బాబ్జీ,
మడి కట్టుకున్న సాహితీవేత్తలు, సాహిత్య సంఘాలు కొత్తవేం కాదు కదా. బతుకులో, సమాజంలో ఎన్నిరకాల పరిధిలు వున్నయో, సాహిత్యంలో కూడా అన్నిరకాల పరిధిలూ వున్నాయి. ప్రతి పరిధి కూడా మడికట్టుకున్న పరిధే. ఆ పరిధిలో భావన, ఆ పరిధిలో విలువలు తప్ప మిగిలిన వాటిని దూరంగా పెట్టటం, దూరంగా వుండటవనేది ప్రతి పరిధికీ వున్న సహజ లక్షణవే. విరసం కూదా వొక మడిగట్టుకున్న పరిధే. ఐతే విరసం వొక్కటే ఆ లక్షణాలు వున్నది కాదు.
సమాజంలో మార్పు ఎంత సహజవో, ఆ మార్పుని ముందరే పసిగట్టి, ఆ దిశలో స్పందించట వనేది, సాహిత్యనికున్న ఒక గొప్ప లక్షణం. జైన, బౌద్ద మతాలు విస్తరించే దశలోనూ, తిరిగి హిందూ మతం బలబడుతున్న సమయంలోనూ, ఆ తర్వాత స్వాతంత్రోధ్యమ సమయంలోనూ (ఇవి సమాజంలో సవాలక్ష మార్పుల్లో కొన్ని మాత్రవే) మారుతున్న సమాజంలో, పాత కొత్తల ఘర్షణ ఒక కొత్త, అధ్బుతవైన సాహిత్య సృష్టికి కారణమవుతూనే, అంతకంటే ఎక్కువగా మూస సాహిత్యానికి కూడా కారణమవుతుంది. దేశ, కాల పరిధుల్తో సంబంధం లేకుండా, ఏ కాలవైనా, ఏ దేశవైనా, ఏ ప్రదేశవైనా, ఏ రాష్త్రవైనా, ఏ ఊరైనా, ఏ వీధైనా, ఏ కుటుంబవైనా, ఏ మనిషైనా గిరిగీసుకోవడం ఒక సహజ లక్షణం. ఆ గిరి ఒక సమయంలో ఒక కొత్త మార్పుకి, ఒక కొత్త భిన్నమైన సాహిత్య సృష్టికి ప్రాణం పోస్తే, అదే గిరి ఒక సమయంలో మరో కొత్త ఆలోచనకి అడ్డంకి కావొచ్చు. విరసం దానికి భిన్నవేవీ కాదు. విరసం, మొదటిది కూడా కాదు. ఐతే ఆ గిరి వెలుపల కూడా చాలా ప్రపంచవుంటుంది. గిరి గీసుకోవడం (విరసం, అరసం లాంటి సాహిత్య సంఘాల్ని సృష్టించుకోవడం) అంటేనే ఆ గిరితో విభేదించే మరో గిరి వుందన్న మాట. ఆ గిరి వెలుపల కూడా చాలా సాహిత్య సృష్టి జరుగుతుంది.
తెలుగు సాహిత్య లోకాన్నంతటిని విరసం గుప్పిట్లో పెట్టుకోలేదు. మొత్తం సమాజాన్ని శాసించగలిగే శక్తి దానికి లేదు. తెలుగు కవులు, కథకులు అందరు విరసం సభ్యులు కాదు. విరసాన్ని అభిమానించే వాళ్ళకన్నా, నిరశించే వాళ్ళే ఎక్కువ తెలుగు దేశంలో. ఐనా కూడా రచయితల చేతగాని తనానికి, మూస కథల సృష్టికి విరసవే కారణవని నువ్వంటే చేసేదేంలేదు. కానీ విరసానికి భిన్నవైన తెలుగు సాహిత్యంలో మూస కథలు లేవని, లేకపోవడం కాదు, ఇబ్బడి ముబ్బడిగా లేవని చెప్పగలవా? విరసం బతుకుని మరో కొత్త కోణంలో పరిశీలించింది. ఆ కోణంలో సాహిత్యానికి ఒక వూపునిచ్చింది. చూడగలిగిన వాళ్ళు చూశారు, వ్రాయ గలిగిన వాళ్ళు వ్రాశారు. కొందరు తమ పదిహేను నిముషాల వెలుగు కోసం అనుకరించారు. ఒకరి సృజన శక్తిని అణగదొక్కగలిగే బలం విరసానికి, అరసానికి, మరొ సారస్వత సంఘానికి లేదు.
