ఇదొక 20 ఏళ్ళ యువకుడి అంతరంగ ఘోష. తెరలు తెరలుగా పొరలు వీడి నగ్నంగా పరిగెత్తే అతని ఆలోచనలు, అతని ఊహలు, అతని పశ్చాత్తాపం, అతని ధర్మాగ్రహం, అతని నిస్సహాయత, అతని ఓటమి, అవమానం, అతని గెలుపు, అతని హృదయోల్లాసం, అతని మోహం, అతని లైంగిక అశాంతి, అతని ఆకలి, అతని ప్రేమ, ఇంకా అతనివే స్నేహం, అభిరుచులు, దుఃఖం — అన్నీ అతడివే!

పుప్పొడి అనే కవితలో పంక్తుల సంఖ్య ఆఱు మాత్రమే. కాని అది చదివినప్పుడు కలిగిన అనుభూతి అపారమైనది. 25 సంవత్సరాలకు ముందు కార్ల్ సేగన్ మనమంతా, అంటే ఆ ఆకాశము, అందులోని ఎన్నో పాలవెల్లులు, మన సౌర కుటుంబము, దానిలోని మన భూమి, అందులో అన్ని జీవజాలాలు అంతా ఆ ఖగోళ బీజము నుండి పుట్టిన అణువులు అని చెప్పిన మాట స్మృతిలో నిద్దుర లేచింది.

వెల్చేరు నారాయణ రావు పరిశోధనా గ్రంథాల గురించిన చిరు పరిచయాలు, ముఖ్యంగా పుస్తకం.నెట్‌లో ప్రచురించబడినవి, వాటన్నిటినీ ఒకచోట చేర్చే ప్రయత్నమే ఇది. వాటితో పాటుగా మరికొన్ని పుస్తకాల వివరాలు కూడా జతచేయబడినై.

తెలుగు వారు ఆస్వాదించ గలిగిన అన్నమయ్య భాష వాడుకలో ప్రత్యేకతలూ, అందమూ ఇతర భాషల వారికి సహజంగా అర్థం కావు. ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం అన్నమయ్య కీర్తనల్లో ఉన్న కవితా మాధుర్యాన్నీ, భావనా పటిమనీ ఇంగ్లీషులోకి పరిచయం చెయ్యడమే కాదు, అన్నమయ్య ఎంత ఆధునికమైన కవో చూపించడం కూడా.

ఇంకొక విశేషమేమిటంటే – ఈ కవితలు వ్రాసిన కవులు ఒకరు ఆంధ్రలో, మరొకరు అమెరికాలో ఉన్నా, ఇద్దరూ కూడబలుక్కుని వ్రాసినట్లనిపించాయి. ఒకరు ‘చందవరం, ప్రకాశం జిల్లా’లో మనల్ని ఒక రౌండ్ కొట్టిస్తే, మరొకరు అధునాతనమైన బంగళాలోకి ‘తేనీటి సమయానికి’ సాదరంగా ఆహ్వానించారు.

అన్నమయ్య శృంగార పదాలని కేవలం శృంగారంగా చూడకుండా కవితాత్మకంగా పరిశీలించి అందులో ఉండే పద మాధుర్యాన్నీ, భావ సౌందర్యాన్నీ వివరిస్తూ ఒక పుస్తకరూపంలో “వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది” పేరున అన్నమయ్య పదపరిచయం చేసింది కవయిత్రి జయప్రభ.

శ్యామ్ కథనా శైలి మరెక్కడా చూడం. అదొక ఏకైక రచనా శైలి. ఏ శైలి అయితే ఆయన కథలకి శక్తిగా, ప్రయోజనకారిగా మారాయో అవే ఆయన కథలకి బలహీనతా, లోపాలయి కూర్చున్నాయి. ఆ శైలికీ, ప్రాసలకీ, వాక్యాలకీ అబ్బురపడి అసలు కథ ఏవిటో మర్చిపోతాం.

పుస్తకం కొనుగోలు, పఠనానుభవం – బాగున్నాయి. పైగా, లీగల్ గా కొంటున్నాం కనుక, ఆత్మసంతృప్తి కూడానూ! బయటి రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండేవారికి ఇది ఉపయోగకరమే. అయితే, ఈ పుస్తకం కొనుగోలు చేయడం లో ఉన్న తతంగం అంతా సామాన్య ప్రజలకి అంత తేలిగ్గా అర్థం కాదేమో అని నా అనుమానం.

ఇంతకు ముందు వచ్చిన సంకలనాలకీ దీనికీ మధ్య నాకు గోచరించే ఒక పెనుమార్పు, కవి తన ఉనికిని హృదయస్థం చేసుకోవటం. అది ‘ఇక్కడే’ అని గ్రహించటం.

పగలంతా పాలవాసన వెంట / పరుగులెత్తిన ఈమె/ సగం రాత్రి వేళ పారిజాతమై పరిమళిస్తుంది. – ఈ మధ్య కాలంలో ఇంతకన్నా మంచి ప్రేమ కవిత చదివిన గుర్తు లేదు.

ముకుంద రామారావు ఆయన ఉద్దేశంలో కవిత్వమంటే ఏమిటో ప్రారంభంలోనే చెప్పారు: “మనస్సు, హృదయం, ఆత్మల సమ్మిశ్రితం బహుశా కవిత్వం” అని. అంతే కాదు. తాను కవిత్వం రాయడానికి ప్రేరణ కూడా చెప్పారు.

ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం. చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం అఫ్సర్ కి తెలుసు. పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇస్తాడు. ఇది అఫ్సర్ ప్రత్యేకత.

నా ఉద్దేశంలో ఇక్కడ కథలు రాస్తున్నవాళ్ళల్లో చాలామంది భౌతికంగా (ఫిజికల్‌ గా) అమెరికాలో ఉన్నారు కానీ, మానసికంగా, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు.

రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనికి డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది.

తెలుగులో శాస్త్రవిజ్ఞాన పుస్తకాల అవసరం ఇంకా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి చేసిన ప్రయత్నమే రోహిణీప్రసాద్ గారు అంతరిక్షాన్ని గురించి రాసిన “విశ్వాంతరాళం” పుస్తకం.

కవి ఊహలకు, ఆ ఊహలకు ఊపిరి పోసేందుకు ఎంచుకున్న వర్ణాలను, చిత్రించడానికి ఎన్నుకున్న కుంచెలను చూసేక ఇది ఈ కవయిత్రి మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యమేసింది.

ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది.

అనువాద రచనలు మూల భాష తెలిసిన వారిని,అనువాద భాష మాత్రమే తెలిసిన వారిని సమానంగా రంజింపజెయ్యాలని ఎలా ఆశిస్తామో, అలాగే అనుభవాల గురించి రాసిన రచనలు కూడా ఆ అనుభవాల నెరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి కూడా సంతృప్తి నియ్యాలని ఆశించటంలో తప్పులేదు.