> ఘంటసాల, రాజాలు ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల (శొభ చిత్రానికి) పాడారు.
ఈరోజు పి.బి.శ్రీనివాస్ 1964-65 ప్రాంతంలో “జ్యోతి” మాసపత్రికలో వివిధ సంగీతదర్శకులపై రాసిన వ్యాసాలు చదువుతూ తెలుసుకున్న విషయం: ఘంటసాల నిర్మించి, సంగీత దర్శకత్వం వహించిన “పరోపకారం” (1953) చిత్రంలో రాజా పాడారని. పాటల పుస్తకం చూసి ఒకటి కాదు రెండు పాడారని నిర్ధారించుకునడమైనది.; “తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనెలూరు…” (A.P.కోమలతో), “హృదయము ఊగిసలాడే…” (ఘంటసాల, A.M.రాజా, P.లీల, A.P.కోమల)
నాకు సంగీతంలో పాండిత్యం సున్నా, అయినా నా ఉద్దేశంలో అన్నమాచార్యులవంటి మహానుభావులు, రామదాసు కూడా పాటలోని పదాలను ఎన్నుకొనేటప్పుడు అవి మాత్రలుగా విరిగేటట్లు జాగ్రత్తగా ఎన్నుకొన్నారు. అందుకే అవి సాహిత్యపరంగా కూడా ఉత్తమమైనవి. అందరు వాగ్గేయకారులు ఈ నియమాన్ని సరిగా పాటించలేని కారణాన ఇప్పటి ఇక్కట్లు వచ్చాయి. జయదేవుని అష్టపదులలో కూడా ఈ నియమం ఎక్కువగా పాటించబడినది. సంస్కృత సాహిత్యంలో పద విచ్ఛేదన యతిగా పరిగణించబడినది కాబట్టి ఆ వృత్తాలను, అందులో మాత్రాబద్ధమైన తాళవృత్తాలను పాడుకోవచ్చు. మనం సామాన్యంగా ఉపయోగించే చంపకమాలవంటి వృత్తాలను కూడా ఇలా రాయడానికి, పాడటానికి వీలవుతుందని నేను నిరూపించి ఉన్నాను.(మరుగేల చరా) (చర రూప పరా) (త్పర సూర్య సుధా) (కర లోచనా) అనివిరిచి పాడగా విని ఉన్నాను. అందుకే కొన్ని పాటలు వాద్య సంగీతంగా బాగుంటాయి, గాత్ర సంగీతంకన్నా. విధేయుడు – మోహన
సంగీతంలో సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే నని ప్రసాద్ గారు అంటున్నారు. కానీ మన దేశాన సంగీతపు వృధ్ధి..వికాసమూ బాగా తెలిసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాత్రం ఇలా అన్నారు.”మన దేశమున సంగీత సాహిత్య రచనలు అనాదిగా అవినాభూతముగా కలిసి న డుచుచున్నను సంగీతము సాహిత్యమునకు శోభాకరము మాత్రముగానే వెనుకనుండి న డచిదనియు వట్టి నాద రచనలు అంతగా పూర్వకాలమున లేవనియు చెప్పవచ్చును.ఎట్లును దక్షిణ దేశమున భక్తి,శృంగారము,వీరము
మొదలగు భావములను భగవద్విషయముగాగాని, ప్రభువులను గూర్చి కాని
వెలువరించు రచనలు చాలవరకు నిబధ్ధగేయములేయైనను వాని భాషా రచన
కు దేశములోనున్న విలువ నాద రచనకు లేదు గావుననే ఆ గానపధ్ధతులు నశించినవి.”
అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయము ప్రకారము..సంగీతమే సాహిత్యాన్ని అనుసరించి న డిచిందిగానీ..సాహిత్యం సంగీతాన్ని అనుసరించలేదు..అన్న ది
విస్పష్టమౌతోంది. సాహిత్యం సంగీతానికి ఉపాంగం కాదనీ..ప్రధానాంగమేననీ కూడా ఇందువలన తేటతెల్లమౌతోంది.
