రాళ్ళపల్లి గారూ, ఈ బోడి పద్యం రాసింది ముస్లిం అని అందరికీ గుర్తు చేస్తున్నారా? ముస్లిం అయితే ఆయన పేరు మీద పన్ చెయ్యకూడదా? ముస్లిం కాబట్టి ఈ కవితకి కొంచం వెయిట్ ఎక్కువ ఇవ్వాలా?
మండవ రవిబాబు గారూ, గుజరాత్ లో హిందుత్వ వాదులు వేసిన కరపత్రాలూ ఈ కవిత్వం ఒకటే అంటారా? అది హిందుత్వ వాదులు గుజరాతులో ఇచ్చే కరపత్రమైతే ఇది హైదరాబాదు పాతబస్తీలో ఇచ్చే కరపత్రమా? కరపత్రమైతే కవిత్వం అని ఎందుకూ అనడం?
ఈ కవిత ఏ ‘విషయం’ చెప్తోందని మీరు అనుకుంటున్నారో కొంచం వివరిస్తారా? తెలుసుకోవాలని ఉంది. మీరు వివరిస్తే, అసలు విషయం జోలికి పోయి చర్చించడానికి నేనూ, ఇంకా చాలామందీ సిద్ధంగానే ఉన్నాం.
మన లోపలి అశ్లీలాలన్నీ కవిత్వ రూపంలో బయట పెట్టుకోడానికి ‘ఈమాట’ అనుమతిస్తే నేను కూడా పుంఖానుపుంఖాలుగా కరపత్రాలూ, కవితలూ రాయడానికి సిద్ధంగానే ఉన్నాను. సంపాదకులవారూ, ఓకేనా?
బోడి పద్యం గురించి Mandava Ravibabu గారి అభిప్రాయం:
03/24/2009 11:44 am
అయ్యా వినీతుల వారూ:
విషయం జోలికి పోవాలనే ఈ పద్యం చెబుతున్నదేమో! కొంచెం ఆలోచించండి.
విషయంలోకి వెళ్ళడానికి భయపడె పైన రాసిన బాబ్జీలూ, రమాప్రభలూ గట్రా బాబోయ్ అశ్లీలం అని అసింటా జరిగారు. కవిత్వం పేరుతో అకవిత్వాన్ని, సౌందర్యం , రసం పేరుతో కృత్రిమ పదాల లాలిత్యాన్ని పఠాభి లాంటి కవులు ఈసడించుకున్నారా? లేదా? దిగంబర కవులు ఇంకా ‘అశ్లీలాన్ని’ గుప్పించ లేదా? స్లమ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ మలాన్ని పరదేశీ ఎవడొ మన ఒంటి మీద పూసేసినప్పుడు చూసి, ఆస్కార్లు ఇచ్చామా లేదా?
మన లోపల ఎన్ని అశ్లీలాలు వున్నాయో అవన్నీ ఇంకా కవిత్వంలోకి రావాల్సిందే….గుజరాత్ లాంటి చోట్ల ముస్లిం ఆడవాళ్ల మీద హిందూత్వ వాదులు వేసిన కరపత్రాలు ఒక సారి చదూకోండి. అశ్లీలం అంటే ఏమిటొ తెలుస్తుంది.
సీతారామయ్యగారూ, మీ అహ్వానానికి క్రుతగ్యతలు. మీరు ప్రత్యేకించి ఆహ్వానించకపోయినా “పిక్క” సత్తువ వున్న వాళ్ళందరూ తప్పక వస్తారు. ఆహ్వానించిన తరువాత లేని సత్తువ తెచ్చుకుని మరీ వస్తారు. రాలేని వాళ్ళు ఈ మాట తరువాయి సంచికలో ఆ విశేషాల కోసం ఎదురుచూస్తారు.
అయితే మొక్కుబడిగా చేసెయ్యకండి ఈ వుత్సవాల్ని. చెయ్యరని తెలుసు. అయినా వోపలేక అనడం. ఎందుకంటే ఇలాటి సభల్లో “… వీరందరివీ చారడేసి కళ్ళు.” అని పొగడ్డం సంప్రదాయం. Tradition should be respected but can be broken. దయచేసి సంప్రదాయాన్ని గౌరవిస్తూనే నూతన సంప్రదాయానికి తెర తీయండి.
శ్రీశ్రీ గురించి రాయను, గోపీచంద్ గారి గురించి రాయలేను. కుటుంబరావు గారి గురించి, కాదు కాదు కుటుంబరావు గారి సాహిత్యం గురించి “లంపెన్ బూర్జువా వర్గాన్ని ఆ వర్గానికి సామాజికంగా సన్నిహితమయిన మధ్యతరగతి కళ్ళతో చూపించడం వల్ల అనివార్యంగా ఏర్పడే శైలి, వ్యంగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళకు సంతృప్తి కలిగించవచ్చుగాని, మార్క్సిస్టు దృక్పథం నుండి ఒక తీవ్రమయిన పరిమితిగానే పరిగణించాలి. ఆ పరిమితే బూర్జువా విమర్శకులకు కుటుంబరావు పట్ల ఉండే సద్భావానికి కారణం (ఉదాహరణకు, వాళ్ళు కుటుంబరావు పట్ల చూపుతున్న ఆదరణ అల్లం రాజయ్యకు ఎన్నటికీ చూపరని నా అనుమానం)” అని బాలగోపాల్ గారు అభిప్రాయ పడ్డారు. దీని మీద చర్చించండి. లేకపోతే మానీయండి.
