ఊర్మిళ ప్రస్తావించిన వరుస ఇది – జనకుడు, సీత, రాముడు, లక్ష్మణుడు. వెంటనే లక్ష్మణుడి చెప్పిన సమాధానంలో వరుస ఇది – రాముడు, జనకుడు, సీత, సీత. సాధారణంగా ఒకవరుసలో ప్రస్తావించిన ప్రశ్నలకు వెంటనే అదే వరుసలో సమాధానం ఇవ్వడం లోకవ్యవహారం. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటే, మా అమ్మా నాన్న బావున్నారనడం సహజం. ఇక్కడ అది లేదు.
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
సృష్టిలో నేను యెరుగ
పైన పంక్తులు కూడా లక్ష్మణుడు ఊర్మిళ భావానికనుగుణంగా చెప్పాడంటే సరిగ్గా పొసగట్లేదు.
ఇక “మనసుకు నచ్చిన ఊహలు” దీనికి సమాధానం పై పంక్తులు. అసూయ స్త్రీ సహజలక్షణం. సీత ఎవ్వరు అని అంటే ఆమె యెవరో నాకు తెలియదని అసూయచేత విసురుగా ఊర్మిళ చెప్పిందనడంలో అనౌచిత్యమేమున్నది?
2. >>ఇది కాస్త ప్రమాదకరమైన ఆలోచన. ఒకటి – పురుషుల నిస్సహాయత >>స్త్రీలు ఆనందిస్తారని సాధారణీకరించి సూత్రీకరించడం చాలా తప్పు.
ఇందులో ప్రమాదకరమూ, అసహజమేముంది? కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా గుమిగూడి (తమదైనలోకంలో మగవాళ్ళు రాని పెరట్లో) తమతమ సంసారం తాలూకు అచ్చట్లు, ముచ్చట్లు చెప్పుకునేప్పుడు (వాళ్ళు ఈ కాలం నాటి హైటెక్ స్త్రీలు కూడా కాదు) తమ మనసులో అణగారిన భావనలను ఉద్యోతిస్తూ చెప్పుకోవడం కద్దు.
అబ్బే, అలా స్త్రీలు ఉండరు, స్త్రీలెప్పుడు భర్తలను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటారనుకోవడమే “మేల్ ఇగో” అని నేననుకుంటున్నాను. 🙂
>>పాటని బట్టి పాతకాలపు స్త్రీల స్థితిగతులని మనస్తత్వాన్నీ ఊహించే్ >>ప్రయత్నం జరుగుతోందా, స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాటని అర్థం చేసుకొనే >>ప్రయత్నం జరుగుతోందా?
రెండవది అవడంలో ఇబ్బందేముందండి? మీరు సూచించిన విశ్వనాథ మారీచుని ఉదాహరణ ఇందుకు ఉపయోగపడుతుంది. లక్ష్మణాగ్రజా అని ఒక రాక్షసుడు చస్తూ అరిచాడంటే సందర్భాన్ని బట్టి సాధారణ లౌకికార్థంలో అది అనౌచిత్యం. (ప్రాణబాధలో ఉన్నప్పుడు ఎదుటివాని పేరుతో కాక, లక్ష్మణాగ్రజా అని అనడం, అలా అనడం ద్వారా రావణున్ని మోసపుచ్చాలనుకోవడం తదితరాలు అనౌచిత్యకారణాలు) దాని ఔచిత్యం తెలియాలంటే మారీచుని స్వభావం, రామభక్తి తెలియాలి. అంటే అతని మనస్తత్వాన్ని బట్టి రచననుఅర్థం చేసుకోవాలి.
ఇక్కడా అలాంటిదే. స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాట అర్థం చేసుకోవాలి అనడంలో అసంగతం ఏమిటి?
హత హత గారూ మిగతా విషయాలు కాస్త పక్కన బెట్టి ఇప్పుడు మీరు రాసిన చివరి వాక్యం ఒకసారి చూద్దాం:
“పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది”
పాఠకుడు రకరకాలుగా ఊహించుకొనే ఆవకాశం ఉంటుందా ఉండదా అప్పుడు ఎట్టి ఊహని రచయిత బలపరుస్తాడు? తన తలకాయలో ఉన్న ఊహనేనా, మరొకదాన్నా? కొచెం ఆలోచించండి. ‘మనకి తెలుసు’ అనే బదులు ‘మనం ఊహించుకోవచ్చు’ అంటే రచయిత కొంచం నిజాయితీ గా ఉన్నట్టు తెలుస్తుందా లేదా చెప్పండి. తః తః,శాస్త్ర జ్ణులు ఎప్పుడు “we know” అంటారో కాస్త తెలిసిన మనిషే . ఇక ‘టెక్నిక్’ అంటారా ఒప్పుకుంటాను.
ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.
ఇక్కడ విజయ రాఘవరావు గారు కాదు విషయం. విజయ రాఘవ రావు గారి మీద గొప్ప గౌరవం నాకుంది. ఆయన వేణువాద్య మాధుర్యమ్ నా చెవికి తెలుసు.
ఇక్కడ వ్యక్తులని గురించి మాట్లాడటం లేదు. సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒక గొప్ప వ్యక్తిని గురించి తలుచుకోవడంలోని సందర్భమ్ గురించి. ఆ విషయం మీద ఉన్న పరిమితులు… ఇబ్బందులూను. పదేపదే ఒకటే చట్రం లోంచి వ్యక్తులని తలుచుకుంటూంటే అందులోని సున్నితత్వం మందగించే అవకాశం ఉంది గనక. అది మంచిది కాదు గనక.
విజయరాఘవ రావు గారి వంటి గొప్ప వేణువాద్య విద్వాంసుని గురించి సంగీత రంగలోని ఇతరులెవరైనా ఈ సరికే మరింతగా “తెలుగున” రాసి ఉండవలసింది. ఆయన సంగీత రంగంలో కర్నాటకమ్ లో ఉన్నవాడు కాడు గనక ఇక్కడి వాళ్ళు రాయలేదో , లేక మరి ఎప్పట్లానే తెలుగు వాళ్ళ అలసత్వమో అనుకోవాలి. తెలుగునేలకి దూరంగా ఉన్నవారు కావడం విజయరాఘవ రావు గారి గురించి ఎక్కువ తెలుగు వారికి తెలియకపోవడానికి గల కారణాలు అని కూడా పూర్తిగా అనను. తెలుగు వాళ్ళకి వాళ్ళలోని విశిష్టతని సకాలంలో గుర్తించే అలవాటు లేదు. దీని గురించి నేను అంటున్నాను. పదే పదే అంటున్నాను ఎందుకంటే మరొక ప్రతిభావంతుడైన తెలుగు వ్యక్తి విషయంలో అయినా వాళ్ళు పోయేకా కాక ముందే తెలుగులు మేల్కొంటే బాగుంటుందని.. తెలుగు పత్రికలూ .. ఇతర మీడియా కూడా! మనకి ఒక కవి మీద గానీ తెలుగు నేల మీద ప్రభవించిన ఒక మంచి కళాకారుని మీద గాని చక్కటి డాక్యుమెంటరీ లేదు. దీనికి ఏమనాలి? టెక్నాలజీ లోపమైతే పూడ్చుకుంటాం! కానీ అది మనుష్యులలోని లోపమే అయితే ఎట్లా?? ఇతర భాషలలో ఈ రకమైన అలసత్వం లేదు. దీని గురించి కూడా మాట్లాడాలి. అది సందర్భాన్ని బట్టైనా మాట్లాడాలి. ఒక వ్యక్తి వ్యాసం రాయడం లేదా రాయక పోవడమ్ కాదిక్కడి సంగతి.
అయితే విజయరాఘవ రావు గారికి బయట మంచి గుర్తింపు ఉంది. అన్ని అవార్డులూ ఆయనని వరించాయి. తెలుగువారినించి తప్ప. అదీ నా చింత . అందుకే చింత. దాని గురించి “మౌనంగా” ఉండటం కన్నా మాట్లాడటమే మంచిది ఎవరైనా..ఎప్పుడైనా ఎక్కడైనా .. ఇందులో ఎవరికీ విబేధం ఉండనవసరం లేదు. ఇక్కడ “మౌనానికి” అదనపు విలువ ఏమీ లేదు.
