మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను సంగీతం శాస్త్రీయంగా అభ్యసించినవాడిని కాదు. అయితే పాటలు పాడటం మా ఇంట్లో అందరికీ ఇష్టం కావటంతో, చిన్నప్పటి నుంచీ సంగీతంపై మోజు వల్ల తెలిసిన వారి దగ్గరనుంచి నేర్చుకుంటూ పాటలు పాడేవాడిని. నా కవల సోదరుడైన రామన్నకూ, నాకూ (కవలలం కావటం వల్లనేమో!) పాటలు తొందరగానే పట్టుపడేవి. కానీ సంగీతంలో మా పరిమితులు మాకు తెలుసు. ఒక ఔత్సాహిక గాయకుడిగా నేను నేర్చుకున్న విషయాలు చెప్ప ప్రయత్నించిన ఫలితమే ఈ వ్యాసాలు. దానికి తోడు స్వయంగా నేర్చుకున్న వేణువు వల్ల స్వరాలతో అనుబంధం ఎక్కువైంది.
రాగాలను ‘ఈమాట ‘లో పరిచయం చేస్తున్నప్పుడు “ఈ వ్యాసాలు ఎవరికైనా ఏమాత్రం ఉపయోగమా?” అన్న అనుమానం నాకు ఎక్కువగా వస్తూ ఉండేది. శ్రోత – పాఠకుల నుంచి స్పందన ఎక్కువ లేకపోటమే ఇందుకు ఒక కారణం అనుకుంటా! కొంత రాగ, స్వర జ్ఞానం వచ్చిన తరవాత ఎవరికి వారే తమంత తాముగా మరింత తెలుసుకోగలరని నా నమ్మకం. అందువల్లే మరిన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చెయ్య లేదు. పైగా వృత్తి రీత్యా అమెరికా నుండి ఫ్రాన్స్ 2002 సంవత్సరంలో వెళ్ళటంతో ఈమాటకి ఎక్కువ రాయలేకపోయాను.
గత సంచికలలో ఈమాటలో శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు చాలా వ్యాసాలు సంగీత పరంగా రాసారు. ఆ అనుభవాలతో ఔత్సాహికులు స్వయం కృషి వల్ల చాలానే నేర్చుకోవచ్చు. ఇది నా స్వానుభవం.
ఆచార్యా!
సోనూ నిగం వైఖరిపై మీ ఆక్షేపణ చాలా సమంజసమైనదిగా కనబడుతుంది. కానీ విద్యాపర శేష భోగులు, దిగ్గజాలవంటి ఉద్దండ పండితుల గురించి వారి మాహత్మ్యం గురించి ఏ విధమైన వాక్యాలతో ప్రస్తుతించకుండా వారిని రంగస్థలంపైకి కేవలం పేరు పిలచి ఆహ్వానించడం, వారి రాకను రసజ్ఞులు కళాభిమానులైన వారు సాదరంగా కరతాళధ్వనులతో స్వాగతించకపోవడం సమంజసమనిపిస్తుందా? సోనూ నిగం గానీ వేరెవరైనా గానీ అట్టి సందర్భాలలో ఏ విధంగా నిర్వహిస్తే హుందాగా ఉంటుందని మీరు భావిస్తారు?
మీరు వెలువరించిన భావాలు, ఉద్భోధించిన సక్రమ ప్రవర్తన సూచనలు సర్వదా సర్వధా అనుసరణీయములు ఆచరణీయములే.
శ్రీ లక్ష్మన్న గారికి అనంత కోటి ధన్యవాదాలు. మీ వ్యాసాలు వాటిలో ఇస్తున్న సమాచారం మాకు ఎంతో ఉపయోగకరంగాఉన్నాయి. ఒకే రాగంలో వున్న పాటలను ఒకదాని తరువాత మరొక్కటి పలికిస్తుంటే ఆ రాగంలో పలికే స్వరాల గురించిన ప్రాధమిక పరిజ్ఞానం కలుగుతున్నట్లు అనిపించి స్ఫూర్తి నిస్తున్నాయి. మీరీ వ్యాసాలు 1999-2001 వత్సరాలలో వ్రాసారు. అప్పటినుండి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఎన్నో కొత్త జనాదరణపొందిన పాటలు వచ్చాయి. మీరు రాగాల వ్యాసాలలో ఇచ్చిన పాటల పట్టికలను పునర్నవీకరించి అనుబంధంగా ఇవ్వరా. ఇది మా విన్నపం మాత్రమే. తరువాత మీరు రాగాల పరిచయ వ్యాసాలను విరమించారెందుకు? మరికొన్ని రాగాలు మాకు పరిచయం చేయ రాదా.
