తెల్లగా వెలిగేవి, పచ్చగా వెలిగేవి, మినుక్కు మినుక్కుమంటూ వెలిగేవి, అటూ ఇటూ ఊగుతూ వెలిగేవి – ఎన్నెన్ని రకాల దీపాలో! వాటిని చూడొద్దూ! పెద్దవాళ్ళకి ఈ తేడాల దీపాల వెలుగులు కనపడవు కాబోలు! దేవుడి దగ్గర దీపపుసెమ్మలో దీపం వేరు. చెట్టులా ఉన్న దీపాలగుత్తిలో ఉన్న దీపాలు వేరు!
శీర్షికలు సంచికలు
ఎడారి మధ్యలో ఉండటంతో అన్ని కనిపిస్తున్నాయి. అసలు ఇన్ని ఉన్నాయని చూస్తే తప్ప, సిటీల్లో ఆకాశాన్ని చూసినప్పుడు తట్టనే తట్టదు! ఎక్కడో చదివాను. యాభై అడుగుల పొడవూ, యాభై అడుగుల వెడల్పూ ఉన్న తెల్ల కాగితం మీద ఎక్కడైనా బాల్ పెన్తో ఒక్క చుక్క పెడితే, అంత ఉంటుందిట మన భూమి ఈ విశాల విశ్వంలో! అన్ని వేల గోళాల మధ్య – మనం. ఓహ్! అద్భుతం. పైగా, చల్లటి గాలి. ఎడారిమీద ప్రేమ పుట్టుకొస్తోంది.
విశ్వసాహిత్యంలో నల్లజాతి మహిళల నవలా రచన ఎప్పుడు ప్రారంభమైంది? అన్న విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూ, తొలి నవలను తేల్చలేకపోతున్నారు. ఆ ప్రయత్నాలు అలా కొనసాగుతూండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన 19వ శతాబ్దిలోని ఇద్దరు నల్లజాతి మహిళల నవలలు వేర్వేరు కారణాలవల్ల ప్రాచుర్యం పొందలేదు.
అమ్మాయిలు ఉద్యానవనంలో పూలు కోస్తున్నారు. కోస్తూ అల్లరి చేస్తున్నారు. చేస్తూ సల్లాపాలాడుతున్నారు. పండిన పళ్ళని వీరు ఆరగిస్తే, పాపం అక్కడి చిలుకలకు ఏం మిగులుతుంది కనుక? అంచేత చిలుక వీరిపై పగబట్టి, వీరి అధరాలపై పడుతుందట, తిందామని. వాతెర అంటే అధరము. స్త్రీ క్రిందిపెదవిని దొండపండుతో పోల్చుతారు. వీరి పెదవులను దొండపళ్ళనుకొని, అవి మిగిలాయి కను వాటిని తినడానికి వస్తుందట చిలుక! వీరి చెక్కిళ్ళపై సాంకవరుచి అట.
నాణేల గురించి మరిచిపోయిన ముప్పై సంవత్సరాల తరువాత, మొక్కలకి నీళ్ళు పడుతున్న నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా మనవడు, “తాతా! ఈ కాయిన్ ఆ చెక్కపెట్టెలో దొరికింది. చూడు దీనిపైన తెలుగు అక్షరాలు ఎంత పెద్దగా ఉన్నాయో!” అంటూ. వాడు ఏడో తరగతిలో చేరి వారం రోజులైందేమో.
బాలమురళి చిన్నగా తనకి ఊరితో సంబంధం, సంగమేశ్వర శాస్త్రిగారి గురించి, నేదునూరి గురించి, కవిగారి గురించి మాట్లాడి వాళ్ళందరికి తన నమస్కృతులు చెప్పి, పక్క వాద్యాలకి సూచన ఇచ్చి హంసధ్వనిలో వాతాపి గణపతిం ఎత్తుకున్నాడు. వయొలిన్ మోగింది. బాలమురళి గొంతు గాడిలో పడింది. శాస్తుర్లు అవసరార్థం మృదంగంతో తాళం వేసేడు. తర్వాత బాలమురళి తన స్వంత కృతి పాడేడు. తాళం మారింది.
