“మీరెక్కడి మనిషి బాబూ! సినిమా వాళ్ళను ఎవడయినా అలాగే అంటాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకు మర్యాదలేమిటీ?” చిరాకు అణుచుకుని మళ్ళీ అందుకున్నాడు. “ఆ బాబుగారికి నటనలో ఓనమాలు తెలీవు. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాక మొహంలో ఒకటే ఫీలింగ్. వాళ్ళ బాబు దగ్గర డబ్బులుండబట్టి అన్ని సినిమాలు ఫ్లాపయినా ఇంకా సినిమాలు తీస్తూ జనాల్ని చంపుతున్నాడు కానీ బుర్ర ఉన్న వాడెవడూ డైలాగ్ లేని వేషం కూడా ఇవ్వడు.
శీర్షికలు సంచికలు
భారత దేశపు బీద అమ్మాయిలందరిలాగే ఓపికమ్మకు ఓపిక ఎక్కువ. పదిహేనేళ్ళకే పెళ్ళి చేస్తే అప్పటి వరకూ ముక్కూ మొహం తెలియని అత్తవారింటికి వెళ్ళి ఓపికగా ఇంటెడు చాకిరీ చేసింది. కాలక్రమేణా ముగ్గురు మగ పిల్లలు, ఓ ఆడ పిల్ల పుడితే వారందరినీ ఓపికగా సాకింది. ఇంతలో భర్తను గిట్టని వారెవరో జైలు పాలు చేయగా సంసారం కిందపడ్డ గుమ్మడికాయలా ముక్కచెక్కలు కాకుండా ఓపికగా కాచుకుంది.
అప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. బాక్పాక్ లోంచి బట్టలన్నీ తీసి, తను వేసుకున్న ప్యాంటు, టీషర్టూ కూడా తీసేసి చకచకా వాషింగ్ మెషీన్లో పడేశాడు. అతను టీషర్టు తీస్తున్నప్పుడు చూశాను. తెల్లగా కండలు తిరిగిన శరీరం, చంకలకింద జీబురుగా పెరిగిన నల్లటి వెంట్రుకలు, పొట్టమీద పలకల మధ్య డైమ్లా మెరుస్తున్న బొడ్డూ, పొడుగాటి తెల్లటి చేతులూ–అతని ఒంటిమీంచి వస్తున్న మొగవాసన. అతని దేహం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఒక రచన అంటే ఏమిటి? దానికి, రచయితకి ఉండే సంబంధం ఏమిటి? రచనలో పాఠకుడి పాత్ర ఏమిటి? ఈ విషయాలు ప్రాముఖ్యంలోకి రాకముందే, ఈ కావ్యదహనోత్సవం జరిగింది. డెత్ ఆ ది ఆథర్ అని 1967లో గానీ రోలాండ్ బార్తా రాయలేదు. దానికి ముందే, ఈ సమావేశంలో ఒక పాఠకుడు ఈ ప్రశ్నలు రేకెత్తుతాడు.
ఆమె అతని ముంజేతిలో చేయి కలిపి నడవసాగింది. అతను మాటిమాటికీ గొంతు సవరించుకోవడం మొదలెట్టాడు. మనసు వికలం అయినప్పుడల్లా అలా చెయ్యడం అతని అలవాటు. బస్స్టాండ్ కిందకు చేరి నిలుచున్నాక అతను గొడుగు ముడిచాడు. ఎదురుగా కొద్దిదూరంలో, గాలికి ఊగుతూ ఆకులనుండి నీళ్ళు రాలుతున్న చెట్టుక్రింద, చిన్న బురదగుంటలో, ఇంకా రెక్కలురాని పక్షిపిల్ల ఒకటి అటూ ఇటూ పొర్లుతోంది బైటకు రాలేక.
ఛైర్మన్ మావ్ అన్నట్లుగానే, ఈ ఉద్యమం (కల్చరల్ రివల్యూషన్) ధ్యేయం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూనే క్యాపిటలిజం దారి తొక్కుతున్నవాళ్ళనూ, క్యాపిటలిస్టుల్లో రియాక్షనరీలనూ ఏరివేయడం. నాలాంటి సామాన్యులకూ ఈ ఉద్యమానికీ అస్సలు సంబంధం లేదు.
భారతదేశ ప్రభుత్వమున మిషనరీల పలుకుబడి హెచ్చెను. అంతట గవర్నరులు ప్రభుత్వసభ్యులు కలెక్టర్లు జడ్జీలు వీరికి సర్వవిధములైన సాయములను జేయుచు వీరిని ప్రోత్సహింపసాగిరి. క్రైస్తవులైనవారి కుద్యోగములిచ్చుట ప్రారంభించిరి. దేశీయుల మతముతో జోక్యము కలిగించుకొనమనియు మతవిషయకమైన విచక్షణచూపమనియు కుంఫిణీవారు వాగ్దానము చేసియున్నను అందుకు విరుద్ధముగా ప్రవర్తింపసాగిరి.