నాది ఇంకొక్క ప్రార్ధన. ఈ శతాబ్దపు ఉత్తమ పాటలలో ఒకటిగా (నేను) భావించే “వేణు మాధవా” పాట ఏ రాగం తెలుపరా. ఈ పాట ఏ సినిమాలోదో తెలియదు గానీ శ్రియా-నాగర్జునలు తెరపై కనిపిస్తారు.
అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.
ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”
కొడవళ్ళ హనుమంతరావు
[1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.
కాలచక్రం వేగంగా ఎవరితోనూసంబంధం లేకుండా తిరుగుతుంది. తనతో పాటు అనేక సంస్కృతులనీ సంప్రదాయాలనీ మార్పులకు గురిచేస్తూ పోతుంది. కాలానుసారంగా మారగలిగినన్నాళ్ళూ ఎవ్వరికీ ఏ బాధా వుండదు. కానీ ఎప్పుడైతే ఇదే నిజమైన సర్వజనులూ ఆదరించి ఆచరించాల్సిన సంస్కృతి సంప్రదాయం అని ఎక్కడ మనం ఆగిపోతామో, అక్కడనుండే మన కష్టాలు ప్రారంభం అవుతాయి. ఎన్ని రామసేనలు వచ్చినా అనివార్యమైన కాలం తెచ్చే మార్పులను ఆపడం సాధ్యం కాదు. కాలానుగుణంగా మారి తీరాలి. లేకపోతే మనకే నష్టం కష్టం. జన జీవన స్రవంతి, జనాభీష్టాలు కాలాదిష్టమైన మార్పులతో వాటి తోవన అవి సాగి పోతూనే వుంటాయి. సంగీత సాహిత్యాలకు సంబంధించిన సామాన్య ప్రజానీక అభిరుచులు దీనికి అతీతం కావు.
ఐతే జీవితమంతా అభిరుచులను మార్పు చేసుకుంటూ పోలేము. మనకి ఆదర్శప్రాయంగా అనిపించిన విలువల వద్ద స్థిరపడి వుండడమే ఉత్తమ లక్షణం.
మహా భారతం 18 పర్వాల్లో ఒకే ఒక్క సారి చదివింది చాలా చోట్ల విసుగుగా వదిలేసింది శాంతి పర్వమైతే అనేక సార్లు చదివినవి యుద్ధ పంచకం (భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తికాలు) + స్త్రీ పర్వం. (సాహిత్య అకాడమీ వారు శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు కలిపి ప్రచురించారు) . యుద్ధ పంచకం ఉత్సాహంతో అమూలాగ్రం చదివింప జేస్తుంది. (ఒక్క మినహాయింపు – సౌప్తిక పర్వంలోనె భీభత్త్సం అశ్వత్థామ పై అసహ్య భావాన్ని కలిగిస్తుంది) స్త్రీ పర్వమంతా కరుణా – శోక రసం. ఏకో రసః కరుణ ఏవ అన్న భవభూతి కావ్యం చదవలేదు కానీ, ఈ స్త్రీ పర్వం లోని కరుణా రస భరితమైన వర్ణనలు, శోక భరిత భావాలు కంట తడి పెట్టీంచక మానవు. వ్యాస కర్త గారు దిఙ్మాత్రంగా చూపిన కొన్ని పద్యాలు తిరిగి ఆ పర్వాన్నంతా స్మృతిలోకి తెచ్చి స్పందింపజేశాయి. భారతంలో నా అభిమాన పర్వాల్లో స్త్రీ పర్వం ఒకటి. ఈ పర్వానికి నాయకురాలు గాంధారి, ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించిన కరుణా శోక రసాలు, క్రోధావేశాలు మనస్సులను కదిలించివేస్తాయి. రచయిత గారికి కృతజ్ఞతలు.