విజయరాఘవరావుగారిని గురించి మరి కొన్ని విశేషాలు – భారతదేశానికి స్వాతంత్ర్యము సిద్దించినప్పుడు ఎఱ్ఱకోటలో మొట్టమొదట 1947 ఆగస్టు 15 రోజు ఆర్చెస్ట్రాను కండక్టు చేసినది వీరే. ఇతని ఒక పెన్సిలు రేఖాచిత్రాన్ని యిక్కడ చూడగలరు. ఇతని ఒక LP రికార్డు చిత్రాలను యిక్కడ చూడ వీలగును. వీరు వ్రాసిన పుస్తకాలలో విజయాంజలి (ఈ పుస్తకాన్ని మానవాళికి అంకితము చేసారు), అభ్యుత్థానము ఉన్నాయి. వీరి కథాసుధ అనే ఒక కథను ఇక్కడ చదువవచ్చును. అతడు వ్రాసిన ఒక కవిత –
ఔనమ్మా సంగీత తరంగాలు
గాలిలో తేలుతున్నాయి
తాన్సేనులు, టాగూరులు
గాంధీలు, నెహ్రూలు
వాళ్లేనమ్మా నీ దిగ్దర్శకత్వంలో
ఈ జీవిత సంగీతపు
మల్హారులు, హిందోళాలు
“కృష్ణారావు గారు , మీకు ఊర్మిళాదేవి నిద్ర అన్న పాటని గురించి పల్లెటూళ్ల ల్లోని స్త్రీల సంభాషణల గురించి ఎంత తెలుసునో నాకు అంత గానూ తెలుసును. దాని గురించి మీరు చింత పడనవసరం లేదు. నాకు పరిశీలనానుభవమూ పరిశోధనానుభవమూ సైతం పుష్కళంగానే ఉన్నాయి.”
రమ గారు,
ఎంత మాట! నాకేదో తెలుసునని అపోహ కలిగించినట్టున్నాను, క్షమించాలి.
మీ పరిశోధనా వ్యాసాలు (peer-reviewed articles) ఎక్కడైనా ప్రచురించారా? వివరాలు తెలియజేస్తే చదవాలనుంది.
ఇంగ్లీషులో Johnny come lately అనే ఒక expression ఉంది.
విజయరాఘవరావుగారి గురించి బొంబాయిలో 1986 ప్రాంతాల సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారు నడిపిన మహాంధ్ర పత్రికలో నేనొక పెద్ద వ్యాసం రాశాను. అప్పటికాయన పాపం బతికే ఉన్నారు. (శాస్త్రిగారి 75 ఏళ్ళకూ, ఆయన పోయిన తరవాతా కూడా వ్యాసాలు రాశాను).
ఇలాంటివన్నీ అడుగడుగునా ‘నిరూపించుకోవడం’ చాలా అనవసరం. కొన్ని సందర్భాల్లో గౌరవంతో మౌనం వహించడం మంచిదని తెలుసుకుంటే చాలు.
మీరు గమనించారో లేదో ఇందులో విజయరాఘవరావు గారి నివాళి కంటే రాసిన వారి సోత్కర్షే పుష్కలంగా వుంది. కాబట్టి, ఇది నివాళి వ్యాసంగా మీరెలా అనుకున్నారో, ఈ అనవసర చర్చెందుకో అర్థం కావడం లేదు.
ఇది చూడండి: విజయరాఘవ రావుగారెంత గొప్పవారో తెలుస్తుంది. అంతేకాక మేము నడుపుతున్న తెలుగు సాహిత్యసమితి సభ్యుల ఉత్సాహాన్ని గమనించిన రావుగారు కొన్నిరోజులకే 1979లో తాను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు మమ్మల్ని సంప్రదించకుండానే మాతరఫున అక్కడ ఎస్.రాజేశ్వరరావునూ, పి.సుశీలనూ ఆర్కెస్ట్రాతోసహా బొంబాయికి ఆహ్వానించారు. అదొక చరిత్రాత్మక ఘట్టమయింది. ఒకవంక మాలో ‘పెద్దలు’గా చలామణీ అవుతున్న కొందరు అలిగి, మొత్తం కార్యక్రమాన్ని చివరి నిమిషాన ముంచే ప్రయత్నం చేశారు. మాలో 35మందిమి వాలంటీర్లం మటుకు పట్టువదలక ఆ పాటల ప్రోగ్రామును అతివిజయవంతంగా నిర్వహించాము. షణ్ముఖానంద హాలులోని 3000 సీట్లూ అమ్ముడు పోవడమేకాక 5రూ. టికెట్టు ప్రేక్షకుల్లోని కొందరు ఆశాపరులకు బ్లాకులో 40రూ. పలికింది! ఇదంతా ఇన్నేళ్ళ తరవాత చెప్పుకోదగినది కాదుగాని, అప్పట్లో మా ఉత్సాహాన్నీ, అందోళననూకూడా పెంచిందనేది చెప్పడానికే.
ఆ ప్రోగ్రాములో గాయకుడు రామకృష్ణ కోరగా నేను తెరలేచే ముందరే రిహార్సల్ లేకుండా తక్కిన ఆర్కెస్ట్రాతో బాటుగా సితార్ వాయించవలసివచ్చింది. ఆ సభకు విజయరాఘవరావుగారు ముఖ్యఅతిథిగా, నౌషాద్ విశేష అతిథిగా రావడం మాకు మరింత సంతోషాన్నిచ్చింది. మేము ఆర్గనైజర్లుగానూ, స్టేజి కళాకారులుగానూకూడా శ్రమిస్తామనే సంగతి విజయరాఘవరావుగారు కళ్ళారా చూసి, భుజం తట్టగలిగారు.
