క్రితం సంచికలోని గడినుడి-42కి మొదటి ఇరవై రోజుల్లో పదమూడుమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-42 సమాధానాలు.
క్రితం సంచికలోని గడినుడి-42కి మొదటి ఇరవై రోజుల్లో పదమూడుమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-42 సమాధానాలు.
నీది బయటి మెరుపు
నాది లోపలి వెలుగు.
నువ్వొక పులకరింతని పూసి రాలిపోతావు
నేను గాయంతో రగిలి మాని మరకనై ఉండిపోతా.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
“Each of us needs something of an island in his life—if not an actual island, at least some place, or space in time, in which to be himself, free to cultivate his differences from others” – John C. Keats.
ప్రతి మనిషికీ జీవితంలో తానొక్కడూ మనగల్గిన ద్వీపపు అవసరం ఉంది, నిజంగా ద్వీపం కాకపోయినా కనీసం తనకు తానుగా ఉండగల్గిన ఒక ప్రాంతము, సమయమూ కావాలి. 1820లో టైఫస్ విజృంభణతో ఇటలీలోని నేపుల్స్ హార్బర్లో ఒక ఓడలో చిక్కుపడి బందీ అయేనాటికి క్షయ వ్యాధితో బాధపడుతున్న తన జీవితంలో మిగిలున్నది నాలుగు నెలలేనని ఇంగ్లీష్ కవి జాన్ కీట్స్కి తెలుసు. అప్పటికతని వయసు పాతికేళ్ళు. ఆ స్థితిలో కూడా అతను కొత్త కవిత్వం చదివాడు, రాశాడు. గతంలోకి తొంగిచూసుకుని అనుభవాలన్నింటినీ ఓ క్రమపద్ధతిలో రాతగా పదిలపర్చుకున్నాడు. ఆ ఏకాంతంలో తన అన్నేళ్ళ జీవితానికీ అతనొక కొత్తచూపు ఇచ్చుకున్నాడు. మానవ చరిత్రలో ఇటువంటి విపత్తులు రావడం, ప్రపంచాన్ని కబళించడం కొత్తకాదు; మానవాళి దానిని దాటుకొని తిరిగి తననూ సమాజాన్నీ పునర్నిర్మించుకోవటమూ కొత్త కాదు. అప్పటి టైఫస్ అయినా ఇప్పటి కొరోనా అయినా ఇదే సత్యం. కానీ మనమే ఒక చిత్రమైన స్థితిలో కాలం గడుపుతున్నాం. ఇళ్ళలో నిజంగా బందీ అయినవారు కొందరే అయినా, బందీ అయ్యాం అన్న భ్రమను మోస్తున్నవారు మాత్రం లెక్కకందనంతమంది. సోషల్ మీడియా మనిషిలోని సంఘజీవిని ఏనాడో మరుగుపరిచింది. అది కట్టిన కోటగోడలతో అతడేనాడో ఒంటరివాడయ్యాడు. ఇప్పుడు వినపడుతున్న ఒంటరి కేకల్లోనూ మనిషికి మనిషి ఎడమవుతున్నాడన్న బాధ కనిపించదు, నిజంగా సాటిమనిషికి సహాయం చేయలేకపోతున్న వ్యథ కనిపించదు. ఒక మిథ్యాప్రపంచంలో బ్రతుకుతూ బైట ప్రపంచాన్ని ఊహిస్తూ, నిందిస్తూ లేదా దానికి భయపడుతూ సాగిస్తున్న వ్యాఖ్యానాలే అన్ని దిక్కుల్లోనూ కనపడుతున్నాయి తప్ప సంవేదనతో ప్రతిధ్వనించే గొంతులెక్కడ? ఏ సమాచార సంబంధాలూ తెగిపోనివాళ్ళు, సరుకులు నెలలకు సరిపడా కొనిపెట్టుకున్నవాళ్ళు, ఉద్యోగానికి, జీవితానికి సంబంధించి ఏ అభద్రతా లేనివాళ్ళూ కూడా ఈ బూటకపు అరుపులకు గొంతు కలపడం