బాబ్జీలు గారి వేదన్లో సమంజసం లేదు. ఒక శాస్త్రం లోని మెలకువల్ని తెలుసుకునేందుకు వలసిన “శిక్షణ” ఎంతోకొంత లేనిదే ఆ శాస్త్రం లోని అభివృధ్ధినీ..విశేషాల్నీ..గ్రహించటం సాధ్యంకాదు. మీరు అక్షర జ్ణానం..లేని వారి చేతికి ఆంధ్ర మ హాభారతం ఇచ్చి వారిని అందులోని విశేషాల్ని ఆనందించమని అన్నా..లేదా చర్చించమని అన్నా వాళ్ళు ఎలా చేయలేరో.. అలాగే శాస్త్రీయ సంగీతంకూడా!! రాజ దర్బారైనా..ప్రజాదర్బారైనా..కాలంలోని మార్పే గానీ ఆస్వాదనకి సంబంధం ఎప్పుడూ ఆస్వాదనాయోగ్యమైన సంస్కారం మాత్రమే!! సంస్కారం అన్న దానికీ సామాన్య..అసామాన్యతకీ ఏ సంబంధం లేదు. ఎప్పుడూ ఏ కాలంలోనీ ఉండదు కూడా! అందువల్ల అత్రే గారి అభిప్రాయాలన్నీ అర్ధవంతమైనవే! creativity లో గానీ..దాని ఆస్వాదన్లో గాని బాబ్జీలు గారికి ఎంత ఇష్టమైనా సమాన త్వం అన్నిసార్లూ సాధ్యంకాదు గాక కాదు.
ఇంక మన దేశంలోని శాస్త్రీయ సంగీతపు చరిత్ర అందులో జరిగిన వికాసపు పూర్వాపరాలూ క్షుణ్ణంగా తెలిసే వీలు లేనిదే ఎవరు ఏ అభిప్రాయం వెలిబుచ్చినా దానికి బలం తక్కువ. మన దేశంలో అక్షరం వెంట స్వరం నడిచిన దశ తొలిది గానూ…దాని తరువాతి దశ స్వరం మాత్రమే ..లేదా రాగం మాత్రమే ముఖ్యమై అక్షరం వెనక్కి తప్పుకోవటం గానూ అర్ధమౌతోంది. కర్ణాటక సంగీతం ఈ దేశం లోని ప్రాచీన గాన పధ్ధతి కాగా..హిందుస్థానీ దాన్నించి విడివడి స్వర రాగ ప్రధానంగా pure music గా రూపొందిందని చెప్పొచ్చు. ………రమ.
నా సంశయ నివృత్తి చేస్తూమీరు వెలువరించిన సమాధానానికి చాలా కృతజ్ఞుడను. సాహిత్యం యొక్క అవలంబన చాలా స్వల్పంగా ఎక్కువ భాగం స్వీయ మేధోజనితమైన స్వరాల హేలతో జనరంజకమైన సంగీతాన్ని సృజించడానికి ఎక్కువ ప్రతిభా వ్యుత్పత్తి కావాలి. అది సాధకులకి అదరికి ఎలా పట్టువడుతుంది. అదీ గాక గురువు గారి ముఖంనుండి వెలువడే రాగాలాపననే ఆధారం చేసుకొని ప్రారంభకులు రాగాలను ఎలా పట్టుకోగలుగుతారు. 12 లేదా 16 స్వరాల మధ్య అంతరాలను కేవలం స్వరం విని పట్టుకోవడం సాధ్యమా. దానికన్నా కర్ణాటక సంగీతంలో సాహిత్యం సమావలంబనం వుండడం వలన మెట్లు మెట్లుగా రాగాన్ని తెలుసుకోవడం సాధ్యం అవుతుంది కదా. (మీరు ప్రారంభకులకు సినిమా పాటల ద్వారా స్థూలంగా రాగాలను గుర్తుపట్టే పరిజ్ఞానాన్నీ సమకూర్చినట్లు)
నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడిని, అతని యాదవ కులాన్నీ, దిక్కులేని చావు చస్తారని శపిస్తుంది, గాంధారి. – వ్యాసకర్త.
అంతే. అంతే.
