సంగీతం, గానం: పాలగుమ్మి విశ్వనాధం సేకరణ: పరుచూరి శ్రీనివాస్ సంగీతం: పాలగుమ్మి విశ్వనాధం గానం: నూకల చిన సత్యనారాయణ సేకరణ: పరుచూరి శ్రీనివాస్ సంగీతం: […]
శీర్షికలు సంచికలు
గానం: ఓలేటి వెంకటేశ్వర్లు సేకరణ: పరుచూరి శ్రీనివాస్ గానం: ఎన్. సిహెచ్. వి. జగన్నాథాచార్యులు సేకరణ: పరుచూరి శ్రీనివాస్ గానం: ఆర్. ఛాయాదేవి సేకరణ: […]
వేణుకుంజం నాటకం లోని పాటలు – తెలుసా నా గుట్టు రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం: పాలగుమ్మి విశ్వనాధం గాత్రం: వింజమూరి లక్ష్మి వేణుకుంజం […]
సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం
గాత్రం: పి. బి. శ్రీనివాస్
సేకరణ: పరుచూరి శ్రీనివాస్
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.
ఛాయ సాహిత్యోత్సవం — 2025. కొత్త కార్యాచరణను ముందడుగు వేయించే ఉత్సాహం ఇది. కొత్త గొంతుకలకు నెలవయ్యే వేదిక ఇది. రానున్న ఎన్నో ప్రయోగాలకిది ప్రారంభపదం.
తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న కథలు ప్రతి సమాజంలోనూ ఉంటాయి. వారి సమాజంలోని ఆచార వ్యవహారాలను, వారు నమ్మే విలువలను కథలుగా చెప్పుకొనే పురాగాథలే వారి […]
పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది.
ద్రౌపది కుమారులు ఐదుగురినీ కోల్పోయిందన్న వార్త నా చెవినపడ్డప్పుడు కూడా అదే జరిగింది. వెంటనే నా మనసు శాంతించింది. ఆమె వెక్కి వెక్కి ఏడవాలి. ఆమె కడుపు మండిపోవాలి. ఆర్యావర్తంలో ముంచుకొచ్చిన ఈ పెనువిపత్తుకు బీజం వేసింది ఆమె అహంకారం కాదా? ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె ధగధగలాడే వజ్రాల కిరీటం ధరించి పట్టమహిషిగా సింహాసనం మీద నవ్వుతూ ఎలా కూర్చుంటుంది?
ఇది మహాభారతాన్ని మరోసారి తమ మాటల్లో, ఆధునిక వచన రూపంలో, చెప్పడం కాదు. మహాభారతంలోని ఎన్నో సమస్యలకు హేతుబద్ధంగా సమాధానాలను వెదికి, సృజనాత్మకంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ప్రయత్నం ఇది. మహాభారతంలోని పౌరాణిక కల్పన (మిథ్)ను వాస్తవాన్ని విడదీసి, ఆనాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందు పునర్నిర్మించిన విద్వత్ ప్రయత్నం ఇది.
ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా తేవాలంటే. “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు. మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది. ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర ఆహార అభద్రతకు ప్రతీక. జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం, జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో ఆనందం ఉంది. రవీంద్రభారతిరంగస్థలంపై దొరకని ఆనందం.
భైరప్పగారి వ్యక్తిగత అభిప్రాయాలను తీవ్రంగా విమర్శించేవారు కూడా ఆయన సృజన శక్తిని, విషయాలను లోతుగా పరిశీలించే ప్రామాణికతను, పాత్రలను విశ్లేషణాత్మకంగా చూచే విధానాన్ని కాదనలేరు. చెప్పదలచుకున్న దాన్ని ప్రామాణికంగా చెప్పే గుణం ఆయనది.