బాలగోపాల్ గారి వ్యాఖ్యని పట్టించుకోనక్కర్లేదని మీరు ఖచ్చితంగా నమ్మితే, వదిలీయండి, నమ్మి చెడిన వాళ్ళు లేరు. నమ్మాలో, నమ్మకూడదో తెలియని నాలాటి వాళ్ళు ఇంకొన్నాళ్ళు గిజగిజ లాడతారు.
బోడి పద్యం గురించి sarma rallapalli గారి అభిప్రాయం:
03/24/2009 6:27 am
రమ గారు:
ఈ కవిత ఒక ముస్లిం రాయబట్టి అతని పేరు మీద పన్ చేస్తున్నారా? అఫ్సర్ని అఫ్సరుడు అనీ, absurd అనీ అనడం, ఆ తిక్క కి మీరు చంకలు కొట్టుకోవడం ఎలాంటి సంస్కారం?
శర్మ రాళ్ళపల్లి
ప్రసాద్ గారు,
శ్రమకోర్చి గుర్తున్న గౌరన పద్యాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆ పద్యాలు అందంగా లేవని ఎవరనగలరు! ఇక్కడొక్క చిన్న విషయం స్పష్టం చెయ్యాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. నేను హరిశ్చంద్రోపాఖ్యానం చదవనిది “ద్విపద కావ్యాలపై నాకున్న వ్యక్తిగత అరుచి” వల్ల మాత్రమే అని చెప్పాను. దీని అర్థం నాకు ద్విపద ఛందస్సు నచ్చదనీ కాదు, ద్విపద కావ్యాల మీద నాకు తక్కువ భావముందనీ కాదు.
మోహనగారు చెప్పినట్టు ద్విపద అచ్చమైన తెలుగు ఛందస్సు, తెలుగు జానపదసాహిత్యమంతా అది కనిపిస్తుంది, పాటలుగా పాడుకోడానికి చాలా అనువైనది. దీనితో నాకే మాత్రం విభేదం లేదు. నాకు కూడా ద్విపదలో ఉన్న ఎన్నో పాటలు నచ్చుతాయి.
ఇక ద్విపద కావ్యాల విషయానికి వస్తే, నాకవి రుచించనంత మాత్రాన వాటిని తక్కువగా భావించే మనస్తత్వం నాకు లేదు. ఒక కవితో ఒక కావ్యమో మనకి బోధపడనంత మాత్రాన, రుచించనంత మాత్రాన అది మంచి కవితో, కావ్యమో కాదని నిర్ధారించెయ్యడం తెలివితక్కువ పని అని నా ఉద్దేశం.
ఇంకొక్క విషయం. నాకు ద్విపద కావ్యాలు రుచించకపోవడానికి “పొలిటికల్” కారణాలేవీ (నాకు తెలిసి) లేవు. నేను పద్య కావ్యాలని చదువుతున్నప్పుడు, చాలా వరకూ పద్యాలని బయటకే చదువుకుంటాను, అప్పుడప్పుడు (తప్పని పరిస్థితుల్లో 🙂 మనసులో చదువుకుంటాను. ఎలా చదువుకున్నా, పద్యాల అర్థంతో పాటు (ఇంకా చెప్పాలంటే అర్థం గ్రహించే ముందు) పద్యాలలో నడకని, వాక్య విన్యాసాన్ని ఆస్వాదిస్తాను. అంచేత పద్యాలలో అర్థం ఎంత ప్రధానమో, నాకు పద్య రచనా విధానమూ అంతే ప్రధానం. ఈ విషయంలో చంపూ కావ్యాలు నాకు బాగా ఆస్వాదనీయంగా అనిపిస్తాయి. రకరకాల ఛందస్సులో పద్యాలు, రకరకాల నడకలతో నన్ను అలరిస్తాయి. వడివడిగా కందాలలో సాగుతున్న కథనంలో హఠాత్తుగా ఒక వర్ణన వయ్యారంగా సీసంతో ఎదురైనప్పుడు మనసు ఒక విధమైన ఉత్తేజాన్ని పొందుతుంది. ద్విపద కావ్యాలలో ఒకే రకమైన ఛందస్సు, ఇంచుముంచు ఒకే నడకతో పుటలకొద్దీ సాగుతుంది కదా. ఇది నాకు చదవడంలో అనాసక్తత కలిగిస్తుంది. అంతే! ఇంతకన్నా దీని వెనుక మరే కారణాలూ లేవు. ఇలా నాకు అనాసక్తి కలుగినంత మాత్రాన ద్విపద కావ్యాలు గురించి నాకెలాంటి తక్కువ అభిప్రాయమూ లేదు.