అవును. కొందరు స్త్రీలు అలానే ఉంటారు. గాంధారిలా. వాళ్ళకే శక్తి ఉంటుంది. వాళ్ళే చెయ్యొచ్చు ఆ పని. ఐనా ఇంకెవరో మగవాడు ఆ పని చెయ్యలేదని సాధిస్తూ ఉంటారు. మగవాళ్ళు మనమే కదా శౌర్యవంతులం అని -స్త్రీ ఏడ్చిందనో, నవ్విందనో, దెప్పిందనో, మెచ్చుకుంది అనో -ఎలాటి యుద్ధాలైనా
చేసేస్తూ ఉంటారు.
మొత్తం యాదవ వంశాన్నే నాశనం చెయ్యగల, కృష్ణ నిర్యాణాన్నే ఘటించగల శాపం ఇవ్వగల శక్తిఉన్న గాంధారికి, భారత యుద్ధం ఆపే శక్తి లేదూ? ఉన్న ఆస్థి పంచుకు తినలేక, పోట్లాటలు సృష్టించుకునేవాళ్ళు ఆమె ఇంట్లో వాళ్ళూ, యుద్ధం ఆపాల్సింది కృష్ణుడూనా?
మరి భారతకథ రాసిన పురుషులు సరే, పై వ్యాసం రాసిన, చదివిన, ఈనాటి పురుషులూ, ఆ కథలో గాంధారీ నారికి ఆ శక్తి ఉన్నదనీ గ్రహించరు. ఎందుకనో?
దక్షులెవ్వారు? స్త్రీలా? పురుషులా? అని ఆలోచిస్తున్నాను. 🙂
లైలా
PS: I liked this essay three years back and I still like it today.
రాగలహరి: సింధుభైరవి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
06/08/2009 7:04 am
శ్రీ ప్రసాద్ గారికి:
మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను సంగీతం శాస్త్రీయంగా అభ్యసించినవాడిని కాదు. అయితే పాటలు పాడటం మా ఇంట్లో అందరికీ ఇష్టం కావటంతో, చిన్నప్పటి నుంచీ సంగీతంపై మోజు వల్ల తెలిసిన వారి దగ్గరనుంచి నేర్చుకుంటూ పాటలు పాడేవాడిని. నా కవల సోదరుడైన రామన్నకూ, నాకూ (కవలలం కావటం వల్లనేమో!) పాటలు తొందరగానే పట్టుపడేవి. కానీ సంగీతంలో మా పరిమితులు మాకు తెలుసు. ఒక ఔత్సాహిక గాయకుడిగా నేను నేర్చుకున్న విషయాలు చెప్ప ప్రయత్నించిన ఫలితమే ఈ వ్యాసాలు. దానికి తోడు స్వయంగా నేర్చుకున్న వేణువు వల్ల స్వరాలతో అనుబంధం ఎక్కువైంది.
రాగాలను ‘ఈమాట ‘లో పరిచయం చేస్తున్నప్పుడు “ఈ వ్యాసాలు ఎవరికైనా ఏమాత్రం ఉపయోగమా?” అన్న అనుమానం నాకు ఎక్కువగా వస్తూ ఉండేది. శ్రోత – పాఠకుల నుంచి స్పందన ఎక్కువ లేకపోటమే ఇందుకు ఒక కారణం అనుకుంటా! కొంత రాగ, స్వర జ్ఞానం వచ్చిన తరవాత ఎవరికి వారే తమంత తాముగా మరింత తెలుసుకోగలరని నా నమ్మకం. అందువల్లే మరిన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చెయ్య లేదు. పైగా వృత్తి రీత్యా అమెరికా నుండి ఫ్రాన్స్ 2002 సంవత్సరంలో వెళ్ళటంతో ఈమాటకి ఎక్కువ రాయలేకపోయాను.
గత సంచికలలో ఈమాటలో శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు చాలా వ్యాసాలు సంగీత పరంగా రాసారు. ఆ అనుభవాలతో ఔత్సాహికులు స్వయం కృషి వల్ల చాలానే నేర్చుకోవచ్చు. ఇది నా స్వానుభవం.
మీరు ఉదాహరించిన పాట నాకు పరిచయం లేదు.
ధన్యవాదాలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
సంగీతానికి స్పందన గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/08/2009 3:21 am
ఆచార్యా!
