I am deeply indebted to you for having presented and enhanced my interest in సంగీతం. Pl. clarify a doubt in this immature సంగీత పిపాసి as I am a very tiny particle in your ocean of knowledge about musicology.
నేను విన్న ఒక కీర్తనలోని పదం “కయి”. కీర్తన “దండము పెట్టెనురా కోడండపాణి చూడరా”. చరణం “పేరుకా ప్రతిష్టకా వూరికా నిను వేడితి, వూరు వారు వీధి వారు వొక్క జాతివారు కారు వారిని కయి బట్టి విడువకు త్యాగరాజార్చిత నీకు దండము పెట్టెనురా”
Is “కయి” not a tamil word for hand? Another doubt why Tamil is called “ARAVAM” in telugu?
చాలా బాగుందండి వ్యాసం. కవిత్వం గట్రా ఏమైనా వ్రాస్తుంటే గాని, ప్రతికొన్ని నెలల కొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని, ఆలోచించుకుని, బుర్ర మళ్ళీ సరిగా ట్యూన్ చేసుకోవల్సిన వ్యాసం.
ఈ విషయం మీద నేను చాలా చోట్ల చర్చించాను కాబట్టి చర్విత చర్వణం అవుతుంది అని చర్చలోకి ప్రవేశించ లేదు. కవిత్వ మీమాంస అన్న వ్యాసంలో రెండవ భాగం కవిత్వ మీమాంస అన్న శీర్షిక కింద నా ఆలోచనలు చూడగలరు.అలాగే ఈ సంభాషణలో మూడవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబు కొంతవరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.
చేరా ఆచార్యుల గారి చర్చ గురించి నేను చాలా విన్నాను. కానీ, ఆ పుస్తకం సంపాదించి చదివినప్పుడు (1990 లలో) నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ‘vers libre ‘(free verse) గురించి వీరిద్దరూ పట్టించుకోక పోవడం. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తే చర్చలో పదును పోతుంది, ఎన్ని విలువైన విషయాలను ప్రస్తావించినా. సమస్య మూలాలను వదిలి అనేకానేక విషయాలు చర్చించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఏది ఏమైనా ఈ చర్చ చరిత్రలో భాగమే కనుక తప్పక చదవ వలసిందే.
శుష్క వచనాన్ని, శుద్ధ కవిత్వాన్ని విడదీసేది భావనా శక్తి. వచనంలో మామూలు తర్కంతో బండి నడుస్తుంది.ఎక్కువ ఖాళీలు ఉండవు. పాఠకుని ఊహా శక్తికి మేత వేయడు రచయిత. దానికి భిన్నంగా కవి పాఠకుని భావనా శక్తిని పరీక్షిస్తాడు. కవిత్వంలో తర్కం లేదు అన్న వితండ వాదం చేయడం లేదు నేను. తర్కాన్ని మించిన భావనా బలం కవితకు ప్రాణం. దాన్ని పాఠకునిలో స్ఫురింప చేయడానికి పాదకల్పన అవసరమవుతుంది. పాదకల్పన కంద పద్యాల్లోనో ఆటవెలదిలోనో ఉన్నట్టు కాకుండా స్వేచ్చగా ఉంటుంది. పాఠకునికి కవి తాను చూసిన జగత్తును చూపి తద్వారా తాను పొందిన అనుభవాన్నిసూచించడానికి సాధనం పాదకల్పన. పాద కల్పన లేకుండా , వాక్యం తరువాత వచ్చే వాక్యం ఒక తర్క ధోరణిలో పడి పోతుంది. వాక్యాల మధ్య అన్వయం హేతుబుద్ధికి అందుతుంది. కవిత్వంలో వాక్యాల మధ్య అన్వయం
హేతుబుద్ధిని దాటిన భావనా శక్తికి సంబంధించినది.దాన్ని సాధించడానికి ఒక సాధనం పాద కల్పన.కవితకు ఒక క్రమం, నడకా,నిర్మాణం ఉన్నాయి మరి. అంతేకాదు,పాదకల్పన లేకుండా కవితలోని ఎత్తుగడ అర్థం కాదు.లయ అవగతం కాదు.
చివరికి చెప్పేదేమిటంటే వచనం రేఖీయం(linear). కవిత వృత్తం. అది ఎలాంటి వృత్తం? దాని గణితం జోలికి పోవడం అభిప్రాయాన్నిమించిన చర్చ.
ఈ విషయంలో ఇస్మాయిల్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉపయోగిస్తుంది.
“ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.” (నిశ్శబ్దంలో నీ నవ్వులు, నా కవితా సంకలనానికి రాసిన ముందుమాట , భూషణీయం నుంచి.)
కామేశ్వర రావు గారూ ,
ఇప్పటికి మీ మొదటి ,మూడవ ప్రశ్నల కు సమాధానం వచ్చిందే అనుకొంటున్నాను. ఇక మిగిలింది రెండవ ప్రశ్న.
౨.
” అ.ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని,
ఆ. పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?”
( అ. ఆ లు నావి , స్పష్టత కోసం )
‘vers libre ‘(free verse ) స్ఫూర్తితో ఆలోచిస్తే (ఆ )సమంజసం కాదు. కానీ, ‘vers libre ‘(free verse ) పాద కల్పనకు వ్యతిరేకం కాదు. ఫ్రెంచి కవులు బిర్ర బిగుసుకుపోయిన ఛందో నియమ నిబంధనలను అతిక్రమించి వాటిని పాటించడమే కవిత్వం కాదు వాటికి బయట కూడా కవిత్వం ఉంటుంది అని చెప్ప దలుచుకున్నారు. (మోహన గారి విలువైన అభిప్రాయం చూడండి పద్యం కూడా ఒక రకమైన వచనమే).ఈ స్ఫూర్తిని గ్రహించిన కవులు చాలా వరకు అన్ని భాషల్లోనూ వారికి తోచిన రీతిలో పాద కల్పన పాటించారు. జర్మన్ , రష్యన్ లో అంత్య ప్రాసలు వదులుకో లేదు అక్కడి కవులు.(ఈ విషయంలో ఈ నాటికీ రష్యన్లు అమెరికన్ లను ఎద్దేవా చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన విషయం.) సారాంశం ఏమంటే ఈ స్ఫూర్తిని గ్రహించి, నీ భాషకు ఏది అందమో దాన్ని వదలకుండా కవిత్వ రచన చేయాలి.
ఇక మిగిలింది prose -poem . కవిత్వాన్ని బహువచనాల బారీ నుండి కాపాడడానికి పుట్టుకొచ్చింది అంటారు Robert Bly. శ్రీ శ్రీ కవిత్వం తీసుకోండి పతితులారా భ్రష్టులారా ..అన్నీ బహువచానాలే. రాజకీయ కవిత్వంలో ఇది తప్పదు. కానీ , ఇది కవిత్వానికి చేటు చేస్తుంది. మనం చూసేది ఒక్కొక్క వస్తువునే. వస్తు సముదాయాలను కాదు. ఈ ఎరుకతో రాసేది prose -poem ఇది కూడా ముందు ఫ్రెంచి కవులే సాధించి చూపారు. ఎక్కువ వివరాలకు Talking All Morning, పుస్తకంలో On Writing Prose Poems అన్న ఇంటర్ వ్యూ (1975 లో వచ్చింది.). అలాగే తొలినాటి ఫ్రెంచి కవుల కవితా సంగ్రహం సవిమర్శకంగా చదవాలి.
