అభిమానానికీ..దురభిమానానికీ..అసలు సాహిత్యం అన్నది రేపటితరాలకి ఎక్కడ మిగలబోతోంది లెండి..మీరేం చింత పడకండి. అలాగే తెలుగు భాషా మిగలబోవడం లేదు. తెలుగు సాహిత్యాన్ని ఇతర విషయాల్ని సైతమ్ రేపటి తరాలకి బోధించే వాళ్ళూ మరి మిగలబోవడం లేదు. ప్రపంచంలో అన్ని భాషల్నీ తొందర తొందర గా అటకెక్కించి..సర్వే సర్వత్రా ఇంగ్లీషే రాజ్యమేలబోతూంది. దాన్ని రారమ్మని మీరంతా రెండు చేతులూ చాచి మరీ మరీ ..
ఆహ్వానిస్తూండగా..తెలుగు ఎందుకు బతుకుతుందీ?? so dont worry…మీ పిల్లలూ..ఆ పిల్లల పిల్లలూ మరింక తెలుగు వారుగా ఉండనఖ్ఖరలేని తీర్మానాలన్నీ మీరంతా ఇలా ముందుకొచ్చి చేస్తూండగా ఇహ తెలుగుకి ఊపిరెక్కడా? సర్వం శ్రీ జగన్నాధంగా
భూమ్మీద ఇటుపై అంతా ఇంగ్లీషే!! రేపు భ్రాహ్మణుడూ ఇంగ్లీషులోనే మంత్రాలు చదువుతాడు..బోయవాడూ ఇంగ్లీషులోనే వలవిసురుతాడు. కోటిపల్లి రేవు లోని సరంగు ఇంగ్లీషులోనే పడవ నడుపుతాడు. అమ్మమ్మలు అందరూ ఇంగ్లీషులోనే జోల పాటలు పాడతారు. చివరికి మీ తెలుగు పల్లెల్లోని పసుల కాపరీ ..కాటికాపరీ కూడా మీ మనసు శాంతించేలా సమస్త తెలుగు విజ్నాన పరిభాషకీ అరువు తెచ్చుకున్నఇంగ్లీషుచొక్కాలే తొడిగించి మరీ ఊరేగిస్తారు.
ముగ్గురు ప్రముఖుల శతజయంతి సభల గురించి విపులంగా రాసిన మీ సమీక్ష, దాని మీద వచ్చిన కొందరి అభిప్రాయాలూ చదివిన తర్వాత, సామాజ స్పృహతో రాసిన ఆముగ్గురు ప్రముఖులపై మీఅందరికీగల ఆదరాభిమానాలూ, గౌరవం చూసి ఇది వ్రాస్తున్నాను. మీఅందరిలా అంతగా చదవడం, రాయడం వచ్చినవాణ్ణి కూడా కాదు. ఈ శతజయంతి సభలూ, సమారాధాలూ వారికి నివాళులు కావచ్చు కానీ, వారికి నిజమైన ఆత్మశాంతిని కూరుస్తుందని మాత్రం అనుకోవడంలేదు. వారు ఏ పవిత్రోద్దేశంతో ఆ రచనలు చేశారో, వాటిలో కొంతైనా కొంత సామాజిక స్పృహతో ఈతరంలోని మనం ఆచరణలో పెడితే, నిజమైన నివాళి ఔతుంది.
మాకు ఇంకా ఏదో జరగలేదని అందరూ ఎవరికి వారే, కులం,మతం,లింగం, ప్రాంతం ఒకటేమిటి అన్నిబేధాలకీ రిజర్వేషన్లు కావాలని అన్నిరకాలుగానూ ఒకరిని ఒకరు ద్వేషించుకొంటున్నాం. మధ్యలో రాజకీయ నాయకులు పబ్బం గడుపుకొంటున్నారు. యన్నారైలు తమవంతు ధనాజ్యం పోస్తున్నారు. అలాకాకుండా, దానికి మనవంతు మేధో సంపత్తిని ఏదైనా అందించగలమా? ఆర్ధిక వికేంద్రీకరణ జరిగితే ఈ విభేధాలు సమసిపోవా? నిజాయితీగా ఒక్కసారి ఆలోచించండి. వీలైతే నడుం కట్టండి!