సోనూ నిగం వైఖరిపై మీ ఆక్షేపణ చాలా సమంజసమైనదిగా కనబడుతుంది. కానీ విద్యాపర శేష భోగులు, దిగ్గజాలవంటి ఉద్దండ పండితుల గురించి వారి మాహత్మ్యం గురించి ఏ విధమైన వాక్యాలతో ప్రస్తుతించకుండా వారిని రంగస్థలంపైకి కేవలం పేరు పిలచి ఆహ్వానించడం, వారి రాకను రసజ్ఞులు కళాభిమానులైన వారు సాదరంగా కరతాళధ్వనులతో స్వాగతించకపోవడం సమంజసమనిపిస్తుందా? సోనూ నిగం గానీ వేరెవరైనా గానీ అట్టి సందర్భాలలో ఏ విధంగా నిర్వహిస్తే హుందాగా ఉంటుందని మీరు భావిస్తారు?
మీరు వెలువరించిన భావాలు, ఉద్భోధించిన సక్రమ ప్రవర్తన సూచనలు సర్వదా సర్వధా అనుసరణీయములు ఆచరణీయములే.
భవదీయుడు
వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్ఖాన్ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/08/2009 2:43 am
సూర్యు డటంచు వ్రేల నిటు జూపిన గాని గ్రహింపలేని దు
ర్వార్య తమో నిమగ్నత ప్రవర్తిలు చంధత నున్న మాకు ని
ట్లర్యమ కోటి జూపి జనుషాంధత నైనను బాపు మీదు స
త్కార్య గతానురక్తి శతధా నుతియింతు ప్రసాద! కోవిదా!
ధన్యవాదాలతో
భవదీయుడు
రాగలహరి: సింధుభైరవి గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/08/2009 1:25 am
శ్రీ లక్ష్మన్న గారికి అనంత కోటి ధన్యవాదాలు. మీ వ్యాసాలు వాటిలో ఇస్తున్న సమాచారం మాకు ఎంతో ఉపయోగకరంగాఉన్నాయి. ఒకే రాగంలో వున్న పాటలను ఒకదాని తరువాత మరొక్కటి పలికిస్తుంటే ఆ రాగంలో పలికే స్వరాల గురించిన ప్రాధమిక పరిజ్ఞానం కలుగుతున్నట్లు అనిపించి స్ఫూర్తి నిస్తున్నాయి. మీరీ వ్యాసాలు 1999-2001 వత్సరాలలో వ్రాసారు. అప్పటినుండి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఎన్నో కొత్త జనాదరణపొందిన పాటలు వచ్చాయి. మీరు రాగాల వ్యాసాలలో ఇచ్చిన పాటల పట్టికలను పునర్నవీకరించి అనుబంధంగా ఇవ్వరా. ఇది మా విన్నపం మాత్రమే. తరువాత మీరు రాగాల పరిచయ వ్యాసాలను విరమించారెందుకు? మరికొన్ని రాగాలు మాకు పరిచయం చేయ రాదా.
నాది ఇంకొక్క ప్రార్ధన. ఈ శతాబ్దపు ఉత్తమ పాటలలో ఒకటిగా (నేను) భావించే “వేణు మాధవా” పాట ఏ రాగం తెలుపరా. ఈ పాట ఏ సినిమాలోదో తెలియదు గానీ శ్రియా-నాగర్జునలు తెరపై కనిపిస్తారు.
మరొక్కసారి ధన్యవాదాలతో
భవదీయుడు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/06/2009 10:11 pm
“తిక్కన పదసంపద”
“ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన యాచేయి దొలుతగాఁ బోరిలో దుస్ససేను
తనువింత లింతలు దునియలై చెదరి రూపఱియున్నఁ గని యుడుకాఱుఁగాక!
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది;”
అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.
ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”
కొడవళ్ళ హనుమంతరావు
[1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/05/2009 1:08 am
కాలచక్రం వేగంగా ఎవరితోనూసంబంధం లేకుండా తిరుగుతుంది. తనతో పాటు అనేక సంస్కృతులనీ సంప్రదాయాలనీ మార్పులకు గురిచేస్తూ పోతుంది. కాలానుసారంగా మారగలిగినన్నాళ్ళూ ఎవ్వరికీ ఏ బాధా వుండదు. కానీ ఎప్పుడైతే ఇదే నిజమైన సర్వజనులూ ఆదరించి ఆచరించాల్సిన సంస్కృతి సంప్రదాయం అని ఎక్కడ మనం ఆగిపోతామో, అక్కడనుండే మన కష్టాలు ప్రారంభం అవుతాయి. ఎన్ని రామసేనలు వచ్చినా అనివార్యమైన కాలం తెచ్చే మార్పులను ఆపడం సాధ్యం కాదు. కాలానుగుణంగా మారి తీరాలి. లేకపోతే మనకే నష్టం కష్టం. జన జీవన స్రవంతి, జనాభీష్టాలు కాలాదిష్టమైన మార్పులతో వాటి తోవన అవి సాగి పోతూనే వుంటాయి. సంగీత సాహిత్యాలకు సంబంధించిన సామాన్య ప్రజానీక అభిరుచులు దీనికి అతీతం కావు.