మన విమర్శకులకు పరభాషా సాంగత్యం లేక చాలా చేటు జరిగింది. పట్టు మని పది భాషల్లో వచ్చిన విమర్శలు చదవరు. అనువాదాల మీద శ్రద్ధ లేదు.చరిత్ర తెలుసుకోరు.ఆధునిక కవిత్వం దాని విమర్శ ఒక ప్రత్యేక విభాగం అన్న స్పృహే లేదు. పిండి కొద్దీ రొట్టె. శుష్క వాదాలు శూన్య హస్తాలు. ఇక జాలింతును; స్వస్తి.
లైలా గారూ !! మీ సందేహం సబబైనది. అయితే ఇలాంటి సందేహం ఇప్పటివరకూ ఈమాట చర్చల్లో ఇంకెవరూ వ్యక్తపరచకపోవడం ఆశ్చర్యమే !!నాకు పద్య స్వరూపం మీద చాలా అభ్యంతరాలే ఉన్నాయి దాన్ని చందస్సుగా చూడగలమే గానీ పద్యాల్లో ఉన్నదంతా ” కవిత్వమని ” ఎవరన్నా అనుకుంటూంటే నా వరకు నాకు హాస్యాస్పదంగా అన్పిస్తుంది.చందస్సు ఒక పనిముట్టు మాత్రమే . చేతిలో పనిముట్టు పట్టుకున్న వాళ్ళంతా కళాకారులు కానట్టే …చందస్సు తెలిసిన వారంతా మంచి పద్యాలు రాసేయలేరు. మంచి పద్యాన్ని చదివే అనుభవం ఉన్న వారెవరన్నా దీన్ని గుర్తు పట్టగలరు కూడా!!
సంపత్కుమార రాసిన పద్యాలు కవిత్వమని ఎవరూ అనుకోరనుకుంటాను. వారు చనిపోయిన సందర్భం గనక వారిని తెలిసిన వారు వారిని గుర్తు చేసుకునే సందర్భంలో వీటిని నలుగురి ముందుకీ తెచ్చారని మనం అనుకోవాలే తప్ప వాటిలోని “కవిత్వాంశ” ప్రకారం బహుశా అయిఉండదు.
సంపత్కుమారగారి పద్యాలని అటుంచండి. వెయ్యేళ్ళ మన పద్య కావ్యాలలోనే భావుకత కల్గిన పద్యాలు తక్కువ. మనం వాటిలోని భాషా చతురతకో వారు వాటిని నడిపిన తీరుకో వాటిని జ్నాపకం పెట్టుకున్నామే గానీ కవిత్వానికి కాదు. పెద్దన మనుచరిత్రం లో మొదటి రెండు ఆశ్వాసాలూ పూర్తయ్యాకా మిగిలిన పుస్తకాన్ని ఓపికగా పూర్తి చేయాల్సిందే !! పోతనగారి భాగవతంలో భక్తి ప్రధానమే తప్ప ఆయన రాసినదంతా మంచి కవిత్వమని అనుకోవడానికి కుదరదు. అంత్యప్రాసలూ అనుప్రాసలూ చదివేసి వాటినే కవిత్వంగా అనుకునే వారే ఎక్కువ కూడా !! ఇలా చాలా మంది పద్యకవుల రచనలు కధని చెప్పడంలో భాగంగా పసలేని పద్యాలని బహుళంగానే కలిగిఉన్నాయి. అందువలన సూత్రాలని పాటిస్తూ వారు గణాలని వాడుతూ సరిగ్గా ఉత్పలమాలలో మిగతా వృత్తపద్యాలో రాసినందుకు ఆయా కవులని ఆ కాలంలో మెచ్చుకున్నారే తప్ప వారు రాసినవన్నీ కవిత్వంగా పరిగణించి కాదనుకుంటాను. ఇది పద్యాలలో విలసిల్లే కవిత్వం గురించి.
ఇహ ఇక్కడ ఉన్న కందాల్లో కోవెల సంపత్కుమార చేరాని ఉద్దేశ్యించి రాసినదాన్ని ఆయన సరదాకి గుర్తుగా మనం భావించాలే గానీ అందులో కవిత్వం చిప్పిల్లుతోందని కాదు. ఆయన రాసిన ఏ పద్యం లోనూ కవిత్వాంశ పూజ్యం !!
కందపద్యం ఒక తేజంతో నడిపిన వాళ్ళలో ఆధునిక కాలంలో శ్రీశ్రీని మాత్రమే పరిగణించాలి. మిగిలిన ఎందరో యధాశక్తి కవులు.
“నిశ్శబ్దంలో నీ నవ్వులు” తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి పదేళ్ళైన సందర్భంగా పుస్తకం.నెట్లో గరికపాటి పవన్ కుమారు గారి సమీక్ష చూసి ఇటొచ్చా. “అరటితొక్క కాలు జారి పడేవాళ్ళ గురించి ఎదురుచూస్తుంది. అగ్గిపుల్ల బుర్ర మండించే వాళ్ళ గురించి బెదురుచూస్తుంది” అబ్బో.. చదివి తరించాల్సిన కవిత్వమే. అనుమానం లేదు. సమీక్షలో గరికపాటి వారు శెలవిచ్చినట్టు హృదయప్రకంపన కాదు. భూకంపమే!
అలా కవితలన్నీ చదువుతూ ఈ కవిత దగ్గరకొచ్చాను. చూస్తే “పవన్” కు అని ఉంది. చిక్కుముడి కాస్త విడిపోయింది. ఎవరీ గరికపాటి పవన్ కుమారు? నక్షత్రాలు రాత్రి మాత్రమే మెరిసినట్టు ఈయన కేవలం తమ్మినేని యదుకుల భూషణు గారికి సంబంధించిన వ్యాసాలు, కవితల్లోనే మెరవడం వెనక కథా కమామిషు ఏవిటి చెప్మా అని చాలా రోజులుగా తలకొట్టుకుంటున్నా. తమ్మినేని వారిపై ఈగ వాలనివ్వని ఇతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ లింకులో ఇతని పేరు చూసి ఎంత ఆనంద పడ్డానో.
ఆప్యాయతా, అనురాగాలతో కూడిన వీరిద్దరి స్నేహం ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలనీ, అరటితొక్కల మీదా, చాక్లెట్ ముచ్చుల మీద, సిగరెట్ పీకల మీదా తమ్మినేని వారు మరెన్నో అద్భుతమైన కవితలు అల్లాలని ఆశిస్తున్నాను.
ఇందులో, ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తితో పద్యాల్లో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారా? ఈ పద్యాలు రాసినపుడు అవతలి వ్యక్తి, మధ్యలో మధ్యలో కందంలోనో ఇంకేదైనా పద్యంలోనో, తిరుగు సమాధానాలు రాశారా?
ఈ కంద పద్యాలలో కవిత్వం ఉన్నదా? ఉంటే, అది అన్ని పద్యాల్లోనూ ఉందా? కొన్నిట్లోనే ఉందా? వాటిల్లోనూ వేరు వేరు రకాలుగా ఉందా? ఈ వివరాలు తెలిసిన వారు చెపుతారా?
