అడ్డం కీకారణ్యానికైనా, జనారణ్యానికైనా తిండి కావాలంటే జరిగి తీరాల్సిందే (10) సమాధానం: కిరణజన్యసంయోగక్రియ ఈ మూడు బేడలు వేదాల్లోవా?(4) సమాధానం: ఆరణాలు అన్యభాషలో చూస్తే […]
Category Archive: సంచికలు
క్రితం సంచికలోని గడినుడి-33కి గడువుతేదీ లోగా నలుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, వైదేహి అక్కిపెద్ది, చందన శైలజ, భమిడిపాటి సూర్యలక్ష్మి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-33 సమాధానాలు, వివరణ.
రెండు చేతులు కౌగిలించుకునప్పుడు
వచ్చే కడియాల చప్పుడుతో
తరగతి గదులు నిద్రలేస్తుంటాయి
అక్కడ తలలు లేని సూత్రాలు
ప్రాణం లేని సమీకరణాలు
ఎందుకు పుట్టాయో తెలియని ప్రమేయాలు
జీవితాలను లోతుగా అధ్యయనం
చేస్తుంటాయి
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ఏ ఏటికాయేడు ఇబ్బడిముబ్బడిగా కథలు, కవిత్వ సంకలనాలు ప్రచురింపబడటం తెలుగునాట రానురానూ రివాజుగా మారుతోంది. ఊరికొకరుగా వెలిసి సాహిత్యాన్ని తమ భుజాల కెక్కించుకు మోస్తున్నామని చెప్పుకోడం చూపించుకోడం మొదలయ్యాకే మన సాహిత్య ప్రమాణాలు ఏ ఎత్తులో ఉన్నాయో మరీ స్పష్టంగా అందరికీ తెలిసి వస్తోంది. పేరు పొందిన కథా/కవిత్వ సంకలనాలు ఏవి తీసుకున్నా అందులో చేర్చబడని కథల/కవితల చర్చ అనివార్యంగా వాటితో జతపడి ఉంటుంది. కానీ, నిజానికి అసలు సమస్య అది కాదు. ఎంపిక చేయబడుతున్న రచనలూ నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడం, ఏ సంకలనాన్ని గమనించినా అది ఒక ఏడాదిలో వచ్చిన గొప్ప రచనల తాలూకు జ్ఞాపికగానో లేదంటే ఆ ఏడాది వినపడ్డ కొత్త గొంతుకలను మరికొందరికి పరిచయం చేసే ప్రయత్నంగానో కనపడకపోతుండడం, సాహిత్యేతర ప్రయోజనాలే ఈ సంకలనాలు క్రమం తప్పకుండా విడుదలయ్యేలా ప్రోత్సహిస్తున్నాయన్న నిజం సాహిత్యావరణంతో అంతగా పరిచయం లేని మామూలు పాఠకులకు కూడా అర్థమయ్యేంత స్పష్టంగా ఈ రాజకీయాలు పెచ్చుపెరిగిపోవడం, కలవరపెట్టే విషయాలు.