హోటల్కి వెళ్ళి టీ తాగాను. ఆకలి వేయలేదు.కడుపులో మంటగా అనిపించింది. రోజూ భోజనం పంపమని హోటల్లో ఉన్న వ్యక్తితో చెప్పాను. నా చిరునామా విని “పగలైతే పర్లేదు గానీ రాత్రి పూట హోటల్ కుర్రాళ్ళు అటు రావడానికి భయపడతారండీ. ఒకమ్మాయి ఆ ఇంటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది తెల్సా? ఆమె అక్కడే తిరుగుతుంది అంటారు మరి. మీకు దెయ్యాలంటే భయం లేదా సార్?” అన్నాడు.
ఘోషలు, ఉద్వేగాలు
కథలు, ప్రయాణాలు
ముగింపులన్నీ
తుది అంచులని దాటిన
గాలి తెరలుగా మారి
వీచి వీచి వెళ్ళిపోయాయి.
కిటికీ తెరిచినా మూసినా
చిక్కటి చీకటి నర్తిస్తూ
నరనరాలలో ప్రవహిస్తూ
ముక్కలైన చందమామ
నింగిలో మూలకు చేరి
ముఖం వేళ్ళాడేసినట్టు
ఉద్యోగం ఊరు మారినప్పుడల్లా
అన్ని సామాన్లతో పాటు
అల్లుకున్న అనుబంధాలను
అట్టపెట్టెల్లో సర్దుకొని
అయ్యగారి ఆఫీసుకో
పెద్దోడి ప్రైవేటుకో
చిన్నోడి కాన్వెంటుకో
కాస్త మబ్బు పట్టినా చాలు
సిరా చుక్కలు చినుకులవుతాయి
నీరెండ మెరుపు తాకినా
వేళ్ళ కొసల్లో పూలు పూస్తాయి.
చీకటి ఊయలలో
రాతిరి బిడ్డ నిద్దరోతున్నపుడు కూడా
బంగారు గంగాళమేం కాదు
చిన్న మట్టి కుండ.
సంవత్సరాలు కుళ్ళబెట్టిన
ఖరీదైన మందూ కాదు
బాటిల్లో దాచితెచ్చిన
హిమాలయాల నీరూ కాదు.
మున్సిపాలిటీ కుళాయి నీరు.
అసలు ఏ రచన గొప్ప రచన? ఏ కథ గొప్ప కథ? ఏది సామాన్యమైన కథ? అలా చెప్పడానికి దానికి తూనికరాళ్ళేమిటి? ఏ కథైతే మన అనుభవ పరిధిలోకి వచ్చిన మన అనుభవాన్ని ఆసరా చేసుకుని మళ్ళా మళ్ళా మరోసారి మరోసారి అందులోని ఒక మాటో, ఒక వాక్యమో, కొన్ని వాక్యాలో జ్ఞాపకం వస్తూ ఉంటాయో ఆ కథ గొప్ప కథ.
అడ్డం భాష పేరులేని విశ్వనాథవారి శర్మ గారి ఎడ్యుకేషన్ (7) సమాధానం: విష్ణుశర్మచదువు సరస్వతీ భగవతీ, భారతీల ముందు (4) సమాధానం: సామాంపాతు కాళిదాసుది […]
ఈమాట సర్వర్ ఉన్న హోస్ట్గేటర్లో సమస్యల వల్ల సరైన సమాధానాలతో పంపినవారి ఈమెయిళ్ళు అన్నీ మాకు చేరలేదు. క్రితం సంచికలోని గడినుడి-78కి మొదటి ఇరవై రోజుల్లో మాకు అందిన సరైన సమాధానాలు పదమూడు మంది నుంచి వచ్చాయి. సరైన సమాధానాలు రాసినా పేర్లు ప్రకటించని వారికి మా క్షమాపణలు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-78 సమాధానాలు.