” మీ అమెరికా ప్రయాణం”….మీరు రాసిన ఐదు సవత్సరాల తర్వాత గానీ నేను దీన్ని చదవలేకపోయినందుకు అయ్యో అని అనుకున్నాను. మీ తెలుగు అమృతంలా ఉంది.మీ శైలి హాయిగా సాగింది. చాలారోజుల తర్వాత తెలిసిన వాడుక పదాలని ఎన్నింటినో చదువుతున్నప్పుడు ప్రాణానికి సుఖంగా అన్పించింది. ఒక్క 50 ఏళ్లలో అమెరికా ప్రయాణం లో ఎన్ని రకాల మార్పులు వచ్చేయో గమనిస్తే భలేగా అన్పించింది. న్యూయార్క్లో దిగడం తోనే ఆపేసారే.??.మరి కొంచెం సంగతులు కూడా రాస్తే బాగుండేది కదా?? మొట్టమొదటి సారి మీ యూనివెర్సిటీ చదువులోని సంగతులు గట్రా.. !! మీ శైలిలోని సొగసులోంచి వాటిని తెలుసుకోవాలని మా సరదాగా ఉంది. ఆ తర్వాతి కధ కూడా చెప్పండి మరి. ఊ( కొడుతూ వినడానికి సిధ్ధంగా ఉంది మనసు.
అందుకే గదండీ దానిని దూరపు ఉదాహరణ అన్నదీ! 🙂 ఆసక్తికరం కాదు, అంతగా అతకని ఉదాహరణ అనుండాల్సింది. ఇకపోతే…
1. వచన కవిత్వం అనేది నియతమైన పద్యం నుండి ఒక క్రమంలో పరిణమించింది అనుకుంటే (అలానే ఆంగ్లంలో వెర్స్ నుంచి ఫ్రీవెర్స్), పాద విభజన వల్ల వచ్చే “స్ఫురణ” కు కారణం అప్పటికే మనం పద్యాలని అచ్చులో చూడడం అని ప్రతిపాదించవచ్చునేమో. ఎందుకంటే, అచ్చులో పద్యకవిత్వమంతానూ పాదబద్ధంగానే ముద్రించబడింది కాబట్టీ కవిత్వం అనగానే పాదాలలో ఉండటమనే భావన ఒకటి అస్థిమూలగతం కావడానికి ఆస్కారముంది. వచన కవిత్వ పాదాలను ఛందోబద్ధమైన నియమాలను ఉల్లంఘించి వ్రాయడం, ఛందోపద్యపు శృంఖలాలనుండి వెలువడ్డంగా కవులు భావించి ఉండవచ్చును.
2. పాదవిభజన కాలగతిలో చెరిగిపోతుందని నేను అనుకోటంలేదు. పాదవిభజనని ఒక ప్రయోజనంతో వాడుకున్నవారూ ఉన్నారు. అప్రయత్నంగా, అనాలోచితంగా చేస్తున్నవారూ ఉన్నారు. అది మౌలిక లక్షణం కాకపోయినా దానినుంచి ఒక ప్రయోజనాన్ని కొందరు కవులు రాబట్టుకోగలిగేరు. అంటే ఇది కవి మీద ఆధారపడ్డ లక్షణం. అందువల్ల (మీ అభిప్రాయం చూడగానే) నాకు కలిగిన ఆలోచన ఇది: పాదవిభజన వల్ల “ఇంకే ప్రయోజనం ఉంది?” అని కాక “ఇంకే ప్రయోజనం లేదు!” అనే ప్రతిపాదనని పరిశీలించడం.
3. పాదవిభజన అనేది ఇలా పరంపరగా వచ్చిన ఒక స్వభావమే తప్ప లక్షణం కాదు అనుకుంటే, ఆ పాదవిభజనకి ఒక ప్రయోజనమూ, లక్షణమూ ఉండాలనే నియమం కూడా ఉండదు. అప్పుడు, కవి తన ఇష్టారాజ్యంగా పాదవిభజన చేసుకోవచ్చు, ఏ కారణమూ లేకుండానే. సకారణంగా చేస్తే మంచిదే కానీ అలా ఎందుకు చేయలేదు అనే నిర్బంధం కవి మీద ఉండదు. అప్పుడు వచన కవిత్వం నిర్మాణ విషయంలో మరింత సులువవుతుంది. కవికి మరింత వెసులుబాటు వస్తుంది. పాదవిభజన అనాలోచితంగా పారంపర్యంగా చేస్తున్నదే కానీ దానిపై స్పష్టత ఉండాలనే నిర్బంధం ఉండదు. వచన కవిత్వానికి నిర్మాణ లక్షణాలు అంటూ ఏమీ ఉండవనే దిశగా మనం పోవలసి ఉంటుంది. అందువల్ల చదువరి ఒక కవితను అనుభవించే తీరు మరింతగా వైయక్తికమవుతుంది. పాదవిభజన అనేది కేవలం ఒక రెలిక్ లాగా ఏ ప్రాధాన్యమూ లేనిదిగా మిగిలిపోతుంది. (ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్నది చాలామటుకూ అదే అని నాకనిపిస్తుంది).
4. అలా అయిన పక్షంలో , వచన కవిత్వంలో లయ, గతి శబ్ద భావ సౌష్టవమూ తదితరాల వాడకమూ, వాటి ప్రభావమూ కవ్యుద్దిష్టాలే కానీ, వచనకవితా నిర్మాణంలో పాత్ర పోషించవు. వీటి ద్వారా కవిత మరింత పౌష్టికమవుతున్నది అనే అభిప్రాయం చదువరి సాహితీశిక్షణ వల్ల వస్తుండవచ్చు. అప్పుడు, కవితానిర్మాణం ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుంది అని నేనన్నది కేవలం ఈ సాహితీశిక్షణపై ఆధారపడినదానిగా, కేవలం వ్యక్తిగత అభిరుచిగానే తీసుకోవాల్సి వుంటుంది తప్ప ఒక నిర్మాణలక్షణంగా ప్రతిపాదించలేను.
అందువల్ల నిర్మాణ, స్వరూప లక్షణాల గురించి కాకుండా వచన కవిత్వాన్ని వచనం నుంచి వేరు చేసే మర్మమేమిటో ఆలోచించవచ్చునేమో. అలా అని లక్షణచర్చకు ఏ ఉపయోగమూ లేదని నేననుకోను. ఆ చర్చ కవికి తన కవితానిర్మాణంలో సహకరిస్తుందనే (కవి సకారణంగా పాదవిభజనని తన కవితలో వాడుకోదలచుకుంటే) ఇప్పటికీ నాకు అనిపిస్తుంది.
అయ్యా!! కవిత్వానికి పాఠకురాలిగా నాకు మీకొచ్చిన సందేహాలు రాలేదు. అసలు వచనకవిత్వం విషయంలో పాద విభజన లోని ఇబ్బందులు నన్ను ఏనాడూ బాధించలేదు. ఇబ్బందీ పెట్టలేదు. పద్యం అన్న పదాన్ని కవులు కవిత్వపరంగానే వాడుక చేస్తున్నారని మీరు గ్రహించాకా మీకింక లక్షణ చర్చ ఉండనఖ్ఖరలేదు. మీరు ఇంకా ఆ వలయంలోనే భ్రమిస్తూంటే దానికి జవాబు ఎక్కడినించి దొరకాలీ??
పఠాభి పదాలని ముక్కలు ముక్కలుగా విరిచి రాసినప్పుడూ ఇదేం పోకడా అంటూ సాంప్రదాయవాదులు విసుక్కున్నారు. లయ మీద మాంచి పట్టున్న పఠాభి పనిగట్టుకుని లయని ..పదాల అందాలనీ ధ్వంసం చేస్తూ కవిత్వం రాసినప్పుడు అది అసలు కవిత్వమే కాదని అనుకున్న వాళ్ళూ ఉన్నారు. కానీ వాళ్ళ విసుగుని పట్టించుకోలేదు తదనంతర కవులు.
