మీ వ్యాసం చాలా బావుంది. మీలా చందస్సులో పరిశోధన చేసి వ్యాసాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికెంతో శ్రద్ధా, అభిరుచీ, కోరికా వుందాలి. అంతకుమించి కాలం కూడా వెచ్చించగలగాలి. చందస్సు అవసరం లేదనుకునే నేటి కవులు చందస్సు దాటి కవిత్వాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. చందస్సు ఒక చట్రమనుకునే వారికి లయతో కూడిన చాలా అల్లికలున్నాయన్న సంగతి తెలీదు. చందస్సుని వాళ్ళు వదిలేసారు. కవిత్వం వాళ్ళనొదిలేసింది. అందుకే వచన కవిత్వంలో వచనం కవిత్వాన్ని రెండో స్థానానికి నెట్టేసింది.
మీలా చెప్పే వారు ఆంధ్రాలో కూడా తక్కువే!
“సృజనాత్మక వ్యాసాలను చదివి ఆనందిస్తే చాలదు. అందులోని బాగోగులను విమర్శించి రచయితకు ప్రోత్సాహమిస్తే అది రచయితకు, కవికి నవపథములో నడవడానికి చేయూత నిచ్చినట్లుంటుంది,” అని మీరు చెప్పింది నాకూ వర్తిస్తుంది. మీ వ్యాసాలు క్రమం తప్పకుండా చదువుతాను. బావుందని చెబుదామనుకుంటూ వాయిదా వేసిన సందర్భాలే ఎక్కువ. ఎందుచేతనో చాలామంది ( నాతో కలుపుకుని ) చదివి మంచీ చెడూ చర్చించరు. ముఖ్యంగా రచయిత బిళ్ళ మెళ్ళో వేసుకునేవారు. చెడు చెప్పాలంటే మొహమాటం అడ్డొస్తుంది. బావుందని చెప్పాలంటే అహం అడ్డొస్తుంది. ఇంకా గట్టిగా అంటే మరలా తమ రచనలమీద మిగతా వారెక్కడ విరుచుకు పడతారోనన్న భయం ఉంటుంది. పైగా పక్కవాణ్ణి పొగిడితే మనం ఒక మెట్టు క్రిందకి పడిపోతామన్న న్యూనతా భావం వుంటుంది. ఇంతకుమించి తమ రచనలని ప్రేమించినట్లుగా ఇతరుల రచనలని గౌరవించ లేకపోవడం వుంటుంది. ఇలా సవాలక్ష కారణాలు వెతక్కుండానే రోజూ కనిపిస్తూ ఉంటాయి.
సెక్స్ శీర్షికలకీ, సినిమా వ్యాసాలకున్న గిరాకీ చందస్సు వ్యాసాలకుండదు సారూ! సాహిత్యమయినా, సంగీతమయినా సినిమా శంఖంలో పోస్తే కానీ తెలుగువారికి రుచించదు.
వ్యాసం చాలా బాగుంది. డా రోహిణీ ప్రసాద్ గారు నాకు, అణుశాస్త్ర సంస్థలో గత పాతిక సంవత్సరాలుగా నాకు సీనియర్ అండ్ ఆత్మీయ మిత్రులు. నేను ఒక సంగీతాభిమానిగా జీవితం గడపటానికి డా రోహిణీ ప్రసాద్ గారి ప్రోద్బలం చాలా ఉంది.