పైన వెలువరించిన రమ గారి అభిప్రాయం చాలా సమంజసమైనది. శ్రద్ధ చూపదగినది కూడా. బాల మురళీ కృష్ణ గారితో సమానమైన ప్రతిభ గలిగిన విద్వాంసులైనా “మగా గనబదిం మనసా స్మరామి” అంటూ లేదా “ఎంద నేర్చినా ఎంద జూసినా” అంటూ పాడితే మనస్సు చివుక్కు మంటుంది. హ, ణ, ప, త అనే అక్షరాలు తమిళంలో లేక పోవచ్చు కానీ సులభోఛ్ఛారణా సాధ్యమైన ఆ ధ్వనులున్నాయి గదా.
కానీ మహేశ్ గారి అభిప్రాయం ఆచరణ సాధ్యం కాదేమో. కొంచెం లోతుగా సహృదయంతో ఆలోచిస్తే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని భావిస్తాను. సంగీతం చ సాహిత్యం చ సరస్వతీ కుచద్వయం ఐనా కూడా సంగీతంలో సాహిత్యానికి, సాహిత్యంలో సంగీతానికి సరి సమ ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యం కాదు. సంగీతంలో సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే. రాగం తాళం వంటి సంగీత ప్రధానాంశాల తరువాతనే సాహిత్యం యొక్క విలువ గుర్తించబడుతుంది. వ్యాసకర్త (గురువుగారే) వివరించినట్లు “పక్కల నిలబడి” అనే సాహిత్యాన్ని సంగీతంలో పక్కాలా నీలాబాడి అని పాడక తప్పదు. దీనికి కారణం రాగ శ్రావ్యత. సంగీతంలో ప్రతి స్వరాక్షరానికి ఒక సాహిత్యాక్షరం ఉండదు. “నిలువలేని మోహమాయె” అనే తొమ్మిది అక్షరాల సాహిత్యానికి “నీ సద సనిదపమ గమాపా మపదని పదనిద రిస” అనే ఇరవై ఒక్క స్వరాక్షరాలు కావాలి. “వనజాక్షిరో విరహమోర్వలేనె వాసుదేవు గొని తేవె” అనే సాహిత్యాన్ని పలికే స్వరాక్షరాలు విద్వంసుని ప్రతిభను బట్టీ అనేక రెట్లు ఎక్కువగా వుంటాయి. ఇక సాహిత్యాక్షరం లఘువైనా గురువైనా దీర్ఘం తప్పనిసరి. సంగీత పరమోద్దేశం శ్రుతిపేయత, శ్రావ్యత అని గుర్తించి సంగీత రసజ్ణులు దీనిని ఉపేక్షింపక తప్పదు. దీనిపై గురువుగారు చాలా సమంజసమైన సమాధానం ఇచ్చారు. కీర్తన తెలుగు భాషలో ఉంది కాబట్టీ, మీరు తెలుగు వారు కాబట్టీ కదా ఇంత గొడవ. అదే మీకు తెలియని వేరే భాష ఐతే లేదా అది గాత్ర సంగీతం గాక వాద్య సంగీతమైతే, కేవలం శ్రుతిపేయమైన ఆ మధుర సంగీతాన్ని ఆస్వాదించి ఊరుకుండేవారు కాదా. సంగీతం శ్రావ్యతా ప్రాధాన్యం కలిగినిది కాబట్టి ఇటువంటి అపరిహార్యములైన చిన్న చిన్న విషయాలను ఉపేక్షించరాదా. కాబట్టి మహేశ్ గారు గారు దీనిని పునరాలోచించి శాస్త్రీయ సంగీతంపై తమ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలి.