రమ గారి, జగన్నాథం ఆలపాటి గారి వ్యాఖ్యానాలు చదివితే మనం తెలుగు భాషను అభిమానిస్తున్నామా లేక దురభిమానాన్ని పెంచుకుంటున్నామా అర్థం కావటం లేదు. సాహిత్య పరంగా మేటి ప్రపంప భాషల సరసన నిలువగలిగే సుసంపన్నమైన సాహిత్యం తెలుగు భాషలో ఉంది. ఆ సంపదను కాపాడుకోవడానికి ఈమాట తరహాలో తెలుగు వ్రాయడాన్ని, చదవడాన్ని, సాహిత్యాభిలాషులను ప్రోత్సహించాలే తప్ప శాస్త్ర, సాంకేతిక విద్యను కూడా తెలుగైజ్ చేయ్యలన్న వాదాన చాలా అసంబద్ధమే కాక, భావి తరాల వారికి తీరని అన్యాయం చేయడమే. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని, అవసరాన్ని గుర్తెరిగి, శాస్త్ర, సాంకేతిక విషయాలను ఇంగ్లీష్ భాషకు వదిలేసి, మన భాష, సంస్కృతి, చరిత్రల గురించిన విషయాలను తెలుగులో రాస్తూ, తెలుగును మరింత సుసంపన్నం చేయడం ద్వారా తెలుగు భాష మనుగడకు తోడ్పడగలమని నా అభిప్రాయం.
“సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు…. ”
“ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.”
ఆరి సీతారామయ్య అభిప్రాయం: December 2, 2008 3:11 pm
ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ ఈ కవిత, ఈ అభిప్రాయాలు చదువుకుని, ఈ పై అభిప్రాయం వెలిబుచ్చినవారికి, ఈ నా ప్రశ్న.
ఈ కవితలో, ఏ పంక్తుల్లో ఉన్న సమాచారాన్ని వాడి, పాఠకులు ఈ కవితను అర్థం చేసుకోవాలో మొదట్లో చెప్పి, చివరికి ఆ పంక్తులే ఈ కవితకు అనవసరమని చెప్పి ముగించారు.
గమనిస్తారా?
పొరపాటా? కాదా?
సమాధానం చెబితే, అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను.
లైలా.
కెంధూళి గురించి Jagannadham Alapati గారి అభిప్రాయం:
12/10/2009 1:26 am
సౌమ్య గారి అభిప్రాయానికి నా సమాధానం, నా అభిప్రాయంగా బాగా అతుకుతుందని యిలా రాస్తున్నాను.
“రెండూను” !
జగన్నాథం
” కొకు” అన్నపేరు విరసం వారి పుణ్యం!! వారి భావనల్లో రసం ఉండదన్నది సాహిత్య విదితం!! ఇహ రేరాజు గారు చెప్పింది ముఖ్యమైన విషయం ఒకటుంది.అదేమిటంటే “థియరీని మార్చుకోవడం”. ఆ దృష్టితో చూసి ఉంటే..మోహనగారికి చాలా సామాజిక మార్పులు స్పస్టంగానే కన్పించేవి. అర్ధమూ అయ్యేవి కూడా!! కొడవటిగంటి కుటుంబరావు గారు కధలు రాసిన కాలం నాటి సమాజమూ..ఇవాల్టి సమాజమూ ఒక్కలా లేదు. ఈ మధ్య కాలంలో తెలుగు సమాజమూ బాగానే మారింది. తెలుగు సాహిత్య సమాజమూ ఆ అన్ని మార్పులనీ తనలో ప్రతిఫలించింది.అనేకానేక అస్థిత్వ ఉద్యమాలానేపద్యం కుటుంబరావుగారు ఎక్కడా ఊహించినట్టు కనబడదు.కానీ అదే గురజాడ చాలా స్పష్టంగా ఊహ చేయగలిగారు.”modern women will rewrite history” అని గురజాడ అన్నది ప్రపంచవ్యాప్తంగా నిజమైంది. ద్రష్ట అంటే ఆయన. కానీ కుటుంబరావు ఏకోశానా అలాంటి దృశ్యాన్ని ఆధునిక కాలానికి మరింత దగ్గరివాడై కూడా చూడలేకపోయాడు. శ్రీశ్రీ సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రావిశాస్త్రీ..కాళీపట్నం కూడా కారు. ఇందుకు కారణం వాళ్ళ”థియరీ” లోపమే!!వాళ్ళ్ “ప్రాక్టీస్ ” లోపంకూడానూ!!
