చిరాకు తగ్గని గణపతమ్మ ముఖాన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిలబడ్డవాడు ఏమనుకున్నాడో, హఠాత్తుగా పరిగెత్తుకెళ్ళి గణపతమ్మ లావుపాటి శరీరాన్ని గట్టిగా హత్తుకున్నాడు. బియ్యం నానబెట్టిన గిన్నెని కోపంగా వంటగట్టు మీద పెట్టి, పెంటను తొక్కిన దానిలా ఛీ! అని పక్కకు జరిగి నిలబడింది గణపతమ్మ.

నాకన్నా అయిదున్నర సంవత్సరాలు పెద్ద అయిన నా పెద్దన్నకు అప్పటికే, అంటే 1962 ప్రాంతాలకు, తెలుగులో పద్యవిద్య పట్టుబడింది. ఆంధ్రదేశంలో నారాయణాచార్యుల వంటి మహాత్ములకు బాగా దగ్గరగా ఉన్నవారిని కాస్త మినహాయిస్తే, ఈమాత్రం ఆమాత్రం తెలుగు పద్యవిద్యలో ప్రవేశం ఉన్నవాళ్ళకి సన్నిధిలోనో, ఏకలవ్యంగానో విశ్వనాథే గురువు. ఇంత అయినా కాలేజీకి రాగానే శ్రీశ్రీ చక్రారాధన అలవడింది.

మాకు ఆకలిగా ఉంది, తను ఏమేమి తెచ్చి ఉంటాడా అని అత్రుతగా చూస్తున్నాం, పెట్టినదాన్ని పెట్టినట్లు గుటుక్కుమనిపించాలని తొందర కూడా పడుతున్నాం. వాసు ఆ భోజనపు పొట్లాన్ని జాగ్రత్తగా విప్పాడు. అందులో ఉన్నది చూసి నేనూ నా మిత్రుడు నిర్ఘాంతపోయాం, నివ్వెరపోయాం, ఖంగుతిన్నాం, నిశ్చేష్టులమయ్యాం!

పదునైన దృశ్యాలు
పాముల్లా పడగవిప్పి
బుసకొడుతున్న గగుర్పాటు
వికృత శబ్దాలకు
గుండెనదిలో పెరుగుతున్న
భయపు నీటిమట్టం

కాళ్ళు భూమిలో పాతేసినట్టు కదలడానికి మొరాయించాయి. చిమన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు చెప్పింది కరెక్టే. ఇక్కడ నుంచి లేచి వెళ్ళాలి నేను. ఆమె ఏ క్షణంలో ఏం చేస్తుందో? బాగ్ లోంచి కత్తి తీసి పొడిస్తే మాత్రం ఎవరు చూడొచ్చారు? అసలు ఆమె ఒక చేత్తో తోస్తే చాలు నేను కుప్పకూలిపోతాను. అంత బలంగా ఉన్నాయి ఆమె చేతులు. కొంపదీసి కరుడుగట్టిన నేరస్తుడెవరైనా ఆ బుర్ఖాలో లేడు కదా? వెన్నులో చలి పుట్టింది.

దామెర్ల రామారావు జీవితకాలంలోనే ఇంతటి ప్రశంసలను అందుకున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో రామారావును ఎరిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరకొర జ్ఞాపకాలే మిగిలాయి. ఆంధ్రదేశ వీరగణంలో అస్పష్టమూర్తిగానే రామారావు నిలిచారు. జాతీయ ఆధునిక చిత్రకళ గ్యాలరీలో దామెర్ల చిత్రాలు మచ్చుకు ఒక్కటైనా కనిపించవు.

మధ్యాహ్నం, అతడికి తను వండిన ఇండియన్ డిష్, రొట్టె మడుపులో, స్వయంగా నోటి కందిస్తే, గోధుమ కనుపాపల, ఆశ్చర్యపు అరక్షణపు నిస్టాగ్మస్. ఆ పై ప్రతి బైట్‍కూ, సంభోగ పరాకాష్ఠాసమయపు కూజితాలు వెలువడ్డాయ్ అతని గొంతులోంచి. ‘ఎవ్రి‌ధింగ్ సీమ్డ్ ఎక్జాట్‍లీ రైట్, ఒళ్ళంతా కోన్యాక్‍లా వెచ్చగా జ్వలించింది.’ అన్నాడు. భోజనానంతర పునర్భవ కామ వాంఛలు, భోగినీ దండకాలకే ఉచితాలు.

‘ఈ గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఇరవై ఎనిమిదేళ్ళ చిన్న వయసులోనే కాలం చెందారు గానీ, ఆయన కనక పూర్ణాయుష్కులు అయి ఉంటే…’ అని కొందరు పెద్దమనుషులు సభా సంప్రదాయాలననుసరించి ఊపిరి పొడుగ్గా వదులుతారు గానీ పూర్ణాయుష్కులు అయి ఉంటే మాత్రం ఏమవుతుంది?

