రామారావుగారు, మీ అభిప్రాయలతో చాలవరకు నేను ఏకీభవిస్తాను. ఔత్సహికుల పరిశోధనలని మనము త్రోసివేయకూడదు. అన్ని పరిశోధన వ్యాసాలలాగే వాటిని కూడ పరీక్షించాలి. నా ఈ వ్యాసములోని కొత్త అంశాలను వ్యాసము చివర చెప్పి ఉండాలి, యిక మీద అలా చేస్తాను. ప్రస్తుతము వాటిని క్రింద విశదీకరిస్తున్నాను –
(1) ఇది మందాక్రాంతముపైన ఒక సమీక్షవ్యాసము లేక రెవ్యూ లాటిది. ఇందులో ఇతరుల కృషిని సంక్షిప్తముగా తెలిపి నేను కనుగొన్న కొత్త విషయాలను చర్చించాను. నేను ఉపయోగించిన గ్రంథాలను కూడ అందరి సౌలభ్యానికోసం వివరాలతో చెప్పాను.
(2) మందాక్రాంతపు జననము, శాసనాలలో ఆ వృత్తపు వాడుక ఈ రంగములో ఉండే కొందరికి తెలిసి ఉన్నా, అవి అంతగా అందుబాటులో లేనందువలన, ప్రయాగప్రశస్తి, వియత్నాం శాసనాలను సంగ్రహముగా తెలిపినాను.
(3) మందాక్రాంతవృత్తము వాడబడిన ఐదు సందేశకావ్యాలను గురించి సంక్షిప్త వివరణ, అందులో ఉండే కొన్ని పద్యాలకు అదే వృత్తములో తెలుగు అనువాదమును తెలిపినాను. సందేశకావ్యాలకు మందాక్రాంతవృత్తములో (యతిప్రాసలు లేకున్నా కూడ) తెలుగు అనువాదాలు నాకు తెలిసి ఎక్కడా లేదు. అసలు అనువాదాలే లేనప్పుడు, ఈ అనువాదాలు ఉత్తమ స్థాయిలో ఉన్నదో లేదో అన్నది వేరే విషయము.
(4) మందాక్రాంత వృత్తపు చర్చ చాలవరకు కొత్తదే. మందాక్రాంతమును బోలిన వృత్తాల పట్టిక చిత్రము పూర్తిగా కొత్తదే. చాల పుస్తకాలను తిరగవేసి ఈ వృత్తాలనుగురించి తెలిసికొని వాటి లక్షణాలను వివరించే ఈ పట్టికను వాటి నిర్మాణశిలలు లేక లెగోల ద్వారా తెలియబరచాను. వీటన్నిటికీ పద్యరూపముగా ఉదాహరణలను ఛందస్సు, రచ్చబండ గుంపులలో ఇచ్చి ఉన్నాను. ఇలాటి పట్టిక proteins, nucleic acids రంగములో amino acid or nucleotide sequence similarity వంటిది. ఛందశ్శాస్త్రములో కూడ వృత్తస్వరూపాలను ఇలా విశదీకరించడానికి వీలవుతుందన్నది ఒక కొత్త విషయమే.
(5) ఒక గురువును రెండు లఘువులుగా మార్చి మందాక్రాంతపు లయ గలిగిన నాలుగు వృత్తాల సృష్టి కూడ నవీనమే. అందులో ఒకటి మాత్రమే పాత లక్షణగ్రంథాలలో ఉన్నది.
(6) మందాక్రాంతపు లయను మందాకిని అనే ఒక జాతి పద్యముగా సృష్టించడము, వాటిని ఉపయోగించి సంస్కృత వృత్తాలను అనువదించడము కూడ సంపూర్ణముగా నూతనమే. ఇలాటి ప్రయత్నము మిగిలినవారికి మార్గదర్శి అవడానికి అవకాశము ఉన్నది.