నేను కూడా డా. బాలమురళీ కృష్ణ గారి వీరాభిమానినే. కాకపోతే నేను అందరు విద్వాంసుల సంగీతాన్నీ కూడా వింటాను. పక్క వాద్య విద్వాంసులని ఓడించటం, స్పీడుగా స్వరాలనీ ఉచ్చరించటం లాంటి గమ్మత్తులని దాటి సంగీతపు విలువలు చాలా ఉన్నాయి. మనము వాటి యందు దృష్టి పెడితే తప్ప అసలైన సంగీత రసికులుగా తయారవలేము. ఒక రాగంలో సంగతులను ఎంత మధురంగా చూపించారు, ఒక రాగం లోని ఆర్ద్రతని ఎంత బాగా ఆవిష్కరించారు, ఒక రాగాన్ని ఎంత సృజనతో మూర్తీభవింపజేసారు అన్న అంశాలు చిరస్థాయిగా నిలిచే విలువలు. ఇటువంటి విలువలతో డా. బాలమురళిగారు పాడిన కొన్ని సన్నివేశాలు నేను ప్రత్యక్షంగా అనుభవించినవి నేను జీవితాంతము మరువలేను. నా మట్టుకు నాకు అనిపిస్తుంది, మంచి సంగీతం లోని మంచితనాన్ని ఆస్వాదించటం అలవాటు చేసుకోవాలంటే, కొన్నాళ్ళ పాటు సాహిత్యాన్ని పక్కన పెట్టాలి. అల్లాగే, కచేరీ వింటున్నంత సేపూ ఒక ధ్వని పూరిత స్పర్థని ఆలోకిస్తున్నట్టు కాకుండా, ఒక సంగీత భావాన్ని భజిస్తున్న విధంగానూ, సంగీతానందాన్ని పొందుతున్న ధోరణిలో వినటానికి కూర్చుంటే, బాలమురళి గారి సంగీతాన్ని, వార్ని పోలు ఇతర మహావిద్వాంసుల సంగీతాన్ని సరైన పద్ధతిలో ఆస్వాదించటం మనకి అలవడుతుందని నాకనిపిస్తుంది.
దాదాపు ముప్ఫై ఐదు సంవత్సరాల క్రితం హైదరబాదులో విశ్వభారతి అని ఒక సంస్థ (ఇప్పటికీ అది పనిచేస్తోందనుకుంటాను). ప్రచురించిన కరపత్రికలో యీ పద్యం గురించి చదవడం జరిగింది. మా పదవ తరగతిలో ఇంద్రప్రస్థము – పాండవులు అని పద్యభాగంలో ఒక పాఠంలో కూడా అది చదివాను. అప్పుడు చదివిన వ్యాఖ్యానమూ గురువులు చెప్పిన భావార్థాలూ గుర్తులేనప్పటికీ, పద్యం మాత్రం గుర్తే. (మిగతా పద్యాలక్కూడా) చీమలమర్రి వారిచ్చిన వివరణ, నచ్చిన పద్యపు విందుగా, మెచ్చిన తాంబూలపు పసందుగా ఉంది. ఆ పాఠంలో ధర్మరాజు గురించి ఒక పద్యం:
ఇన్ని దశాబ్దాల తరవాత అప్పటి విషయాలు కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయనే ఉద్దేశంతోనే నేనివి స్కాన్ చేసి పంపుతున్నాను. వీటిలో సాహిత్యానికి సంబంధించిన విశిష్టత లేదని కోప్పడకుండా ఉంటే చాలు. రచయితగా కుటుంబరావుగారు సిగ్గుపడవలసినదేదీ చెయ్యలేదని నాకు తెలుసు కనక అటువంటి విమర్శలు కూడా అనవసరమే. ఇక నా కామెంట్లన్నీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రమే.
నాకు ఈ మధ్యన పార్టిషన్ నేపధ్యంగా వచ్చిన సాహిత్యంపై ఆసక్తి కలిగింది. హింది, ఇంగ్లీషు భాషల్లో అలాంటి సాహిత్యం వెతుక్కుంటున్నాను, చదువుకోడానికి. ఇప్పుడీ కథ చదువుతుంటే, దీన్ని కూడా ఆ కోవకు సంబంధించినదిగా పరిగణించవచ్చునని అనిపిస్తోంది నాకు.
దేశవిభజన ప్రభావం ఉత్తరభారతంలోనే ఎక్కువని, బహుశా, దక్షిణభారతంలో దాని ధ్యాస ఎక్కువగా ఉండకపోవచ్చుననే అభిప్రాయం విన్నాను. మన సాహిత్యంలో పార్టిషన్ నేపథ్యంగా వచ్చినవాటిని గురించి వివరాలు తెలుపగలరా, ఎవరైనా?