ఇంక మొన్న కనక ప్రసాద్ గారి వ్యాసంలో గానీ లేదా కొంత మాధవ్ అభిప్రాయంలో గానీ అసలు వచన కవిత్వం అన్నదానికి మొదలెట్లా కొనసాగింపు ఎట్లా.. దాన్ని ముగింపు ఎట్లా.. దానికేమన్నా నియతి ఉన్నదా? అన్న సందేహాల చుట్టూ వారి ప్రశ్నలు నడిచాయి. ఈ ప్రశ్నలకి కవులెవరన్నా బదులు చెపుతే మీ అందరితో పాటూ నేనూ ఆసక్తిగానే చదువుతాను. కానీ అసలు అలాంటి ప్రశ్నలకి జవాబులు కవులైన వాళ్ళు చెప్పగలరా అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరన్నా ప్రాచీనకవులని వేసారా?? అందుకు వారేమని బదులు ఇచ్చారో మీరేమన్నా చెప్పగలరా?? పాత కవిత్వం అంతా కధా ప్రధానమూ.. వర్ణనల మయమూ చంధోమయమూ కదా?? అసలు అందులో క్వాచిత్కంగా తప్ప కవిత్వం ఉన్న సందర్భాలేవీ?? వారికసలు కధచెప్పడంలో ఉన్న దృష్టి లేదా స్వేచ్చా కవిత్వం రాయడంలో లేనే లేదే?? ఇవాళ గణాల దారిని వదిలి పెట్టి భావానికి పెద్ద పీటవేసి ఏ అంశం మీదనైనా తమతమ భావాలని రాయడానికి చందోరహిత మార్గాలలోంచి వచన పద్యం అనో వచన కవిత అనో పేరు పెట్టి… కవితా వస్తువుని “కధా చట్రం” నించి విడిపించి… ఒక భావస్వేచ్చని సాధించినది ఇవాళ్టి ఆధునిక కవులు కాదా?? మీ అందరి ప్రశ్నలూ లేదా సందేహాలూ గనక ఈ కవిత్వానికి లక్షణ నిర్దేశం చేయడం కోసమే అయితే అందుకు ఈ కవితాప్రక్రియలో చేయితిరిగిన వారి పద్యాలని 🙂 అదే “వచన పద్యాలని” మీలాంటి వారెవ్వరైనా పరిశీలించి కొన్ని లక్షణాలని కనుగొనవచ్చునే?? అందుకు మీకు కవిత్వం కావాలీ గానీ… కవుల సృజన ప్రక్రియ తాలూకు రహస్యాలతో ఏంపనీ?? ఈ ప్రశ్నని కవులని అటుంచండి కాసేపు. అసలు ఏ కళాకారులనైనా మీరడిగినా వాళ్ళు నిజంగా వివరించగలరా అన్నది నాకు సందేహమే!!
ఇంతమంది స్త్రీలు ఇన్ని వేలతరాలుగా పిల్లల్ని కంటున్నా పురిటి నొప్పులు ఇలాంటివని గానీ పిల్లల్ని తొలిగా ముద్దాడినప్పటి అనుభవం ఇలాంటిదనిగానీ విడమరిచి చెప్పగలిగారా?? అందుకు అసలు ఒక భాష ఉందా?? అలాంటి ప్రశ్నలకి వచ్చే జవాబులు నిజంగా మీ సందేహ నివృత్తికి చాలుతాయా?? అసలీ ప్రశ్నలకి జవాబులు ఏ కవికైనా తెలుసునా?? చెప్పగలరా?? మీరే ఆలోచించండి ఒకసారి.
ఇంక లక్షణ నిర్దేశమే చేయజాలని వచన కవితావాక్యంలో మీరు పాద విభజన కోసం చూస్తున్నారు.అసలు మీకు భావ ప్రధానమైన కవితావాక్యంలో భాషకి ముఖ్యమైన వాక్యం తాలూకు రూపాన్ని వెదుకుతున్నారే?? అది కుదిరే పనేనా?? వచన కవితని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చదవ వచ్చునేమో?? దాన్ని ఇక్కడే విరవాలని ఒక నియమంగా ఆ వాక్యాన్ని విభజించనేలేమేమో?? చదివే వారి గొంతుని అనుసరించి భావం ఎప్పుడూ కొత్తగా వినిపించే అవకాశం ఉన్న కవితా ప్రక్రియ వచన కవిత్వం కాగా అది మనకి అలవాటైన వాక్యాల్లో ఉందనే కదా దాన్ని మీరు విభజించను వీలులేదని అనుకుంటున్నారు?? ఇన్ని సమస్యలని ముందుపెట్టుకుని చందస్సుని మనసులో పెట్టుకుని ఆ దృష్టితో వచన కవిత్వానికి కూడా లక్షణ నిర్దేశం చేయచూసినప్పుడు తిప్పలు తప్పవు. వచన కవిత్వంలో పాదవిభజన భాష ప్రకారమో లయ ప్రకారమో జరిగితే మీరన్న చర్చ సులువు. కానీ మీరే వచన పద్యాన్నైనా లోపలో బయటో చదివి చూడండి. అది భావాన్ని అనుసరించి గాని నడవదు. ఎవరి పద్యాన్నైనా సరే !! ఒకరి భాష మరొకరిది కాదు. వాక్యవిన్యాసం ఎప్పుడూ భావస్పోరితంగా మాత్రమే నడుస్తుంది. ఇందుకు మీరు లక్షణ నిర్దేశమే చేయగలిగితే అప్పుడు మీకు ఇప్పటి వరకూ అమలులో ఉన్న నియమాలు పనికిరావు. కొత్త లక్షణ సూత్రాలు అనువర్తిస్తాయి. వాటిని తయారుచేసుకోవాలి. అది ఆలంకారికుల పని. మనకి కొత్త కవిబృందం తయారై ఉంది గానీ మరి ఈ ప్రక్రియకి కొత్త ఆలంకారికులు లేదా అలాంటి వారెవరో వారు మాత్రం ఇంకా తయ్యారవలేదు. సంపత్ కుమార శిక్షణ పాత సంప్రదాయం లోనిది. ఆయన ఆలోచనలు అందులోంచి తయారైనవి. అందుకే ఆయన వ్యాఖ్యానాలు గానీ లేదా ఆ తరహా ఇతరులు వేస్తున్న ప్రశ్నలు గానీ మారిన ఇవాళ్టి కవితావాక్యానికి నప్పడం లేదు. అలాగే మాధవ్ వ్యాసం నిండా కూడా బోలెడన్ని అవకతవక వాక్యాలున్నాయి. అవన్నీ అయోమయమైన ప్రకటనలే చాలావరకూ!! అందువలన వచన కవులనించి వారి సృజనకి సంబంధించిన ప్రశ్నలకి జవాబులనీ రాబట్టే దిశగా కన్నా… ఉన్న కవిత్వానికి కొత్త నియమాలున్నాయేమో అనే దిశగా కొత్త ఆలోచనలు చేస్తే మంచిది బహుశా .
మీలాంటివారెవరైనా ఇందుకు ప్రయత్నించవచ్చు. ప్రయత్నించండి మరి.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి narayana babu vedula గారి అభిప్రాయం:
01/30/2011 3:35 am
Ayya gorti garu,
I am deeply indebted to you for having presented and enhanced my interest in సంగీతం. Pl. clarify a doubt in this immature సంగీత పిపాసి as I am a very tiny particle in your ocean of knowledge about musicology.