పరిహార్యాలైన దోషాలకు ఇది వర్తించదు. రమగారు చెప్పినట్లు “కుల మురళి” అని సాగదీసి పాడడం ఖండించ వలసినదే. (రాగ పరంగా సాధ్యమైన పరిస్థితులలో) సంగీతం (రాగం) సహకరించని పరిస్థితులలో, “యాదవ” లోని “వ” ని స్వల్పంగా భంజించకుండా సాగించి “కుల” ని పాడి, అక్కడ అతి స్వల్ప కాలం ఖండించి తరువాత పదం పాడడం (యస్పీ గారు ఇటువంటి మార్పులు తమ కార్యక్రమాలలో చూపిస్తుంటారు), సంగీతం సాహిత్యం రెండిటినీ అభిమానించే వారు చేస్తారు. లేకుంటే సాహిత్య భావం దోష భూయిష్టమౌతుంది. నా చిన్నప్పుడు నేర్చుకున్న
ఫణి రాజకం
కణవిఘ్ననివా
రణశాంభవశ్రీ
అనే పదాలకులు (ఫణి రాజ కంకణ, విఘ్న నివారణ, శాంభవ అని విడదీసి) అర్థం తెలుసుకోవడానికి నాకు పదిహేను సంవత్సరాలు పట్టింది. హంసధ్వనిలోని ఈ కృతిని ఇప్పటికీ పై విరుపులతోనే పాడుతారు. సాహిత్యం తెలిసిన వారు మాత్రం యస్పీ గారు చూపిన మార్గంలో సంగీత సాహిత్యాలకు భంగం కలుగ కుండా పాడుతారు.
గురువుగారు రోహిణీ ప్రసాదు గారినుండి గానీ లేదా తదితర ఈమాట సంగీత కళా కోవిదులైన వారినుండి గానీ ఒక చిన్న ప్రశ్న కు సమాధానం ఆశిస్తాను.
సంగీతంలో సాహిత్యానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక గంట సేపు పాడే కచేరీలో సాహిత్యం మొత్తం 1-2 నిముషాలకు మించదు. సంగీత విద్వాంసులకు సాహిత్యం మీద అంత పట్టుండదు. (మన ఈ మాట వ్యాసాలలోనే త్యాగరాజు గారి కీర్తనలలో సాహిత్య విలువ గణనీయం గాదని ఉటంకించారు) కానీ సంగీత సాహిత్యాలను సమంగా సంభావించేవారు ముఖ్యంగా కీర్తనలలో చివరలో స్వర విహారం చేసేటపుడు స్వరంతో పాటు సాహిత్యం కూడా జోడించి పాడుతే ఇంకా హృదయంగమంగా వుంటూంది గదా. ఉదాహరణకి శంకరాభరణం పాట చివరిలో
రీస సాస రిరి సాస రీ సాస నినిసరీ నినిసరీ సనిప నీ నీ నీ (తప్పుండవచ్చు మన్నించాలి) తొ పాటు
దేవ రార, కన రార, వే రార, ఉరు కృపా గుణ గణాభరణ సాకారా లాగా
సంగీత సాహిత్యాలను జోడెద్దుల బండ్లమీద ప్రతి స్వరాక్షరానికి ఒక సాహిత్యాక్షరం నిర్మిస్తూ ఎందుకు పాడరు. ఈ విధమైన రచన త్యాగరాజుల వారు “ఎందరో మహానుభావులు” కృతిలో చేశారు కదా?
మహేష్ కుమార్ గారి అభిప్రాయం తో ఏకీభవిస్తూ..మ చ్చుకి అలాంటి అనుభవం ఎలా ఉంటుందో చెప్తాను. “సామ జ వర గమనా”..త్యాగరాజ కృతిని చాలా బాగా పాడుతూనే….యాదవకుల.. మురళీ..అని విరవ్వల్సిన చోట మ హారాజ పురం .”యాదవ..కులమురళీ” అని “కుల”మురళీ పదం మీద పాడినత సేపూ stress చేస్తూంటే..ఆయన గొంతుని ఎంతగా న చ్చుకునే వారికైనా కూడా అది, పానకంలో పుడక లాగా గుచ్చుకుంటూ నే ఉంటుంది.