మీకు తెలుగు..కన్నడ ..తమిళ భాషలు క్షుణ్ణంగా వచ్చిన ట్టు కన్పిస్తుంది. ఆసక్తి కరమైన అంశాలని వీటి సాహిత్యాల్లోంచి ఎన్నుకుని పోల్చి ఏదైనా రాయాలని మీకు అన్పించలేదా? అటువంటి శక్తి మీకు ఉన్నప్పుడు..మీరు ఆ తోవలో కృషి చేయగల్గితే..అందువలన ఈ ప్రాచీన ద్రావిడ భాషా సాహిత్యాలకి లాభమ్ కలుగుతుంది.. అలాగే వీటిలో ఉన్న ప్రత్యేకతల గురించీ.. ఇటుపై. తరాల వరకూ కూడా …మీరు చెప్పే తులనాత్మక విషయాల వలన మరింత..మేలు బ హుశా ఉండొచ్చును…అన్న ఆలోచన నాకు కలిగి మీకీ సూచన చేయాలనిపించింది .మీరు కూడా ఆలోచంచండి.
రమ.
ప్రసాదు గారూ!! చంద్రమతి వర్ణన అందంగా ఉంది. ఎంత బాగుందో!! మీకన్నా తెలుగు వచ్చిన వారేరీ?? నాకు కూడా మరి కొన్ని ద్విపదలు గుర్తొచ్చేయి.ద్విపద ధారణకి బాగా లొంగుతుంది.
నా అభిప్రాయం బాబ్జీలు గారి అభిప్రాయం మీద చెప్పిందని మీరు మరిచినట్టున్నారు సీతారామయ్య గారూ!! చర్చలో నిరుపయోగం అంటూ ఉండదు. విరసం పాత్ర గురించి కూడా చర్చ జరగటంలో లోటు ఉండనఖ్ఖరలేదు, దాని ప్రతికూల ప్రభావం సృజన మీద పడినప్పుడు.
ఇది అటుంచితే.. రచయితల్ని సంస్థలు తయారుచేయవు ..అలాగే చంపవు..అని నేనన్నాను. ఇప్పుడూ అంటున్నాను. శ్రీశ్రీ..కాళీపట్నం లని విరసం కాదు కవినీ..కధకుడినీ చేసింది. వాళ్ళలో తదనంతర కాలంలో.. స్వేచ్చగా రాయలేక పోవడంలో విరసం పాత్ర ఉందని పరిశీలనకి స్పష్టంగానే తెలుస్తుంది.ఇదే నేను వివరించి చెప్పాను. అయితే ఇందులో రచయితలుగా ఆయా వ్యక్తుల పాత్ర కూడా అంతే ముఖ్యమైంది.వాళ్ళ సృజనని పరిరక్షించుకోవటంలో వాళ్ళ మెలకువలూ..వాళ్ల మొహమాటాలూ..వాళ్ళ రాజకీయాలూ..వాళ్ళ పరిమితులూ వాళ్ళే అల్టిమేట్ గా నిర్ణయించుకోవాలి గనక. నేను చెప్పింది patterns.. trend setters.. influences.. imitations.. వీటి గురించి. ఇది విస్త్రుతంగా విడిగా మాట్లాడాల్సిన విషయం.
ఇంక తెలుగు కధల గురించి మీ పరిశీలన లో లోతులేదు. బహుశా మీరు మరింత స్పష్టంగా..విస్త్రుతంగా మాట్లాడివుంటే మీ వ్యాసానికి ఒక రూపం వచ్చి ఉండేది. కధ అన్నది తెలుగులో నిజానికి ఎదగలేదు. మన దగ్గర వస్తువైవిధ్యం.. ప్రక్రియా వైవిధ్యం పెద్దగా కన్పించవు. కధ రాయగల్గిన చతురత కూడా ఎక్కువ మందిలో లేదని తెలుగు కధ దానికదే loud గా చెప్పుకుంటుంది.ప్రతీదీ కధ కాలేదు.కానీ ఆ సంగతిని తెలుసుకోగల కధకులు సంఖ్యలో మన దగ్గర తక్కువ. మన దగ్గర ఇప్పటికీ approved themes ఎక్కువ కన్పిస్తాయి. హిపోక్రసీ లోంచి మేలైన సృజన రాదు. అందువల్ల తెలుగు కధల్లో రుచి ఉన్నవి కొద్ది మాత్రమే!! క్లుప్తంగా ఇది నా అభిప్రాయం. ఇన్హిబిషన్ లేని శైలి లో ‘సమాజపు ఒప్పుదల’ని ఆశించని వస్తువుతో వస్తే తప్ప తెలుగు కధల్ని చదవడం ప్రస్తుతానికి బోరు .