నాలుగు రచనలు మన ముందున్నప్పుడు వాటిలో ఏది అత్యుత్తమ రచనో బేరీజు వెయ్యడం, నాలుగింటినీ విలువ కట్టి వరుసలో ప్రకటించడం అసాధ్యమైతే కావచ్చు కానీ, ఇన్ని ప్రింట్ పత్రికలు,కొత్తగా పుట్టుకొస్తోన్న వెబ్ పత్రికలు, ఏడాది పొడుగునా ప్రచురిస్తోన్న ఇన్ని వందల రచనల్లో నుండి, ఒక కనీస స్థాయిలో నిలబడగల రచనలను ఎంపిక చేయలేకపోవడం ఎలాంటి దుర్గతి! ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారో, ఏ ప్రాతిపదికన ఎంపిక జరిగిందో మాటవరసకు కూడా ప్రకటించని సంపాదకుల అలక్ష్యం. తమ రచనలు ఎట్లాంటి సంకలనాలలో ప్రచురింపడుతున్నాయో కనీస వివరం తెలియని స్థితిలో రచయితలున్నారు. ముందుగా రచయితలకు తెలియబరచడం, అనుమతి తీసుకోవడం అక్కర్లేని పనులయ్యాయి. ఆపాటి గౌరవాన్ని కూడా ఆశించకుండా, తమ రచనలను అచ్చులో చూసుకుంటే చాలన్న తృప్తితో బ్రతుకుతున్నారా తెలుగు రచయితలు? వెబ్పత్రికలలో రచనలు పరిశీలనకు అనర్హమైనవనీ, ప్రింట్ పత్రికలలో ప్రచురింపబడ్డ రచనలనే ఈ సంకలనాలకు పరిశీలిస్తామనీ బిగ్గరగా, బహిరంగంగా చెప్పుకుంటున్న సంపాదకవర్గాలది మరో వింత పోకడ. సాంకేతికతను కళకు విరోధిగా భావించే మూర్ఖత్వమిది. లేదా వెబ్పత్రికలలో వస్తోన్న సాహిత్యాన్ని గమనించలేని అలసత్వం. మాధ్యమాలను బట్టి, రచయిత పేరును బట్టీ కాక, అక్షరాలను బట్టి రచనలకు విలువ గట్టే ధోరణి మనకింకెప్పటికి అలవడుతుంది? లేని విలువలను ఈ సంకలనాలకు ఆపాదించడం ఆపి, మన చేతుల్లో నుండి చల్లగా జారుకుంటోన్న ఉత్తమ ప్రాచీన సాహిత్యమేదైనా ఉంటే దానిని పునఃప్రచురించుకుంటే, కనీసం కొత్త చెత్తను కాస్త తగ్గించుకున్నవారమవుతాం.
టీమ్ వర్క్ అనగానే వాడి కళ్ళు మెరిశాయి. ఆ మెరిసిన కళ్ళల్లోంచి మిగిలిపోయిన నీటిచుక్కలు మరింత మెరుస్తూ స్ఫటికాలలాగా రాలిపడ్డాయి. వాడు నా ఒళ్ళో కూర్చొని స్టీరింగ్ వీల్ తిప్పుతుంటే నేను కాళ్ళతో పెడల్స్ కంట్రోల్ చేస్తూ, పార్కింగ్ లాట్లో అలా ఒక అరగంట టీమ్ ఆట ఆడేం. నేను వాణ్ణి గేర్లు కూడా మార్చనిచ్చాను కాసేపు. రివర్స్ గేర్ వేసినప్పుడల్లా వాడు ఒకటే కేరింతలు. కన్నబిడ్డ నవ్వును మించింది ఏముంటుంది ఈ లోకంలో.
అకస్మాత్తుగా ఒకాయన తన కిష్టమైన ఓ బూజీ వూజీ ట్యూన్ చెప్పి అది పియానో పై వాయిస్తే వెయ్యి డాలర్లు కేష్ ఇస్తానన్నాడట. ఆలక్స్ స్టూడెంట్లని వద్దనలేదు. అతను అసలు ఏమైనా అనే లోపలే, ఒక కుర్రాడు ఉత్సాహంతో వాయించాడు. అక్కడి నుండీ అక్కడి అతిథులందరికీ ఒక్కొక్కరికీ కిర్రెక్కి, వారి జాజ్, పాప్ మ్యూజిక్ కోర్కెలు అడగటం, వెంటనే కేష్ ప్రైజ్ ఆఫర్స్, ఆ ట్యూన్స్ వచ్చిన వాళ్ళు అవి వాయించటంలో, ఒక కొత్త ఉత్సాహం, ఒక కోలాహలం.