విజయరాఘవ రావుగారికి వేణువు వాయించడమే కాదు, తోటి కళాకారుల భుజం తట్టడం కూడా వచ్చునని చక్కగా తెలుస్తోంది కదా? విజయరాఘవ రావుగారి గురించి మనలాంటి వెర్రివాళ్ళకి ఏమీ తెలియలేదంటే అది మన తప్పు. కాదంటారా?
మదన్మోహన్ సంగీత దర్శకత్వములో అన్పఢ్ చిత్రములోని ఆప్ కీ నజరోన్ నె సమ్ఝా నాకు నచ్చిన పాటలలో ఒకటి. మీరు చెప్పిన తరువాత నేను ఆ పాటను మళ్లీ వినే అవకాశం కలిగింది. ఆ పాటకు అదే మెట్టులో ఇంచుమించు అదే అర్థములో నా అనువాదాన్ని జత చేస్తున్నాను. తెలుగులో పాడుతూ ఆనందించండి-
నీదు కన్నులు దెలిపె ప్రియ నా ప్రేమ నీ సంతసముగా
ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా
ఔను నీ సమ్మతి యది నాకు అతి ఆనందము
చెప్పె చూపులు నిజముగా వందనమ్ముల దెలుపుచు
నవ్వుతూ నా జీవితములో జేరితివిగద హాయిగా
ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా
నీకు గమ్యము నేనెగాదా నాకు గమ్యము నీవెగా
నాకు లేదుగ భయము లేవియు నీవు పక్కన ఉండగా
గాలివానకు తెలియజేయుడు నాకు ప్రియుడిట దొరికెగా
ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా
పడెగదా నా యెడదపైన నీదు నీడల మాయలే
దిక్కుదిక్కుల మ్రోగెగా వంద నాదస్వరములే
రెండు జగముల ముదము లన్నియు నేడె నాకే దొరికెగా
ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా
Pardon me, చందమామలో నేమో చదువుకున్నా, ఎప్పుడో ఒక నీతి కథని.
ఒక ఇంటివాళ్ళకి మామిడికాయల బుట్ట వచ్చింది. కొన్ని కుళ్ళువి. కొన్ని నవనవ లాడుతున్నయి. నాలాటి ఒక హృదయం లేని స్త్రీ, – అయ్యలూ! కుళ్ళిన పళ్ళు అవతల పారెయ్యండి, మంచివి ఇవ్వాళే తినండి అంది. వారు -ఎందుకు పారెయ్యటం వెర్రిదానా! నీకు డబ్బు విలువ బొత్తిగా తెలీదూ, నువ్వు చెప్పేదేంటి, మేము వినేదేంటి అని, కుళ్ళిన పళ్ళే తిన్నారు. మర్నాటికి మరి కొన్ని కుళ్ళాయి. మళ్ళీ అవే తిన్నారు. ఇలా బుట్టలో కాయలు ఐపోయేసరికి వారు ఒక్క నాడూ మంచి మామిడిపండు ఆనందంగా తినలేదు. మంచి రుచి తెలుసుకోలేదు. ఈ లోగా వారికి కుళ్ళు రుచి అలవాటై పోయింది. ఇప్పడు కుళ్ళు పళ్ళే కావాలని తెచ్చుకుని కళ్ళ కద్దుకుని తింటారు.
రోహిణీ ప్రసాద్ “మరణించినప్పుడే కళాకారులను గుర్తు చేసుకోటానికి, పరిచయం చెయ్యటానికి, మీరిచ్చే కారణం?” – అని నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.
పర్లేదు. విషాదంలో ఉన్నారు, మీరు శ్రీనివాస్, occupy శ్రద్ధాంజలి ఈ మాట ప్రాంగణం లోనే peaceful గా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్, ఎప్పుడు రాయాలో మీకే తెలుసుగా.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి రవి అభిప్రాయం:
01/11/2012 5:39 am
కామేశ్వరరావు గారు,
ఊర్మిళ ప్రస్తావించిన వరుస ఇది – జనకుడు, సీత, రాముడు, లక్ష్మణుడు. వెంటనే లక్ష్మణుడి చెప్పిన సమాధానంలో వరుస ఇది – రాముడు, జనకుడు, సీత, సీత. సాధారణంగా ఒకవరుసలో ప్రస్తావించిన ప్రశ్నలకు వెంటనే అదే వరుసలో సమాధానం ఇవ్వడం లోకవ్యవహారం. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటే, మా అమ్మా నాన్న బావున్నారనడం సహజం. ఇక్కడ అది లేదు.