కలింగత్తుప్పరణిలోని నీడలపైన రెండు పద్యాలను కింద ఇస్తున్నాను. అందులో రెండవది బ్రహ్మానందంగారు ఉదహరించిన నన్నెచోడుని పద్యానికి సరిపోతుంది. కలింగత్తుప్పరణిలోని మొదటి రెండు అధ్యాయాలను ఆరుద్రగారు వెన్నెల – వేసవి అని తెనిగించారు. బాపు బొమ్మలు ఈ పుస్తకానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. వారి తర్జుమాను కింద ఇస్తున్నాను –
ఉత్తర కళింగాధిపతి అనంతవర్మ కప్పమును చెల్లించని కారణాన వానిని యుద్ధములో పరిమార్చమని కులోత్తుంగచోడుడు పల్లవరాజు కరుణాకర తొండమానుని ఆజ్ఞాపించెను. అతడు తన సైన్యముతో పాలేరు,
స్వర్ణముఖి, పెన్న, మన్నేరు, కృష్ణ, గోదావరి, పంప, గౌతమీ నదులను దాటి కళింగ దేశాన్ని చేరి చేసిన యుద్ధములో కళింగ చక్రవర్తి అపజయుడై పారిపోయెనట. ఆ కరుణాకర తొండమాను శౌర్య పరాక్రమాలను
వర్ణించే కావ్యం ఇది. ఇట్టి వీర కావ్యాలను తమిళములో పరణి అంటారు. పరణి కావ్యాలలో ఇదే మొదటిది, దాని రచనలో జయంగొండాన్ దిట్ట. నన్నెచోడుడు ఈ కవిని అనుసరించాడంటే అతని కాలం క్రీ.శ. 1118 తరువాత. కాని జయంగొండాన్ కూడా ఇతర కవులను అనుకరించి రాసిన పద్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఆరుద్రగారు అంటారు. అందువల్ల నేను ముందు చెప్పినట్లు రెండు పద్యాలు ఒకే విధంగా ఉంటే ఏది ముందో ఏది వెనుకో చెప్పడం కష్టం.
ప్రసాద్ గారూ – పుస్తకం దగ్గర లేక స్మృతుల పుటలను తిరగవేసి వల్లించే శక్తి ఉండే మీలాటివారు ఉన్నంతవరకు తెలుగు సాహిత్యం ఎప్పుడు అజరం, అమరం. ఇక పోతే ద్విపద చాలా అందమైన దేశి ఛందస్సు. ద్విపదలో అందమేమంటే (మీ పద్యాలలో కూడా దీనిని చూడవచ్చు) ఏ పాదం ఆ పాదానికి విరుగుతుంది. తెలుగు ఛందస్సులో ద్విపదకు, రగడలకు తప్ప మిగిలిన వాటికి ఈ నియమము ఐచ్ఛికము. వీటికి ఇవి తప్పని సరి. దీనివల్ల వచ్చిన గొప్ప ప్రయోజనం ఏమిటంటే ద్విపదలను రగడలను పాడుకోవచ్చు. అందుకే యక్ష గానాలలో వీటికి ప్రాముఖ్యత ఎక్కువ. తరువోజ రూపంలో ద్విపద అందుకే దంపుళ్ల పాట అయినది. పంచమాత్రలతో ద్విపద వినడానికి చాలా బాగుంటుంది. సినిమా పాటలో ద్విపద ఛందస్సును కూడా నేను ఈ మధ్య ప్రస్తావించాను. తెలుగు కవులు దేశి ఛందస్సులైన ద్విపద, అక్కఱ, రగడలను వాడకుండా ఉండటం తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు. అందుకే ఏవో కొన్ని గ్రంథాలు తప్ప మిగిలినవి పాడటానికి సౌలభ్యము నీయవు.
బోడి పద్యం గురించి ప్రవీణ్ గారి అభిప్రాయం:
03/24/2009 2:24 pm
రాళ్ళపల్లి గారూ, ఈ బోడి పద్యం రాసింది ముస్లిం అని అందరికీ గుర్తు చేస్తున్నారా? ముస్లిం అయితే ఆయన పేరు మీద పన్ చెయ్యకూడదా? ముస్లిం కాబట్టి ఈ కవితకి కొంచం వెయిట్ ఎక్కువ ఇవ్వాలా?
మండవ రవిబాబు గారూ, గుజరాత్ లో హిందుత్వ వాదులు వేసిన కరపత్రాలూ ఈ కవిత్వం ఒకటే అంటారా? అది హిందుత్వ వాదులు గుజరాతులో ఇచ్చే కరపత్రమైతే ఇది హైదరాబాదు పాతబస్తీలో ఇచ్చే కరపత్రమా? కరపత్రమైతే కవిత్వం అని ఎందుకూ అనడం?