తిలక్ కవిత్వంలో కథా లక్షణాలూ, ఆయన కథల్లో కవిత్వ చాయలూ ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. మానసిక సంఘర్షణను ఇంత శక్తిమంతంగా చూపిన రచన నా పరిమిత పఠనా జీవితంలో తారసపడలేదు. రచయిత ఉద్దేశాలతో అభిప్రాయ భేదాలున్నా ఆ శైలిని మోహించకుండా ఉండలేను.
నేను టి పద్మిని గారి పుస్తకం చదివాను. శ్రీ రాధే శ్యాం గారి ప్రమేయంతొ నవంబర్ 07 ఈమాట లొ మీ మొదటి వ్యాసం చదివా. ఇప్పుడు ఈ వ్యాసం చదవడం, ఆ గాత్రం వినడం చాలా ఆనందంగా వుంది. పాడుతా తీయగా కార్యక్రమంలొ ఈ అంశాలు శ్రోతలు వింటే మేలు.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
05/04/2012 12:02 am
మోహన రావు గారూ,
మీ వ్యాసం చాలా బావుంది. మీలా చందస్సులో పరిశోధన చేసి వ్యాసాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికెంతో శ్రద్ధా, అభిరుచీ, కోరికా వుందాలి. అంతకుమించి కాలం కూడా వెచ్చించగలగాలి. చందస్సు అవసరం లేదనుకునే నేటి కవులు చందస్సు దాటి కవిత్వాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. చందస్సు ఒక చట్రమనుకునే వారికి లయతో కూడిన చాలా అల్లికలున్నాయన్న సంగతి తెలీదు. చందస్సుని వాళ్ళు వదిలేసారు. కవిత్వం వాళ్ళనొదిలేసింది. అందుకే వచన కవిత్వంలో వచనం కవిత్వాన్ని రెండో స్థానానికి నెట్టేసింది.
మీలా చెప్పే వారు ఆంధ్రాలో కూడా తక్కువే!
“సృజనాత్మక వ్యాసాలను చదివి ఆనందిస్తే చాలదు. అందులోని బాగోగులను విమర్శించి రచయితకు ప్రోత్సాహమిస్తే అది రచయితకు, కవికి నవపథములో నడవడానికి చేయూత నిచ్చినట్లుంటుంది,” అని మీరు చెప్పింది నాకూ వర్తిస్తుంది. మీ వ్యాసాలు క్రమం తప్పకుండా చదువుతాను. బావుందని చెబుదామనుకుంటూ వాయిదా వేసిన సందర్భాలే ఎక్కువ. ఎందుచేతనో చాలామంది ( నాతో కలుపుకుని ) చదివి మంచీ చెడూ చర్చించరు. ముఖ్యంగా రచయిత బిళ్ళ మెళ్ళో వేసుకునేవారు. చెడు చెప్పాలంటే మొహమాటం అడ్డొస్తుంది. బావుందని చెప్పాలంటే అహం అడ్డొస్తుంది. ఇంకా గట్టిగా అంటే మరలా తమ రచనలమీద మిగతా వారెక్కడ విరుచుకు పడతారోనన్న భయం ఉంటుంది. పైగా పక్కవాణ్ణి పొగిడితే మనం ఒక మెట్టు క్రిందకి పడిపోతామన్న న్యూనతా భావం వుంటుంది. ఇంతకుమించి తమ రచనలని ప్రేమించినట్లుగా ఇతరుల రచనలని గౌరవించ లేకపోవడం వుంటుంది. ఇలా సవాలక్ష కారణాలు వెతక్కుండానే రోజూ కనిపిస్తూ ఉంటాయి.
సెక్స్ శీర్షికలకీ, సినిమా వ్యాసాలకున్న గిరాకీ చందస్సు వ్యాసాలకుండదు సారూ! సాహిత్యమయినా, సంగీతమయినా సినిమా శంఖంలో పోస్తే కానీ తెలుగువారికి రుచించదు.