ప్రపంచంలో వచ్చే మార్పులని కొలిచి చూసే సిధ్ధాంత పరికరాలు పాతబడిపోయే స్థితి ఒకటి వస్తుందని ఈ రచయితలు ఊహించలేదు. అది వీరి దృస్టి దోషమే!! ఆనాటి యువత ఇవాళ లేరు. ఆనాటి ఆర్ధిక పరిస్థితిలు అలాగే ఇవాళ లేవు. ప్రపంచీకరణ నేపధ్యంలో..కుటుంబరావు కధల్ని లక్ష్మన్న చూడలేదు.”ఎక్కడవేసిన గొంగళీ అక్కడే ఉన్నట్టు”గా ఇవాళ్టికీ సామాజిక పరిస్థితులు ఉన్నాయని మోహన గారు భావించడాన్ని కూడా చాదస్తపు..వెనుకబాటుమాటగానే చూడాల్సి ఉంటుంది. “మంచిగతమున కొంచమే” నని అప్పారావుగారన్నది ఈనాటికీ ఈ తరహా చదువుకున్నవారికి అర్ధంకాలేదని అన్పిస్తుంది ఇటువంటి ప్రకటనలు చూసినప్పుడు.పరిస్థితులు ఎక్కడా మారనే లేదనీ..బహుసా మరి మారవనీ మోహన గారు అనడం నిజంగా ఆశ్చర్యపడవలసిన విషయం!! మార్పుని వీళ్ళూ గమనించరనీ..గమనించినా కూడా దాన్ని ఏకోశానా ఒప్పుకోరనీ తెలియజెప్పేలా ఉంటాయి ఇటువంటి అభిప్రాయాలు. ప్రతి సమాజంలోనూ మంచి మార్పులూ ఉంటాయి..కానివీ ఉంటాయి. ఆ కాలానికి చెందిన సాహిత్యం వాటిని బొమ్మ కట్టి చూపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కూడా!! మనం చేయవలసిందల్లా ఉత్తుత్తి నిట్టూర్పులు విడవకుండా వాటిని గమనించటమూ..వాటిని విశ్లేషించటమూనూ!!
రమ.
ఇంత చర్చ జరిగాకైనా, చాలామంది తెలుగులో శాస్త్ర లేఖనం, పఠనం జరగాలని కోరుకోవడం శుభపరిణామం. రమగారన్నట్లుగా, విజ్ఞానశాస్త్రం సైతం ఎక్కువ తెలుగువారికి చేరువకావాలంటే మొట్టమొదటగా కనీసం మనం మాతృభాషలో బోధించాల్సిన అవసరాన్ని బలంగా గుర్తించాలి. దానికి అవసరమైనన్ని తెలుగు పదాలు కొరవడితే, ఇతర భాషలనుండి-అది సంస్కృత మైనా, ఆంగ్లమైనా-దిగుమతి చేసుకోవాలే కాని, తెలుగే పనికి రాదనడం సరికాదని, వేమూరి వారి ఈ వ్యాసాన్ని చూశాకైనా అర్థం చేసుకోవచ్చు.
