటూ ఇట్నించటూ కూడా చెప్పగలిగినవాళ్ళా?
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/20/2009 7:52 am
నమస్కారం
ఇట్లాంటివి చదవడానికే ఓపిక, సమయం పడితే, వ్రాయడానికింకెంత ఓపిక, పరిశ్రమ,పరిశోధన ముఖ్యంగా విషయంపై విశేషమైన ఆసక్తి ఉండాలో, కాదు ఉంటేనే తప్ప ఇట్లాంటివి వ్రాయడం సాధ్యం కాదు అనిపిస్తుంది.
“వేణు గాన లోలుని కన వేయి కనులు కావలెనే” అన్నది త్యాగరాజ కృతి అని తెలుసుకొని ఆశ్చర్యపడ్డాను. సుశీలగారి కమ్మని గళంలో ఉన్న సినిమా పాట “వేణు గాన లోలుని గన వేయి కనులు చాలవులే” అన్నదానికి త్యాగరాజు కృతి ప్రేరకమే అయినప్పటికినీ, ‘వేయి కన్నులు కావలెనే’, అనడంకంటే, ‘వేయికను(లైనా) చాలవులే’ అని ఎంతో రసరమ్యంగా రాసారు రచయిత ఎవరో _ సినారె/ఆత్రేయ/ఆరుద్ర?!!
త్యాగరాజుకు పూర్వులు, సమకాలీనులు, తెలుగు సంస్కృతాలలోనే కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే, (నాకు) తెలిసినంతలో ఎంతోమంది మహానుభావులు, పూర్వకవులను స్తుతించడం, ఇతరులకు కృతజ్ఞతలందించడం లాంటివి ఉన్నా, “ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు” అని అంత సింపుల్గా, స్పష్టంగా, సాత్వికంగా, సువర్ణానికి సువాసనబ్బినట్లు, సంగీతపరంగా గళమెత్తి పలికింది, పాడింది ఒక్క త్యాగరాజే అనుకుంటాను. ఎన్నో వివరాలందించినందుకు వందనాలు.
====
విధేయుడు
-Srinivas
బోడి పద్యం గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
03/20/2009 6:32 am
బాబ్జీలు మొషోయ్,
I quote your words: “పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.” ఇవి బాబాగారి అభిప్రాయమ్మీద తమరుగారు వెలువరించిన అభిప్రాయం కాదా? ఇట్టాంటి పుంజీడు వ్యాఖ్యల్ని చూస్తే గరికపాటి వారికి బాధ కలగదా?
అయినా కవితాత్మని ఎవరో ఎందుకు ఆవిష్కరించాలి? కవి చెప్పాల్సింది చెప్పాడు. ఆవిష్కరించాల్సిందేదో ఆయనే ఆవిష్కరించాడు (దాచి ఉంచాల్సిందాన్ని చూపించేశాడనే గదా, అస్లీలం అని మొత్తుకునేది జనాలు). ఆ ఆవిష్కరించింది ఆత్మకాదు, అది దెయ్యం బూతం పిశాచం అని కొందరు సహృదయులు సెర్టిఫై చేసేశారు గదా. తమరుగారికి తృప్తికాలేదా? హబ్భే, మీరనవసరంగా దాన్నొక కొరివిదయ్యమని భయపడుతున్నారు, అది ఒక దీపమే అని చూపించడానికి ప్రయత్నించిన బొల్లోజుబాబా మీద పుంజీడు పేణ్ణీళ్ళు చల్లింది తమరుగారు కాదా? ఇంకా యేల ఈ ఆత్మల వేట?
[ఈ కామెంట్ ఎడిట్ చేయబడినది – సం.]
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
03/20/2009 6:15 am
ముందుగా బాబ్జీలు గారికి – ఈ మాత్రానికి కాపీ అనుకోనక్కర్లేదు. ఆనందభైరవి, మధ్యమావతి, సురటి, ఇలాంటి రాగఛ్ఛాయలున్న సాంప్రదాయక పాటలు (స్త్రీల పాటలు లాలి పాటలు ఇత్యాది) బోలెడున్నాయి. త్యాగరాజు ఉత్సవ సాంప్రదాయ కృతుల్నీ, దివ్యనామ సంకీర్తనల్నీ ఇదే ఉద్దేశంతో (సంగీతం నేర్చుకోని వాళ్ళయినా పాడుకోగలిగేట్టు) రాశారని నా నమ్మకం. అంచేత ఇటువంటి సాంప్రదాయ బాణీలు కొన్ని ఈ కృతుల్లో కనిపిస్తాయి.