నేను విన్న ఒక కీర్తనలోని పదం “కయి”. కీర్తన “దండము పెట్టెనురా కోడండపాణి చూడరా”. చరణం “పేరుకా ప్రతిష్టకా వూరికా నిను వేడితి, వూరు వారు వీధి వారు వొక్క జాతివారు కారు వారిని కయి బట్టి విడువకు త్యాగరాజార్చిత నీకు దండము పెట్టెనురా”
Is “కయి” not a tamil word for hand? Another doubt why Tamil is called “ARAVAM” in telugu?
mee abhimaani
narayanam babu vedula
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:
01/29/2011 8:58 pm
పద్యము సొగసుగా ఉంది. శ్రీమాన్ చీమలమర్రి బృందావన్ రావు గారి వర్ణన మనోహరముగా ఉన్నది. వారికి ధన్యవాదములు.
కవిత్వ మీమాంస గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/29/2011 12:15 pm
చాలా బాగుందండి వ్యాసం. కవిత్వం గట్రా ఏమైనా వ్రాస్తుంటే గాని, ప్రతికొన్ని నెలల కొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని, ఆలోచించుకుని, బుర్ర మళ్ళీ సరిగా ట్యూన్ చేసుకోవల్సిన వ్యాసం.
థాంక్స్.
లైలా
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:
01/29/2011 7:34 am
ఈ విషయం మీద నేను చాలా చోట్ల చర్చించాను కాబట్టి చర్విత చర్వణం అవుతుంది అని చర్చలోకి ప్రవేశించ లేదు.
కవిత్వ మీమాంస అన్న వ్యాసంలో రెండవ భాగం కవిత్వ మీమాంస అన్న శీర్షిక కింద నా ఆలోచనలు చూడగలరు.అలాగే ఈ సంభాషణలో మూడవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబు కొంతవరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.
చేరా ఆచార్యుల గారి చర్చ గురించి నేను చాలా విన్నాను. కానీ, ఆ పుస్తకం సంపాదించి చదివినప్పుడు (1990 లలో) నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ‘vers libre ‘(free verse) గురించి వీరిద్దరూ పట్టించుకోక పోవడం. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తే చర్చలో పదును పోతుంది, ఎన్ని విలువైన విషయాలను ప్రస్తావించినా. సమస్య మూలాలను వదిలి అనేకానేక విషయాలు చర్చించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఏది ఏమైనా ఈ చర్చ చరిత్రలో భాగమే కనుక తప్పక చదవ వలసిందే.
శుష్క వచనాన్ని, శుద్ధ కవిత్వాన్ని విడదీసేది భావనా శక్తి. వచనంలో మామూలు తర్కంతో బండి నడుస్తుంది.ఎక్కువ ఖాళీలు ఉండవు. పాఠకుని ఊహా శక్తికి మేత వేయడు రచయిత. దానికి భిన్నంగా కవి పాఠకుని భావనా శక్తిని పరీక్షిస్తాడు. కవిత్వంలో తర్కం లేదు అన్న వితండ వాదం చేయడం లేదు నేను. తర్కాన్ని మించిన భావనా బలం కవితకు ప్రాణం. దాన్ని పాఠకునిలో స్ఫురింప చేయడానికి పాదకల్పన అవసరమవుతుంది. పాదకల్పన కంద పద్యాల్లోనో ఆటవెలదిలోనో ఉన్నట్టు కాకుండా స్వేచ్చగా ఉంటుంది. పాఠకునికి కవి తాను చూసిన జగత్తును చూపి తద్వారా తాను పొందిన అనుభవాన్నిసూచించడానికి సాధనం పాదకల్పన. పాద కల్పన లేకుండా , వాక్యం తరువాత వచ్చే వాక్యం ఒక తర్క ధోరణిలో పడి పోతుంది. వాక్యాల మధ్య అన్వయం హేతుబుద్ధికి అందుతుంది. కవిత్వంలో వాక్యాల మధ్య అన్వయం
హేతుబుద్ధిని దాటిన భావనా శక్తికి సంబంధించినది.దాన్ని సాధించడానికి ఒక సాధనం పాద కల్పన.కవితకు ఒక క్రమం, నడకా,నిర్మాణం ఉన్నాయి మరి. అంతేకాదు,పాదకల్పన లేకుండా కవితలోని ఎత్తుగడ అర్థం కాదు.లయ అవగతం కాదు.
చివరికి చెప్పేదేమిటంటే వచనం రేఖీయం(linear). కవిత వృత్తం. అది ఎలాంటి వృత్తం? దాని గణితం జోలికి పోవడం అభిప్రాయాన్నిమించిన చర్చ.
ఈ విషయంలో ఇస్మాయిల్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉపయోగిస్తుంది.
“ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.” (నిశ్శబ్దంలో నీ నవ్వులు, నా కవితా సంకలనానికి రాసిన ముందుమాట , భూషణీయం నుంచి.)
కామేశ్వర రావు గారూ ,
ఇప్పటికి మీ మొదటి ,మూడవ ప్రశ్నల కు సమాధానం వచ్చిందే అనుకొంటున్నాను. ఇక మిగిలింది రెండవ ప్రశ్న.
౨.
” అ.ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని,
ఆ. పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?”
( అ. ఆ లు నావి , స్పష్టత కోసం )
‘vers libre ‘(free verse ) స్ఫూర్తితో ఆలోచిస్తే (ఆ )సమంజసం కాదు. కానీ, ‘vers libre ‘(free verse ) పాద కల్పనకు వ్యతిరేకం కాదు. ఫ్రెంచి కవులు బిర్ర బిగుసుకుపోయిన ఛందో నియమ నిబంధనలను అతిక్రమించి వాటిని పాటించడమే కవిత్వం కాదు వాటికి బయట కూడా కవిత్వం ఉంటుంది అని చెప్ప దలుచుకున్నారు. (మోహన గారి విలువైన అభిప్రాయం చూడండి పద్యం కూడా ఒక రకమైన వచనమే).ఈ స్ఫూర్తిని గ్రహించిన కవులు చాలా వరకు అన్ని భాషల్లోనూ వారికి తోచిన రీతిలో పాద కల్పన పాటించారు. జర్మన్ , రష్యన్ లో అంత్య ప్రాసలు వదులుకో లేదు అక్కడి కవులు.(ఈ విషయంలో ఈ నాటికీ రష్యన్లు అమెరికన్ లను ఎద్దేవా చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన విషయం.) సారాంశం ఏమంటే ఈ స్ఫూర్తిని గ్రహించి, నీ భాషకు ఏది అందమో దాన్ని వదలకుండా కవిత్వ రచన చేయాలి.
ఇక మిగిలింది prose -poem . కవిత్వాన్ని బహువచనాల బారీ నుండి కాపాడడానికి పుట్టుకొచ్చింది అంటారు Robert Bly. శ్రీ శ్రీ కవిత్వం తీసుకోండి పతితులారా భ్రష్టులారా ..అన్నీ బహువచానాలే. రాజకీయ కవిత్వంలో ఇది తప్పదు. కానీ , ఇది కవిత్వానికి చేటు చేస్తుంది. మనం చూసేది ఒక్కొక్క వస్తువునే. వస్తు సముదాయాలను కాదు. ఈ ఎరుకతో రాసేది prose -poem ఇది కూడా ముందు ఫ్రెంచి కవులే సాధించి చూపారు. ఎక్కువ వివరాలకు Talking All Morning, పుస్తకంలో On Writing Prose Poems అన్న ఇంటర్ వ్యూ (1975 లో వచ్చింది.). అలాగే తొలినాటి ఫ్రెంచి కవుల కవితా సంగ్రహం సవిమర్శకంగా చదవాలి.