సూర్య చంద్రులు లేరని
హరివిల్లు ఆకాశాన్ని విడిచి వెళ్ళింది
ఆధారంగా ఉంటుందనుకున్న దారం
పతంగం చేయి వదిలి ఫక్కున నవ్వింది
మది ఊసుల్ని గానం చేయాలనుకున్న కోకిల
శ్రోతలే లేక బిక్కు బిక్కు మన్నది
ఎన్నెన్ని నిండుకుండల్లాంటి మేఘాలు! గుండుపిన్నుతో గుచ్చకుండానే టప్మని పేలిపోయే బెలూన్లా ఎంత వుబ్బిందో నా గుండెకాయ! ఎప్పుడు ముట్టుకుంటే పేలిపోతదోనని కాపలా కాస్తుంట. నీ వూహల ప్రపంచం గేటు కాడ నిలబడి, కూలబడి, నిండుకున్న వూటచెలిమల తడిని తడుముకుంటుంటే ఖాళీ ఆకాశంలో రంగుల గాలిపటాలు ఎగరేసిన సాయంత్రాలు యాదికొస్తుంటాయి. మాంజా తెగిన పతంగై నీ కోసం వెతుకుతుంటా.
మళ్ళీ… నవ్వేయాల్సొస్తుంది
గడ్డకట్టిన ముఖాన్ని చీల్చుకుని
నుదుటిమీద జీవితం తుఫుక్కున
ఉమ్మిన తడి నిజాలు జారిపోతుండగా
మళ్ళీ… ముడి విప్పాల్సొస్తుంది
ఛెళ్ళున తగిలిన చెంపదెబ్బ
మనసుని మండిస్తుండగా
జూస్ని పోలిన వ్యక్తి ఇంద్రుడు. హిందూ పురాణాలలోని దత్తాత్రేయ పురాణం ప్రకారం కశ్యపుడు దక్షప్రజాపతి యొక్క ఎనమండుగురు కూతుళ్ళని పెళ్ళి చేసుకుంటాడు. వీరిలో పెద్ద కూతురు అదితికి పుట్టిన వారిలో ఆదిత్యులు పన్నెండుమంది. జూస్ పన్నెండుగురు ఒలింపియనులలో ఒకడైతే, ఇంద్రుడు పన్నెండుగురు ఆదిత్యులలో ఒకడు.
గూడెంలోని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్ళిన ఒక నిజాయితీ గల టీచరు అనుభవాలు, చిన్న కథలుగా మారిన సంపుటి; ‘మొగ్గలు’ అనే ఒక ప్రత్యేకమైన కవితారూపమిది అని వెలువరించిన పుస్తకం; అంతర్జాల పాఠకుల చూపునీ, కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన ముక్తకాలు, ఈ సంచికలో.
క్రితం సంచికలోని గడినుడి-40కి మొదటి ఇరవై రోజుల్లో ఆరుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, జిబిటి సుందరి, అగడి ప్రతిభ, సరస్వతి పొన్నాడ, వైదేహి అక్కిపెద్ది, కన్యాకుమారి బయన. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-40 సమాధానాలు.
అడ్డం పెద్దగుడిలోని పెద్ద జంగమయ్య (6) సమాధానం: బృహదీశ్వరుడు ముక్కుగాలితియ్యన (6) సమాధానం: స్వరమధురిమ తెలంగాణా వాయుప్రసారం (2) సమాధానం: హవా కడపలో తిరిగిన […]
ఈ సంచికలో దాశరథి, భుజంగరాయశర్మ, విశ్వేశ్వరరావు, అడవి బాపిరాజు వంటి ప్రముఖులు రచించిన కొన్ని లలితగీతాలు వినిపిస్తున్నాను. ఓలేటి వెంకటేశ్వర్లు, వేదవతి, ఛాయాదేవి తదితరులు పాడిన ఈ గీతాలు మొదటగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
స్వర్గీయ కొండసాని నారాయణరెడ్డి స్మరణలో… కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020 కొరకు తెలుగు రాష్ట్రాలలోని కవులు మరియు రాష్ట్రేతర తెలుగు కవుల నుండి కవిత/కథా/నవల సంపుటాలను పురస్కారం కోసం ఆహ్వానిస్తున్నాము. ఈ పురస్కారపు 2019 గ్రహితలు కవిత్వం : సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి – బడి; కథ: యమ్.వి రామిరెడ్డి – వెంటవచ్చునది.