ఈ కవిత ఏ ‘విషయం’ చెప్తోందని మీరు అనుకుంటున్నారో కొంచం వివరిస్తారా? తెలుసుకోవాలని ఉంది. మీరు వివరిస్తే, అసలు విషయం జోలికి పోయి చర్చించడానికి నేనూ, ఇంకా చాలామందీ సిద్ధంగానే ఉన్నాం.
మన లోపలి అశ్లీలాలన్నీ కవిత్వ రూపంలో బయట పెట్టుకోడానికి ‘ఈమాట’ అనుమతిస్తే నేను కూడా పుంఖానుపుంఖాలుగా కరపత్రాలూ, కవితలూ రాయడానికి సిద్ధంగానే ఉన్నాను. సంపాదకులవారూ, ఓకేనా?
బోడి పద్యం గురించి Mandava Ravibabu గారి అభిప్రాయం:
03/24/2009 11:44 am
అయ్యా వినీతుల వారూ:
విషయం జోలికి పోవాలనే ఈ పద్యం చెబుతున్నదేమో! కొంచెం ఆలోచించండి.
విషయంలోకి వెళ్ళడానికి భయపడె పైన రాసిన బాబ్జీలూ, రమాప్రభలూ గట్రా బాబోయ్ అశ్లీలం అని అసింటా జరిగారు. కవిత్వం పేరుతో అకవిత్వాన్ని, సౌందర్యం , రసం పేరుతో కృత్రిమ పదాల లాలిత్యాన్ని పఠాభి లాంటి కవులు ఈసడించుకున్నారా? లేదా? దిగంబర కవులు ఇంకా ‘అశ్లీలాన్ని’ గుప్పించ లేదా? స్లమ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ మలాన్ని పరదేశీ ఎవడొ మన ఒంటి మీద పూసేసినప్పుడు చూసి, ఆస్కార్లు ఇచ్చామా లేదా?
మన లోపల ఎన్ని అశ్లీలాలు వున్నాయో అవన్నీ ఇంకా కవిత్వంలోకి రావాల్సిందే….గుజరాత్ లాంటి చోట్ల ముస్లిం ఆడవాళ్ల మీద హిందూత్వ వాదులు వేసిన కరపత్రాలు ఒక సారి చదూకోండి. అశ్లీలం అంటే ఏమిటొ తెలుస్తుంది.
రవి బాబు
కథ దేని గురించి? గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/24/2009 8:41 am
సీతారామయ్యగారూ, మీ అహ్వానానికి క్రుతగ్యతలు. మీరు ప్రత్యేకించి ఆహ్వానించకపోయినా “పిక్క” సత్తువ వున్న వాళ్ళందరూ తప్పక వస్తారు. ఆహ్వానించిన తరువాత లేని సత్తువ తెచ్చుకుని మరీ వస్తారు. రాలేని వాళ్ళు ఈ మాట తరువాయి సంచికలో ఆ విశేషాల కోసం ఎదురుచూస్తారు.
అయితే మొక్కుబడిగా చేసెయ్యకండి ఈ వుత్సవాల్ని. చెయ్యరని తెలుసు. అయినా వోపలేక అనడం. ఎందుకంటే ఇలాటి సభల్లో “… వీరందరివీ చారడేసి కళ్ళు.” అని పొగడ్డం సంప్రదాయం. Tradition should be respected but can be broken. దయచేసి సంప్రదాయాన్ని గౌరవిస్తూనే నూతన సంప్రదాయానికి తెర తీయండి.
శ్రీశ్రీ గురించి రాయను, గోపీచంద్ గారి గురించి రాయలేను. కుటుంబరావు గారి గురించి, కాదు కాదు కుటుంబరావు గారి సాహిత్యం గురించి “లంపెన్ బూర్జువా వర్గాన్ని ఆ వర్గానికి సామాజికంగా సన్నిహితమయిన మధ్యతరగతి కళ్ళతో చూపించడం వల్ల అనివార్యంగా ఏర్పడే శైలి, వ్యంగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళకు సంతృప్తి కలిగించవచ్చుగాని, మార్క్సిస్టు దృక్పథం నుండి ఒక తీవ్రమయిన పరిమితిగానే పరిగణించాలి. ఆ పరిమితే బూర్జువా విమర్శకులకు కుటుంబరావు పట్ల ఉండే సద్భావానికి కారణం (ఉదాహరణకు, వాళ్ళు కుటుంబరావు పట్ల చూపుతున్న ఆదరణ అల్లం రాజయ్యకు ఎన్నటికీ చూపరని నా అనుమానం)” అని బాలగోపాల్ గారు అభిప్రాయ పడ్డారు. దీని మీద చర్చించండి. లేకపోతే మానీయండి.
బాలగోపాల్ గారి వ్యాఖ్యని పట్టించుకోనక్కర్లేదని మీరు ఖచ్చితంగా నమ్మితే, వదిలీయండి, నమ్మి చెడిన వాళ్ళు లేరు. నమ్మాలో, నమ్మకూడదో తెలియని నాలాటి వాళ్ళు ఇంకొన్నాళ్ళు గిజగిజ లాడతారు.