ఆమాట చెప్తే ఆ తమిళులు అంటారు కదా!” అసలు త్యాగరాజ కీర్తనల్ని మీకు అందించింది మేమే కదా!” అని. అది నిజమే అయినా తప్పులు లేకుండా పాడొచ్చు కదా అంటేనో..తమిళం తప్పుల్తో ఉచ్చరిస్తే మీరు ఊరుకుంటారా? అంటేనో మాత్రం ఉలకరు. తప్పుల్తో ఎంత గొప్పగా పాడినా ఆ అసలుభాషలో రక్తి కట్టటం కష్టం. కానీ అది ముఖ్యమైన సమ స్య అన్న ది..ముందు చర్చకి రావాలి. దాన్ని issue చేయందే దక్షిణాదిన తెలుగులోశాస్త్రీయ సంగీతం పాడే వాళ్ళు…వళ్ళు దగ్గర పెట్టుకోరు. తెలుగుభాష మీద ఉన్న నిర్లక్ష్యం వల్లనే అర్ధ, భావాల విరుపుల మీద పాడేవారు శ్రధ్ధ పెట్టరు. అయితే అంత మాతృభాషాభిమానం ..అలా శ్రధ్ధతో తెలుగుని రాగయుక్తంగానే కాదూ..భావ యుక్తంగానూ..అర్ధం చెడకుండానూ..పాడాలని గాయకులని అడగాలన్న దీక్ష ..భాష్ మీద కనీసపు గౌరవం..అలాగే..అలా పాడే వారి వైఖరి మీద విమర్శ పెట్టే బాధ్యతా..ఏనాడైనా..తెలుగువారికి ఏదీ?? తెలుగుని హాయిగా ఆస్వాదించటంలో తెలుగు వారిలో తగినంత శ్రధ్ధ ఏదీ?? అంతేనా తమిళుల్ని అనుకరిస్తూ తెలుగు కృతుల్ని తప్పుల్తో పాడే తెలుగు వారే ఉన్నారు కూడాను.
రమ.
కథ చాలా చక్కగా ఉంది. రచయితకు అభినందనలు. నిజంగా రాఘవ లాంటి భర్తలు ఉంటే, మారాల్సిన అవసరం చాలా ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ సంసారానికి జోడెడ్ల వంటి వారు. ఇద్దరూ సమానంగా సంసార భారాన్ని మోయాల్సి ఉంటుంది.
ఒకే గురులఘువుల అమరికతో వేరువేరు గతులలో రాయడానికి
వీలవుతుందని ఛందస్సు రచ్చబండ వేదికలపైన ఎన్నో ఉదాహరణలతో
నేను నిరూపించిన సంగతి కొందరికి గుర్తు ఉందనుకొంటాను. ఇది
కూడా ఒక చిత్రకవిత్వమే.
దయచేసి మీరు పై విషయంపై వ్రాసిన వ్యాసం (వ్యాసాలు) అందజేయగలరా?
లేదా వాటిని నేనెక్కడ (అంతర్జాలంలో) పొందగలనో తెలియజేయండి.
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
06/01/2009 2:46 pm
> ఘంటసాల, రాజాలు ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల (శొభ చిత్రానికి) పాడారు.