ఒక్కోసారి తాతగారి హుంకరింపు వినిపించినా పలికేవాణ్ణి కాదు. మా అమ్మ కూడా గట్టిగా అరిస్తే విసుక్కుంటూ వెళ్ళేవాణ్ణి. ఒకటి రెండుసార్లు చూసి, మా తాతగారు, “సీఈఈత! పి. బి. కామేశ్వర్రావని కొత్తగా ఈ. ఎన్. టీ వచ్చాడట. బాగా చూస్తాట్ట. వీణ్ణి తీసుకుని వెళ్ళకూడదూ” అన్నారు. ఆయన అంత గంభీరంగా జోకేస్తున్నారో నిజంగా చెప్తున్నారో తెలిసి చావలేదు నాకు. ఆ తరవాత ఎప్పుడూ వినపడగానే దగ్గరకెళ్ళేవాణ్ణి, ఈ వెటకారాలెవడు పడతాడనుకుంటూ.
పఠాభి ఒక ప్రపంచయుద్ధం సృష్టించిన విధ్వంసం అనంతరం, ఆ విధ్వంసం నుంచి కోలుకోకుండానే ప్రపంచం మరొక ప్రపంచయుద్ధం కోసం సమాయత్తమౌతున్న కాలంలో, వినాశనం వైపుగా, ఆత్మ విధ్వంసకత్వం వైపుగా ప్రపంచం అడుగులు వేస్తున్న కాలంలో ఆ యుగ మనఃస్థితిని, ఆ కాలంలో తన ఆత్మ విచికిత్సని పఠాభి కావ్యరూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మనమర్థం చేసుకోవాలి.
అమ్మా సత్యవతిగారూ! కథలో కథంతా చెప్పే ప్రధాన పాత్రకు పేరు లేదు. ఒక వ్యక్తిత్వమూ, ఒక అభిరుచి, ఒక రుచి, అతగాడి ఒక వృత్తి కనపడదు. అసలు కళ్ళముందుకు రాని సుశీల మాత్రం మనకు అంతా తానై మనతో ఉండిపోతుంది. ఈ కథ ఇంకో గొప్ప టెక్నిక్. అమ్మా మీకు నా పరి పరి దండాలు.
నిజానికి ఇది ఒక్క అమెరికా తెలుగువాళ్ళకే చెందిన కథ కాదు. మూలాల నుంచి విడివడి బ్రతుకుతోన్న ప్రతి ఒక్కరి కథ ఇది. తరాల తరబడి తమ తమ మూలాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కొత్త జీవితాల నిర్మాణాలకు ఆపూర్వ అస్తిత్వాలు అవరోధమవడమన్న విషయాన్ని గ్రహించడం, వాటిల్ని దాటుకోవడం ఇంకా ముఖ్యం అన్న విషయాన్ని సమర్థవంతంగా ప్రతిపాదించిన కథ ఇది.
మనసులో కోరికలు
కళ్ళ చివర్ల నుంచి
నిరాశ వాసన కొడుతూ
జారి పడిపోతున్నా
పట్టుకోకుండా కూర్చున్నాడు
అతను నవ్వుతున్నాడు
‘ఒక రోజు’ అనే ఈ పంక్తి ఇప్పుడు మొదలవ్వాలి. అయితే చంద్రానికి ఇలా దేన్నీ సాదాసీదాగా చేస్తే నచ్చదు కాబట్టి–ఒక దివ్యమైన శుక్రవారం అని ప్రారంభం కానుంది ఈ పంక్తి. ఎంత విభిన్నంగా చెయ్యాలనుకున్నా ఈ పంక్తి ఒకరోజు అనే మొదలవ్వడాన్ని తప్పించడం వీలు కాలేదు చూడండి. వచ్చే పంక్తే దివ్యమైన శుక్రవారం… ప్చ్… సరే రండి తర్వాత పంక్తికి… వచ్చే పంక్తిలో కథ రాకెట్ వేగాన్ని పుంజుకోబోతుంది…
ఇంద్రజాలికుని
టోపీలోని
పావురాయిని
నేనేనోయ్
ఇత్తడి మాటల
లోకుల సరసన
పరుసవేదిని
నేనేనోయ్
తమ పిల్లల పసితనం లోని అమాయకత్వంలో కనపడకుండా దాక్కున్న కళ్ళు చెదిరే తెలివీ, సమయోచిత సంభాషణలకీ అబ్బురపడి ఆ అబ్బురాన్ని పదిమందికీ పంచి ఆనందించే చిట్టి తల్లులని గుండెకి హత్తుకోవాలనిపిస్తూ వుంటుంది. అందుచేత ఈ నెమలీకల్ని అలా తడిమే సాహసం చేస్తున్నాను.