నేను వంద మాటలు మాట్లాడితే
నువ్వు ఒక్క నవ్వు నవ్వుతావు.
నేను మౌనంగా ఉంటే
కలవరంతో
ఎలా ఉన్నావు, జాగ్రత్త అంటావు.
ఇక, ఆ మాటతో
నేను నదినై గలగలమంటానా

సమర్థుడు, ఉత్తముడు, సాధు ప్రవర్తనుడైన కుణాలుడి విషయంలో తన మోహాన్ని, ప్రేమను అదుపు చేసుకోలేకపోయింది తిష్యరక్షిత. ఉద్యానవనంలో ధ్యానంలో ఉన్న అతనిని కౌగిలించుకొని తన కోరికను వెల్లడించింది. కుణాలుడు ఆమెను సున్నితంగానే తిరస్కరించాడు. తల్లిలాంటి దానివి అని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. తండ్రికి కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు.

మాటా మాటా పేర్చుకుని
ఒక వంతెన కట్టుకోవడం కష్టం కానీ
ఏదో అనుమానమో
అసంతృప్తో
గాలి బుడగలా పగిలిపోవడం
ఏమంత కష్టం కాదు

నవల చదివేవారికి చిత్రకళ, చరిత్ర, రంగుల లోతుపాతులు తెలియకపోతే ఏమీ అర్థం కాదన్న సంశయం, కళాకారుడి కళామయ జీవితం దేనికన్న సంశయం కంటే, ఒక ఆర్టిస్టుకి కళ పట్ల, జీవితం పట్ల గల అగాధపు లాలస గుండె నిండిపోయేలా కనిపిస్తుంది. అతడి జీవన వైరుధ్యాన్ని ప్రతి సెంటీమీటరు తాకి, స్పందించగల నిర్మాణం ఈ నవలలో ఉంది.

ఇందులో ఉన్నది క్రమాలంకారం. వరుస క్రమంలో ఒకదానిపై మరొకటివైరంతో ఉన్నట్లుగా వర్ణన. అంటే, తుమ్మెదలు సంపంగి పూలపై వాలవు, కానీ సీత అలకలు అంటే ముంగురుల కిందనే సంపంగి వంటి ముక్కు ఉంది. అందువల్ల తుమ్మెదల పై సంపెంగలదాడి వలె ఉంది. అట్లాగే తామర పూలకు చంద్రునికి వైరం. కానీ ఇక్కడ ఆమె చేతులు పద్మాల వలె ఉంటే వాటితో ముఖమనే చంద్రుణ్ణి మన్మథుడు వైరిగా ఏర్పరచాడు.

క్రితం సంచికలోని గడినుడి-65కి మొదటి ఇరవై రోజుల్లో పద్నాలుగు మంది నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-65 సమాధానాలు.

అడ్డం బసవనిప్రభువు సమాధానం: వృషపతి వేడిమీసం మీదనగా బాధే సమాధానం: సంవేదన శివునికొప్పులో తియ్యనితులసి సమాధానం: రుద్రజడ నారదుని రహదారి సమాధానం: వినువీధి సగటున […]

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం! కథలు చేరవలసిన ఆఖరుతేదీ: మే 10, 2022.