ఈరోజు పి.బి.శ్రీనివాస్ 1964-65 ప్రాంతంలో “జ్యోతి” మాసపత్రికలో వివిధ సంగీతదర్శకులపై రాసిన వ్యాసాలు చదువుతూ తెలుసుకున్న విషయం: ఘంటసాల నిర్మించి, సంగీత దర్శకత్వం వహించిన “పరోపకారం” (1953) చిత్రంలో రాజా పాడారని. పాటల పుస్తకం చూసి ఒకటి కాదు రెండు పాడారని నిర్ధారించుకునడమైనది.; “తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనెలూరు…” (A.P.కోమలతో), “హృదయము ఊగిసలాడే…” (ఘంటసాల, A.M.రాజా, P.లీల, A.P.కోమల)
— శ్రీనివాస్
రాగాలూ స్వరాలూ గురించి mOhana గారి అభిప్రాయం:
05/30/2009 1:33 pm
నాకు సంగీతంలో పాండిత్యం సున్నా, అయినా నా ఉద్దేశంలో అన్నమాచార్యులవంటి మహానుభావులు, రామదాసు కూడా పాటలోని పదాలను ఎన్నుకొనేటప్పుడు అవి మాత్రలుగా విరిగేటట్లు జాగ్రత్తగా ఎన్నుకొన్నారు. అందుకే అవి సాహిత్యపరంగా కూడా ఉత్తమమైనవి. అందరు వాగ్గేయకారులు ఈ నియమాన్ని సరిగా పాటించలేని కారణాన ఇప్పటి ఇక్కట్లు వచ్చాయి. జయదేవుని అష్టపదులలో కూడా ఈ నియమం ఎక్కువగా పాటించబడినది. సంస్కృత సాహిత్యంలో పద విచ్ఛేదన యతిగా పరిగణించబడినది కాబట్టి ఆ వృత్తాలను, అందులో మాత్రాబద్ధమైన తాళవృత్తాలను పాడుకోవచ్చు. మనం సామాన్యంగా ఉపయోగించే చంపకమాలవంటి వృత్తాలను కూడా ఇలా రాయడానికి, పాడటానికి వీలవుతుందని నేను నిరూపించి ఉన్నాను.(మరుగేల చరా) (చర రూప పరా) (త్పర సూర్య సుధా) (కర లోచనా) అనివిరిచి పాడగా విని ఉన్నాను. అందుకే కొన్ని పాటలు వాద్య సంగీతంగా బాగుంటాయి, గాత్ర సంగీతంకన్నా. విధేయుడు – మోహన
రాగాలూ స్వరాలూ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
05/30/2009 10:30 am
సంగీతంలో సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే నని ప్రసాద్ గారు అంటున్నారు. కానీ మన దేశాన సంగీతపు వృధ్ధి..వికాసమూ బాగా తెలిసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాత్రం ఇలా అన్నారు.”మన దేశమున సంగీత సాహిత్య రచనలు అనాదిగా అవినాభూతముగా కలిసి న డుచుచున్నను సంగీతము సాహిత్యమునకు శోభాకరము మాత్రముగానే వెనుకనుండి న డచిదనియు వట్టి నాద రచనలు అంతగా పూర్వకాలమున లేవనియు చెప్పవచ్చును.ఎట్లును దక్షిణ దేశమున భక్తి,శృంగారము,వీరము
మొదలగు భావములను భగవద్విషయముగాగాని, ప్రభువులను గూర్చి కాని
వెలువరించు రచనలు చాలవరకు నిబధ్ధగేయములేయైనను వాని భాషా రచన
కు దేశములోనున్న విలువ నాద రచనకు లేదు గావుననే ఆ గానపధ్ధతులు నశించినవి.”
అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయము ప్రకారము..సంగీతమే సాహిత్యాన్ని అనుసరించి న డిచిందిగానీ..సాహిత్యం సంగీతాన్ని అనుసరించలేదు..అన్న ది
విస్పష్టమౌతోంది. సాహిత్యం సంగీతానికి ఉపాంగం కాదనీ..ప్రధానాంగమేననీ కూడా ఇందువలన తేటతెల్లమౌతోంది.
రమ.