బోడి పద్యం గురించి sarma rallapalli గారి అభిప్రాయం:
03/24/2009 6:27 am
రమ గారు:
ఈ కవిత ఒక ముస్లిం రాయబట్టి అతని పేరు మీద పన్ చేస్తున్నారా? అఫ్సర్ని అఫ్సరుడు అనీ, absurd అనీ అనడం, ఆ తిక్క కి మీరు చంకలు కొట్టుకోవడం ఎలాంటి సంస్కారం?
శర్మ రాళ్ళపల్లి
నాచన సోమన చతుర వచో విలాసం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
03/24/2009 12:26 am
ప్రసాద్ గారు,
శ్రమకోర్చి గుర్తున్న గౌరన పద్యాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆ పద్యాలు అందంగా లేవని ఎవరనగలరు! ఇక్కడొక్క చిన్న విషయం స్పష్టం చెయ్యాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. నేను హరిశ్చంద్రోపాఖ్యానం చదవనిది “ద్విపద కావ్యాలపై నాకున్న వ్యక్తిగత అరుచి” వల్ల మాత్రమే అని చెప్పాను. దీని అర్థం నాకు ద్విపద ఛందస్సు నచ్చదనీ కాదు, ద్విపద కావ్యాల మీద నాకు తక్కువ భావముందనీ కాదు.
మోహనగారు చెప్పినట్టు ద్విపద అచ్చమైన తెలుగు ఛందస్సు, తెలుగు జానపదసాహిత్యమంతా అది కనిపిస్తుంది, పాటలుగా పాడుకోడానికి చాలా అనువైనది. దీనితో నాకే మాత్రం విభేదం లేదు. నాకు కూడా ద్విపదలో ఉన్న ఎన్నో పాటలు నచ్చుతాయి.
ఇక ద్విపద కావ్యాల విషయానికి వస్తే, నాకవి రుచించనంత మాత్రాన వాటిని తక్కువగా భావించే మనస్తత్వం నాకు లేదు. ఒక కవితో ఒక కావ్యమో మనకి బోధపడనంత మాత్రాన, రుచించనంత మాత్రాన అది మంచి కవితో, కావ్యమో కాదని నిర్ధారించెయ్యడం తెలివితక్కువ పని అని నా ఉద్దేశం.
ఇంకొక్క విషయం. నాకు ద్విపద కావ్యాలు రుచించకపోవడానికి “పొలిటికల్” కారణాలేవీ (నాకు తెలిసి) లేవు. నేను పద్య కావ్యాలని చదువుతున్నప్పుడు, చాలా వరకూ పద్యాలని బయటకే చదువుకుంటాను, అప్పుడప్పుడు (తప్పని పరిస్థితుల్లో 🙂 మనసులో చదువుకుంటాను. ఎలా చదువుకున్నా, పద్యాల అర్థంతో పాటు (ఇంకా చెప్పాలంటే అర్థం గ్రహించే ముందు) పద్యాలలో నడకని, వాక్య విన్యాసాన్ని ఆస్వాదిస్తాను. అంచేత పద్యాలలో అర్థం ఎంత ప్రధానమో, నాకు పద్య రచనా విధానమూ అంతే ప్రధానం. ఈ విషయంలో చంపూ కావ్యాలు నాకు బాగా ఆస్వాదనీయంగా అనిపిస్తాయి. రకరకాల ఛందస్సులో పద్యాలు, రకరకాల నడకలతో నన్ను అలరిస్తాయి. వడివడిగా కందాలలో సాగుతున్న కథనంలో హఠాత్తుగా ఒక వర్ణన వయ్యారంగా సీసంతో ఎదురైనప్పుడు మనసు ఒక విధమైన ఉత్తేజాన్ని పొందుతుంది. ద్విపద కావ్యాలలో ఒకే రకమైన ఛందస్సు, ఇంచుముంచు ఒకే నడకతో పుటలకొద్దీ సాగుతుంది కదా. ఇది నాకు చదవడంలో అనాసక్తత కలిగిస్తుంది. అంతే! ఇంతకన్నా దీని వెనుక మరే కారణాలూ లేవు. ఇలా నాకు అనాసక్తి కలుగినంత మాత్రాన ద్విపద కావ్యాలు గురించి నాకెలాంటి తక్కువ అభిప్రాయమూ లేదు.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/23/2009 10:32 pm
మోహనరావు గారూ!!