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
సృష్టిలో నేను యెరుగ
పైన పంక్తులు కూడా లక్ష్మణుడు ఊర్మిళ భావానికనుగుణంగా చెప్పాడంటే సరిగ్గా పొసగట్లేదు.
ఇక “మనసుకు నచ్చిన ఊహలు” దీనికి సమాధానం పై పంక్తులు. అసూయ స్త్రీ సహజలక్షణం. సీత ఎవ్వరు అని అంటే ఆమె యెవరో నాకు తెలియదని అసూయచేత విసురుగా ఊర్మిళ చెప్పిందనడంలో అనౌచిత్యమేమున్నది?
2. >>ఇది కాస్త ప్రమాదకరమైన ఆలోచన. ఒకటి – పురుషుల నిస్సహాయత >>స్త్రీలు ఆనందిస్తారని సాధారణీకరించి సూత్రీకరించడం చాలా తప్పు.
ఇందులో ప్రమాదకరమూ, అసహజమేముంది? కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా గుమిగూడి (తమదైనలోకంలో మగవాళ్ళు రాని పెరట్లో) తమతమ సంసారం తాలూకు అచ్చట్లు, ముచ్చట్లు చెప్పుకునేప్పుడు (వాళ్ళు ఈ కాలం నాటి హైటెక్ స్త్రీలు కూడా కాదు) తమ మనసులో అణగారిన భావనలను ఉద్యోతిస్తూ చెప్పుకోవడం కద్దు.
అబ్బే, అలా స్త్రీలు ఉండరు, స్త్రీలెప్పుడు భర్తలను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటారనుకోవడమే “మేల్ ఇగో” అని నేననుకుంటున్నాను. 🙂
>>పాటని బట్టి పాతకాలపు స్త్రీల స్థితిగతులని మనస్తత్వాన్నీ ఊహించే్ >>ప్రయత్నం జరుగుతోందా, స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాటని అర్థం చేసుకొనే >>ప్రయత్నం జరుగుతోందా?
రెండవది అవడంలో ఇబ్బందేముందండి? మీరు సూచించిన విశ్వనాథ మారీచుని ఉదాహరణ ఇందుకు ఉపయోగపడుతుంది. లక్ష్మణాగ్రజా అని ఒక రాక్షసుడు చస్తూ అరిచాడంటే సందర్భాన్ని బట్టి సాధారణ లౌకికార్థంలో అది అనౌచిత్యం. (ప్రాణబాధలో ఉన్నప్పుడు ఎదుటివాని పేరుతో కాక, లక్ష్మణాగ్రజా అని అనడం, అలా అనడం ద్వారా రావణున్ని మోసపుచ్చాలనుకోవడం తదితరాలు అనౌచిత్యకారణాలు) దాని ఔచిత్యం తెలియాలంటే మారీచుని స్వభావం, రామభక్తి తెలియాలి. అంటే అతని మనస్తత్వాన్ని బట్టి రచననుఅర్థం చేసుకోవాలి.
ఇక్కడా అలాంటిదే. స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాట అర్థం చేసుకోవాలి అనడంలో అసంగతం ఏమిటి?
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి TahaTaha అభిప్రాయం:
01/11/2012 3:45 am
హత హత గారూ మిగతా విషయాలు కాస్త పక్కన బెట్టి ఇప్పుడు మీరు రాసిన చివరి వాక్యం ఒకసారి చూద్దాం:
“పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది”
పాఠకుడు రకరకాలుగా ఊహించుకొనే ఆవకాశం ఉంటుందా ఉండదా అప్పుడు ఎట్టి ఊహని రచయిత బలపరుస్తాడు? తన తలకాయలో ఉన్న ఊహనేనా, మరొకదాన్నా? కొచెం ఆలోచించండి. ‘మనకి తెలుసు’ అనే బదులు ‘మనం ఊహించుకోవచ్చు’ అంటే రచయిత కొంచం నిజాయితీ గా ఉన్నట్టు తెలుస్తుందా లేదా చెప్పండి. తః తః,శాస్త్ర జ్ణులు ఎప్పుడు “we know” అంటారో కాస్త తెలిసిన మనిషే . ఇక ‘టెక్నిక్’ అంటారా ఒప్పుకుంటాను.