క్రితం సంచికలోని గడినుడి-32కి మొదటి పది రోజుల్లోనే 11మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, ఆదిత్య, సుభద్ర వేదుల, వైదేహి అక్కిపెద్ది, అగడి ప్రతిభ, ముకుందుల బాలసుబ్రహ్మణ్యం, రవిచంద్ర ఇనగంటి, భమిడిపాటి సూర్యలక్ష్మి, ఆళ్ళ రామారావు, బండారు పద్మ, జిబిటి సుందరి/గోటేటి మార్కండేయులు/హరిణి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-32 సమాధానాలు, వివరణ.
అడ్డం మేరుపర్వతం బంగారుకొండ (6) సమాధానం: కనకనగము మీరు తర్వాత ఏమిస్తారో తెలిపే శాసనం తిరిగి వ్రాయండి. అనుమానాలు వీడండి (4) వీలునామా< = […]
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ఈనాడే పుట్టిందీ కాదు, ఈ ఏటితోనే పోయేదీ కాదు. ఎవరు మహాకవి? ఎవరు ఎందుకు కాదు? అన్న చర్చలు సమయసందర్భాలతో నిమిత్తం లేకుండా తెలుగు సాహిత్య సమూహాలలో ఉండుండీ అలజడి రేపడానికి కారణం లేకపోలేదు. మనకు కవిత్వాన్ని (ఆ మాటకొస్తే ఏ సాహిత్య ప్రక్రియనైనా) చదివి అర్థం చేసుకోవడం కన్నా ముందే, అది రాసిన కవిని, ఆ కవిత్వాన్ని ఒక వాద-భావ-వర్గ ప్రాతిపదికలపై ఒక మూసలో పడేయడం మీద మోజు ఎక్కువ. కవిత్వం పలికించిన స్వరం కన్నా, దాన్ని వినిపించిన శరీరం పట్ల ఆసక్తి ఎక్కువ. మనముందున్న నాలుగు పంక్తులు ఏం చెబుతున్నాయన్న స్పృహ కన్నా, కవిని పట్టి కుదిపివేసిన ఏ అనుభవం ఎలా మూర్తిమంతమై పదాలలోకి ఒదిగింది అన్న వివేచన కన్నా, ఆ పంక్తుల వెనుక ఉన్న మనుష్యులు, వారితో ముడిపడ్డ రాజకీయాలూ మనకు ముఖ్యం. ఇక్కడ కవిత్వాన్ని కవిని విడదీసి చూడలేం, కవిత్వాన్ని రాజకీయాన్ని విడదీసి మాట్లాడలేం, కులమతాలకు అతీతంగా కవిని గౌరవించలేం.
