శ్రీశ్రీ కవిత్వం మీద ఇప్పటికి బండ్లకొద్దీ వ్యాసాలు వచ్చాయనడం అతిశయోక్తి కాదు. మరయితే, మరోవ్యాసం ఎందుకూ అన్న ప్రశ్నకి సంపత్ గారి వ్యాస పరంగా సమాధానం చెప్పడం తేలికే!

తీరాలు దాటి దూరాలు చేరిన
సంబరాల్లో
నడిపించిన చేయి విడిచిపోయి

శ్రీశ్రీ చతుర్మాత్రలలో జ-గణాన్ని ఉపయోగించడం మాత్రమే కాక వాటిని మొదట కూడా పెట్టాడు. ఇది శ్రీశ్రీ ఒక ప్రత్యేకమైన సాధన. అన్ని పాదాలు ఎదురు నడకతో ప్రారంభమయితే ఒక గమనము, ఉరుకు వస్తుంది.

అప్పుడు నేను గుర్తించని ఒక విశేష విషయం ఏమిటంటే, ఆనాటి షష్టిపూర్తిలో అన్ని వేలమంది జనం మధ్య వేదిక మీద శ్రీశ్రీ ఒంటరిగా కూర్చున్నాడు. అప్పటి ఉద్వేగపూరిత వివాదాత్మక సంఘటనల మధ్య శ్రీశ్రీ నిజంగా లేడు.

శ్రీశ్రీ అనువాదాలు చదివితే ముందుగా కొట్టొచ్చినట్టు కనిపించేది వాటిలోని వైవిధ్యం – ప్రతీకాత్మకత, అధివాస్తవికత, విప్లవం – ఇలా అనేక కవిత్వ ధోరణులు ఈ అనువాదాలలో కనిపిస్తాయి.

ఈ మాటనే నేను బలంగా నమ్ముతున్నాను. మేధస్సు కాల్పనిక సాహిత్యానికి అడ్డు అని, అనవసరంగా సృజనలో తలదూర్చి పానకంలో పుడకలాగ బాధిస్తుందనీ నాకు అనిపిస్తుంది.

తప్పటడుగులు వేసే తెలుగింటి పిల్లవాడు ఈ రచనలో మన కళ్ళముందు ఎంతో ముద్దుగా సాక్షాత్కరిస్తాడు. చదువుకోడానికే ఎంతో అద్భుతంగా, తెలుగుదనం ఉట్టిపడే ఈ రచనకు శంకరాభరణంలో స్వరరచన జరిగింది.

శ్రీశ్రీ మాటల్లో “వచనగీతం అంటే చేతికి వచ్చిన వ్రాత కాదు. వ్యర్థ పదాలు లేకుండా వచనం రాయటం మరీ కష్టం. వచనగీతానికి ప్రాణప్రదమైన లక్షణం గమన వైవిధ్యం.”

ప్రపంచస్థాయికి ఎదిగి, తెలుగునేల మీద నిలకడగా నిటారుగా నిలబడ్డవాడు శ్రీశ్రీ. అందుకే కాబోలు ఆయన కవిత్వం అనువాదం కాకపోయినా తెలుగు రాని వాళ్ళని కూడా ఆకట్టుకుంది.

!!!ఈమాట పాఠకులకు, రచయితలకు, సమీక్షకులకు, వ్యాఖ్యాతలకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు
!!!

తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా మహా ప్రస్థాన కవితా విరించిని వీలైనంత సంపూర్ణంగా పునఃపరిచయం చేసే సంకల్పంతో కొన్ని పాత, కొన్ని కొత్త విశ్లేషణా విమర్శా వ్యాసాలను ప్రచురిస్తున్నాం. శ్రీశ్రీతో జరిగిన చర్చల ఆడియో రూపకాలు, శ్రీశ్రీ ఉపన్యాసం, కవితా పఠనపు వీడియోలూ, శ్రీశ్రీ కవితకి బాపూ బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తున్నాం. ఇంకా…

ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన, పరిశోధనల నిమిత్తం అధ్యాపక పదవి నెలకొల్పడానికై కొప్పాక వారు భూరి విరాళం ఇచ్చారు. మీ వంతు సహాయం మీరూ చేయమని విజ్ఞప్తి.

బాలగోపాల్ బహుముఖప్రజ్ఞుడు అనడం అతిశయోక్తి కాదు. సాహిత్య విమర్శకుడిగా, తత్వశాస్త్రవేత్తగా, సామాజికశాస్త్ర వ్యాఖ్యాతగా తెలుగునాట ప్రసిద్ధికెక్కాడు.

మా నాన్నా, మా బాబాయీ ప్రతిఏటా తల్లిదండ్రులకు తద్దినాలు పెడుతూ ఉండేవారు. ఒకసారి తమతో ఉపవాసం ఉండవలసిన పురోహితుడు కర్మకు ముందు రహస్యంగా హోటలుకెళ్ళి తినిరావడం వారి కంటబడిందట.