మందిమనస్తత్వమే తప్ప మరొకటి కాదు. హామ్స్టర్ వీల్ లాంటి జీవితానికి అంకితమైపోయి, నిదానించి తన గురించి తన సమాజం గురించి స్పష్టత తెచ్చుకోవడానికి అవసరమైన కనీస సమయాన్ని పూర్తిగా సోషల్ మీడియాకే ధారాదత్తం చేసిన మనిషి ఈ రోజు కొత్తగా ఈ ఒంటరి గీతాన్ని పాడటంలో అర్థం లేదు. మనందరం కీట్స్లా మన జీవితానికో కొత్తచూపు ఇచ్చుకోలేకపోవచ్చు కానీ అనుకోకుండా దొరికిన ఈ ద్వీపంలో మన గురించి మనం కనీసపాటి స్పష్టత తెచ్చుకోగలిగితే జీవితంలోనైనా ప్రపంచంలోనైనా రాబోయే విపత్తులకు సిద్ధపడే శక్తిని సంపాదించుకుంటాం. అందుకే, బయటకు వెళ్ళే స్థితి లేకపోతే లోపలికి ప్రయాణం చెయ్యండన్న నానుడి ఈరోజు మరింతగా అవసరం.
అతనొచ్చేలోగా స్నానం చేద్దామనుకుని ఒంటిపై కుర్తీ తీసేయబోతూ ఆగిపోయింది. ఎవరో తననే చూస్తూన్న భావన, దానితో కలిగే ఇబ్బంది, అసౌకర్యమూ. రోడ్డు మీద నడుస్తున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఆఫీసులోనూ అలవాటయినదే. కానీ ఇది ఇల్లు. ఎవరి జోలీ లేకుండా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండడానికి అలవాటుపడిన భద్ర ప్రదేశం. ఎందుకలా అనిపించిందో, అనిపిస్తూ ఉందో తేల్చుకోలేకపోయింది.
ఈ పుస్తక రచయితలు కథన శైలిని అనుసరించడం వల్ల, బౌద్ధ సాహిత్యం ఆధారంగా లభించిన బుద్ధుడి సంభాషణలను యథాతథంగా పేర్కొనే ప్రయత్నం చెయ్యడం వల్ల ఈ రచనను ఒకటికి రెండుసార్లు చదవాలనిపిస్తుంది. తమ కథన క్రమంలో పాఠకుల జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించే అనేక సంఘటనలను వారు విస్మరించలేదు.
అవ్యక్తాద్యత ఏతద్వ్యక్తం జాతమశేషమ్
యద్ధత్తే తదజస్రం యత్రాంతేలయమేతి
It is That
the formless
the inexpressible
the primordial vibration
the true form of Guru
చిన్నప్పటినుంచీ ఎంతో కలిగిన కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగి, అమెరికాలో చదువుకోవాలన్న కోరిక తీర్చుకుని, తనకిష్టమైన అబ్బాయిని పెళ్ళి చేసుకుని, జీవితమంతా వడ్డించిన విస్తరిలా బతుకుతున్న రాధ ఇలాంటి వాళ్ళ గురించి అంత సానుభూతి ఎలా చూపగలిగింది? ఆ అమ్మాయిలో ఆ సంస్కారం ఎలా వచ్చింది? తప్పు చేసిన మనుషుల్లో కూడా మంచి ఉంటుందని ఎంత ధీమా తనకు! ఎలా నమ్ముతోంది వీళ్ళని!
సాయంత్రపు ఎండ తలుపుకున్న కిటికీగుండా లోపలికి వచ్చి నా వేలికున్న తొడుగు మీద పడుతున్నది. ఆ ఎండ దానిమీద ప్రతిఫలించి ట్రెయిన్ సీలింగ్ మీద ఓ తెల్లని సీతాకోకచిలుకకు మల్లే కదులుతున్నది. ఈ తొడుగు దేంతో తయారయిందో నాకు తెలియదు గానీ, ఇరవయ్యేడేళ్ళు భూమిలో కప్పడి ఉన్నాకూడా ఇంతబాగా మెరుస్తున్నది. ఇందులో బంగారమో వెండో ఉందేమో.