వేణునాదం ఆగింది! గురించి rama bharadwaj అభిప్రాయం:
01/11/2012 12:47 am
ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.
ఇక్కడ విజయ రాఘవరావు గారు కాదు విషయం. విజయ రాఘవ రావు గారి మీద గొప్ప గౌరవం నాకుంది. ఆయన వేణువాద్య మాధుర్యమ్ నా చెవికి తెలుసు.
ఇక్కడ వ్యక్తులని గురించి మాట్లాడటం లేదు. సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒక గొప్ప వ్యక్తిని గురించి తలుచుకోవడంలోని సందర్భమ్ గురించి. ఆ విషయం మీద ఉన్న పరిమితులు… ఇబ్బందులూను. పదేపదే ఒకటే చట్రం లోంచి వ్యక్తులని తలుచుకుంటూంటే అందులోని సున్నితత్వం మందగించే అవకాశం ఉంది గనక. అది మంచిది కాదు గనక.
విజయరాఘవ రావు గారి వంటి గొప్ప వేణువాద్య విద్వాంసుని గురించి సంగీత రంగలోని ఇతరులెవరైనా ఈ సరికే మరింతగా “తెలుగున” రాసి ఉండవలసింది. ఆయన సంగీత రంగంలో కర్నాటకమ్ లో ఉన్నవాడు కాడు గనక ఇక్కడి వాళ్ళు రాయలేదో , లేక మరి ఎప్పట్లానే తెలుగు వాళ్ళ అలసత్వమో అనుకోవాలి. తెలుగునేలకి దూరంగా ఉన్నవారు కావడం విజయరాఘవ రావు గారి గురించి ఎక్కువ తెలుగు వారికి తెలియకపోవడానికి గల కారణాలు అని కూడా పూర్తిగా అనను. తెలుగు వాళ్ళకి వాళ్ళలోని విశిష్టతని సకాలంలో గుర్తించే అలవాటు లేదు. దీని గురించి నేను అంటున్నాను. పదే పదే అంటున్నాను ఎందుకంటే మరొక ప్రతిభావంతుడైన తెలుగు వ్యక్తి విషయంలో అయినా వాళ్ళు పోయేకా కాక ముందే తెలుగులు మేల్కొంటే బాగుంటుందని.. తెలుగు పత్రికలూ .. ఇతర మీడియా కూడా! మనకి ఒక కవి మీద గానీ తెలుగు నేల మీద ప్రభవించిన ఒక మంచి కళాకారుని మీద గాని చక్కటి డాక్యుమెంటరీ లేదు. దీనికి ఏమనాలి? టెక్నాలజీ లోపమైతే పూడ్చుకుంటాం! కానీ అది మనుష్యులలోని లోపమే అయితే ఎట్లా?? ఇతర భాషలలో ఈ రకమైన అలసత్వం లేదు. దీని గురించి కూడా మాట్లాడాలి. అది సందర్భాన్ని బట్టైనా మాట్లాడాలి. ఒక వ్యక్తి వ్యాసం రాయడం లేదా రాయక పోవడమ్ కాదిక్కడి సంగతి.
అయితే విజయరాఘవ రావు గారికి బయట మంచి గుర్తింపు ఉంది. అన్ని అవార్డులూ ఆయనని వరించాయి. తెలుగువారినించి తప్ప. అదీ నా చింత . అందుకే చింత. దాని గురించి “మౌనంగా” ఉండటం కన్నా మాట్లాడటమే మంచిది ఎవరైనా..ఎప్పుడైనా ఎక్కడైనా .. ఇందులో ఎవరికీ విబేధం ఉండనవసరం లేదు. ఇక్కడ “మౌనానికి” అదనపు విలువ ఏమీ లేదు.
రమ.
వేణునాదం ఆగింది! గురించి మోహన అభిప్రాయం:
01/10/2012 11:52 pm
విజయరాఘవరావుగారిని గురించి మరి కొన్ని విశేషాలు – భారతదేశానికి స్వాతంత్ర్యము సిద్దించినప్పుడు ఎఱ్ఱకోటలో మొట్టమొదట 1947 ఆగస్టు 15 రోజు ఆర్చెస్ట్రాను కండక్టు చేసినది వీరే. ఇతని ఒక పెన్సిలు రేఖాచిత్రాన్ని యిక్కడ చూడగలరు. ఇతని ఒక LP రికార్డు చిత్రాలను యిక్కడ చూడ వీలగును. వీరు వ్రాసిన పుస్తకాలలో విజయాంజలి (ఈ పుస్తకాన్ని మానవాళికి అంకితము చేసారు), అభ్యుత్థానము ఉన్నాయి. వీరి కథాసుధ అనే ఒక కథను ఇక్కడ చదువవచ్చును. అతడు వ్రాసిన ఒక కవిత –
ఔనమ్మా సంగీత తరంగాలు
గాలిలో తేలుతున్నాయి
తాన్సేనులు, టాగూరులు
గాంధీలు, నెహ్రూలు
వాళ్లేనమ్మా నీ దిగ్దర్శకత్వంలో
ఈ జీవిత సంగీతపు
మల్హారులు, హిందోళాలు
విధేయుడు – మోహన
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:
01/10/2012 11:35 pm
రమ గారు,
ఎంత మాట! నాకేదో తెలుసునని అపోహ కలిగించినట్టున్నాను, క్షమించాలి.