రమ గారు చెప్పినట్టు, విరసం కాదు కదా మరే సంఘం కూడా ఎవరి సృజన శక్తినీ అణచలేదు. కారా గారితోపాటు ఎవరైనా వ్రాయకపోవడానికి కారణం, వాళ్ళు వ్రాయలేకపోవడవే. ఎవరు కూడా పుట్టిందిమొదలు పొయ్యేదాకా సాహిత్య సృష్టి చెయ్యలేరు. బాల్యం లాగా, యవ్వనంలాగా, బహుశా వృద్దాప్యం లాగా, సాహిత్య సృష్టి కూదా ఒక ఆది, అంతం వున్నటువంటిదే. ఆ తర్వాత కూడా రాస్తారు, ఎప్పుడో ఒకటో అరో కవిత చమక్కుమనవచ్చు, కానీ రమ గారు అది ఇంగవ చుట్టిన గుడ్డ వాసనే కానీ, ఇంగవ కాదనీ మనవి.
ఇక విరసం ఒక రచయితల సంఘవే కాదు, ఒక సామాజిక, రాజకీయ రచయితల సంఘం. దానీ విధానాలు, రాజకీయాలు, ఆ దిశలో దాని పరిధిలు దానివి. శ్రీశ్రీ సినిమాల్లో ప్రేమ గీతాలు వ్రాయడానికి, భక్తి గీతాలు వ్రాయడానికి, ఇందిరా గాంధీ ఇరవై సూత్రాలమీద వ్రాయడానికి ఆయనకి విరసం అడ్డురాలా. విరసం సభ్యుడైన తర్వాతో, ఆ తర్వాతో ఆయన కవిత్వ సృష్టి చేయలేకపోవడానికి కారణం, ఆయనలో ఆ సృజనాత్మక నిండుకోవడవే.
యుగంధర్ మహాశయా!
కందపద్యములూ, సీస పద్యములూ వ్రాయగలిగిన మీరు ఈ వచన కవిత గురించి ఎందుకు వ్రాయరు? మిగిలిన శీర్షికలలో చక్కని అభిప్రాయములు వ్రాసిన మీరు ఇచ్చట ఎందుకిటుల వ్రాయుట? మొదటి అభిప్రాయము నాది. అందు నాకవగతమవని వాటిని గురించి అడిగితిని. కవి గారెటూ జవాబివ్వజాలరు. కవితని ఆనందించి, అనుభూతించి అనుభవించిన వారుకూడా కవితని విపులీకరించకపోవడం మా దౌర్భాగ్యం. బొల్లోజుబాబా గారి అభిప్రాయమునకు జవాబుగా నాఅభిప్రాయమందు “ధార” గురించి ప్రశ్నించితిని. ఆయనా తదుపరి మీరునూ కవిత గురించి తప్ప మిగిలిన విషయముల గురించి విశ్లేషించినారు. మీరన్నట్టు కవిగారు రాసేసి జనం మీదకొదిలేస్తే సరిపోదు. ప్రతీ కాళిదాసుకీ ఓ మల్లినాథ సూరి వుంటేనే కాని కుదరదు. “అఫ్సరుడు” (మళ్ళీ వరదలో కొట్టుకొచ్చిన ప్రయోగం”) గారికి మీరో, సూర్య గారో మల్లినాథ సూరనుకుని అడగడం నా తప్పు. క్షమించండి. ఇదే “అఫ్సరుడి” గారి కవిత ఈ మధ్య సోమవారం సాహిత్య పేజీల్లో పడింది. అది లక్ష రెట్లు నయం ఈ బోడి పద్యం కన్నా. బహుశా ఈ బోడి పద్యం ఈమాట కోసం ప్రత్యేకించి రాసేరేమో? One more thing whoever punches some trash in this area are not critics. అభిప్రాయాలు రాసే వారు విమర్శకులు కారు. అంచేత పుంజీడు అభిప్రాయాలు పుంజీడు విమర్శలు కాదు. “మీ అభిప్రాయం తెలియ చేయండి” లో అభిప్రాయం తెలియచేయడం ఎందుకు? ఎవర్నుధ్ధరించడానికి? తెలుగు భాషనుధ్ధరించడానికా?