ఐతే జీవితమంతా అభిరుచులను మార్పు చేసుకుంటూ పోలేము. మనకి ఆదర్శప్రాయంగా అనిపించిన విలువల వద్ద స్థిరపడి వుండడమే ఉత్తమ లక్షణం.
భవదీయుడు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/04/2009 2:43 am
మహా భారతం 18 పర్వాల్లో ఒకే ఒక్క సారి చదివింది చాలా చోట్ల విసుగుగా వదిలేసింది శాంతి పర్వమైతే అనేక సార్లు చదివినవి యుద్ధ పంచకం (భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తికాలు) + స్త్రీ పర్వం. (సాహిత్య అకాడమీ వారు శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు కలిపి ప్రచురించారు) . యుద్ధ పంచకం ఉత్సాహంతో అమూలాగ్రం చదివింప జేస్తుంది. (ఒక్క మినహాయింపు – సౌప్తిక పర్వంలోనె భీభత్త్సం అశ్వత్థామ పై అసహ్య భావాన్ని కలిగిస్తుంది) స్త్రీ పర్వమంతా కరుణా – శోక రసం. ఏకో రసః కరుణ ఏవ అన్న భవభూతి కావ్యం చదవలేదు కానీ, ఈ స్త్రీ పర్వం లోని కరుణా రస భరితమైన వర్ణనలు, శోక భరిత భావాలు కంట తడి పెట్టీంచక మానవు. వ్యాస కర్త గారు దిఙ్మాత్రంగా చూపిన కొన్ని పద్యాలు తిరిగి ఆ పర్వాన్నంతా స్మృతిలోకి తెచ్చి స్పందింపజేశాయి. భారతంలో నా అభిమాన పర్వాల్లో స్త్రీ పర్వం ఒకటి. ఈ పర్వానికి నాయకురాలు గాంధారి, ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించిన కరుణా శోక రసాలు, క్రోధావేశాలు మనస్సులను కదిలించివేస్తాయి. రచయిత గారికి కృతజ్ఞతలు.
గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
06/03/2009 11:11 pm
బాబ్జీలు గారి వేదన్లో సమంజసం లేదు. ఒక శాస్త్రం లోని మెలకువల్ని తెలుసుకునేందుకు వలసిన “శిక్షణ” ఎంతోకొంత లేనిదే ఆ శాస్త్రం లోని అభివృధ్ధినీ..విశేషాల్నీ..గ్రహించటం సాధ్యంకాదు. మీరు అక్షర జ్ణానం..లేని వారి చేతికి ఆంధ్ర మ హాభారతం ఇచ్చి వారిని అందులోని విశేషాల్ని ఆనందించమని అన్నా..లేదా చర్చించమని అన్నా వాళ్ళు ఎలా చేయలేరో.. అలాగే శాస్త్రీయ సంగీతంకూడా!! రాజ దర్బారైనా..ప్రజాదర్బారైనా..కాలంలోని మార్పే గానీ ఆస్వాదనకి సంబంధం ఎప్పుడూ ఆస్వాదనాయోగ్యమైన సంస్కారం మాత్రమే!! సంస్కారం అన్న దానికీ సామాన్య..అసామాన్యతకీ ఏ సంబంధం లేదు. ఎప్పుడూ ఏ కాలంలోనీ ఉండదు కూడా! అందువల్ల అత్రే గారి అభిప్రాయాలన్నీ అర్ధవంతమైనవే! creativity లో గానీ..దాని ఆస్వాదన్లో గాని బాబ్జీలు గారికి ఎంత ఇష్టమైనా సమాన త్వం అన్నిసార్లూ సాధ్యంకాదు గాక కాదు.