మీకు తెలుగు..కన్నడ ..తమిళ భాషలు క్షుణ్ణంగా వచ్చిన ట్టు కన్పిస్తుంది. ఆసక్తి కరమైన అంశాలని వీటి సాహిత్యాల్లోంచి ఎన్నుకుని పోల్చి ఏదైనా రాయాలని మీకు అన్పించలేదా? అటువంటి శక్తి మీకు ఉన్నప్పుడు..మీరు ఆ తోవలో కృషి చేయగల్గితే..అందువలన ఈ ప్రాచీన ద్రావిడ భాషా సాహిత్యాలకి లాభమ్ కలుగుతుంది.. అలాగే వీటిలో ఉన్న ప్రత్యేకతల గురించీ.. ఇటుపై. తరాల వరకూ కూడా …మీరు చెప్పే తులనాత్మక విషయాల వలన మరింత..మేలు బ హుశా ఉండొచ్చును…అన్న ఆలోచన నాకు కలిగి మీకీ సూచన చేయాలనిపించింది .మీరు కూడా ఆలోచంచండి.
రమ.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/23/2009 11:00 am
ప్రసాదు గారూ!! చంద్రమతి వర్ణన అందంగా ఉంది. ఎంత బాగుందో!! మీకన్నా తెలుగు వచ్చిన వారేరీ?? నాకు కూడా మరి కొన్ని ద్విపదలు గుర్తొచ్చేయి.ద్విపద ధారణకి బాగా లొంగుతుంది.
రమ.
కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/23/2009 10:37 am
నా అభిప్రాయం బాబ్జీలు గారి అభిప్రాయం మీద చెప్పిందని మీరు మరిచినట్టున్నారు సీతారామయ్య గారూ!! చర్చలో నిరుపయోగం అంటూ ఉండదు. విరసం పాత్ర గురించి కూడా చర్చ జరగటంలో లోటు ఉండనఖ్ఖరలేదు, దాని ప్రతికూల ప్రభావం సృజన మీద పడినప్పుడు.
ఇది అటుంచితే.. రచయితల్ని సంస్థలు తయారుచేయవు ..అలాగే చంపవు..అని నేనన్నాను. ఇప్పుడూ అంటున్నాను. శ్రీశ్రీ..కాళీపట్నం లని విరసం కాదు కవినీ..కధకుడినీ చేసింది. వాళ్ళలో తదనంతర కాలంలో.. స్వేచ్చగా రాయలేక పోవడంలో విరసం పాత్ర ఉందని పరిశీలనకి స్పష్టంగానే తెలుస్తుంది.ఇదే నేను వివరించి చెప్పాను. అయితే ఇందులో రచయితలుగా ఆయా వ్యక్తుల పాత్ర కూడా అంతే ముఖ్యమైంది.వాళ్ళ సృజనని పరిరక్షించుకోవటంలో వాళ్ళ మెలకువలూ..వాళ్ల మొహమాటాలూ..వాళ్ళ రాజకీయాలూ..వాళ్ళ పరిమితులూ వాళ్ళే అల్టిమేట్ గా నిర్ణయించుకోవాలి గనక. నేను చెప్పింది patterns.. trend setters.. influences.. imitations.. వీటి గురించి. ఇది విస్త్రుతంగా విడిగా మాట్లాడాల్సిన విషయం.
ఇంక తెలుగు కధల గురించి మీ పరిశీలన లో లోతులేదు. బహుశా మీరు మరింత స్పష్టంగా..విస్త్రుతంగా మాట్లాడివుంటే మీ వ్యాసానికి ఒక రూపం వచ్చి ఉండేది. కధ అన్నది తెలుగులో నిజానికి ఎదగలేదు. మన దగ్గర వస్తువైవిధ్యం.. ప్రక్రియా వైవిధ్యం పెద్దగా కన్పించవు. కధ రాయగల్గిన చతురత కూడా ఎక్కువ మందిలో లేదని తెలుగు కధ దానికదే loud గా చెప్పుకుంటుంది.ప్రతీదీ కధ కాలేదు.కానీ ఆ సంగతిని తెలుసుకోగల కధకులు సంఖ్యలో మన దగ్గర తక్కువ. మన దగ్గర ఇప్పటికీ approved themes ఎక్కువ కన్పిస్తాయి. హిపోక్రసీ లోంచి మేలైన సృజన రాదు. అందువల్ల తెలుగు కధల్లో రుచి ఉన్నవి కొద్ది మాత్రమే!! క్లుప్తంగా ఇది నా అభిప్రాయం. ఇన్హిబిషన్ లేని శైలి లో ‘సమాజపు ఒప్పుదల’ని ఆశించని వస్తువుతో వస్తే తప్ప తెలుగు కధల్ని చదవడం ప్రస్తుతానికి బోరు .