మన విమర్శకులకు పరభాషా సాంగత్యం లేక చాలా చేటు జరిగింది. పట్టు మని పది భాషల్లో వచ్చిన విమర్శలు చదవరు. అనువాదాల మీద శ్రద్ధ లేదు.చరిత్ర తెలుసుకోరు.ఆధునిక కవిత్వం దాని విమర్శ ఒక ప్రత్యేక విభాగం అన్న స్పృహే లేదు. పిండి కొద్దీ రొట్టె. శుష్క వాదాలు శూన్య హస్తాలు. ఇక జాలింతును; స్వస్తి.
తమ్మినేని యదుకుల భూషణ్.
చేరా కు ఒక శతమానం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/29/2011 4:19 am
లైలా గారూ !! మీ సందేహం సబబైనది. అయితే ఇలాంటి సందేహం ఇప్పటివరకూ ఈమాట చర్చల్లో ఇంకెవరూ వ్యక్తపరచకపోవడం ఆశ్చర్యమే !!నాకు పద్య స్వరూపం మీద చాలా అభ్యంతరాలే ఉన్నాయి దాన్ని చందస్సుగా చూడగలమే గానీ పద్యాల్లో ఉన్నదంతా ” కవిత్వమని ” ఎవరన్నా అనుకుంటూంటే నా వరకు నాకు హాస్యాస్పదంగా అన్పిస్తుంది.చందస్సు ఒక పనిముట్టు మాత్రమే . చేతిలో పనిముట్టు పట్టుకున్న వాళ్ళంతా కళాకారులు కానట్టే …చందస్సు తెలిసిన వారంతా మంచి పద్యాలు రాసేయలేరు. మంచి పద్యాన్ని చదివే అనుభవం ఉన్న వారెవరన్నా దీన్ని గుర్తు పట్టగలరు కూడా!!
సంపత్కుమార రాసిన పద్యాలు కవిత్వమని ఎవరూ అనుకోరనుకుంటాను. వారు చనిపోయిన సందర్భం గనక వారిని తెలిసిన వారు వారిని గుర్తు చేసుకునే సందర్భంలో వీటిని నలుగురి ముందుకీ తెచ్చారని మనం అనుకోవాలే తప్ప వాటిలోని “కవిత్వాంశ” ప్రకారం బహుశా అయిఉండదు.
సంపత్కుమారగారి పద్యాలని అటుంచండి. వెయ్యేళ్ళ మన పద్య కావ్యాలలోనే భావుకత కల్గిన పద్యాలు తక్కువ. మనం వాటిలోని భాషా చతురతకో వారు వాటిని నడిపిన తీరుకో వాటిని జ్నాపకం పెట్టుకున్నామే గానీ కవిత్వానికి కాదు. పెద్దన మనుచరిత్రం లో మొదటి రెండు ఆశ్వాసాలూ పూర్తయ్యాకా మిగిలిన పుస్తకాన్ని ఓపికగా పూర్తి చేయాల్సిందే !! పోతనగారి భాగవతంలో భక్తి ప్రధానమే తప్ప ఆయన రాసినదంతా మంచి కవిత్వమని అనుకోవడానికి కుదరదు. అంత్యప్రాసలూ అనుప్రాసలూ చదివేసి వాటినే కవిత్వంగా అనుకునే వారే ఎక్కువ కూడా !! ఇలా చాలా మంది పద్యకవుల రచనలు కధని చెప్పడంలో భాగంగా పసలేని పద్యాలని బహుళంగానే కలిగిఉన్నాయి. అందువలన సూత్రాలని పాటిస్తూ వారు గణాలని వాడుతూ సరిగ్గా ఉత్పలమాలలో మిగతా వృత్తపద్యాలో రాసినందుకు ఆయా కవులని ఆ కాలంలో మెచ్చుకున్నారే తప్ప వారు రాసినవన్నీ కవిత్వంగా పరిగణించి కాదనుకుంటాను. ఇది పద్యాలలో విలసిల్లే కవిత్వం గురించి.
ఇహ ఇక్కడ ఉన్న కందాల్లో కోవెల సంపత్కుమార చేరాని ఉద్దేశ్యించి రాసినదాన్ని ఆయన సరదాకి గుర్తుగా మనం భావించాలే గానీ అందులో కవిత్వం చిప్పిల్లుతోందని కాదు. ఆయన రాసిన ఏ పద్యం లోనూ కవిత్వాంశ పూజ్యం !!
కందపద్యం ఒక తేజంతో నడిపిన వాళ్ళలో ఆధునిక కాలంలో శ్రీశ్రీని మాత్రమే పరిగణించాలి. మిగిలిన ఎందరో యధాశక్తి కవులు.
రమ.
కలిశాం గురించి Narayana గారి అభిప్రాయం:
01/29/2011 3:58 am
“నిశ్శబ్దంలో నీ నవ్వులు” తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి పదేళ్ళైన సందర్భంగా పుస్తకం.నెట్లో గరికపాటి పవన్ కుమారు గారి సమీక్ష చూసి ఇటొచ్చా. “అరటితొక్క కాలు జారి పడేవాళ్ళ గురించి ఎదురుచూస్తుంది. అగ్గిపుల్ల బుర్ర మండించే వాళ్ళ గురించి బెదురుచూస్తుంది” అబ్బో.. చదివి తరించాల్సిన కవిత్వమే. అనుమానం లేదు. సమీక్షలో గరికపాటి వారు శెలవిచ్చినట్టు హృదయప్రకంపన కాదు. భూకంపమే!
అలా కవితలన్నీ చదువుతూ ఈ కవిత దగ్గరకొచ్చాను. చూస్తే “పవన్” కు అని ఉంది. చిక్కుముడి కాస్త విడిపోయింది. ఎవరీ గరికపాటి పవన్ కుమారు? నక్షత్రాలు రాత్రి మాత్రమే మెరిసినట్టు ఈయన కేవలం తమ్మినేని యదుకుల భూషణు గారికి సంబంధించిన వ్యాసాలు, కవితల్లోనే మెరవడం వెనక కథా కమామిషు ఏవిటి చెప్మా అని చాలా రోజులుగా తలకొట్టుకుంటున్నా. తమ్మినేని వారిపై ఈగ వాలనివ్వని ఇతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ లింకులో ఇతని పేరు చూసి ఎంత ఆనంద పడ్డానో.
ఆప్యాయతా, అనురాగాలతో కూడిన వీరిద్దరి స్నేహం ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలనీ, అరటితొక్కల మీదా, చాక్లెట్ ముచ్చుల మీద, సిగరెట్ పీకల మీదా తమ్మినేని వారు మరెన్నో అద్భుతమైన కవితలు అల్లాలని ఆశిస్తున్నాను.
విధేయుడు,
నారాయణ
చేరా కు ఒక శతమానం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/28/2011 7:41 pm
ఇందులో, ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తితో పద్యాల్లో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారా? ఈ పద్యాలు రాసినపుడు అవతలి వ్యక్తి, మధ్యలో మధ్యలో కందంలోనో ఇంకేదైనా పద్యంలోనో, తిరుగు సమాధానాలు రాశారా?
ఈ కంద పద్యాలలో కవిత్వం ఉన్నదా? ఉంటే, అది అన్ని పద్యాల్లోనూ ఉందా? కొన్నిట్లోనే ఉందా? వాటిల్లోనూ వేరు వేరు రకాలుగా ఉందా? ఈ వివరాలు తెలిసిన వారు చెపుతారా?
థాంక్స్
లైలా
నా అమెరికా ప్రయాణం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/28/2011 1:49 pm
వేమూరి వేంకటేశ్వర రావు గారూ !!
