ఒకావిడ, ముఖం గుర్తు లేదు, వయసులో చిన్నదే, కానీ అందరమూ బహుశా ఆమె కోసమే ఎదురు చూస్తున్నంత ప్రాధాన్యత గల మనిషి, వడిగా అడుగులేస్తూ లోపలికి వస్తోంది. మాలో మేము ఏదో మాట్లాడుకుంటున్న మా దృష్టి ఆమెవైపు మళ్ళింది. చిత్రంగా, ఆమెతోపాటు వెంట వస్తున్న నలుగురైదుగురిలో బాల్‌రెడ్డి ఉన్నాడు. ఇతనిది మా ఊరే. నాకు చిన్నప్పటినుంచీ పరిచయం. ఇద్దరమూ మనసారా కళ్ళతో పలకరించుకున్నాం.

నువ్వు కొంచెం ఆలోచించి ఉంటే నీకు తెలిసేది నువ్వు ముమ్తాజ్‌ని, ఒక ముస్లిమ్‌ని, ఒక స్నేహితుణ్ణి కాదు చంపివేసింది, నువ్వు చంపివేసింది ఒక మనిషిని, అని. వాడొక దగుల్బాజీ అయినా సరే. నువ్వు చంపింది నీకు నచ్చని వాడి దగుల్బాజీతనాన్ని కాదు, వాడినే. వాడు ఒక ముసల్మాన్ అయితే నువ్వు వాడిలోని ముసల్మానీని చెరిపివేయలేదు. వాడి జీవితాన్నే చెరిపివేశావు.

పగటిరూపాల సాయంసంధ్యలో
సూర్యాస్తమయాన్ని కనబడనీకుండా
చీకటి తీరాల కావల నుంచి
కిటికీ దగ్గర చేరి
సంధ్యారూపాల పగటి నీడలను చూస్తూ
ఆ కొద్దిపాటి ప్రేమ రాకను తెలుసుకోనివ్వండి.

ఈడంత గంజి వార్సినట్టయితాందని
ఊరకుక్కలు ఓరసూపు జూత్తయి.
పలుకు మీదున్నప్పటి పదునే పదునని
పదిమంది గుడిసె సుట్టే కాపల గాత్తాంటరు.
గంజిలబడ్డ ఈగకు గాశారమా పాడా?
అని మొఖం జూసుకుంటనే గొణుగుతాంటరు.

మ‌ళ్ళీ క‌ల‌గంటాను.
మ‌నోహ‌ర‌మైన మ‌రీచిక‌ల‌ను,
మ‌రులుగొలిపే మ‌ధుమాసాల‌ను.

మ‌ళ్ళీ మ‌ళ్ళీ క‌ల‌గంటాను.
మధురాధ‌ర మంద‌హాసాల‌ను,
మ‌త్తిల్ల‌జేసే మ‌ల‌యానిలాల‌ను.

పద్యాల మీద
గుట్టలు గుట్టలుగా
పుట్టలు పుట్టలుగా
తుట్టెలు తుట్టెలుగా
పేరుకు పోయిన జ్ఞాపకాలు
జ్ఞాపకాలు పద్యాల్ని కొరుకుతూ

భారతీయ భక్తి సాహిత్యంలో శివుణ్ణి, విష్ణువుని స్తుతిస్తోనో, ప్రేమిస్తోనో కవిత్వం చెప్పడం మొదలైన ఎంతో కాలానికిగాని శక్తిని ఆరాధిస్తూ చెప్పే కవిత్వం రాలేదు. వేదాల్లోని వాగ్దేవి సూక్తం, ఉపనిషత్తుల్లోని ఉమా హైమవతి, ఇతిహాస, పురాణాల్లోని దేవి, బౌద్దుల తార, తాంత్రిక దశమహావిద్యల్లో కాళి ఒక ఉపాస్య దేవీమూర్తిగా భక్తికవుల హృదయాల్ని కొల్లగొట్టుకోడానికి పద్దెనిమిదో శతాబ్దిదాకా ఆగవలసి వచ్చింది.

మనుషుల్లో జ్ఞాని, పండితుడు, అమాయకుడు, దొంగ, వెధవ, మోసగొండి, పోకిరి, మహాత్మ, మంచివాడు, చెడ్డవాడు, చాదస్తుడు, ఛాందసుడు అని రకరకాలు ఉన్నట్టే పిల్లుల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. రౌడీ పిల్లి, పండిత పిల్లి, శాంత పిల్లి, దొంగ పిల్లి, మంచి పిల్లి, అమాయక పిల్లి, కాలాంతక పిల్లి, మోసగొండి పిల్లి, హంతక పిల్లి అని పలు రకాలున్నాయి. స్నీకీ ఒరిజినల్ ప్రియుడు రౌడీ పిల్లి. చింటూ ఏమో ఇంటలెక్చువల్ టైప్.