ఇంక మన దేశంలోని శాస్త్రీయ సంగీతపు చరిత్ర అందులో జరిగిన వికాసపు పూర్వాపరాలూ క్షుణ్ణంగా తెలిసే వీలు లేనిదే ఎవరు ఏ అభిప్రాయం వెలిబుచ్చినా దానికి బలం తక్కువ. మన దేశంలో అక్షరం వెంట స్వరం నడిచిన దశ తొలిది గానూ…దాని తరువాతి దశ స్వరం మాత్రమే ..లేదా రాగం మాత్రమే ముఖ్యమై అక్షరం వెనక్కి తప్పుకోవటం గానూ అర్ధమౌతోంది. కర్ణాటక సంగీతం ఈ దేశం లోని ప్రాచీన గాన పధ్ధతి కాగా..హిందుస్థానీ దాన్నించి విడివడి స్వర రాగ ప్రధానంగా pure music గా రూపొందిందని చెప్పొచ్చు. ………రమ.
గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/03/2009 9:58 pm
నా సంశయ నివృత్తి చేస్తూమీరు వెలువరించిన సమాధానానికి చాలా కృతజ్ఞుడను. సాహిత్యం యొక్క అవలంబన చాలా స్వల్పంగా ఎక్కువ భాగం స్వీయ మేధోజనితమైన స్వరాల హేలతో జనరంజకమైన సంగీతాన్ని సృజించడానికి ఎక్కువ ప్రతిభా వ్యుత్పత్తి కావాలి. అది సాధకులకి అదరికి ఎలా పట్టువడుతుంది. అదీ గాక గురువు గారి ముఖంనుండి వెలువడే రాగాలాపననే ఆధారం చేసుకొని ప్రారంభకులు రాగాలను ఎలా పట్టుకోగలుగుతారు. 12 లేదా 16 స్వరాల మధ్య అంతరాలను కేవలం స్వరం విని పట్టుకోవడం సాధ్యమా. దానికన్నా కర్ణాటక సంగీతంలో సాహిత్యం సమావలంబనం వుండడం వలన మెట్లు మెట్లుగా రాగాన్ని తెలుసుకోవడం సాధ్యం అవుతుంది కదా. (మీరు ప్రారంభకులకు సినిమా పాటల ద్వారా స్థూలంగా రాగాలను గుర్తుపట్టే పరిజ్ఞానాన్నీ సమకూర్చినట్లు)
భవదీయుడు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/03/2009 4:47 pm
నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడిని, అతని యాదవ కులాన్నీ, దిక్కులేని చావు చస్తారని శపిస్తుంది, గాంధారి. – వ్యాసకర్త.
అంతే. అంతే.
అవును. కొందరు స్త్రీలు అలానే ఉంటారు. గాంధారిలా. వాళ్ళకే శక్తి ఉంటుంది. వాళ్ళే చెయ్యొచ్చు ఆ పని. ఐనా ఇంకెవరో మగవాడు ఆ పని చెయ్యలేదని సాధిస్తూ ఉంటారు. మగవాళ్ళు మనమే కదా శౌర్యవంతులం అని -స్త్రీ ఏడ్చిందనో, నవ్విందనో, దెప్పిందనో, మెచ్చుకుంది అనో -ఎలాటి యుద్ధాలైనా
చేసేస్తూ ఉంటారు.
మొత్తం యాదవ వంశాన్నే నాశనం చెయ్యగల, కృష్ణ నిర్యాణాన్నే ఘటించగల శాపం ఇవ్వగల శక్తిఉన్న గాంధారికి, భారత యుద్ధం ఆపే శక్తి లేదూ? ఉన్న ఆస్థి పంచుకు తినలేక, పోట్లాటలు సృష్టించుకునేవాళ్ళు ఆమె ఇంట్లో వాళ్ళూ, యుద్ధం ఆపాల్సింది కృష్ణుడూనా?
మరి భారతకథ రాసిన పురుషులు సరే, పై వ్యాసం రాసిన, చదివిన, ఈనాటి పురుషులూ, ఆ కథలో గాంధారీ నారికి ఆ శక్తి ఉన్నదనీ గ్రహించరు. ఎందుకనో?
దక్షులెవ్వారు? స్త్రీలా? పురుషులా? అని ఆలోచిస్తున్నాను. 🙂
లైలా
PS: I liked this essay three years back and I still like it today.