సాయిబ్రహ్మానందం గారూ – మీరు మళ్ళీ పొరబడ్డారని చెప్పడానికి విచారిస్తున్నాను. త్యాగరాజ కృతుల్లో రెండో అక్షర ప్రాస రెండు విడతలుగా అమలు అవుతుంది. పల్లవికీ అనుపల్లవికీ కలిపి ఒక ప్రాస. చరణానికి ఇంకో ప్రాస. ఒకటికంటే ఎక్కువ చరణాలుంటే ప్రతి చరణానికీ వేరే ప్రాస ఉండొచ్చు. కొన్ని కృతుల్లో పల్లవిలో ఉపయోగించిన ప్రాసనే చరణంలోనూ వాడ్డం ఉంది. ఉదా:
పల్లవి: ఎందరో మహానుభావులు; అను: చందురూ వర్ణుని
పల్లవి: నను పాలింప; అను: వనజ నయన
పాట అంతా ఒకటే ప్రాస: పల్లవి: నగుమోము గనలేని; అను: నగరాజ ధర; చరణం: ఖగరాజు, గగనానికి, జగమేలే, వగ జూపకు
ఇక, ఒక తాళ ఆవృత్తము = ఒక పాదము అనే సూత్రం. నగుమోమునే తీసుకోండి. పల్లవీ అనుపల్లవీ కూడా ఆదితాళంలో రెండేసి ఆవృత్తాలు పడతాయి. కానీ పాదం ఒక్కటే.
మీరు మొదట ఉదహరించిన వాసుదేవయని కృతి యైనా అంతే. చరణంలోనూ అంతే. ఒక్కో పాదమూ రెండేసి ఆవృత్తాలు సాగుతుంది. అదే రెండుకళల చౌక పద్ధతిలో పాడారనుకోండి, ఈ పాదం మొత్తమూ ఒక తాళ ఆవృత్తంలోనే ఇముడుతుంది. సాహిత్యపు వరుసకీ తాళానికీ ఉన్న సంబంధం సాపేక్షమే గానీ అబ్సొల్యూటు కాదుగదా. నా ఉద్దేశంలో చివరికి పాదం ఎక్కడ అంతమైంది అనేది ఆయా కృతిలో అనుసరించిన ఛందస్సుని బట్టి ఉంటుంది. ఇక ఆయన రాసిన కొన్ని పద్యాల్లో ఛందస్సు సరిపోలేదన్న మూలాన త్యాగరాజు ఛందస్సుని పట్టించుకోలేదనే వ్యాఖ్య కూడా పేలవంగా కనిపిస్తుంది. శాస్త్రాలు ఏమీ చదువుకోని నేనే రాయగలను అర్ధవంతమైన కందపద్యాలూ, సీసపద్యాలూ. సంస్కృతాంధ్రాల్లో పండితుడైన త్యాగరాజు ఆమాత్రం సీస పద్యం ఛందోనియమాలన్నీ పాటిస్తూ రాయలేదనేది ఏమీ నమ్మేట్టుగా లేదు. మరి మన చేతికి అందిన ప్రతుల్లో ఆ తప్పులు ఎందుకు ఉన్నాయో పైవాడికి తెలియాలి.
3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
03/20/2009 5:32 am
“తెలంగాణా యాసలో “దర్గామిట్టీ కథలూ” ?? ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట కతలకి రంగస్థలం ఒంగోలు జిల్లాలోని కావలి పట్టణం.
కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/20/2009 2:52 am
రవికిరణ్ గారూ!!
“చదివించే గుణం” అన్నారు చూసేరూ..అదీ సరైన మాట.అది లేందే ఇంక అందులో ఏమున్నా ఒహటే!!
కాఫ్కా frozen sea అన్నimage పూర్తిగా western అనుభవంలోంచి చెప్పింది.
దాన్నలాగే స్వీకరించాలి .