లేదు బాబ్జీలు గారూ మీ అభిప్రాయం సహేతుకమైందే! సాహిత్యానికి తన నిరంకుశ వైఖరి ద్వారా విరసం సరిపడా అపకారం చేసింది. స్వతహాగా మంచి కవి రచయితలైన..శ్రీశ్రీ..కొకు..రావిశాస్త్రి..కాళీపట్నం..లాం టి వాళ్ళూ..అలాగే మిగిలిన మరి కొందరు..వారి విశ్వాసాలకి కట్టుబడి విరసంలో కొనసాగారు.కానీ విరసానిది ధృతరాష్ట్ర కౌగిలి. అందువల్ల అందులోకి వెళ్ళాకా కవిత్వం తగ్గి..కొత్తవి చెప్పుకోదగ్గవేవీ రాయలేక..విరసానికి పబ్లిసిటీ ముఖంలాగా మిగిలేడు శ్రీశ్రీ. కాళీపట్నం రామారావు గారు “యజ్నం” లాంటి గొప్ప కధని విరసం రాజకీయాలతో సంబంధం లేకుండానే రాసి కూడా..అందులో సభ్యులయ్యాకా..మళ్ళీ అంత బలమైన కధ ఏదీ రాయలేదు.విరసానికి పెద్ద దిక్కుగా పెద్దమనిషి పాత్రలో మిగిలారు. వీరి సంగతే ఇలా ఉంటే ఇహ మిగతా వాళ్ళ మాట చెప్పేదేముందీ??
విరసం ఏనాడూ తన సంస్థలో భాగం కాని కవి రచయితల విషయంలో కొంచెం కూడా సానుకూల వైఖరిని చూపించలేదు సరికదా..తనకి పనిపడినప్పుడు మాత్రం..తెనుగుదేశం లోని సకల కవి,రచయిత విమర్శక శిఖామణులంతా..”మేధావులు” అందరూ..తమ వెనకే ఉన్నారని చెప్పడానికి సదా ప్రయత్నించింది. రచయితలే కాని వారికి సంస్థ పగ్గాలు అప్పజెప్పింది.వాళ్ళూ రచయితలకీ..సాహిత్యానికీ నిరభ్యంతరంగా నాయకత్వం వహించేయగలిగేరు. దీన్ని ప్రశ్నించే వీలుని గానీ..ఇందుకు జవాబు చెప్పే పూచీ గానీ ఆ సంస్థ ఏనాడూ తీసుకోలేదు. అందులో ఉన్న కవి ..రచయితలు సైతం ఈ పరిస్థితిని భరించేరు గానీ..ప్రశ్నించినట్టు కన్పించదు. అందులో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్న విషయం బహిరంగ రహస్యమే!! విమర్శకి చోటు తీసేసి..అడిగిన ఎవరినైనా దబాయించడంలో చూపిన శ్రధ్ధ..ఆత్మ విమర్శలో చూపక..దాని పరిధిని సంకుచితం చేసుకుంది….రచయితలు లేని రచయితల సంస్థ అది. ప్రాపగాండా లిటరేచర్ కీ..ఆ తరహా సాహిత్యానికీ మాత్రమే దాని ప్రాపు. గనక మీ పరిశీలన సరైందే!!
రమ.