రాగాలూ స్వరాలూ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
05/30/2009 2:52 am
పైన వెలువరించిన రమ గారి అభిప్రాయం చాలా సమంజసమైనది. శ్రద్ధ చూపదగినది కూడా. బాల మురళీ కృష్ణ గారితో సమానమైన ప్రతిభ గలిగిన విద్వాంసులైనా “మగా గనబదిం మనసా స్మరామి” అంటూ లేదా “ఎంద నేర్చినా ఎంద జూసినా” అంటూ పాడితే మనస్సు చివుక్కు మంటుంది. హ, ణ, ప, త అనే అక్షరాలు తమిళంలో లేక పోవచ్చు కానీ సులభోఛ్ఛారణా సాధ్యమైన ఆ ధ్వనులున్నాయి గదా.
కానీ మహేశ్ గారి అభిప్రాయం ఆచరణ సాధ్యం కాదేమో. కొంచెం లోతుగా సహృదయంతో ఆలోచిస్తే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని భావిస్తాను. సంగీతం చ సాహిత్యం చ సరస్వతీ కుచద్వయం ఐనా కూడా సంగీతంలో సాహిత్యానికి, సాహిత్యంలో సంగీతానికి సరి సమ ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యం కాదు. సంగీతంలో సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే. రాగం తాళం వంటి సంగీత ప్రధానాంశాల తరువాతనే సాహిత్యం యొక్క విలువ గుర్తించబడుతుంది. వ్యాసకర్త (గురువుగారే) వివరించినట్లు “పక్కల నిలబడి” అనే సాహిత్యాన్ని సంగీతంలో పక్కాలా నీలాబాడి అని పాడక తప్పదు. దీనికి కారణం రాగ శ్రావ్యత. సంగీతంలో ప్రతి స్వరాక్షరానికి ఒక సాహిత్యాక్షరం ఉండదు. “నిలువలేని మోహమాయె” అనే తొమ్మిది అక్షరాల సాహిత్యానికి “నీ సద సనిదపమ గమాపా మపదని పదనిద రిస” అనే ఇరవై ఒక్క స్వరాక్షరాలు కావాలి. “వనజాక్షిరో విరహమోర్వలేనె వాసుదేవు గొని తేవె” అనే సాహిత్యాన్ని పలికే స్వరాక్షరాలు విద్వంసుని ప్రతిభను బట్టీ అనేక రెట్లు ఎక్కువగా వుంటాయి. ఇక సాహిత్యాక్షరం లఘువైనా గురువైనా దీర్ఘం తప్పనిసరి. సంగీత పరమోద్దేశం శ్రుతిపేయత, శ్రావ్యత అని గుర్తించి సంగీత రసజ్ణులు దీనిని ఉపేక్షింపక తప్పదు. దీనిపై గురువుగారు చాలా సమంజసమైన సమాధానం ఇచ్చారు. కీర్తన తెలుగు భాషలో ఉంది కాబట్టీ, మీరు తెలుగు వారు కాబట్టీ కదా ఇంత గొడవ. అదే మీకు తెలియని వేరే భాష ఐతే లేదా అది గాత్ర సంగీతం గాక వాద్య సంగీతమైతే, కేవలం శ్రుతిపేయమైన ఆ మధుర సంగీతాన్ని ఆస్వాదించి ఊరుకుండేవారు కాదా. సంగీతం శ్రావ్యతా ప్రాధాన్యం కలిగినిది కాబట్టి ఇటువంటి అపరిహార్యములైన చిన్న చిన్న విషయాలను ఉపేక్షించరాదా. కాబట్టి మహేశ్ గారు గారు దీనిని పునరాలోచించి శాస్త్రీయ సంగీతంపై తమ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలి.