రమ.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/20/2009 2:31 am
బాబ్జీలు గారూ! చర్చ సరైన దిశగా నడవాలి. కొత్త, పాత లేదా మంచి..చెడ్డ కాదు.పాండిత్యం అన్నది ముఖ్యంగా కవిత్వం విషయంలో..అందునా పాత కావ్యాల విషయంలో..ఆనాటి భాష మీద పట్టూ..అందులోని విషయాన్ని విశ్లేషించగల సామర్ధ్యం మెండుగా ఇంకా వాటిల్లోని విశేషాల్ని విప్పిచెప్పగల దక్షత ..అనేక పుస్తకాల్తో పరిచయం..వాటిని సవ్యంగా పాఠకుల ముందుకి తేగల నేర్పూ..ఉన్నవాళ్ళు..వీళ్ళూ పండితులంటే!! అనేక భాషాసాహిత్యాలు అర్ధం చేసుకోగలవాళ్ళూనూ. పాతకాలంలో ఇటువంటి విద్వత్తు ఉన్నవాళ్ళ్ళు ఉండేవారు. వారిని గొప్పగా గౌరవించేవారు. అలాంటి scholarship క్రమేపీ తగ్గిపోయింది. భట్టు అనేవారు పూర్వం. అంటే ఎనిమిది భాషల్లో విశారదులై ఉండాలి. మరి ఇవాళ ఈ నిర్వచనం పరిధిలోకి వచ్చే” పండితులు” ఏరీ??
అందువలన చాలా మందివి అరకొర పాండిత్యాలే!! అయితే అందుకని పుస్తకాలు చదవకుండా ఉండలేము కదా? ఉన్నంతలో ఎవరి పుస్తకం మనలోని పఠన తృష్ణని తీరుస్తుందో దాన్ని చదువుకోవాల్సిందే కావాలనుకుంటేనే సుమా!! ఇంక వ్యాఖ్యాత భావాలు నచ్చకపోతే..చప్పగా అన్పిస్తే..అది సహజం గానే మరుగునపడి పోతుంది. పాఠకుల్ని ఎవరుగానీ మభ్యపెట్టలేరు. కష్టం.
ఇంతకీ చెప్పేదేమంటే..పుస్తకాలని రానివ్వండి. పాత సాహిత్యాన్ని చదవడానికి …ఇవాళ్టి తరంకోసం.. పాత సాహిత్యం..వాటి వ్యాఖ్యానాల్తో మళ్ళీ ప్రచురించడం అవసరం. ఆ పని ఎవరు చేసినా అందుకు స్వాగతించాలి. అథవా ఆ వ్యాఖ్యానం నాసిరకంగా ఉంటే తప్ప….ఈ పుస్తకం వట్టి దండగ అని చెప్పడానికి.. తెలివైన వారు ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు. ఏమంటారు?
రమ.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
03/19/2009 9:04 pm
చెప్పే విషయం మీదా, భాష మీదా పట్టు ఉండటమే కాక, సొంత అనుభవాలతో రాస్తే, చదివే వాళ్ళకి ఉత్కంఠ, విజ్ఞానంతో పాటు ఆనందం కలుగుతాయని సురేష్ నిరూపించారు.
కొడవళ్ళ హనుమంతరావు
బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/19/2009 10:20 am
యుగంధర్ గారూ, సూర్య గారూ,
వాగుడు కాయల్నీ, moral police ల గురించీ అభిప్రాయాలు రాసే బదులు పై పెట్టె లో నున్న కవితాత్మను ఆవిష్కరింపచేయొచ్చు కదా? గరికపాటి వారు బాధపడ్డది ఇలాటి అభిప్రాయాలపై అభిప్రాయాలకే అనుకుంటాను. ఇయన్నీ వొగ్గేసి పైనున్న బోడి పద్యం మీద ఏటైనా సెప్పండి. అప్పుడు వాగుడుకాయలూ, “మోరల్” రక్షకభటులూ సిగ్గుపడిపోయి, తప్పైపోనాదని లెంపలేసుకుని బుద్దిగుంటారు.
కథ దేని గురించి? గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
03/19/2009 9:55 am
సీతారామయ్య గారు,
ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.
“మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?
ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.
కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.
కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.
మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.
కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?
బాబ్జీ,
ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.
కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.
మీతో ఏకీభవిస్తాను రమ గారు, గురూ గారన్నట్టు, నవ్వేది, నవ్వించేది, కదిలేది, కదిలించేదే కదా, కవితైనా, కథైనా.
కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.
గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?
రవికిరణ్ తిమ్మిరెడ్డి
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/19/2009 9:49 am
ఎమ్. ఎస్. ప్రసాదు గారూ,
వెల్చేరు వారు పరిచయం చేసిన గ్రంథానికి పండితుల వ్యాఖ్యలు కావాలా? మధ్యలో ఈ పండితులెవరు? వీళ్ళ అర్హతలేవిటి? వెల్చేరు వారికన్నా వీరుధ్ధరించినదేమిటి? మంచి గతమున కొంచెమే. ఆ కొద్ది మంచితనాన్ని మంచిగా చెప్పేవారెవరు? “పన్”డితులు అంటే అట్నించిటూ ఇట్నించటూ కూడా చెప్పగలిగినవాళ్ళా?