బోడి పద్యం గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:
03/21/2009 5:18 am
“జాగ్ నీకీ రాత్” అనే కవిత్వం గుర్తుకువచ్చింది
కళ్ళలో సూదుల్లా గుచ్చుతున్న నిద్రలాంటి కాలాన్ని ఓపుకుంటూ గడుపుతున్న సందర్భం
నిద్రపోని అనేక సంఘటనలు ఎదురౌతూనేవున్నాయి
చెప్పటం మర్చిపోయాను. ఈ వ్యాసం నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా సెప్టెంబర్ లో డిట్రాయట్ కు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మా డిటియల్సీ తరఫున శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ ల శతజయంతి ఉత్సవం జరుపుతున్నాం (సెప్టెంబర్ 26, 27). మీరందరూ వచ్చారంటే ఈ వ్యాసం నచ్చలేదని నాకు ముఖం మీదే చెప్పొచ్చు, కథల గురించి చాలా కబుర్లు చెప్పుకోవచ్చు, నాకంటే వ్యాసాలు బాగా రాసే వారిని చాలా మందిని కలవొచ్చు. ఏమంటారూ? వస్తారు కదూ.
రవికిరణ్ గారూ,
నేన్రాసిన నిజాయితీ, కథలోని వస్తువుమీద రచయితకున్న నిజాయితీ. రచయిత బతుకు గురించి కాదు.
విరసం వల్ల మంచి కథకులు ఎవరూ తయారవలేదని నా నమ్మకం. విరసం వల్ల రచయితలూ మరియూ కళాకారులూ “ఫారం కోడిపెట్టల్లా” తయారయేరని నా అనుమానం. విరసం వల్లే విరసపు సాహిత్యం తప్ప మిగిలిన సాహిత్యవంతా అంటరానిదనీ, ముట్టుకుంటే దేవిడీమన్నా అనుకునే తత్వం ప్రబలిపోయిందని నా నమ్మకం. మహానుభావులందరూ వొప్పుకున్న కథకుండవలసిన “చదివించే గుణం” చెట్టెక్కిపోయిందని నానమ్మకం. ఇవన్నీ అపనమ్మకాలయితే చాలా సంతోషం.
మిత్రులారా, ఒక్క విషయం. ఈ కథ ఆత్మహత్య గురించి కానే కాదు. ప్రకృతిలో లీనమై పోవాలన్న ఒక తీవ్రమైన కోరికలోంచి వచ్చిన తాదాత్మ్యపు ఆలొచనా ధారగా నేను స్వీకరిస్తున్నా. ఎందుకంటే ఈ కథ రాస్తున్నపుడు భగవంతం, నేను కొన్ని సమయాల్లో కలిసే ఉన్నాం. ఇదొక అలోచనా ధారకు అక్షర రూపం, కొన్ని విషయాలను ఏ అక్షరం ప్రకటింప చేయగలగదు. కథ చివర్లో అర్ధం కావట్లెదు అన్నది, భాషకి అందని ఎక్స్ప్రెషన్ అని భావన. ఎంతైనా కథా రచయిత కథని చాలా సమర్ధవంతంగా నడిపించాడు. కథలో కవిత్వం నిబిడీకృతమైఉంది.
ఈగ హనుమాన్
వెంకటేశ్వర రావు గారు ,
నేను కూడా చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాడినే. కానీ గణన యంత్రం (కంప్యూటర్) కనిపెట్టినప్పుడు దాని వలన దుష్ఫలితాలు ఉన్నాయని తెలిసినా దాన్ని వాడల్సినటువంటి పరిస్థితి ఎలా కలిగిందో , రేపు ఈ Digitalization కూడా అంతే. మన కాలం వాళ్ళు దీనిని జిర్నించుకోవడం కష్టం కానీ, రాబోయే తరాల వారికీ అంతా గణన యంత్రమే. (ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మ , నాన్న ,కంప్యూటర్ అన్నమాట ).
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి Shyam Pullela గారి అభిప్రాయం:
03/21/2009 4:28 pm
ఆర్యా,
వ్యాసం చాలా బాగుంది. మీరు రెందవ వాక్యంలో సూచించిన శ్రీనాధుని అన్ని చాటువుల PDFలో అక్షరాలు సమంగా లేవు. సవరించగలరు.