తెలుగులో మంచి కథలు లేవూ రావూ అంటాం, వస్తే మనం గుర్తు పట్టగలమా? మనకు అసలు కథ చదవడం వచ్చా? రచయిత-రచన-పాఠకుడు అని ఆగిపోతున్నాం కాని సాహిత్యంలో అటుపైన వచ్చే అతిముఖ్యమైన సాహిత్యచర్చను మనం మర్చిపోయాం. పాఠకుడు పెట్టుకున్న అద్దాలను బట్టి, రచన ఎన్నో రంగుల్లో తారసపడవచ్చు. అది సహజం. అయితే, ఈ రంగులను దాటుకుని రచనకు స్వతంత్రమైన అస్తిత్వమంటూ ఒకటి ఉంటుంది. కథ నిజంగా ఏం చెబుతున్నదన్నది పాఠకులు చూడగల్గుతున్నారా, విస్మరిస్తున్నారా, లేక తమకు నచ్చింది తామే తీసుకుని తిరగరాసుకుంటున్నారా తెలుసుకునేందుకు అక్కరకొచ్చేది సాహిత్యచర్చ ఒక్కటే. సోషల్ మీడియాలో సాహిత్య ప్రేమికులు వేలాదిగా ఉన్న గ్రూపులున్నాయి కాని వాటిల్లో ఎవరూ సాహిత్యం గురించి విశ్లేషించరు, తమ అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడిస్తూ చర్చలు చేయరు. ఇది పాఠకులే కాదు, రచయితలూ చేయరు. పుస్తక ప్రచురణ కూడా ఏటా నడిచే పబ్బంలా మారడంతో, పరస్పర పొగడ్తల భాగోతానికి ఏ విఘాతమూ కలగకుండా, ఇప్పుడు రచయితలూ జాగ్రత్తపడుతున్నారు. కనీసం వాళ్ళైనా సాటి రచయితల కథలు, కవితల గురించి ఎందుకు విశ్లేషించరు? ఏది బాగుందో, ఏది బాలేదో ఎందుకు మాట్లాడుకోరు? రచయితలూ ఈ దిశగా అడుగులు వేయడం లేదంటే వాళ్ళూ సామాన్య పాఠకుల్లాగానే కథలో తమకు నచ్చిందీ నచ్చనిదీ చూసుకుంటారే తప్ప, తమ ఇష్టాయిష్టాలకు ఆవలగా కథ ఏం చెప్తోందో చూడటం లేదు అనే అర్థం. ఒక రచనను అనుభవించేది వైయక్తికంగానే, మౌనంగానే కావచ్చు. కాని, రచన ఒక వస్తువు. దానికొక నిర్మాణపద్ధతి ఉంటుంది. అది మనముందు పరచుకున్న తీరొకటి ఉంటుంది. ప్రతీ వాక్యమూ, ప్రతీ సంఘటన, ప్రతీ వర్ణన రచనానిర్మాణంలో భాగం. ఆ నిర్మాణపద్ధతి, తీరు, నడత వల్లనే రచన అంతిమంగా బాగుండేదీ బాగుండనిదీ, ఆ రచన ఒకరికి నచ్చినా నచ్చకున్నా. తమ రచనను ఎలా ఆవిష్కరిస్తున్నాం అన్నది రచయితలు చేయవలసిన, చేసుకోవలసిన చర్చ. శాస్త్రీయ పరిశోధనలలో ఉన్నవారు ఒకరినుంచి ఒకరు నేర్చుకున్నట్టు, తమ పద్ధతుల బాగోగులు చర్చించుకున్నట్టు, రచయితలూ రచనల లక్షణాలు చర్చలు చేస్తూ, పదిమందిలో మాట్లాడుకుంటూ ఉంటే, సాటి రచయితల్లో కొందరైనా తమ రచనల గురించిన అపోహలు తొలగించుకునే వీలుంటుంది; పాఠకులకు అవగాహన పెరిగే అవకాశముంటుంది; తెలుగులో మంచి రచనలు మరికొన్ని రావచ్చనే భ్రమ కొంతయినా నిజమయే అవకాశముంటుంది.
చిత్రానికి బలం ఆంబోతు, పీడిత గుర్రం, దిష్టిబొమ్మల్లా మనుషులు–ఇవన్నీ క్రూరమైన వక్రీకరణల నుండి ఉద్భవించాయి. ఈ రూపాల్లో పికాసో ప్రజా అరాచకాలకీ , దురాక్రమణకీ ఆత్మాశ్రయసమానత చూపించాడు. గ్వెర్నికా అత్యంత విషాదార్థాలకి, సామూహిక అవివేకతకి ప్రత్యేక ప్రతీక. మరో రకంగా చెప్పాలంటే, ఇది దాదాపు ఒక సైకాటిక్ డ్రాయింగ్.