పదాల్ని దిగుమతి చేసుకొనేటప్పుడు, తెలుగు నుడికారానికి అనుగుణంగా శాశ్వతంగా దిగుమతి చేసుకుంటే బాగుంటుంది. అలాకాకుండా, ఆంగ్ల పదాలకి విభక్తులు చేర్చి, ” ఫోను చెయ్యి ” అని చెప్పడానికి, ఇప్పుడు ఎక్కువమంది అంటున్నట్లుగా ” కాల్చెయ్యి “, ” కాలియ్యి “, చెయ్యియ్యి అని సంకరం చేస్తే అసహ్యంగా ఉంటుంది.
ఇప్పటికే వేమూరి, కొడవటిగంటి వంటి వారలెందరో వారి వారి శాస్త్ర రచనలు తెలుగులో చేసి, అసంభవమనుకొంటున్నదాన్ని-“సంభవం” చేసి చూపించారు.
ఇది శాస్త్ర పరిజ్ఞానం కోసమేగాని, కావ్యరచనకోసం కాదని అందరూ సహృదయంతో అర్థంచేసుకొని, లేనిపోని శంకలకి పోకుండా, తెలుగు వైభవానికి తెర ఇకనైనా తీయడానికి స్వాగతిద్దాం!
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
12/15/2009 2:58 am
అయ్యా హరీష్ గారూ!!
అభిమానానికీ..దురభిమానానికీ..అసలు సాహిత్యం అన్నది రేపటితరాలకి ఎక్కడ మిగలబోతోంది లెండి..మీరేం చింత పడకండి. అలాగే తెలుగు భాషా మిగలబోవడం లేదు. తెలుగు సాహిత్యాన్ని ఇతర విషయాల్ని సైతమ్ రేపటి తరాలకి బోధించే వాళ్ళూ మరి మిగలబోవడం లేదు. ప్రపంచంలో అన్ని భాషల్నీ తొందర తొందర గా అటకెక్కించి..సర్వే సర్వత్రా ఇంగ్లీషే రాజ్యమేలబోతూంది. దాన్ని రారమ్మని మీరంతా రెండు చేతులూ చాచి మరీ మరీ ..
ఆహ్వానిస్తూండగా..తెలుగు ఎందుకు బతుకుతుందీ?? so dont worry…మీ పిల్లలూ..ఆ పిల్లల పిల్లలూ మరింక తెలుగు వారుగా ఉండనఖ్ఖరలేని తీర్మానాలన్నీ మీరంతా ఇలా ముందుకొచ్చి చేస్తూండగా ఇహ తెలుగుకి ఊపిరెక్కడా? సర్వం శ్రీ జగన్నాధంగా
భూమ్మీద ఇటుపై అంతా ఇంగ్లీషే!! రేపు భ్రాహ్మణుడూ ఇంగ్లీషులోనే మంత్రాలు చదువుతాడు..బోయవాడూ ఇంగ్లీషులోనే వలవిసురుతాడు. కోటిపల్లి రేవు లోని సరంగు ఇంగ్లీషులోనే పడవ నడుపుతాడు. అమ్మమ్మలు అందరూ ఇంగ్లీషులోనే జోల పాటలు పాడతారు. చివరికి మీ తెలుగు పల్లెల్లోని పసుల కాపరీ ..కాటికాపరీ కూడా మీ మనసు శాంతించేలా సమస్త తెలుగు విజ్నాన పరిభాషకీ అరువు తెచ్చుకున్నఇంగ్లీషుచొక్కాలే తొడిగించి మరీ ఊరేగిస్తారు.
రమ.
డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష గురించి Jagannadham Alapati గారి అభిప్రాయం:
12/12/2009 11:00 am
ముగ్గురు ప్రముఖుల శతజయంతి సభల గురించి విపులంగా రాసిన మీ సమీక్ష, దాని మీద వచ్చిన కొందరి అభిప్రాయాలూ చదివిన తర్వాత, సామాజ స్పృహతో రాసిన ఆముగ్గురు ప్రముఖులపై మీఅందరికీగల ఆదరాభిమానాలూ, గౌరవం చూసి ఇది వ్రాస్తున్నాను. మీఅందరిలా అంతగా చదవడం, రాయడం వచ్చినవాణ్ణి కూడా కాదు. ఈ శతజయంతి సభలూ, సమారాధాలూ వారికి నివాళులు కావచ్చు కానీ, వారికి నిజమైన ఆత్మశాంతిని కూరుస్తుందని మాత్రం అనుకోవడంలేదు. వారు ఏ పవిత్రోద్దేశంతో ఆ రచనలు చేశారో, వాటిలో కొంతైనా కొంత సామాజిక స్పృహతో ఈతరంలోని మనం ఆచరణలో పెడితే, నిజమైన నివాళి ఔతుంది.
మాకు ఇంకా ఏదో జరగలేదని అందరూ ఎవరికి వారే, కులం,మతం,లింగం, ప్రాంతం ఒకటేమిటి అన్నిబేధాలకీ రిజర్వేషన్లు కావాలని అన్నిరకాలుగానూ ఒకరిని ఒకరు ద్వేషించుకొంటున్నాం. మధ్యలో రాజకీయ నాయకులు పబ్బం గడుపుకొంటున్నారు. యన్నారైలు తమవంతు ధనాజ్యం పోస్తున్నారు. అలాకాకుండా, దానికి మనవంతు మేధో సంపత్తిని ఏదైనా అందించగలమా? ఆర్ధిక వికేంద్రీకరణ జరిగితే ఈ విభేధాలు సమసిపోవా? నిజాయితీగా ఒక్కసారి ఆలోచించండి. వీలైతే నడుం కట్టండి!
ఒక్కతే… మృత్యువు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
12/11/2009 2:37 pm
బొల్లోజు బాబా గారూ!!నెరూడా మృత్యువుకి శ్రీశ్రీ అనువాదం నీరసంగా ఉంది. అంతకన్నా మీది మెరుగు. మీ కన్నా కామేశ్వర్రావు గారిది ఎక్కువ నయం!
రమ
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి hareesh గారి అభిప్రాయం:
12/11/2009 1:04 pm
రమ గారి, జగన్నాథం ఆలపాటి గారి వ్యాఖ్యానాలు చదివితే మనం తెలుగు భాషను అభిమానిస్తున్నామా లేక దురభిమానాన్ని పెంచుకుంటున్నామా అర్థం కావటం లేదు. సాహిత్య పరంగా మేటి ప్రపంప భాషల సరసన నిలువగలిగే సుసంపన్నమైన సాహిత్యం తెలుగు భాషలో ఉంది. ఆ సంపదను కాపాడుకోవడానికి ఈమాట తరహాలో తెలుగు వ్రాయడాన్ని, చదవడాన్ని, సాహిత్యాభిలాషులను ప్రోత్సహించాలే తప్ప శాస్త్ర, సాంకేతిక విద్యను కూడా తెలుగైజ్ చేయ్యలన్న వాదాన చాలా అసంబద్ధమే కాక, భావి తరాల వారికి తీరని అన్యాయం చేయడమే. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని, అవసరాన్ని గుర్తెరిగి, శాస్త్ర, సాంకేతిక విషయాలను ఇంగ్లీష్ భాషకు వదిలేసి, మన భాష, సంస్కృతి, చరిత్రల గురించిన విషయాలను తెలుగులో రాస్తూ, తెలుగును మరింత సుసంపన్నం చేయడం ద్వారా తెలుగు భాష మనుగడకు తోడ్పడగలమని నా అభిప్రాయం.
సువర్ణభూమిలో … గురించి lyla yerneni గారి అభిప్రాయం:
12/10/2009 5:20 pm
“సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు…. ”
“ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.”