భవదీయుడు,
శ్యామసుందర్
కథ దేని గురించి? గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
03/21/2009 12:20 pm
బాబ్జీ,
మడి కట్టుకున్న సాహితీవేత్తలు, సాహిత్య సంఘాలు కొత్తవేం కాదు కదా. బతుకులో, సమాజంలో ఎన్నిరకాల పరిధిలు వున్నయో, సాహిత్యంలో కూడా అన్నిరకాల పరిధిలూ వున్నాయి. ప్రతి పరిధి కూడా మడికట్టుకున్న పరిధే. ఆ పరిధిలో భావన, ఆ పరిధిలో విలువలు తప్ప మిగిలిన వాటిని దూరంగా పెట్టటం, దూరంగా వుండటవనేది ప్రతి పరిధికీ వున్న సహజ లక్షణవే. విరసం కూదా వొక మడిగట్టుకున్న పరిధే. ఐతే విరసం వొక్కటే ఆ లక్షణాలు వున్నది కాదు.
సమాజంలో మార్పు ఎంత సహజవో, ఆ మార్పుని ముందరే పసిగట్టి, ఆ దిశలో స్పందించట వనేది, సాహిత్యనికున్న ఒక గొప్ప లక్షణం. జైన, బౌద్ద మతాలు విస్తరించే దశలోనూ, తిరిగి హిందూ మతం బలబడుతున్న సమయంలోనూ, ఆ తర్వాత స్వాతంత్రోధ్యమ సమయంలోనూ (ఇవి సమాజంలో సవాలక్ష మార్పుల్లో కొన్ని మాత్రవే) మారుతున్న సమాజంలో, పాత కొత్తల ఘర్షణ ఒక కొత్త, అధ్బుతవైన సాహిత్య సృష్టికి కారణమవుతూనే, అంతకంటే ఎక్కువగా మూస సాహిత్యానికి కూడా కారణమవుతుంది. దేశ, కాల పరిధుల్తో సంబంధం లేకుండా, ఏ కాలవైనా, ఏ దేశవైనా, ఏ ప్రదేశవైనా, ఏ రాష్త్రవైనా, ఏ ఊరైనా, ఏ వీధైనా, ఏ కుటుంబవైనా, ఏ మనిషైనా గిరిగీసుకోవడం ఒక సహజ లక్షణం. ఆ గిరి ఒక సమయంలో ఒక కొత్త మార్పుకి, ఒక కొత్త భిన్నమైన సాహిత్య సృష్టికి ప్రాణం పోస్తే, అదే గిరి ఒక సమయంలో మరో కొత్త ఆలోచనకి అడ్డంకి కావొచ్చు. విరసం దానికి భిన్నవేవీ కాదు. విరసం, మొదటిది కూడా కాదు. ఐతే ఆ గిరి వెలుపల కూడా చాలా ప్రపంచవుంటుంది. గిరి గీసుకోవడం (విరసం, అరసం లాంటి సాహిత్య సంఘాల్ని సృష్టించుకోవడం) అంటేనే ఆ గిరితో విభేదించే మరో గిరి వుందన్న మాట. ఆ గిరి వెలుపల కూడా చాలా సాహిత్య సృష్టి జరుగుతుంది.
తెలుగు సాహిత్య లోకాన్నంతటిని విరసం గుప్పిట్లో పెట్టుకోలేదు. మొత్తం సమాజాన్ని శాసించగలిగే శక్తి దానికి లేదు. తెలుగు కవులు, కథకులు అందరు విరసం సభ్యులు కాదు. విరసాన్ని అభిమానించే వాళ్ళకన్నా, నిరశించే వాళ్ళే ఎక్కువ తెలుగు దేశంలో. ఐనా కూడా రచయితల చేతగాని తనానికి, మూస కథల సృష్టికి విరసవే కారణవని నువ్వంటే చేసేదేంలేదు. కానీ విరసానికి భిన్నవైన తెలుగు సాహిత్యంలో మూస కథలు లేవని, లేకపోవడం కాదు, ఇబ్బడి ముబ్బడిగా లేవని చెప్పగలవా? విరసం బతుకుని మరో కొత్త కోణంలో పరిశీలించింది. ఆ కోణంలో సాహిత్యానికి ఒక వూపునిచ్చింది. చూడగలిగిన వాళ్ళు చూశారు, వ్రాయ గలిగిన వాళ్ళు వ్రాశారు. కొందరు తమ పదిహేను నిముషాల వెలుగు కోసం అనుకరించారు. ఒకరి సృజన శక్తిని అణగదొక్కగలిగే బలం విరసానికి, అరసానికి, మరొ సారస్వత సంఘానికి లేదు.