” మీ అమెరికా ప్రయాణం”….మీరు రాసిన ఐదు సవత్సరాల తర్వాత గానీ నేను దీన్ని చదవలేకపోయినందుకు అయ్యో అని అనుకున్నాను. మీ తెలుగు అమృతంలా ఉంది.మీ శైలి హాయిగా సాగింది. చాలారోజుల తర్వాత తెలిసిన వాడుక పదాలని ఎన్నింటినో చదువుతున్నప్పుడు ప్రాణానికి సుఖంగా అన్పించింది. ఒక్క 50 ఏళ్లలో అమెరికా ప్రయాణం లో ఎన్ని రకాల మార్పులు వచ్చేయో గమనిస్తే భలేగా అన్పించింది. న్యూయార్క్లో దిగడం తోనే ఆపేసారే.??.మరి కొంచెం సంగతులు కూడా రాస్తే బాగుండేది కదా?? మొట్టమొదటి సారి మీ యూనివెర్సిటీ చదువులోని సంగతులు గట్రా.. !! మీ శైలిలోని సొగసులోంచి వాటిని తెలుసుకోవాలని మా సరదాగా ఉంది. ఆ తర్వాతి కధ కూడా చెప్పండి మరి. ఊ( కొడుతూ వినడానికి సిధ్ధంగా ఉంది మనసు.
అనేక వందనాలు మీకు,
రమ.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav గారి అభిప్రాయం:
01/28/2011 11:14 am
అందుకే గదండీ దానిని దూరపు ఉదాహరణ అన్నదీ! 🙂 ఆసక్తికరం కాదు, అంతగా అతకని ఉదాహరణ అనుండాల్సింది. ఇకపోతే…
1. వచన కవిత్వం అనేది నియతమైన పద్యం నుండి ఒక క్రమంలో పరిణమించింది అనుకుంటే (అలానే ఆంగ్లంలో వెర్స్ నుంచి ఫ్రీవెర్స్), పాద విభజన వల్ల వచ్చే “స్ఫురణ” కు కారణం అప్పటికే మనం పద్యాలని అచ్చులో చూడడం అని ప్రతిపాదించవచ్చునేమో. ఎందుకంటే, అచ్చులో పద్యకవిత్వమంతానూ పాదబద్ధంగానే ముద్రించబడింది కాబట్టీ కవిత్వం అనగానే పాదాలలో ఉండటమనే భావన ఒకటి అస్థిమూలగతం కావడానికి ఆస్కారముంది. వచన కవిత్వ పాదాలను ఛందోబద్ధమైన నియమాలను ఉల్లంఘించి వ్రాయడం, ఛందోపద్యపు శృంఖలాలనుండి వెలువడ్డంగా కవులు భావించి ఉండవచ్చును.
2. పాదవిభజన కాలగతిలో చెరిగిపోతుందని నేను అనుకోటంలేదు. పాదవిభజనని ఒక ప్రయోజనంతో వాడుకున్నవారూ ఉన్నారు. అప్రయత్నంగా, అనాలోచితంగా చేస్తున్నవారూ ఉన్నారు. అది మౌలిక లక్షణం కాకపోయినా దానినుంచి ఒక ప్రయోజనాన్ని కొందరు కవులు రాబట్టుకోగలిగేరు. అంటే ఇది కవి మీద ఆధారపడ్డ లక్షణం. అందువల్ల (మీ అభిప్రాయం చూడగానే) నాకు కలిగిన ఆలోచన ఇది: పాదవిభజన వల్ల “ఇంకే ప్రయోజనం ఉంది?” అని కాక “ఇంకే ప్రయోజనం లేదు!” అనే ప్రతిపాదనని పరిశీలించడం.
3. పాదవిభజన అనేది ఇలా పరంపరగా వచ్చిన ఒక స్వభావమే తప్ప లక్షణం కాదు అనుకుంటే, ఆ పాదవిభజనకి ఒక ప్రయోజనమూ, లక్షణమూ ఉండాలనే నియమం కూడా ఉండదు. అప్పుడు, కవి తన ఇష్టారాజ్యంగా పాదవిభజన చేసుకోవచ్చు, ఏ కారణమూ లేకుండానే. సకారణంగా చేస్తే మంచిదే కానీ అలా ఎందుకు చేయలేదు అనే నిర్బంధం కవి మీద ఉండదు. అప్పుడు వచన కవిత్వం నిర్మాణ విషయంలో మరింత సులువవుతుంది. కవికి మరింత వెసులుబాటు వస్తుంది. పాదవిభజన అనాలోచితంగా పారంపర్యంగా చేస్తున్నదే కానీ దానిపై స్పష్టత ఉండాలనే నిర్బంధం ఉండదు. వచన కవిత్వానికి నిర్మాణ లక్షణాలు అంటూ ఏమీ ఉండవనే దిశగా మనం పోవలసి ఉంటుంది. అందువల్ల చదువరి ఒక కవితను అనుభవించే తీరు మరింతగా వైయక్తికమవుతుంది. పాదవిభజన అనేది కేవలం ఒక రెలిక్ లాగా ఏ ప్రాధాన్యమూ లేనిదిగా మిగిలిపోతుంది. (ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్నది చాలామటుకూ అదే అని నాకనిపిస్తుంది).
4. అలా అయిన పక్షంలో , వచన కవిత్వంలో లయ, గతి శబ్ద భావ సౌష్టవమూ తదితరాల వాడకమూ, వాటి ప్రభావమూ కవ్యుద్దిష్టాలే కానీ, వచనకవితా నిర్మాణంలో పాత్ర పోషించవు. వీటి ద్వారా కవిత మరింత పౌష్టికమవుతున్నది అనే అభిప్రాయం చదువరి సాహితీశిక్షణ వల్ల వస్తుండవచ్చు. అప్పుడు, కవితానిర్మాణం ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుంది అని నేనన్నది కేవలం ఈ సాహితీశిక్షణపై ఆధారపడినదానిగా, కేవలం వ్యక్తిగత అభిరుచిగానే తీసుకోవాల్సి వుంటుంది తప్ప ఒక నిర్మాణలక్షణంగా ప్రతిపాదించలేను.
అందువల్ల నిర్మాణ, స్వరూప లక్షణాల గురించి కాకుండా వచన కవిత్వాన్ని వచనం నుంచి వేరు చేసే మర్మమేమిటో ఆలోచించవచ్చునేమో. అలా అని లక్షణచర్చకు ఏ ఉపయోగమూ లేదని నేననుకోను. ఆ చర్చ కవికి తన కవితానిర్మాణంలో సహకరిస్తుందనే (కవి సకారణంగా పాదవిభజనని తన కవితలో వాడుకోదలచుకుంటే) ఇప్పటికీ నాకు అనిపిస్తుంది.
మాధవ్
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/28/2011 10:22 am
అయ్యా!! కవిత్వానికి పాఠకురాలిగా నాకు మీకొచ్చిన సందేహాలు రాలేదు. అసలు వచనకవిత్వం విషయంలో పాద విభజన లోని ఇబ్బందులు నన్ను ఏనాడూ బాధించలేదు. ఇబ్బందీ పెట్టలేదు. పద్యం అన్న పదాన్ని కవులు కవిత్వపరంగానే వాడుక చేస్తున్నారని మీరు గ్రహించాకా మీకింక లక్షణ చర్చ ఉండనఖ్ఖరలేదు. మీరు ఇంకా ఆ వలయంలోనే భ్రమిస్తూంటే దానికి జవాబు ఎక్కడినించి దొరకాలీ??