మీ పరిశోధనా వ్యాసాలు (peer-reviewed articles) ఎక్కడైనా ప్రచురించారా? వివరాలు తెలియజేస్తే చదవాలనుంది.
కృష్ణారావు
వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:
01/10/2012 9:28 pm
ఇంగ్లీషులో Johnny come lately అనే ఒక expression ఉంది.
విజయరాఘవరావుగారి గురించి బొంబాయిలో 1986 ప్రాంతాల సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారు నడిపిన మహాంధ్ర పత్రికలో నేనొక పెద్ద వ్యాసం రాశాను. అప్పటికాయన పాపం బతికే ఉన్నారు. (శాస్త్రిగారి 75 ఏళ్ళకూ, ఆయన పోయిన తరవాతా కూడా వ్యాసాలు రాశాను).
ఇలాంటివన్నీ అడుగడుగునా ‘నిరూపించుకోవడం’ చాలా అనవసరం. కొన్ని సందర్భాల్లో గౌరవంతో మౌనం వహించడం మంచిదని తెలుసుకుంటే చాలు.
వేణునాదం ఆగింది! గురించి వెర్రి Rahaman అభిప్రాయం:
01/10/2012 7:25 pm
లైలా,
మీరు గమనించారో లేదో ఇందులో విజయరాఘవరావు గారి నివాళి కంటే రాసిన వారి సోత్కర్షే పుష్కలంగా వుంది. కాబట్టి, ఇది నివాళి వ్యాసంగా మీరెలా అనుకున్నారో, ఈ అనవసర చర్చెందుకో అర్థం కావడం లేదు.
ఇది చూడండి: విజయరాఘవ రావుగారెంత గొప్పవారో తెలుస్తుంది.
అంతేకాక మేము నడుపుతున్న తెలుగు సాహిత్యసమితి సభ్యుల ఉత్సాహాన్ని గమనించిన రావుగారు కొన్నిరోజులకే 1979లో తాను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు మమ్మల్ని సంప్రదించకుండానే మాతరఫున అక్కడ ఎస్.రాజేశ్వరరావునూ, పి.సుశీలనూ ఆర్కెస్ట్రాతోసహా బొంబాయికి ఆహ్వానించారు. అదొక చరిత్రాత్మక ఘట్టమయింది. ఒకవంక మాలో ‘పెద్దలు’గా చలామణీ అవుతున్న కొందరు అలిగి, మొత్తం కార్యక్రమాన్ని చివరి నిమిషాన ముంచే ప్రయత్నం చేశారు. మాలో 35మందిమి వాలంటీర్లం మటుకు పట్టువదలక ఆ పాటల ప్రోగ్రామును అతివిజయవంతంగా నిర్వహించాము. షణ్ముఖానంద హాలులోని 3000 సీట్లూ అమ్ముడు పోవడమేకాక 5రూ. టికెట్టు ప్రేక్షకుల్లోని కొందరు ఆశాపరులకు బ్లాకులో 40రూ. పలికింది! ఇదంతా ఇన్నేళ్ళ తరవాత చెప్పుకోదగినది కాదుగాని, అప్పట్లో మా ఉత్సాహాన్నీ, అందోళననూకూడా పెంచిందనేది చెప్పడానికే.
ఆ ప్రోగ్రాములో గాయకుడు రామకృష్ణ కోరగా నేను తెరలేచే ముందరే రిహార్సల్ లేకుండా తక్కిన ఆర్కెస్ట్రాతో బాటుగా సితార్ వాయించవలసివచ్చింది. ఆ సభకు విజయరాఘవరావుగారు ముఖ్యఅతిథిగా, నౌషాద్ విశేష అతిథిగా రావడం మాకు మరింత సంతోషాన్నిచ్చింది. మేము ఆర్గనైజర్లుగానూ, స్టేజి కళాకారులుగానూకూడా శ్రమిస్తామనే సంగతి విజయరాఘవరావుగారు కళ్ళారా చూసి, భుజం తట్టగలిగారు.