కవిత్వం తమ స్వార్థం కోసం సామాజిక రాజకీయ వైషమ్యాలను రేకెత్తించి పబ్బం గడుపుకోవాలనుకునే అవకాశవాదుల చేతిలో ఒదగాల్సిన ఆయుధం కాదు. మన ప్రస్తుత అవసరాల కోసం పనికి రావాల్సిన పనిముట్టు అసలే కాదు. సృజన ఉద్దేశము వేరు. దాని ప్రయోజనమూ లక్ష్యమూ వేరు. కవిత్వానికి రంగూ రుచీ వాసనా ఉండాలన్న మాటలు నిజమైన కవిత్వ ప్రేమికులకు చెప్పే రహస్యం ఒకటైతే, కవిత్వం కూడా రాజకీయంగా మారిపోయిన నేటి తెలుగు సాహిత్య వాతావరణంలో, ఈ మాటలు స్ఫురింపజేసే అర్థం మరొకటి. విశ్వనాథ ఏ కాలం వాడో జాషువా అదే కాలం వాడు. జీవిత నేపథ్యం, జీవన విధానం, అవి ఇరువురిలో కలుగజేసిన స్పందనలు పోల్చలేనివి. ఆ భిన్నత్వమే భిన్న దృక్పథాలను సమానంగా పోషిస్తూ, సాహిత్యానికి జీవలక్షణాన్ని ఆపాదిస్తుంది. అందరి కవిత్వమూ మనకు నచ్చక్కర్లేదు. కాని, ఎవరి కవిత్వం పట్ల సహానుభూతి ఉన్నదో వారిని మెచ్చుకోవడం కన్నా ఎవరి పట్ల వ్యతిరేకత ఉన్నదో వారిని చులకన చేయడం ప్రస్తుతం మనం అలవర్చుకున్న ఏకైక సాహిత్యావసరం. మహాకవి, యుగకవి వంటి డొల్ల పదాల మీద ఉన్న ఆసక్తి, వాటిని తమకు నచ్చిన పేర్లకు అతికించడంలో ఉన్న శ్రద్ధ, స్వయంసంపూర్ణమూ సర్వస్వతంత్రమూ అయిన కవిత్వం మీద ఉండి ఉంటే, బహుశా ఈ చర్చలెంత హానికరమో, అనవసరమో కొంతయినా అర్థమయ్యేదేమో. మనుష్యులుగా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, బలహీనతలు, నమ్మకాలు వారికుండటంలో అనౌచిత్యం ఏమీ లేదు కానీ, సాహిత్యపు ముసుగులో కొందరు ఎక్కడికక్కడ స్వయంలబ్ధి సమూహాలుగా విడివడి నిర్లజ్జగా తమ రాజకీయాలను, ద్వేష ప్రకటనలనూ సాహిత్యంగా, సాహిత్యావసరంగా అమ్మజూడటమే ప్రస్తుత తెలుగు సాహిత్య వాతావరణం లోని విషాదం. గొంతు ఎవరిది పెద్దదయితే వారిదే అధికారం అనుకొనే ధోరణిలోనే ప్రపంచమంతా ఉన్నది. కాని సాహిత్యసృజనని కూడా అదే తీరున విమర్శించలేం నియంత్రించలేం అన్న వివేకం కొరవడిన స్థితిలో ఉన్నాం. చివరకు, కవి రాసిన కవిత్వం గురించి మాట్లాడగలమే కాని, రాయని కవిత్వం గురించి ఎందుకు రాయలేదని కవిని ప్రశ్నించలేం, నిందించలేం అన్న కనీస సాహిత్య సంస్కారం కూడా మనకు అలవడని అధమస్థాయిలో ఉన్నాం మనం. ఈ పుట్టకురుపు ఉన్నది, ఇంతగా ప్రబలిందీ కేవలం తెలుగు సాహిత్యావరణంలోనేనా!
ఒక అద్దం, ఒక లక్ష్యం: ఒరే మాధవా! మనిషన్నాక ఒక లక్ష్యం ఉండాల్రా. జీవితంలో తనకేం కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలిసుండాల్రా. ఏం చేయదల్చుకున్నావని ఎప్పుడడిగినా అలా మాట దాటేస్తావేంట్రా! చుట్టూ చూడరా ఒకసారి. నీ స్నేహితుల్ని, మిగతావాళ్ళని చూడు. అందరూ ఎంత కష్టపడుతున్నారో చూడు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, సీఈఓలు కావాలని. కష్టపడాల్రా, లేకుంటే ఏమీ సాధించలేవు ఈ జన్మలో.