నారాయణరావుగారి దృష్టిలో పాశ్చాత్య విజ్ఞానార్జన విధానాల్ని, కేవలం భౌతిక పరిశోధనలే విద్యాన్వేషణ మార్గాలనే భావనల్లోని లోపాల్ని సున్నితంగా ఎత్తిచూపేవి; భారతీయులకీ పాశ్చాత్యులకీ ఆలోచనా ధోరణుల్లో, సంస్కృతీ సంప్రదాయాల్లో వున్న భేదాలు చాలా మౌలికమైనవి; వాటిని స్పష్టంగా గుర్తించినప్పుడే రెంటినీ అనుసంధించటం సాధ్యమని చాటేవి, ఈ పుస్తకంలో వున్న రెండు రచనలూ.

క్రితం సంచికలోని గడినుడి-31కి మొదటి ఇరవై రోజుల్లో ఎనమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. ఈ సారి గడినుడి నింపడంలో కలిగిన సాంకేతిక అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇకపై అటువంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్త పడతాం. పోయిన నెల గడినుడికి అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, అగడి ప్రతిభ, బండారు పద్మ, వైదేహి అక్కిపెద్ది, సుభద్ర వేదుల, భమిడిపాటి సూర్యలక్ష్మి, ముకుందుల బాలసుబ్రమణ్యం, ఆళ్ళ రామారావు. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-31 సమాధానాలు, వివరణ.

అడ్డం సువాసన తొలుత లక్కతో తయారు చేశారు (5) సమాధానం: గంధమాదిని ఉదాహరణకి సర్వ వశంకరి (3) సమాధానం: దేవత రామా! నాజీ పరిపాలనా? […]

నవంబర్ 2015 సంచికలో బాలానంద బృందం 78rpm రికార్డులపైన, రేడియోలోను పాడిన కొన్ని పాటలు, రేడియోలో సమర్పించిన కొన్ని కార్యక్రమాలు విన్నాం. ఈ సంచికలో మరికొన్ని పాటలు, కథలు విందాం.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఏ కొద్దిమందో ఉంటారు. వారి భావాలు, ఆశయాలు, ఎంచుకున్న దారులు వంటివాటితో మనకు మమేకత ఉండకపోవచ్చు. పైపెచ్చు విరోధమూ ఉండవచ్చు. కాని, వారిని మనస్ఫూర్తిగా గౌరవించకుండా ఉండలేం. తమ ఆశయం పట్ల వారికున్న నిబద్ధత, అది సాధించడం కోసం చేసే నిరంతర పోరాటం, అహోరాత్రాలు జ్వలించిపోయే తపన, ప్రాణాలైనా అర్పించగల త్యాగశీలత, వారిని ప్రత్యర్థులు కూడా గౌరవించేట్టు, అభిమానించేట్టు చేస్తాయి. అలాంటి కొద్దిమందిలో ఒకరు శివసాగర్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కంభం జ్ఞానసత్యమూర్తి (15 జులై, 1931 – 17 ఏప్రిల్, 2012). సమాజపు అసమానతల పట్ల అసహనంతో విప్లవోద్యమ మార్గాన్ని ఎంచుకున్న ప్రతీ యువతీయువకుడి నోటా కదను తొక్కే కవితా పంక్తులు ఇద్దరు కవులవి. ఒకరు శ్రీశ్రీ, మరొకరు శివసాగర్. అయితే కేవలం కవిగా కలమే కాకుండా సైనికుడిగా ఆయుధమూ పట్టినది, ‘ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ కవి నేడు’ అంటూ విప్లవకవిత్వానికి దారి వేసినది శివసాగర్ మాత్రమే. వయోవిద్యాప్రాంతీయభేదాలనేవి లేకుండా జనవాహినిలో నినాదస్థాయికి చేరుకున్నది ఆయన కవిత్వం మాత్రమే. కవిత, పాట రెండు దారులుగా సాగిన ఆయన సాహిత్య ప్రస్థానంలో మొదటగా 1983లో ప్రచురించిన ఉద్యమం నెలబాలుడు ఎందరినో ప్రభావితం చేసింది. ప్రజలను కదిలించడంలో పాటకున్న బలాన్ని తెలుసుకున్న శివసాగర్ కలంనుంచి నరుడో భాస్కరుడో, చెల్లీ చెంద్రమ్మా, నల్లాటి సూరీడూ, ఓ విలుకాడ! వంటి పాటలు ఇప్పటికీ ప్రముఖంగానే ఉన్నాయి, ఇక ఎప్పటికీ ఉంటాయి. భూమీ ఆకాశం కలిసే చోట/ పొన్నపూలు రాలిపడిన చోట/ వీధిదీపాలు ఉరిపోసుకున్న చోట/ నేలమాళిగ కన్నీరు కార్చిచ్చు అయినచోట/ తిరిగి వస్తాను/ తిరిగి లేస్తాను/ నాకోసం ఎదురు చూడు/ నాకోసం వేచి చూడు అని చాటిన ఆ విప్లవకవి వర్ధంతి సందర్భంగా ఈ సంచిక ఆయన స్మృతిలో వెలువరిస్తున్నాం. సమయం తక్కువగా ఉన్నప్పటికీ అడగగానే నివాళి రాసి పంపిన నరేష్కుమార్ సూఫీ, బొమ్మ పంపిన అన్వర్, అరుదైన శివసాగర్ జైలు డైరీ ప్రతి పంపి సహాయం చేసిన గుర్రం సీతారాములుగార్లకు మా కృతజ్ఞతలు.