పఠాభి పదాలని ముక్కలు ముక్కలుగా విరిచి రాసినప్పుడూ ఇదేం పోకడా అంటూ సాంప్రదాయవాదులు విసుక్కున్నారు. లయ మీద మాంచి పట్టున్న పఠాభి పనిగట్టుకుని లయని ..పదాల అందాలనీ ధ్వంసం చేస్తూ కవిత్వం రాసినప్పుడు అది అసలు కవిత్వమే కాదని అనుకున్న వాళ్ళూ ఉన్నారు. కానీ వాళ్ళ విసుగుని పట్టించుకోలేదు తదనంతర కవులు.
ఇంక మొన్న కనక ప్రసాద్ గారి వ్యాసంలో గానీ లేదా కొంత మాధవ్ అభిప్రాయంలో గానీ అసలు వచన కవిత్వం అన్నదానికి మొదలెట్లా కొనసాగింపు ఎట్లా.. దాన్ని ముగింపు ఎట్లా.. దానికేమన్నా నియతి ఉన్నదా? అన్న సందేహాల చుట్టూ వారి ప్రశ్నలు నడిచాయి. ఈ ప్రశ్నలకి కవులెవరన్నా బదులు చెపుతే మీ అందరితో పాటూ నేనూ ఆసక్తిగానే చదువుతాను. కానీ అసలు అలాంటి ప్రశ్నలకి జవాబులు కవులైన వాళ్ళు చెప్పగలరా అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరన్నా ప్రాచీనకవులని వేసారా?? అందుకు వారేమని బదులు ఇచ్చారో మీరేమన్నా చెప్పగలరా?? పాత కవిత్వం అంతా కధా ప్రధానమూ.. వర్ణనల మయమూ చంధోమయమూ కదా?? అసలు అందులో క్వాచిత్కంగా తప్ప కవిత్వం ఉన్న సందర్భాలేవీ?? వారికసలు కధచెప్పడంలో ఉన్న దృష్టి లేదా స్వేచ్చా కవిత్వం రాయడంలో లేనే లేదే?? ఇవాళ గణాల దారిని వదిలి పెట్టి భావానికి పెద్ద పీటవేసి ఏ అంశం మీదనైనా తమతమ భావాలని రాయడానికి చందోరహిత మార్గాలలోంచి వచన పద్యం అనో వచన కవిత అనో పేరు పెట్టి… కవితా వస్తువుని “కధా చట్రం” నించి విడిపించి… ఒక భావస్వేచ్చని సాధించినది ఇవాళ్టి ఆధునిక కవులు కాదా?? మీ అందరి ప్రశ్నలూ లేదా సందేహాలూ గనక ఈ కవిత్వానికి లక్షణ నిర్దేశం చేయడం కోసమే అయితే అందుకు ఈ కవితాప్రక్రియలో చేయితిరిగిన వారి పద్యాలని 🙂 అదే “వచన పద్యాలని” మీలాంటి వారెవ్వరైనా పరిశీలించి కొన్ని లక్షణాలని కనుగొనవచ్చునే?? అందుకు మీకు కవిత్వం కావాలీ గానీ… కవుల సృజన ప్రక్రియ తాలూకు రహస్యాలతో ఏంపనీ?? ఈ ప్రశ్నని కవులని అటుంచండి కాసేపు. అసలు ఏ కళాకారులనైనా మీరడిగినా వాళ్ళు నిజంగా వివరించగలరా అన్నది నాకు సందేహమే!!
ఇంతమంది స్త్రీలు ఇన్ని వేలతరాలుగా పిల్లల్ని కంటున్నా పురిటి నొప్పులు ఇలాంటివని గానీ పిల్లల్ని తొలిగా ముద్దాడినప్పటి అనుభవం ఇలాంటిదనిగానీ విడమరిచి చెప్పగలిగారా?? అందుకు అసలు ఒక భాష ఉందా?? అలాంటి ప్రశ్నలకి వచ్చే జవాబులు నిజంగా మీ సందేహ నివృత్తికి చాలుతాయా?? అసలీ ప్రశ్నలకి జవాబులు ఏ కవికైనా తెలుసునా?? చెప్పగలరా?? మీరే ఆలోచించండి ఒకసారి.
ఇంక లక్షణ నిర్దేశమే చేయజాలని వచన కవితావాక్యంలో మీరు పాద విభజన కోసం చూస్తున్నారు.అసలు మీకు భావ ప్రధానమైన కవితావాక్యంలో భాషకి ముఖ్యమైన వాక్యం తాలూకు రూపాన్ని వెదుకుతున్నారే?? అది కుదిరే పనేనా?? వచన కవితని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చదవ వచ్చునేమో?? దాన్ని ఇక్కడే విరవాలని ఒక నియమంగా ఆ వాక్యాన్ని విభజించనేలేమేమో?? చదివే వారి గొంతుని అనుసరించి భావం ఎప్పుడూ కొత్తగా వినిపించే అవకాశం ఉన్న కవితా ప్రక్రియ వచన కవిత్వం కాగా అది మనకి అలవాటైన వాక్యాల్లో ఉందనే కదా దాన్ని మీరు విభజించను వీలులేదని అనుకుంటున్నారు?? ఇన్ని సమస్యలని ముందుపెట్టుకుని చందస్సుని మనసులో పెట్టుకుని ఆ దృష్టితో వచన కవిత్వానికి కూడా లక్షణ నిర్దేశం చేయచూసినప్పుడు తిప్పలు తప్పవు. వచన కవిత్వంలో పాదవిభజన భాష ప్రకారమో లయ ప్రకారమో జరిగితే మీరన్న చర్చ సులువు. కానీ మీరే వచన పద్యాన్నైనా లోపలో బయటో చదివి చూడండి. అది భావాన్ని అనుసరించి గాని నడవదు. ఎవరి పద్యాన్నైనా సరే !! ఒకరి భాష మరొకరిది కాదు. వాక్యవిన్యాసం ఎప్పుడూ భావస్పోరితంగా మాత్రమే నడుస్తుంది. ఇందుకు మీరు లక్షణ నిర్దేశమే చేయగలిగితే అప్పుడు మీకు ఇప్పటి వరకూ అమలులో ఉన్న నియమాలు పనికిరావు. కొత్త లక్షణ సూత్రాలు అనువర్తిస్తాయి. వాటిని తయారుచేసుకోవాలి. అది ఆలంకారికుల పని. మనకి కొత్త కవిబృందం తయారై ఉంది గానీ మరి ఈ ప్రక్రియకి కొత్త ఆలంకారికులు లేదా అలాంటి వారెవరో వారు మాత్రం ఇంకా తయ్యారవలేదు. సంపత్ కుమార శిక్షణ పాత సంప్రదాయం లోనిది. ఆయన ఆలోచనలు అందులోంచి తయారైనవి. అందుకే ఆయన వ్యాఖ్యానాలు గానీ లేదా ఆ తరహా ఇతరులు వేస్తున్న ప్రశ్నలు గానీ మారిన ఇవాళ్టి కవితావాక్యానికి నప్పడం లేదు. అలాగే మాధవ్ వ్యాసం నిండా కూడా బోలెడన్ని అవకతవక వాక్యాలున్నాయి. అవన్నీ అయోమయమైన ప్రకటనలే చాలావరకూ!! అందువలన వచన కవులనించి వారి సృజనకి సంబంధించిన ప్రశ్నలకి జవాబులనీ రాబట్టే దిశగా కన్నా… ఉన్న కవిత్వానికి కొత్త నియమాలున్నాయేమో అనే దిశగా కొత్త ఆలోచనలు చేస్తే మంచిది బహుశా .
మీలాంటివారెవరైనా ఇందుకు ప్రయత్నించవచ్చు. ప్రయత్నించండి మరి.
రమ.