రమ.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana గారి అభిప్రాయం:
03/23/2009 10:02 am
కలింగత్తుప్పరణిలోని నీడలపైన రెండు పద్యాలను కింద ఇస్తున్నాను. అందులో రెండవది బ్రహ్మానందంగారు ఉదహరించిన నన్నెచోడుని పద్యానికి సరిపోతుంది. కలింగత్తుప్పరణిలోని మొదటి రెండు అధ్యాయాలను ఆరుద్రగారు వెన్నెల – వేసవి అని తెనిగించారు. బాపు బొమ్మలు ఈ పుస్తకానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. వారి తర్జుమాను కింద ఇస్తున్నాను –
ఆడుగిన్ఱ శిఱై వెంబరుంది నిళల్ అంజి యక్కడువనత్తై వి-
ట్టోడుగిన్ఱ నిళలొక్కుం నిఱ్కుం నిళల్ ఓరిడత్తు ముళవల్లవే
– జయంగొండన్, కలింగత్తుప్పరణి (80)
జ్వలియించు దినకరుని చరపు లోర్వగలేక
పులుగుగమి మేతకై పోవు నీడలు తక్క
నిలకడగ నిగిడారు నీడ లీ కానలో
కలయ జూచినమేర కనిపించ నేరవు
ఆదవంబరుగు మెన్ఱు నిన్ఱ నిళల్ అంగు నిన్ఱు కుడి పోనద-
ప్పాదవంబునల్ పెఱా దుణంగువన పరుగుం నమ్మైయెన వెరువియే
– జయంగొండన్, కలింగత్తుప్పరణి (81)
తీక్ష్ణాంశు వాకలిచె తినివేయునని వగచి
వృక్షపాదము లంటి వేడుకొన్నది నీడ
అక్షీణ క్షుధచేత ఆ తరువు త్రావునని
వీక్షించుచుండగనె వెడలి పోయినది
ఉత్తర కళింగాధిపతి అనంతవర్మ కప్పమును చెల్లించని కారణాన వానిని యుద్ధములో పరిమార్చమని కులోత్తుంగచోడుడు పల్లవరాజు కరుణాకర తొండమానుని ఆజ్ఞాపించెను. అతడు తన సైన్యముతో పాలేరు,
స్వర్ణముఖి, పెన్న, మన్నేరు, కృష్ణ, గోదావరి, పంప, గౌతమీ నదులను దాటి కళింగ దేశాన్ని చేరి చేసిన యుద్ధములో కళింగ చక్రవర్తి అపజయుడై పారిపోయెనట. ఆ కరుణాకర తొండమాను శౌర్య పరాక్రమాలను
వర్ణించే కావ్యం ఇది. ఇట్టి వీర కావ్యాలను తమిళములో పరణి అంటారు. పరణి కావ్యాలలో ఇదే మొదటిది, దాని రచనలో జయంగొండాన్ దిట్ట. నన్నెచోడుడు ఈ కవిని అనుసరించాడంటే అతని కాలం క్రీ.శ. 1118 తరువాత. కాని జయంగొండాన్ కూడా ఇతర కవులను అనుకరించి రాసిన పద్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఆరుద్రగారు అంటారు. అందువల్ల నేను ముందు చెప్పినట్లు రెండు పద్యాలు ఒకే విధంగా ఉంటే ఏది ముందో ఏది వెనుకో చెప్పడం కష్టం.
గ్రంథసూచి – వెన్నెల – వేసవి, ఆరుద్ర, నవోదయ పబ్లిషర్స్, విజయవాడ, మొదటి కూర్పు 1968.
విధేయుడు – మోహన
నాచన సోమన చతుర వచో విలాసం గురించి mOhana గారి అభిప్రాయం:
03/23/2009 8:37 am
ప్రసాద్ గారూ – పుస్తకం దగ్గర లేక స్మృతుల పుటలను తిరగవేసి వల్లించే శక్తి ఉండే మీలాటివారు ఉన్నంతవరకు తెలుగు సాహిత్యం ఎప్పుడు అజరం, అమరం. ఇక పోతే ద్విపద చాలా అందమైన దేశి ఛందస్సు. ద్విపదలో అందమేమంటే (మీ పద్యాలలో కూడా దీనిని చూడవచ్చు) ఏ పాదం ఆ పాదానికి విరుగుతుంది. తెలుగు ఛందస్సులో ద్విపదకు, రగడలకు తప్ప మిగిలిన వాటికి ఈ నియమము ఐచ్ఛికము. వీటికి ఇవి తప్పని సరి. దీనివల్ల వచ్చిన గొప్ప ప్రయోజనం ఏమిటంటే ద్విపదలను రగడలను పాడుకోవచ్చు. అందుకే యక్ష గానాలలో వీటికి ప్రాముఖ్యత ఎక్కువ. తరువోజ రూపంలో ద్విపద అందుకే దంపుళ్ల పాట అయినది. పంచమాత్రలతో ద్విపద వినడానికి చాలా బాగుంటుంది. సినిమా పాటలో ద్విపద ఛందస్సును కూడా నేను ఈ మధ్య ప్రస్తావించాను. తెలుగు కవులు దేశి ఛందస్సులైన ద్విపద, అక్కఱ, రగడలను వాడకుండా ఉండటం తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు. అందుకే ఏవో కొన్ని గ్రంథాలు తప్ప మిగిలినవి పాడటానికి సౌలభ్యము నీయవు.
విధేయుడు – మోహన