విజయరాఘవ రావుగారికి వేణువు వాయించడమే కాదు, తోటి కళాకారుల భుజం తట్టడం కూడా వచ్చునని చక్కగా తెలుస్తోంది కదా? విజయరాఘవ రావుగారి గురించి మనలాంటి వెర్రివాళ్ళకి ఏమీ తెలియలేదంటే అది మన తప్పు. కాదంటారా?
వేణునాదం ఆగింది! గురించి జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:
01/10/2012 7:08 pm
నా ఓటు కూడా లైలా గారికీ, రమా భరద్వాజ్ గారికీ, ఈ విషయంలో.
ప్రసాద్
ఆగవే రజనీ! విభావరి! గురించి మోహన అభిప్రాయం:
01/10/2012 3:06 pm
మదన్మోహన్ సంగీత దర్శకత్వములో అన్పఢ్ చిత్రములోని ఆప్ కీ నజరోన్ నె సమ్ఝా నాకు నచ్చిన పాటలలో ఒకటి. మీరు చెప్పిన తరువాత నేను ఆ పాటను మళ్లీ వినే అవకాశం కలిగింది. ఆ పాటకు అదే మెట్టులో ఇంచుమించు అదే అర్థములో నా అనువాదాన్ని జత చేస్తున్నాను. తెలుగులో పాడుతూ ఆనందించండి-
నీదు కన్నులు దెలిపె ప్రియ నా ప్రేమ నీ సంతసముగా
ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా
ఔను నీ సమ్మతి యది నాకు అతి ఆనందము
చెప్పె చూపులు నిజముగా వందనమ్ముల దెలుపుచు
నవ్వుతూ నా జీవితములో జేరితివిగద హాయిగా
ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా
నీకు గమ్యము నేనెగాదా నాకు గమ్యము నీవెగా
నాకు లేదుగ భయము లేవియు నీవు పక్కన ఉండగా
గాలివానకు తెలియజేయుడు నాకు ప్రియుడిట దొరికెగా
ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా
పడెగదా నా యెడదపైన నీదు నీడల మాయలే
దిక్కుదిక్కుల మ్రోగెగా వంద నాదస్వరములే
రెండు జగముల ముదము లన్నియు నేడె నాకే దొరికెగా
ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా
విధేయుడు – మోహన
వేణునాదం ఆగింది! గురించి lyla yerneni అభిప్రాయం:
01/10/2012 3:06 pm
Pardon me, చందమామలో నేమో చదువుకున్నా, ఎప్పుడో ఒక నీతి కథని.
ఒక ఇంటివాళ్ళకి మామిడికాయల బుట్ట వచ్చింది. కొన్ని కుళ్ళువి. కొన్ని నవనవ లాడుతున్నయి. నాలాటి ఒక హృదయం లేని స్త్రీ, – అయ్యలూ! కుళ్ళిన పళ్ళు అవతల పారెయ్యండి, మంచివి ఇవ్వాళే తినండి అంది. వారు -ఎందుకు పారెయ్యటం వెర్రిదానా! నీకు డబ్బు విలువ బొత్తిగా తెలీదూ, నువ్వు చెప్పేదేంటి, మేము వినేదేంటి అని, కుళ్ళిన పళ్ళే తిన్నారు. మర్నాటికి మరి కొన్ని కుళ్ళాయి. మళ్ళీ అవే తిన్నారు. ఇలా బుట్టలో కాయలు ఐపోయేసరికి వారు ఒక్క నాడూ మంచి మామిడిపండు ఆనందంగా తినలేదు. మంచి రుచి తెలుసుకోలేదు. ఈ లోగా వారికి కుళ్ళు రుచి అలవాటై పోయింది. ఇప్పడు కుళ్ళు పళ్ళే కావాలని తెచ్చుకుని కళ్ళ కద్దుకుని తింటారు.
రోహిణీ ప్రసాద్ “మరణించినప్పుడే కళాకారులను గుర్తు చేసుకోటానికి, పరిచయం చెయ్యటానికి, మీరిచ్చే కారణం?” – అని నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.
పర్లేదు. విషాదంలో ఉన్నారు, మీరు శ్రీనివాస్, occupy శ్రద్ధాంజలి ఈ మాట ప్రాంగణం లోనే peaceful గా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్, ఎప్పుడు రాయాలో మీకే తెలుసుగా.
లైలా