రమ గారు చెప్పినట్టు, విరసం కాదు కదా మరే సంఘం కూడా ఎవరి సృజన శక్తినీ అణచలేదు. కారా గారితోపాటు ఎవరైనా వ్రాయకపోవడానికి కారణం, వాళ్ళు వ్రాయలేకపోవడవే. ఎవరు కూడా పుట్టిందిమొదలు పొయ్యేదాకా సాహిత్య సృష్టి చెయ్యలేరు. బాల్యం లాగా, యవ్వనంలాగా, బహుశా వృద్దాప్యం లాగా, సాహిత్య సృష్టి కూదా ఒక ఆది, అంతం వున్నటువంటిదే. ఆ తర్వాత కూడా రాస్తారు, ఎప్పుడో ఒకటో అరో కవిత చమక్కుమనవచ్చు, కానీ రమ గారు అది ఇంగవ చుట్టిన గుడ్డ వాసనే కానీ, ఇంగవ కాదనీ మనవి.
ఇక విరసం ఒక రచయితల సంఘవే కాదు, ఒక సామాజిక, రాజకీయ రచయితల సంఘం. దానీ విధానాలు, రాజకీయాలు, ఆ దిశలో దాని పరిధిలు దానివి. శ్రీశ్రీ సినిమాల్లో ప్రేమ గీతాలు వ్రాయడానికి, భక్తి గీతాలు వ్రాయడానికి, ఇందిరా గాంధీ ఇరవై సూత్రాలమీద వ్రాయడానికి ఆయనకి విరసం అడ్డురాలా. విరసం సభ్యుడైన తర్వాతో, ఆ తర్వాతో ఆయన కవిత్వ సృష్టి చేయలేకపోవడానికి కారణం, ఆయనలో ఆ సృజనాత్మక నిండుకోవడవే.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/21/2009 8:39 am
యుగంధర్ మహాశయా!
కందపద్యములూ, సీస పద్యములూ వ్రాయగలిగిన మీరు ఈ వచన కవిత గురించి ఎందుకు వ్రాయరు? మిగిలిన శీర్షికలలో చక్కని అభిప్రాయములు వ్రాసిన మీరు ఇచ్చట ఎందుకిటుల వ్రాయుట? మొదటి అభిప్రాయము నాది. అందు నాకవగతమవని వాటిని గురించి అడిగితిని. కవి గారెటూ జవాబివ్వజాలరు. కవితని ఆనందించి, అనుభూతించి అనుభవించిన వారుకూడా కవితని విపులీకరించకపోవడం మా దౌర్భాగ్యం. బొల్లోజుబాబా గారి అభిప్రాయమునకు జవాబుగా నాఅభిప్రాయమందు “ధార” గురించి ప్రశ్నించితిని. ఆయనా తదుపరి మీరునూ కవిత గురించి తప్ప మిగిలిన విషయముల గురించి విశ్లేషించినారు. మీరన్నట్టు కవిగారు రాసేసి జనం మీదకొదిలేస్తే సరిపోదు. ప్రతీ కాళిదాసుకీ ఓ మల్లినాథ సూరి వుంటేనే కాని కుదరదు. “అఫ్సరుడు” (మళ్ళీ వరదలో కొట్టుకొచ్చిన ప్రయోగం”) గారికి మీరో, సూర్య గారో మల్లినాథ సూరనుకుని అడగడం నా తప్పు. క్షమించండి. ఇదే “అఫ్సరుడి” గారి కవిత ఈ మధ్య సోమవారం సాహిత్య పేజీల్లో పడింది. అది లక్ష రెట్లు నయం ఈ బోడి పద్యం కన్నా. బహుశా ఈ బోడి పద్యం ఈమాట కోసం ప్రత్యేకించి రాసేరేమో? One more thing whoever punches some trash in this area are not critics. అభిప్రాయాలు రాసే వారు విమర్శకులు కారు. అంచేత పుంజీడు అభిప్రాయాలు పుంజీడు విమర్శలు కాదు. “మీ అభిప్రాయం తెలియ చేయండి” లో అభిప్రాయం తెలియచేయడం ఎందుకు? ఎవర్నుధ్ధరించడానికి? తెలుగు భాషనుధ్ధరించడానికా?
కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/21/2009 7:15 am
లేదు బాబ్జీలు గారూ మీ అభిప్రాయం సహేతుకమైందే! సాహిత్యానికి తన నిరంకుశ వైఖరి ద్వారా విరసం సరిపడా అపకారం చేసింది. స్వతహాగా మంచి కవి రచయితలైన..శ్రీశ్రీ..కొకు..రావిశాస్త్రి..కాళీపట్నం..లాం టి వాళ్ళూ..అలాగే మిగిలిన మరి కొందరు..వారి విశ్వాసాలకి కట్టుబడి విరసంలో కొనసాగారు.కానీ విరసానిది ధృతరాష్ట్ర కౌగిలి. అందువల్ల అందులోకి వెళ్ళాకా కవిత్వం తగ్గి..కొత్తవి చెప్పుకోదగ్గవేవీ రాయలేక..విరసానికి పబ్లిసిటీ ముఖంలాగా మిగిలేడు శ్రీశ్రీ. కాళీపట్నం రామారావు గారు “యజ్నం” లాంటి గొప్ప కధని విరసం రాజకీయాలతో సంబంధం లేకుండానే రాసి కూడా..అందులో సభ్యులయ్యాకా..మళ్ళీ అంత బలమైన కధ ఏదీ రాయలేదు.విరసానికి పెద్ద దిక్కుగా పెద్దమనిషి పాత్రలో మిగిలారు. వీరి సంగతే ఇలా ఉంటే ఇహ మిగతా వాళ్ళ మాట చెప్పేదేముందీ??
విరసం ఏనాడూ తన సంస్థలో భాగం కాని కవి రచయితల విషయంలో కొంచెం కూడా సానుకూల వైఖరిని చూపించలేదు సరికదా..తనకి పనిపడినప్పుడు మాత్రం..తెనుగుదేశం లోని సకల కవి,రచయిత విమర్శక శిఖామణులంతా..”మేధావులు” అందరూ..తమ వెనకే ఉన్నారని చెప్పడానికి సదా ప్రయత్నించింది. రచయితలే కాని వారికి సంస్థ పగ్గాలు అప్పజెప్పింది.వాళ్ళూ రచయితలకీ..సాహిత్యానికీ నిరభ్యంతరంగా నాయకత్వం వహించేయగలిగేరు. దీన్ని ప్రశ్నించే వీలుని గానీ..ఇందుకు జవాబు చెప్పే పూచీ గానీ ఆ సంస్థ ఏనాడూ తీసుకోలేదు. అందులో ఉన్న కవి ..రచయితలు సైతం ఈ పరిస్థితిని భరించేరు గానీ..ప్రశ్నించినట్టు కన్పించదు. అందులో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్న విషయం బహిరంగ రహస్యమే!! విమర్శకి చోటు తీసేసి..అడిగిన ఎవరినైనా దబాయించడంలో చూపిన శ్రధ్ధ..ఆత్మ విమర్శలో చూపక..దాని పరిధిని సంకుచితం చేసుకుంది….రచయితలు లేని రచయితల సంస్థ అది. ప్రాపగాండా లిటరేచర్ కీ..ఆ తరహా సాహిత్యానికీ మాత్రమే దాని ప్రాపు. గనక మీ పరిశీలన సరైందే!!
రమ.
బోడి పద్యం గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:
03/21/2009 5:18 am
“జాగ్ నీకీ రాత్” అనే కవిత్వం గుర్తుకువచ్చింది
కళ్ళలో సూదుల్లా గుచ్చుతున్న నిద్రలాంటి కాలాన్ని ఓపుకుంటూ గడుపుతున్న సందర్భం
నిద్రపోని అనేక సంఘటనలు ఎదురౌతూనేవున్నాయి
ఇంకొంచెం విస్తృతంగా రాయాలేమో!