విప్లవం అనేమాట తెలుగుపాఠకులకి ఒకరకంగానే అర్థం అవుతుంది. ఆ అర్థం నాకు పట్టదు అనీ, ఒకరకమైన సాహిత్యం ఇంకొకరకమైన సాహిత్యంగా మారినప్పుడు రచనాసూత్రాలు మారతాయనీ, ఇలా మారినప్పుడు విప్లవం అనేమాట వాడవచ్చనీ నేను ఎన్నిసార్లు చెప్పినా నా పాఠకులు పట్టించుకోలేదు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
సృష్టిలోని జీవులన్నీ ఇంద్రియ ధర్మాలైన చూపు, స్పర్శ, వినికిడి, రుచి, వాసనల ద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. జీవించడానికి అవసరమైన ప్రాథమిక, సహజ జ్ఞానం ఈ ఇంద్రియానుభవపు జ్ఞాపకాల వల్ల వాటికి ఏర్పడుతుంది. రాను రానూ మేధ అభివృద్ధి చెందుతూ వచ్చింది. దానితోపాటే సామాజిక జీవనం, సంభాషణ. జీవపరిణామక్రమంలో మనుషుల స్థాయికి వచ్చేసరికి ఆలోచన, వాక్కు అత్యంత బలమైన పరికరాలుగా రూపు దిద్దుకున్నాయి. ఇంద్రియానుభూతి వల్ల ఏర్పడే సహజ జ్ఞాన స్థాయిని దాటి, తర్కము, విచక్షణ, విశ్లేషణలతో తన అనుభవాలకు విలువలు ఆపాదించడం మనిషి క్రమక్రమంగా పెంపొందించుకున్నాడు. ఇది, ద్వితీయ, తార్కిక స్థాయిలో నేర్చుకునే జ్ఞానం. మనిషి సంఘజీవి కావడంతో వాక్కు, వాక్యం ద్వారా జ్ఞానాన్ని, అనుభవాలని ఒకరికొకరు బట్వాడా చేసుకోవడం మొదలైంది. తమకు తెలియని ప్రపంచాలను పరోక్షంగా తెలుసుకోవడం, ప్రశ్నించడం, తమనూ తమ ప్రపంచాన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం క్రమేణా జ్ఞానసముపార్జనకు ప్రధానమార్గాలయ్యాయి. మౌఖికమైనా, లిఖితమైనా, ఒక వాక్యపు బలం ఈ సందర్భంలోనే మనకు అర్థమవుతుంది. తద్వారా సాహిత్యపు అవసరం కూడా. సాహిత్యపు ప్రధాన ఉపయోగం మన ఆలోచనలను, పరిశీలనలను, స్పందనలనూ స్పష్టం చేసుకోడంలో సహాయపడడం. అలా సహాయపడేది తార్కిక స్థాయి సాహిత్యం. అంటే అనుభూతి కలిగించి ఆపైన అది దాటి మేధను కూడా తాకగలిగే సాహిత్యం. ఈ సాహిత్యపు అవసరాన్ని ఎంత లోతుగా గుర్తించగలిగితే ఆ సమాజం అంత దీర్ఘాయుష్షు ఉన్న సాహిత్యాన్ని సృష్టించుకుంటుంది. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న, ఉత్పన్నమవుతున్న సాహిత్యాన్ని పరిశీలించండి. ఇందులో ఎంత శాతం ప్రాథమిక అనుభూతి స్థాయిని దాటగలుగుతున్నదో చూడండి. భావుకత్వం, అన్యాయాన్ని ఎదిరించే ఆవేశం, అసమానతలను ప్రశ్నించే ఆగ్రహం ఇవన్నీ బలమైన అనుభూతులే. అయితే ఇవి తార్కిక చింతన, వివేచనల ఫలితం కావు. ఇవి ప్రాథమిక స్పందనలు. రచయితలు సామాజికస్థాయి రుగ్మతలకు వైయక్తికస్థాయిలో సమాధానాలు చెప్పడానికి వారు అనుభూతి స్థాయి దాటి ఆలోచించకపోవడం మినహా మనకు వేరొక కారణం కనపడదు. సినిమాలలో ఒక విలన్ను ఒక హీరో చంపినంత మాత్రాన ఆ విలనీ సమాజం లోనుంచి ఎలా పోదో, ఒక కథలో ఒక వ్యక్తి