ఆరి సీతారామయ్య అభిప్రాయం: December 2, 2008 3:11 pm
ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ ఈ కవిత, ఈ అభిప్రాయాలు చదువుకుని, ఈ పై అభిప్రాయం వెలిబుచ్చినవారికి, ఈ నా ప్రశ్న.
ఈ కవితలో, ఏ పంక్తుల్లో ఉన్న సమాచారాన్ని వాడి, పాఠకులు ఈ కవితను అర్థం చేసుకోవాలో మొదట్లో చెప్పి, చివరికి ఆ పంక్తులే ఈ కవితకు అనవసరమని చెప్పి ముగించారు.
గమనిస్తారా?
పొరపాటా? కాదా?
సమాధానం చెబితే, అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను.
లైలా.
కెంధూళి గురించి Jagannadham Alapati గారి అభిప్రాయం:
12/10/2009 1:26 am
సౌమ్య గారి అభిప్రాయానికి నా సమాధానం, నా అభిప్రాయంగా బాగా అతుకుతుందని యిలా రాస్తున్నాను.
“రెండూను” !
జగన్నాథం
నాయినమ్మ యిల్లు గురించి rajeshwari గారి అభిప్రాయం:
12/09/2009 7:58 pm
మీ కవిత బాగుంది.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
12/09/2009 3:12 am
” కొకు” అన్నపేరు విరసం వారి పుణ్యం!! వారి భావనల్లో రసం ఉండదన్నది సాహిత్య విదితం!! ఇహ రేరాజు గారు చెప్పింది ముఖ్యమైన విషయం ఒకటుంది.అదేమిటంటే “థియరీని మార్చుకోవడం”. ఆ దృష్టితో చూసి ఉంటే..మోహనగారికి చాలా సామాజిక మార్పులు స్పస్టంగానే కన్పించేవి. అర్ధమూ అయ్యేవి కూడా!! కొడవటిగంటి కుటుంబరావు గారు కధలు రాసిన కాలం నాటి సమాజమూ..ఇవాల్టి సమాజమూ ఒక్కలా లేదు. ఈ మధ్య కాలంలో తెలుగు సమాజమూ బాగానే మారింది. తెలుగు సాహిత్య సమాజమూ ఆ అన్ని మార్పులనీ తనలో ప్రతిఫలించింది.అనేకానేక అస్థిత్వ ఉద్యమాలానేపద్యం కుటుంబరావుగారు ఎక్కడా ఊహించినట్టు కనబడదు.కానీ అదే గురజాడ చాలా స్పష్టంగా ఊహ చేయగలిగారు.”modern women will rewrite history” అని గురజాడ అన్నది ప్రపంచవ్యాప్తంగా నిజమైంది. ద్రష్ట అంటే ఆయన. కానీ కుటుంబరావు ఏకోశానా అలాంటి దృశ్యాన్ని ఆధునిక కాలానికి మరింత దగ్గరివాడై కూడా చూడలేకపోయాడు. శ్రీశ్రీ సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రావిశాస్త్రీ..కాళీపట్నం కూడా కారు. ఇందుకు కారణం వాళ్ళ”థియరీ” లోపమే!!వాళ్ళ్ “ప్రాక్టీస్ ” లోపంకూడానూ!!
