అభివృద్ధి పేరుతో ప్రకృతి మీద మానవుడు చేస్తున్న అఘాయిత్యాలనీ, వాటి వల్ల సహజ వనరుల మీద ఆధారపడిన ప్రజల జీవితాలు చితికిపోవటాన్నీ, భూగోళంపై ఉండే సహజ సంపద, జంతుజాలాల మీద శాశ్వతంగా మిగిలిపోయే సమస్యలనీ నేపథ్యంగా తీసుకొని వ్రాసిన నవల చంద్రలతగారి “దృశ్యాదృశ్యం”. ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయాలు చాలానే ఉన్నా, కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే ఇక్కడ చర్చిస్తాను.

యీ “సముద్రం”లో అన్వేషణ వుంది. గుర్తు పట్టే చూపుంది. చుట్టూ పరిగెత్తమనే పరిస్థితులున్నా తమలోకి తాము చూసుకొనే మనుష్యులు మనకి స్నేహితులవుతారీ “సముద్రం”లో.

భూషణ్‌ కథల్లో ముఖ్యమైన వస్తువు స్త్రీపురుష సంబంధం. ఒక యువకుడు ఉంటాడు. మిత భాషి. తన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆమెకు ఇష్టం; నిన్నుప్రేమిస్తున్నాను అని చెప్పనవసరం లేకుండానే ఆమె తనను అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటాడు. కాని అలా జరగదు. ఆమె దూరం అవుతుంది. అతని ప్రయత్నం లేకుండానే మరోస్త్రీకి దగ్గిరవుతాడు; లేక మొదటి స్త్రీ తిరిగి అతనికి దగ్గిరవుతుంది. ఇంతకంటే లోతుగా ఈ సంబంధాన్ని పరిశీలించటం ఈ కథల్లో కనిపించదు.

(తమ్మినేని యదుకుల భూషణ్‌ కవితాసంకలనం “చెల్లెలి గీతాలు” పై సమీక్ష) ఈ కవితలు చదివే ముందు ఒకసారి, వర్తమానాన్ని వదిలి బాల్యంలోకి తిరిగి పయనించేందుకు […]

ముందుగా కల్పనా రెంటాల పుస్తకం “కనిపించే పదం”. ముప్పై ఒక్క కవితలు; అందులో ఎంపిక చేయదగిన చక్కటి కవితలు ఒక నాలుగు (నది సప్తపది, […]

“ఆకులోఆకునై” కాలమ్‌ గా “ఆంధ్రప్రభ దినపత్రిక” లో వచ్చిన వ్యాసాలను సంకలించి అందమైన పుస్తకంగా తీసుకువచ్చారు వీరలక్ష్మీదేవిగారు. ఇందులోని వ్యాసాలు మల్లెపూవుల మీద నిలిచిన […]

అనువాదం ప్రాముఖ్యం  తెలియని జాతికి విమోచన లేదు. దీవి సుబ్బారావు శ్రమకోర్చి, బసవ, అక్క మహాదేవి, అల్లమప్రభు, తదితర కన్నడ వచన కవులను(12 వ […]

హృదయవాదీ మానవతావేదీ కథకుడైతే అతని కంట పడ్డ లోకరీతులూ, వెంటపడ్డ రాగద్వేషాల ఫణితులూ ఎలాటి రూపం పొంది, ఎటువంటి ఫలితాల్ని ఇస్తాయో ఈ “బొంబాయి […]