ఎక్కడో ఆకురాలిన చప్పుడు వినిపిస్తుంది
ఇంకెక్కడో రెక్కలు ముడిచిన పావురం మాటలు వినిపిస్తాయి
మహానగరపు ఖాళీలేనితనం
గోల చేస్తూనే వుంటుంది
గదిలో మాత్రం
నిశ్శబ్దపు పోట్లు.
ఇప్పుడు నేను మహోన్నతమైన పద్యంగా మారిపోయి
ఉద్వేగాలను పద్యాల విత్తులుగా మార్చి నాటాలి.
మార్పు జరగడానికి ఎవరికైనా ఏం కావాలి?
మనిషి పద్యంగా మారితే చాలదా!
కానీ నీ నాటకం మధ్యనో చివరనో
ఏదో ఒక ఉన్మత్త సన్నివేశంలో
ఆ అద్దం చేసే రొద
ఏదోరకంగా వింటూనే వుంటావు
అదీ నిజమేనని ఒప్పుకోలుగా లోలోపలైనా
తప్పక గొణుక్కుంటూనే వుంటావు
ఇట్లు వంగరాష్ట్రములోను మనరాష్ట్రములోను కూడా ముందుగా విద్యాభివృద్ధి కొరకు ప్రారంభమయిన ప్రచారము ఆందోళనము తరువాత స్వధర్మ రక్షణముకొరకును అటుతరువాత పరిపాలనములో గల అన్యాయములను బాపుటకొరకును అటుపిమ్మట రాజ్యాంగ సంస్కరణముల కొరకును చేయబడిన రాజకీయోద్యమముగా పరిణమించెను.
తన తండ్రి యూరెనస్ శాపం ఏ విధంగా పరిణమిస్తుందో అనే భయంతో క్రోనస్ తన సంతానాన్ని మింగేసి తన కడుపులో బంధిస్తాడు. కానీ రేయా పన్నుగడ పన్ని జూస్ స్థానంలో ఒక రాయికి దుప్పటి గుడ్డ చుట్టబెట్టి క్రోనస్కి ఇస్తుంది. ఆ రాయిని క్రోనస్ మింగేస్తాడు. ఈ విధంగా క్రోనస్ కడుపులోకి జూస్ వెళ్ళకుండా రక్షణ పొందుతాడు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ఈ సంపుటిలోని కథలన్నీ ఆధునిక జీవితపు సంక్లిష్టతనూ, ఈ కాలపు స్వేచ్ఛతో ముడిపడి ఉన్న సందిగ్ధావస్థనూ చిరపరిచితమనిపించే కథాంశాలతోనూ, సన్నివేశాలతోనూ నేర్పుగా అల్లుకున్నవి. సమతుల్యం లేని ఆలోచనల పునాదుల మీద నిర్మించుకున్న జీవనసౌధం కుదురుగా నిలబడదని చెప్పే ఈ కాలపు కథల అవసరం ఇప్పుడు మరీ కనపడుతోంది.
ప్రస్తుతం నా ఆడియో టేపులు, డిస్కులు నాకు అందుబాటులో లేవు. అందువల్ల ఈ నెలలో కూడా మరికొన్ని లలిత గీతాలే అందిస్తున్నాను. ఇవన్నీ విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారమవుతున్నప్పుడు వేర్వేరు సమయాల్లో రికార్డు చేసుకున్నవి.
అడ్డం ఇది వారి పని. కానీ, అచ్చును కోల్పోయి అతలాకుతలమైంది కనుక, వాద్యపరికర రూపమెత్తింది (5) సమాధానం: పరివాదిని చేపలు పట్టే ఉపకరణాన్ని లోపల […]
క్రితం సంచికలోని గడినుడి-41కి మొదటి ఇరవై రోజుల్లో పంతొమ్మిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-41 సమాధానాలు.