పరిహార్యాలైన దోషాలకు ఇది వర్తించదు. రమగారు చెప్పినట్లు “కుల మురళి” అని సాగదీసి పాడడం ఖండించ వలసినదే. (రాగ పరంగా సాధ్యమైన పరిస్థితులలో) సంగీతం (రాగం) సహకరించని పరిస్థితులలో, “యాదవ” లోని “వ” ని స్వల్పంగా భంజించకుండా సాగించి “కుల” ని పాడి, అక్కడ అతి స్వల్ప కాలం ఖండించి తరువాత పదం పాడడం (యస్పీ గారు ఇటువంటి మార్పులు తమ కార్యక్రమాలలో చూపిస్తుంటారు), సంగీతం సాహిత్యం రెండిటినీ అభిమానించే వారు చేస్తారు. లేకుంటే సాహిత్య భావం దోష భూయిష్టమౌతుంది. నా చిన్నప్పుడు నేర్చుకున్న
ఫణి రాజకం
కణవిఘ్ననివా
రణశాంభవశ్రీ
అనే పదాలకులు (ఫణి రాజ కంకణ, విఘ్న నివారణ, శాంభవ అని విడదీసి) అర్థం తెలుసుకోవడానికి నాకు పదిహేను సంవత్సరాలు పట్టింది. హంసధ్వనిలోని ఈ కృతిని ఇప్పటికీ పై విరుపులతోనే పాడుతారు. సాహిత్యం తెలిసిన వారు మాత్రం యస్పీ గారు చూపిన మార్గంలో సంగీత సాహిత్యాలకు భంగం కలుగ కుండా పాడుతారు.
గురువుగారు రోహిణీ ప్రసాదు గారినుండి గానీ లేదా తదితర ఈమాట సంగీత కళా కోవిదులైన వారినుండి గానీ ఒక చిన్న ప్రశ్న కు సమాధానం ఆశిస్తాను.
సంగీతంలో సాహిత్యానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక గంట సేపు పాడే కచేరీలో సాహిత్యం మొత్తం 1-2 నిముషాలకు మించదు. సంగీత విద్వాంసులకు సాహిత్యం మీద అంత పట్టుండదు. (మన ఈ మాట వ్యాసాలలోనే త్యాగరాజు గారి కీర్తనలలో సాహిత్య విలువ గణనీయం గాదని ఉటంకించారు) కానీ సంగీత సాహిత్యాలను సమంగా సంభావించేవారు ముఖ్యంగా కీర్తనలలో చివరలో స్వర విహారం చేసేటపుడు స్వరంతో పాటు సాహిత్యం కూడా జోడించి పాడుతే ఇంకా హృదయంగమంగా వుంటూంది గదా. ఉదాహరణకి శంకరాభరణం పాట చివరిలో
రీస సాస రిరి సాస రీ సాస నినిసరీ నినిసరీ సనిప నీ నీ నీ (తప్పుండవచ్చు మన్నించాలి) తొ పాటు
దేవ రార, కన రార, వే రార, ఉరు కృపా గుణ గణాభరణ సాకారా లాగా
సంగీత సాహిత్యాలను జోడెద్దుల బండ్లమీద ప్రతి స్వరాక్షరానికి ఒక సాహిత్యాక్షరం నిర్మిస్తూ ఎందుకు పాడరు. ఈ విధమైన రచన త్యాగరాజుల వారు “ఎందరో మహానుభావులు” కృతిలో చేశారు కదా?
తెలుగు నవలలో అస్తిత్వ వాదం గురించి Rajesh గారి అభిప్రాయం:
05/28/2009 12:11 am
Hi
Especially the last 3 Paragraphs in the article [ http://www.sartre.org/Writings/Americansandtheirmyths.htm ] are true and good ….
Thanks for the Article.
Rajesh Devabhaktuni.
మా అమ్మ గదే! గురించి prasanna గారి అభిప్రాయం:
05/27/2009 11:12 pm
చాలా బావుంది కథ.
ఎండింగ్ బావుంది.