ప్రజల పాట, ప్రజల బాధ, ప్రజా ఉద్యమానికి ఇంతకన్నా పెద్ద కవిత్వం ఇంకేం ఉంటుంది? శివసాగర్ ప్రతీ కవిత వెనుకా ఒక నేపథ్యం ఉంది, ఒక వీరుడి మరణమో విజయమో ఉంది, ఒక ఆకలి బాధ ఉంది. ఏ పలుకూ ఊహామాత్రం కాదు, మరే పోలికా సత్యదూరం కాదు. ఒక్క కవిత కూడా జనసామాన్యపు నాల్కలమీద ఆడటానికి ఇబ్బందిపడిందీ లేదు.

ఒకే పేద్ద కాగితం, అదే పొడవాటి వేళ్ళ చిత్రకళా విన్యాసం. నో దిద్దుబాట్లు, నో అచ్చుతప్పులు, నో కొట్టివేతలు… అలా చూస్తుండగానే నరాల బిగువూ, కరాల సత్తువ, కణకణ మండే, గలగల తొణికే అనేక కన్నులు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళూ, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ, చెరసాలలలో చిక్కేవాళ్ళూ…

ఉద్యమాన్ని నెలబాలుడుగా ఊహించటంలోనే శివసాగర్ కాల్పనిక ధోరణి వ్యక్తమవుతున్నది. అలలపై కలలు కంటాడు. అలల పైనుంచి వచ్చే చిరుగాలి సితారా ధ్వనులకు పరవశిస్తాడు. మిత్రద్రోహంచేత శత్రు చేజిక్కి తన ప్రజలకు చందమామ చేత సందేశం పంపిస్తాడు. ఏమని? ‘జీవితాంతం వరకు ప్రజలకు సేవలు చేయ విఫలమైనందుకు తన్ను క్షమించమ’ని.

ఒకసారి… కాస్త కనికరం ఉన్న రజాకారు ఒకడు సహరన్‌పూర్‌లో ఇద్దరు అమ్మాయిలు పాకిస్తానులో ఉన్న అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళడానికి నిరాకరించారని, వాళ్ళని అక్కడే ఒదిలిపెట్టేశానని నాకు చెప్పాడు. జలంధరులో ఒక అమ్మాయిని తాము బలవంతాన తీసుకెళ్ళినప్పుడు, అక్కడున్న కుటుంబాలన్నీ ఎవరి ఇంటి కోడలో దూరప్రయాణానికి వెళ్తున్నట్టు వీడ్కోలు చెప్పారని, ఒక రజాకారు చెప్పాడు.

మేకకి సంబంధించినంతవరకూ చావు అనేది, కత్తికీ దాని కుత్తుకకీ మధ్య కార్యకారణ సంబంధం. ఇందులో వాదోపవాదాలకీ తర్కోపతర్కాలకీ తావు లేదన్నది కత్తిమేక ప్రగాఢ విశ్వాసం. చావుని దూరం లాగో, భారం లాగో, కాలం లాగో, వేగం లాగో కొలవడం సాధ్యం కాదని, అన్నీ కలగలిపిన ఓ క్రొత్త ప్రక్రియని కనిపెట్టాలని, చావుని బెత్తడు దూరం నుంచి తప్పించుకొన్నప్పుడే కత్తిమేక నిశ్చయించుకొంది.

ఇక మన ఇష్టాయిష్టాలను బట్టి ప్రాచీన సంస్కృతిని, సాహిత్యాన్ని ఎంచుకోవచ్చుగాని, భీష్మించుకుని అవే ఆనాట వాస్తవరూపాలని మొండికెత్తడాన్ని ఏమనగలం? కాలగతిలో కుల, మత, ప్రాంతీయ, రాజకీయ, తాత్త్విక గంధకం వీటిలోకి చేరడంలో ఆశ్చర్యంలేదు – మొత్తం ప్రతి అక్షరం పరమపవిత్రం అనుకోవడం, కాదు, మొత్తం అంతా చెత్త అని నేలకేసి కొట్టడమూ ఒకే రకపు జ్ఞానం.