-బ్రహ్మానందం గొర్తి
బాలమురళీకృష్ణ గురించి P H Thyagaraju అభిప్రాయం:
05/03/2012 1:56 pm
వ్యాసం చాలా బాగుంది. డా రోహిణీ ప్రసాద్ గారు నాకు, అణుశాస్త్ర సంస్థలో గత పాతిక సంవత్సరాలుగా నాకు సీనియర్ అండ్ ఆత్మీయ మిత్రులు. నేను ఒక సంగీతాభిమానిగా జీవితం గడపటానికి డా రోహిణీ ప్రసాద్ గారి ప్రోద్బలం చాలా ఉంది.
బాలమురళీకృష్ణ సంగీతం గురించి P H Thyagaraju అభిప్రాయం:
05/03/2012 1:34 pm
నేను కూడా డా. బాలమురళీ కృష్ణ గారి వీరాభిమానినే. కాకపోతే నేను అందరు విద్వాంసుల సంగీతాన్నీ కూడా వింటాను. పక్క వాద్య విద్వాంసులని ఓడించటం, స్పీడుగా స్వరాలనీ ఉచ్చరించటం లాంటి గమ్మత్తులని దాటి సంగీతపు విలువలు చాలా ఉన్నాయి. మనము వాటి యందు దృష్టి పెడితే తప్ప అసలైన సంగీత రసికులుగా తయారవలేము. ఒక రాగంలో సంగతులను ఎంత మధురంగా చూపించారు, ఒక రాగం లోని ఆర్ద్రతని ఎంత బాగా ఆవిష్కరించారు, ఒక రాగాన్ని ఎంత సృజనతో మూర్తీభవింపజేసారు అన్న అంశాలు చిరస్థాయిగా నిలిచే విలువలు. ఇటువంటి విలువలతో డా. బాలమురళిగారు పాడిన కొన్ని సన్నివేశాలు నేను ప్రత్యక్షంగా అనుభవించినవి నేను జీవితాంతము మరువలేను. నా మట్టుకు నాకు అనిపిస్తుంది, మంచి సంగీతం లోని మంచితనాన్ని ఆస్వాదించటం అలవాటు చేసుకోవాలంటే, కొన్నాళ్ళ పాటు సాహిత్యాన్ని పక్కన పెట్టాలి. అల్లాగే, కచేరీ వింటున్నంత సేపూ ఒక ధ్వని పూరిత స్పర్థని ఆలోకిస్తున్నట్టు కాకుండా, ఒక సంగీత భావాన్ని భజిస్తున్న విధంగానూ, సంగీతానందాన్ని పొందుతున్న ధోరణిలో వినటానికి కూర్చుంటే, బాలమురళి గారి సంగీతాన్ని, వార్ని పోలు ఇతర మహావిద్వాంసుల సంగీతాన్ని సరైన పద్ధతిలో ఆస్వాదించటం మనకి అలవడుతుందని నాకనిపిస్తుంది.
నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన గురించి Dr, I.A.P.S. Murthy అభిప్రాయం:
05/03/2012 1:12 pm
దాదాపు ముప్ఫై ఐదు సంవత్సరాల క్రితం హైదరబాదులో విశ్వభారతి అని ఒక సంస్థ (ఇప్పటికీ అది పనిచేస్తోందనుకుంటాను). ప్రచురించిన కరపత్రికలో యీ పద్యం గురించి చదవడం జరిగింది. మా పదవ తరగతిలో ఇంద్రప్రస్థము – పాండవులు అని పద్యభాగంలో ఒక పాఠంలో కూడా అది చదివాను. అప్పుడు చదివిన వ్యాఖ్యానమూ గురువులు చెప్పిన భావార్థాలూ గుర్తులేనప్పటికీ, పద్యం మాత్రం గుర్తే. (మిగతా పద్యాలక్కూడా) చీమలమర్రి వారిచ్చిన వివరణ, నచ్చిన పద్యపు విందుగా, మెచ్చిన తాంబూలపు పసందుగా ఉంది. ఆ పాఠంలో ధర్మరాజు గురించి ఒక పద్యం:
దుర్జయ విమతాహంకృతి
మార్జయ యాచనక దైన్య మర్దన చణ దోః
ఖర్జులు గలరతనికి భీ
మార్జున నకులసహదేవులను ననుజన్ముల్.