ప్రపంచంలో వచ్చే మార్పులని కొలిచి చూసే సిధ్ధాంత పరికరాలు పాతబడిపోయే స్థితి ఒకటి వస్తుందని ఈ రచయితలు ఊహించలేదు. అది వీరి దృస్టి దోషమే!! ఆనాటి యువత ఇవాళ లేరు. ఆనాటి ఆర్ధిక పరిస్థితిలు అలాగే ఇవాళ లేవు. ప్రపంచీకరణ నేపధ్యంలో..కుటుంబరావు కధల్ని లక్ష్మన్న చూడలేదు.”ఎక్కడవేసిన గొంగళీ అక్కడే ఉన్నట్టు”గా ఇవాళ్టికీ సామాజిక పరిస్థితులు ఉన్నాయని మోహన గారు భావించడాన్ని కూడా చాదస్తపు..వెనుకబాటుమాటగానే చూడాల్సి ఉంటుంది. “మంచిగతమున కొంచమే” నని అప్పారావుగారన్నది ఈనాటికీ ఈ తరహా చదువుకున్నవారికి అర్ధంకాలేదని అన్పిస్తుంది ఇటువంటి ప్రకటనలు చూసినప్పుడు.పరిస్థితులు ఎక్కడా మారనే లేదనీ..బహుసా మరి మారవనీ మోహన గారు అనడం నిజంగా ఆశ్చర్యపడవలసిన విషయం!! మార్పుని వీళ్ళూ గమనించరనీ..గమనించినా కూడా దాన్ని ఏకోశానా ఒప్పుకోరనీ తెలియజెప్పేలా ఉంటాయి ఇటువంటి అభిప్రాయాలు. ప్రతి సమాజంలోనూ మంచి మార్పులూ ఉంటాయి..కానివీ ఉంటాయి. ఆ కాలానికి చెందిన సాహిత్యం వాటిని బొమ్మ కట్టి చూపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కూడా!! మనం చేయవలసిందల్లా ఉత్తుత్తి నిట్టూర్పులు విడవకుండా వాటిని గమనించటమూ..వాటిని విశ్లేషించటమూనూ!!
రమ.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Jagannadham Alapati గారి అభిప్రాయం:
12/09/2009 1:12 am
ఇంత చర్చ జరిగాకైనా, చాలామంది తెలుగులో శాస్త్ర లేఖనం, పఠనం జరగాలని కోరుకోవడం శుభపరిణామం. రమగారన్నట్లుగా, విజ్ఞానశాస్త్రం సైతం ఎక్కువ తెలుగువారికి చేరువకావాలంటే మొట్టమొదటగా కనీసం మనం మాతృభాషలో బోధించాల్సిన అవసరాన్ని బలంగా గుర్తించాలి. దానికి అవసరమైనన్ని తెలుగు పదాలు కొరవడితే, ఇతర భాషలనుండి-అది సంస్కృత మైనా, ఆంగ్లమైనా-దిగుమతి చేసుకోవాలే కాని, తెలుగే పనికి రాదనడం సరికాదని, వేమూరి వారి ఈ వ్యాసాన్ని చూశాకైనా అర్థం చేసుకోవచ్చు.
పదాల్ని దిగుమతి చేసుకొనేటప్పుడు, తెలుగు నుడికారానికి అనుగుణంగా శాశ్వతంగా దిగుమతి చేసుకుంటే బాగుంటుంది. అలాకాకుండా, ఆంగ్ల పదాలకి విభక్తులు చేర్చి, ” ఫోను చెయ్యి ” అని చెప్పడానికి, ఇప్పుడు ఎక్కువమంది అంటున్నట్లుగా ” కాల్చెయ్యి “, ” కాలియ్యి “, చెయ్యియ్యి అని సంకరం చేస్తే అసహ్యంగా ఉంటుంది.
ఇప్పటికే వేమూరి, కొడవటిగంటి వంటి వారలెందరో వారి వారి శాస్త్ర రచనలు తెలుగులో చేసి, అసంభవమనుకొంటున్నదాన్ని-“సంభవం” చేసి చూపించారు.
ఇది శాస్త్ర పరిజ్ఞానం కోసమేగాని, కావ్యరచనకోసం కాదని అందరూ సహృదయంతో అర్థంచేసుకొని, లేనిపోని శంకలకి పోకుండా, తెలుగు వైభవానికి తెర ఇకనైనా తీయడానికి స్వాగతిద్దాం!
ఒక్కతే… మృత్యువు గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:
12/08/2009 11:08 pm
ఈ క్రింది లింకులో ఇదే కవితకు శ్రీశ్రీ చేసిన అనువాదాన్ని చూడవచ్చును
http://sahitheeyanam.blogspot.com/2009/12/blog-post_09.html
బొల్లోజు బాబా