రచనలు ఎందుకు పత్రికలకు పంపాలి? ఎప్పుడు అచ్చేస్తారో, ఎందుకు వేస్తారో, వేస్తారో వెయ్యరో కూడా చెప్పని పత్రికల దగ్గర పడిగాపులు పడే కన్నా, అనుకున్నదే తడవు ప్రచురించుకొనే వెసులుబాటిచ్చే సొంత వేదికలు, క్షణాల్లో స్పందనని కళ్ళ ముందుంచే సోషల్ మీడియా ఖాతాలే మెరుగని రాసే గుణమున్న అందరికీ అనిపించడంలో చిత్రమేమీ లేదు. అయితే, సాహిత్యవ్యాసంగం మిగతా కళలలాగా ఎవరి స్థాయి వారికి ప్రత్యక్షంగా తెలియనీయదు. ఇది నా అనుభవం, నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను అన్న ధోరణి సాహిత్యవ్యాసంగపు ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. చిత్రిక పట్టడం వల్ల తొలిప్రతిలోని నిజాయితీ పోతుందన్నదీ శుద్ధ అబద్ధమే. చాలామంది రచయితలకు తమ రాతలలో ఏం లోపించిందో తెలియదు. ఎవరో కొందరు మినహాయింపుగా ఉన్నప్పుడు, వారినే ఆదర్శంగా తీసుకోవడం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటిది. ఆలోచనల్లోని స్పష్టత అక్షరాల్లోకి రావడం లేదని గమనించుకునే తెలివి అందరికీ ఉండదు. రాద్దామనుకున్న దానికి, రాసిన దానికీ ఉన్న భేదాలు తరచి చూసుకునే ఓర్పూ కొద్దిమంది ఆస్తే. కానీ అది వాళ్ళ సాహిత్య సృజనకేమీ అడ్డు కాదు. ప్రచురణకు అసలే అడ్డు కాదు. అయినప్పటికీ, రాద్దామనుకున్నదేదో రాశారో లేదో, రాసినది ఎంతవరకూ దానికది సంపూర్ణంగా స్వతంత్రంగా నిలబడగలుగుతుందో లేదో, మూడో మనిషి చేతుల్లోకి చివరిప్రతి వెళితేనే రచయితకు తెలుస్తుంది. ఒక బ్లాగుకో, సోషల్ మీడియా అకౌంట్‌కో మన రచనను అప్పగించే కన్నా, పత్రికకు పంపిస్తే అన్నిటికంటే ముందు, అది రచయిత, రచయిత తరఫువాళ్ళు, లేదా రచయిత ఆమోదించిన, రచయిత ఆజ్ఞలకు షరతులకు లోబడి మాట్లాడనున్న ఒకానొక ఆంతరంగిక వృత్తాన్ని దాటుకుని, రచనను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టకుండా చూడగల మరొక వృత్తంలోకి వెళుతుంది. అది, ఒక రచనను సర్వస్వతంత్రంగా నిలబెట్టి, దాని విలువను కేవలం సాహిత్య విలువ, ప్రతిభ ఆధారంగా బేరీజు వేస్తుంది. పత్రిక స్థాయి, ప్రమాణాలు మంచివైతే, రచయితకు ఒక చక్కని పరామర్శ/విమర్శ దొరుకుతాయి. పరిష్కర్తలయిన సంపాదకులతో చర్చలు సాహిత్య దృక్పథాన్ని విశాలం చేస్తాయి, అభిధనూ ధ్వనినీ మరింత బలంగా రచనలో వాడుకోవడం నేర్పుతాయి. ఇలా రచనను ఒక కొత్త చూపుతో గమనించుకునే వీలు కలుగుతుంది. ఎడంగా నిలబడి తప్పొప్పులను చర్చించే సావకాశం దొరుకుతుంది. రచన తిరస్కరించబడినప్పుడు, దానికి కారణాలు అర్థమయ్యే కొద్దీ రచనను శ్రద్ధగా గమనించడం అలవాటవుతుంది. ఇవన్నీ రచనను ఉద్వేగభరితంగా మాత్రమే కాక, తార్కికంగా కూడా బలపరుచుకునే వీలిస్తాయి. ఆలోచనల్లో స్పష్టత తెచ్చుకోవడం, అనవసరమైన పదాల, వాక్యాల ఏరివేత అలవాటుగా మారడమన్నది ఒక పరిష్కర్త సహాయంతోనే సాధ్యమవుతుంది. అలా రచనలను మెరుగు పెట్టుకొనే కొద్దీ రచనావ్యాసంగం దానికదే పదును తేలుతుంది. దీనివల్ల తెలుగు భాషకో, తెలుగు సాహిత్యానికో ఈ రోజుకీ రోజు ఏదో లాభిస్తుందన్న అత్యాశ కాదు కానీ విమర్శ తిరగలిలో నలిగితే మంచి సాహిత్యపుటలవాట్లు కొద్దిమందికయినా అబ్బుతాయని నమ్మకం.

కూల్డ్రే దొర కూడా కలోనియల్ బ్రిటిష్ చిత్రకళానైపుణ్యానికి అవతల నిలబడలేదు-ఆయనదీ అదే నేత. కానీ దారితెన్ను, అతీగతీ లేని చిత్రకళాపథంలో నాటికి ఆ ప్రాంతాల్లో ఆయన కాటన్ దొర వంటి పనే చేసేరు – మంచి పంటకు మొలకలెత్తించారు నారు పోసేరు. ఆ సరసన దామెర్ల రామారావు, ఆయన సాటి కళాకారులు, మిత్రులు అతి కొద్దిమంది గొప్ప చిత్రకారులుగా మిగిలారు-ఇక్కడ.

నువ్వనుకున్నావ్ కొండమావయ్యా నే పడుకున్నాననీ! వెన్నెలగా ఉంది కదూ ఇవాళ! పెద్దకిటికీ తీసివుందిగా! ఆకాశం మాంఛి తెల్లగా వెన్నలా మెత్తగా భలే బావుంది. అలా చూస్తూ ఉంటే కాస్సేపటికి చందమామ కిటికీకి ఎదురుగ్గా దగ్గరగా వొచ్చీసీడు. కళ్ళు మూసుకుని తెరిచీసరికి నేను ఆకాశంలో ఉన్నా. ఎంత మెత్తగా ఉందో ఆకాశం!