భిత్తి ఆత్మ చరిత్ర కష్టాలలో కడతేరిన వ్యక్తి సంకల్ప సిద్ధిని నిరూపిస్తుంది. “ఒక రచయితకు కలిగిన కష్టాలు ఆయనను ఒక మహోన్నత రచయితగా రూపొందించడంలో ఎంతగానో సహకరించాయి” అన్న విషయాన్ని నిరూపిస్తుంది. భిత్తి ఆత్మ కథనంగా మాత్రమే కాక అపురూపమైన కథనంతో కూడిన నవలగా అనిపిస్తుంది.
మహాభారతం అంటే దాయాదుల యుద్ధం, రాజ్యాధికారం కోసం జరిగిన యుద్ధం అనుకొంటారు. కాని, హేతుబద్ధమైన ఆలోచనలతో ఈ నవల రాసి, కొన్ని ఊహించని సత్యాల్ని వెలికి తీశారు. ఆయన వెలికి తీసిన ఎన్నో సత్యాల్లో… ప్రధానమైన ‘స్త్రీల మానసిక క్షోభ. ఆనాడు స్త్రీలు మౌనంగా ఎంతటి దుఃఖాన్ని దిగమింగుకున్నారు.
చెరువుతోనే సరిపెట్టకుండా అందరం దగ్గర్లో ఉన్న ఛోంగ్కోర్ వ్యూపాయింట్ దాకా ఎక్కాం… కానీ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ఆ వ్యూ పాయింట్ నుంచి దూరాన గంగపూర్ణ శిఖరం, అన్నపూర్ణ 2, 3, 4 శిఖరాలు, తిలిచో శిఖరం – అన్నీ ఒకేసారి కొలువుదీరి మనసుకు పరవశం కలిగించాయి… చక్కని తేనీరు సేవిస్తూ చుట్టూ పరచుకుని ఉన్న శిఖరాలతో కబుర్లాడటం – అనూహ్యమైన అనుభవమది.
అప్పటివరకు వినోదకరమైన ప్రయోగాలకీ, భయంకరమైన పిడుగులకీ, విద్యుత్తుతో ఏదో సంబంధం ఉందనుకున్నారు కాని, ప్రకృతిని అర్థం చేసుకోవడంలో గురుత్వాకర్షణ శక్తి లాగా విద్యుత్తు కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని డేవీ నిరూపించాడు.
ఒక్కక్షణం అతను దారిద్ర్య సంపదలూ, జాతిమత వయోభేదాలూ, సంఘపు అంతస్తుల మెట్టపల్లాలూ, ఆస్థిమాంసాల శరీరపు దౌర్బల్యాలూ, వ్యక్తి చైతన్యపు, అహంకారపు సరిహద్దులూ, అన్నీ అధిగమించి ఆ కుర్రవాడితో, ఒక మానవ జీవిమాత్రుడై, సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఆ కుర్రవాడికీ తనకూ ఏమీ విభేదం లేదనీ, అతన్నించి తనను ఎవ్వరూ వేరుచెయ్యలేరనీ అనుకొన్నాడు.
దునియాలో మోసం చెయ్యందెవరు? తోబుట్టువులైనా మొగుడూ పెళ్ళాలైనా, కిళ్ళీకొట్టోడైనా, మందుల షాపోడైనా, బడే బడే నేతాలోగ్ అయినా… చివరికి ఆ అడుక్కునే కొజ్జావోడైనా – మోసం చెయ్యనోడు లేనేలేడంటా!
Read more వరకూ అలా అలా చదివేసి thumbs up emoji కొట్టి, రచయిత ఎవరో కూడా చూడకుండా తన కాంటాక్ట్స్లో కొందరికి, గ్రూపులు కొన్నిటికి forward చేశాడు ప్రసిద్ధ్… నిమిషాల మీద ఆ కథ ప్రపంచమంతా చుట్టేసింది. ఇంకా ఎక్కడో తిరుగుతూనే ఉంది. ఎవరి దృష్టీ తగలకుండా. నకులుని గుఱ్ఱం.