ఈ పద్యంలో ఏదైనా చమత్కారముంటే వివరించ గోర్తాను.
– ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
కినిమా పత్రిక నుంచి – 3 గురించి Rohiniprasad అభిప్రాయం:
05/03/2012 10:17 am
ఇన్ని దశాబ్దాల తరవాత అప్పటి విషయాలు కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయనే ఉద్దేశంతోనే నేనివి స్కాన్ చేసి పంపుతున్నాను. వీటిలో సాహిత్యానికి సంబంధించిన విశిష్టత లేదని కోప్పడకుండా ఉంటే చాలు. రచయితగా కుటుంబరావుగారు సిగ్గుపడవలసినదేదీ చెయ్యలేదని నాకు తెలుసు కనక అటువంటి విమర్శలు కూడా అనవసరమే. ఇక నా కామెంట్లన్నీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రమే.
కినిమా పత్రిక నుంచి – 3 గురించి dvrao అభిప్రాయం:
05/03/2012 8:55 am
ఈ ఫీచర్ చాలా బావుంది. అప్పటి ఇంటర్వ్యు లు దొరికితే ప్రచురించండి
అద్దంలో జిన్నా గురించి Purnima అభిప్రాయం:
05/03/2012 7:52 am
నాకు ఈ మధ్యన పార్టిషన్ నేపధ్యంగా వచ్చిన సాహిత్యంపై ఆసక్తి కలిగింది. హింది, ఇంగ్లీషు భాషల్లో అలాంటి సాహిత్యం వెతుక్కుంటున్నాను, చదువుకోడానికి. ఇప్పుడీ కథ చదువుతుంటే, దీన్ని కూడా ఆ కోవకు సంబంధించినదిగా పరిగణించవచ్చునని అనిపిస్తోంది నాకు.
దేశవిభజన ప్రభావం ఉత్తరభారతంలోనే ఎక్కువని, బహుశా, దక్షిణభారతంలో దాని ధ్యాస ఎక్కువగా ఉండకపోవచ్చుననే అభిప్రాయం విన్నాను. మన సాహిత్యంలో పార్టిషన్ నేపథ్యంగా వచ్చినవాటిని గురించి వివరాలు తెలుపగలరా, ఎవరైనా?
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Phaneendra అభిప్రాయం:
05/03/2012 6:56 am
తిలక్ కవిత్వంలో కథా లక్షణాలూ, ఆయన కథల్లో కవిత్వ చాయలూ ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. మానసిక సంఘర్షణను ఇంత శక్తిమంతంగా చూపిన రచన నా పరిమిత పఠనా జీవితంలో తారసపడలేదు. రచయిత ఉద్దేశాలతో అభిప్రాయ భేదాలున్నా ఆ శైలిని మోహించకుండా ఉండలేను.
చందవరం, ప్రకాశం జిల్లా గురించి బొక్కా ప్రేమ్ కుమార్ అభిప్రాయం:
05/03/2012 4:57 am
@Srinivas Vuruputuri
>ఆవు సినిమా పోస్టర్ను తిని నెమరేస్తుందని అర్థం కాదా?
మీరు చాల షార్ప్ సుమండీ…
-బొక్కా ప్రేమ్ కుమార్
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి radhakrishna అభిప్రాయం:
05/03/2012 4:55 am
నేను టి పద్మిని గారి పుస్తకం చదివాను. శ్రీ రాధే శ్యాం గారి ప్రమేయంతొ నవంబర్ 07 ఈమాట లొ మీ మొదటి వ్యాసం చదివా. ఇప్పుడు ఈ వ్యాసం చదవడం, ఆ గాత్రం వినడం చాలా ఆనందంగా వుంది. పాడుతా తీయగా కార్యక్రమంలొ ఈ అంశాలు శ్రోతలు వింటే మేలు.