కథ దేని గురించి? గురించి ఆరి సీతారామయ్య గారి అభిప్రాయం:
03/21/2009 4:19 am
చెప్పటం మర్చిపోయాను. ఈ వ్యాసం నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా సెప్టెంబర్ లో డిట్రాయట్ కు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మా డిటియల్సీ తరఫున శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ ల శతజయంతి ఉత్సవం జరుపుతున్నాం (సెప్టెంబర్ 26, 27). మీరందరూ వచ్చారంటే ఈ వ్యాసం నచ్చలేదని నాకు ముఖం మీదే చెప్పొచ్చు, కథల గురించి చాలా కబుర్లు చెప్పుకోవచ్చు, నాకంటే వ్యాసాలు బాగా రాసే వారిని చాలా మందిని కలవొచ్చు. ఏమంటారూ? వస్తారు కదూ.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
03/21/2009 1:41 am
రమ గారికి చాలా కృతజ్ఞుడిని. నేను చెప్పాలనుకున్న భావాన్నిమీరుచాలా సమర్ధవంతంగా విస్ఫష్టంగా వెలువరించారు.
కథ దేని గురించి? గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/21/2009 12:57 am
రవికిరణ్ గారూ,
నేన్రాసిన నిజాయితీ, కథలోని వస్తువుమీద రచయితకున్న నిజాయితీ. రచయిత బతుకు గురించి కాదు.
విరసం వల్ల మంచి కథకులు ఎవరూ తయారవలేదని నా నమ్మకం. విరసం వల్ల రచయితలూ మరియూ కళాకారులూ “ఫారం కోడిపెట్టల్లా” తయారయేరని నా అనుమానం. విరసం వల్లే విరసపు సాహిత్యం తప్ప మిగిలిన సాహిత్యవంతా అంటరానిదనీ, ముట్టుకుంటే దేవిడీమన్నా అనుకునే తత్వం ప్రబలిపోయిందని నా నమ్మకం. మహానుభావులందరూ వొప్పుకున్న కథకుండవలసిన “చదివించే గుణం” చెట్టెక్కిపోయిందని నానమ్మకం. ఇవన్నీ అపనమ్మకాలయితే చాలా సంతోషం.
అతడు, నేను, అతడి కథ గురించి ega hanuman గారి అభిప్రాయం:
03/20/2009 8:31 pm
మిత్రులారా, ఒక్క విషయం. ఈ కథ ఆత్మహత్య గురించి కానే కాదు. ప్రకృతిలో లీనమై పోవాలన్న ఒక తీవ్రమైన కోరికలోంచి వచ్చిన తాదాత్మ్యపు ఆలొచనా ధారగా నేను స్వీకరిస్తున్నా. ఎందుకంటే ఈ కథ రాస్తున్నపుడు భగవంతం, నేను కొన్ని సమయాల్లో కలిసే ఉన్నాం. ఇదొక అలోచనా ధారకు అక్షర రూపం, కొన్ని విషయాలను ఏ అక్షరం ప్రకటింప చేయగలగదు. కథ చివర్లో అర్ధం కావట్లెదు అన్నది, భాషకి అందని ఎక్స్ప్రెషన్ అని భావన. ఎంతైనా కథా రచయిత కథని చాలా సమర్ధవంతంగా నడిపించాడు. కథలో కవిత్వం నిబిడీకృతమైఉంది.
ఈగ హనుమాన్
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి Rajesh గారి అభిప్రాయం:
03/20/2009 2:04 pm
వెంకటేశ్వర రావు గారు ,
నేను కూడా చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాడినే. కానీ గణన యంత్రం (కంప్యూటర్) కనిపెట్టినప్పుడు దాని వలన దుష్ఫలితాలు ఉన్నాయని తెలిసినా దాన్ని వాడల్సినటువంటి పరిస్థితి ఎలా కలిగిందో , రేపు ఈ Digitalization కూడా అంతే. మన కాలం వాళ్ళు దీనిని జిర్నించుకోవడం కష్టం కానీ, రాబోయే తరాల వారికీ అంతా గణన యంత్రమే. (ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మ , నాన్న ,కంప్యూటర్ అన్నమాట ).