సాహిత్యం అంటే ఇలానే ఉండాలి, ఇవి మాత్రమే చెప్పాలి, ఇలా మాత్రమే చెప్పాలి అన్నది కనపడని కంచె. సమాజపు కట్టుబాట్లను లెక్కచేయకుండా తమదైన అభిప్రాయాలని ధైర్యంగా వెల్లడించిన రచయితలు ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా ఎంతోమంది లేరు. అంతమాత్రాన అలా చెప్పిన వారు సమాజ వ్యతిరేకులో దేశద్రోహులో కారు. భిన్న ప్రవర్తనలను, విశ్వాసాలనూ నిరసించి హేళన చెయ్యడం, మన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకునేవారి పట్ల ద్వేషం కక్కడం, చివరకు హింసకు కూడా తెగించడం, మనముందున్న నేటి నాగరికత. సామూహిక ధోరణులకు, అభిప్రాయాలకు, నమ్మకాలకూ వంతపలికే సాహిత్యాన్ని కళలనూ మాత్రమే ఆదరించడం ఈ సంకుచిత ధోరణిలోని భాగమే. ఏ భిన్నస్వరం వెలువడ్డా దౌర్జన్యంతో నొక్కివేయడం ఈ ఆధిపత్యధోరణికి మరోకోణమే. అందుకే గొంతు పెగుల్చుకోలేనివారి స్వరమై బిగ్గరగా, బలంగా, మనముందుకొచ్చిన సాహిత్యం ఈనాటికీ బహుతక్కువ. ఆ సాహిత్యానికి దక్కిన ఆదరణ, గౌరవం ఇంకా తక్కువ. సమూహాల్లో కలవలేక అవస్థపడుతున్న మనుష్యుల లోలోపలి సంక్షోభాలను, సంకోచాలనూ నిజాయితీగా నిబ్బరంగా చెప్పుకోనిస్తున్నామా? ఆ జీవితాలు చెప్పే సత్యాలను అంగీకరిస్తున్నామా? ఏ చట్రంలోనూ బిగియకుండా, ఏ నిరసనలకూ వెరవకుండా, జీవితాన్ని దాని అన్ని ఎత్తుపల్లాలతో, చీకటివెలుగులతో పాఠకుల ముందుకు తెచ్చే కథలను భూతద్దం పెట్టి వెదుక్కోవాల్సిన పరిస్థితి నుండి మన సాహిత్యచరిత్రేం పెద్దగా ఎదగలేదు. ఇప్పుడే కాదు, అట్లాంటి జీవితాలను, భిన్నస్వరాలను మన సాహిత్యంలోకి, కళల్లోకి, సమాజంలోకీ సాదరంగా ఆహ్వానించుకోలేనంతకాలం ఆ ఎదుగుదల అసాధ్యం. ఇటువంటి పరిస్థితుల్లో టెలింగ్ ది ట్రూత్ అబౌట్ మి అన్న ఎ. రేవతి ఆత్మకథను, రచయిత్రి పి. సత్యవతి ఒక హిజ్రా ఆత్మకథగా చేసిన తెలుగు అనువాదానికి ఈ ఏటి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించడం ఆశావహమైన విషయం. సమాజం చూపే అనాగరిక వివక్షను, భాషభాషల్లోనూ వినిపించాలనుకున్న ధైర్యానికి దక్కిన గౌరవమిది. సమాజంలోని పెనుచీకటిని వేలెత్తిచూపి, జీవించే హక్కు కోసం నిర్భయంగా చేసిన ఒక మనిషి పోరాటం గుర్తించదగినది, స్వాగతించదగినది, గౌరవించి గెలిపించదగినది. సమాజం భిన్నత్వానికి పర్యాయపదం. అందుకే, ఈ తరహా సాహిత్యాన్ని సమాజం స్వీకరించే తీరును బట్టి ఇక ముందయినా అది భిన్నత్వంలో ఏకత్వం చూసి పురోగమిస్తుందా లేక తనను తాను చీల్చుకొని అధోపతనం అవుతుందా అన్నది చూచాయగానైనా తెలుస్తుంది.