తిరుగుబాటు చేసినంత మాత్రాన ఆ దురాచారం సంఘంలో సమసిపోదు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు మార్గం ఆ రుగ్మతల స్వరూపస్వభావాలను విశ్లేషించి తెలుసుకోవడంలోను, అవి పాఠకులకు అర్థం చేయించడంలోను ఉంటుంది. ఆ మార్గం తార్కికస్థాయి సాహిత్యం మాత్రమే చూపుతుంది. ఉదా. ఒక రచన మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆవేశాన్ని రగిలిస్తుంది. కాని, అదే సమయంలో ఆ అనుభూతిని దాటి పాఠకులలో, శ్రోతలలో ఏదో ఒక ఆలోచననూ రేకెత్తించగలిగినప్పుడు ఆ రచన పది కాలాలు సజీవంగా ఉంటుంది. అనుభూతి సాంద్రత ఎక్కువయేకొద్దీ అది మేధకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ సాంద్రత లోపించిన సాహిత్యం, సినిమా తదితర ఏ కళారూపమయినా ప్రత్యక్షంగా దానితో గడుపుతున్న సమయంలో మాత్రమే ఆ అనుభూతిని మనలో మేల్కొలిపి, తాత్కాలిక ఉపశమనాన్నిచ్చి ఆ వెంటనే మాయమైపోతుంది. వెంటనే స్పందించేలా చేస్తుంది. అలాకాక బలమైన ప్రాథమిక అనుభూతి, దానిని దాటి అంతే తీక్షణమైన తార్కిక విచక్షణ – ఈ రెండూ కలిగించగలిగినదే సజీవ సాహిత్యం అవుతుంది. మన ఆవేశాలని, అనురాగాలనీ కూడా లోతుగా అర్థం చేసుకోడానికి సహాయపడుతుంది. సాహిత్యపు ప్రయోజనం నెరవేర్చడంలో ఈ మేధ చేస్తున్న పని అన్నిసార్లూ స్పష్టంగా కనపడకపోవచ్చు. కాని, గొప్ప సాహిత్యాన్ని చదివినవారందరికీ తెలుసు: మేధకు దారి మనసు నుండి. మేధోచితమైన అనుభూతి ప్రకటన చిక్కగా లోతుగా ఉంటుంది. అలా దాని సాంద్రత ఎంత ఎక్కువ ఉంటే మేధకు, తార్కికతకూ అది అంత దగ్గరవుతుంది. స్పందన అంత నిదానమవుతుంది. మనిషి భావుకత తార్కికతల కలబోత. అందుకే, మనకు మనసును మాత్రమే తాకే సాహిత్యంతో పాటు మెదడుకు పదును పెట్టే సాహిత్యం కూడా అత్యంత అవసరం. తెలుగు సాహిత్యంలో ఈ తరహా రచనలెన్ని?
జాతకాలు చెప్పేవాళ్ళు రెండు విధాలు. కొందరు, జాతకచక్రం చేతిలోకి తీసుకొంటూనే, ‘ఓహో! ఆహా! మహజ్జాతకం! ఆరు నెలలలో అమెరికా వెళ్ళి పోతావు. వచ్చేటపుడు ఒక ఐ-ప్యాడ్ తెస్తావుగా నాకోసం’ అంటాడు. మరొకాయన, చక్రం చూస్తూనే ముఖం చిట్లిస్తాడు. ‘ఈ పిల్లకు కుజదోషం’ అని మొదలుపెట్టి, కట్టకముందే తాళి తెంపేస్తాడు.
అతన్నెప్పుడూ లైబ్రరీలో చూడలేదు. బాచ్ లో ఈ ఎల్.ఆర్.పి. మీద పనిచేస్తూ చాలా కొద్దిమందే కనపడుతున్నారు. రాబోతున్న ఫైనల్ ఎగ్జామ్స్ మీదనే దృష్టి పెడుతున్నారు. వీళ్ళ రైటప్లు ఎప్పుడు తయారవుతాయో?! లేకపోతే దానికీ అడ్డదారులేమన్నా ఉన్నాయో? త్వరలోనే తెలిసింది. నూటయాభై వరకూ ఉన్న టాపిక్స్ లోంచే ఎంచి మార్చి మార్చి ఇస్తుంటారట! ఫైళ్ళని డిపాజిట్ చేసే స్టోర్ తాలూకు సివిలియన్ స్టాఫ్ గొంతులో రెండు పెగ్గులూ జేబులో రెండొందలూ పోస్తే…