రాగాలూ స్వరాలూ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
05/27/2009 11:05 am
మహేష్ కుమార్ గారి అభిప్రాయం తో ఏకీభవిస్తూ..మ చ్చుకి అలాంటి అనుభవం ఎలా ఉంటుందో చెప్తాను. “సామ జ వర గమనా”..త్యాగరాజ కృతిని చాలా బాగా పాడుతూనే….యాదవకుల.. మురళీ..అని విరవ్వల్సిన చోట మ హారాజ పురం .”యాదవ..కులమురళీ” అని “కుల”మురళీ పదం మీద పాడినత సేపూ stress చేస్తూంటే..ఆయన గొంతుని ఎంతగా న చ్చుకునే వారికైనా కూడా అది, పానకంలో పుడక లాగా గుచ్చుకుంటూ నే ఉంటుంది.
ఆమాట చెప్తే ఆ తమిళులు అంటారు కదా!” అసలు త్యాగరాజ కీర్తనల్ని మీకు అందించింది మేమే కదా!” అని. అది నిజమే అయినా తప్పులు లేకుండా పాడొచ్చు కదా అంటేనో..తమిళం తప్పుల్తో ఉచ్చరిస్తే మీరు ఊరుకుంటారా? అంటేనో మాత్రం ఉలకరు. తప్పుల్తో ఎంత గొప్పగా పాడినా ఆ అసలుభాషలో రక్తి కట్టటం కష్టం. కానీ అది ముఖ్యమైన సమ స్య అన్న ది..ముందు చర్చకి రావాలి. దాన్ని issue చేయందే దక్షిణాదిన తెలుగులోశాస్త్రీయ సంగీతం పాడే వాళ్ళు…వళ్ళు దగ్గర పెట్టుకోరు. తెలుగుభాష మీద ఉన్న నిర్లక్ష్యం వల్లనే అర్ధ, భావాల విరుపుల మీద పాడేవారు శ్రధ్ధ పెట్టరు. అయితే అంత మాతృభాషాభిమానం ..అలా శ్రధ్ధతో తెలుగుని రాగయుక్తంగానే కాదూ..భావ యుక్తంగానూ..అర్ధం చెడకుండానూ..పాడాలని గాయకులని అడగాలన్న దీక్ష ..భాష్ మీద కనీసపు గౌరవం..అలాగే..అలా పాడే వారి వైఖరి మీద విమర్శ పెట్టే బాధ్యతా..ఏనాడైనా..తెలుగువారికి ఏదీ?? తెలుగుని హాయిగా ఆస్వాదించటంలో తెలుగు వారిలో తగినంత శ్రధ్ధ ఏదీ?? అంతేనా తమిళుల్ని అనుకరిస్తూ తెలుగు కృతుల్ని తప్పుల్తో పాడే తెలుగు వారే ఉన్నారు కూడాను.
రమ.
పునరపి గురించి Ananth Mallavarapu గారి అభిప్రాయం:
05/27/2009 7:40 am
కథ చాలా చక్కగా ఉంది. రచయితకు అభినందనలు. నిజంగా రాఘవ లాంటి భర్తలు ఉంటే, మారాల్సిన అవసరం చాలా ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ సంసారానికి జోడెడ్ల వంటి వారు. ఇద్దరూ సమానంగా సంసార భారాన్ని మోయాల్సి ఉంటుంది.
పాటల్లో లయవిన్యాసాలు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
05/26/2009 11:27 pm
మోహన గారికి
దయచేసి మీరు పై విషయంపై వ్రాసిన వ్యాసం (వ్యాసాలు) అందజేయగలరా?
లేదా వాటిని నేనెక్కడ (అంతర్జాలంలో) పొందగలనో తెలియజేయండి.
భవదీయుడు
జనరంజని: మహానటి సావిత్రి గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
05/26/2009 11:29 am
ఇప్పుడే విన్నాను. పొందిన ఆనందం వర్ణనాతీతం. మీరు చేస్తున్న జన రంజనం చల్లగా అవితధంగా సాగాలి. దశ సహస్ర శత కోటి ధన్యవాదాలు.
భవదీయుడు