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ మందాక్రాంతవృత్తముపై సుమారు ఐదారు సంవత్సరాలుగా చేసిన నా పరిశోధనల సారాంశాన్ని యిక్కడ పొందుపరచాను. ఇంకా ఎన్నో వివరాలను వ్యాసపు నిడివిని దృష్టిలో నుంచుకొని విడిచివేయవలసి వచ్చింది.
1) బ్రహ్మానందం గారు, నచ్చిన విషయాలను ఎప్పుడు నచ్చాయి అనే చెప్పాలి. అందువల్ల మనము తక్కువ కాము. నేను చిన్నప్పుడు Yussouf by James Lowell లో చదివిన క్రింది పంక్తులు మెదడులో తేలుతున్నాయి –
As one lamp lights another, nor grows less,
So nobleness enkindleth nobleness.
2) జయప్రభ గారు, మీరు చెప్పినది నిజమే. నాకు ఎంతో యిష్టము కాబట్టే, ఛందశ్శాస్త్రములో నేను పరిశోధనలు చేస్తున్నాను. ఇవి ఎవరు బావుంది, బాగా లేదు అని చెప్పినా, వ్యాసాలు వ్రాయకున్నా కూడ ఆపను. ఎందుకంటే ఈ శాస్త్రములో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థము చేసికోవడానికి, నన్ను జ్ఞానవంతుడిని గావించుకోడానికి. మీ సలహాలకు కృతజ్ఞుడిని.
3) లైలాగారు, కాళిదాసు నివసించిన కాలమునుగురించి ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇతడు క్రీస్తు పూర్వమే ఉన్నాడంటారు. మరి కొందరు నేను తెలిపినట్లు నాలుగవ శతాబ్దపు వాడంటారు. ఇతని కవిత్వములో అశ్వఘోషుని కొన్ని అనుసరణలు, అనుకరణలు ఉన్నాయి. కాళిదాసులాటి కవికి మిగిలినవారిని ఎందుకు అనుసరించాలి అనే వాళ్లు ఇతడు అశ్వఘోషునికి పూర్వకవి అంటారు. నా ఉద్దేశములో మందాక్రాంతమును వాడిన మొట్టమొదటి కవి కాళిదాసు హరిసేనుడివల్ల ప్రభావితుడై ఆ వృత్తాన్ని మేఘదూత రచనకు ఎన్నుకొన్నాడని అనుకొంటాను. ఇక పోతే, సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి శిలాక్షరాలు కాబట్టి ఇందులో ఎట్టి సందేహము లేదు. కావున నేను కాలిదాసు నాలుగవ శతాబ్దపు వాడనే నమ్ముతాను. సముద్రగుప్తుడన్నది ఒక బిరుదు మాత్రమే. ఇతని అసలు పేరు వేరైనది.
కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు. మీరు ఉదహరించిన ఘటకర్పరునికి పేరు అది కాదు, అదేమో తెలియదు. కాని సందేశకావ్యములలో ఇతడు వ్రాసిన ఘటకర్పరము ఉన్నది. ఇది ఒక యమక కావ్యము కూడ. కొందరు దీనిని చూచిన తరువాతే కాళిదాసు మేఘదూతాన్ని వ్రాసినాడంటారు.
4) రవి గారు, రాజగోపాల శర్మ వ్రాసిన పుస్తకములో (గ్రంథసూచిలో ఎనిమిదవది, ఇది DLI – IISc లో లభ్యము) తెలుగులో కొటికలపూడి వేంకటకృష్ణ పండితులు 1790లో అనువదించారు, అది నేడు దొరకడము లేదు. లభ్యమయిన పుస్తకాలలో వడ్డాది సుబ్బరాయకవి 1884లో చేసిన అనువాదము మొదటిది. సుమరు 50 అనువాదాలు ఇందులో పేర్కొనబడ్డాయి.
5) నిడదవోలు వేంకటరావుగారికి కన్నడ ఛందస్సుతో బాగుగా పరిచయము ఉన్నది. ఆందువలన వీరు భామినీషట్పదిని ఎన్నుకొన్నారేమో లేక కామేశ్వరరావుగారన్నట్లు ఈ ఛందస్సు తెలుగులో కూడ పరిచితము కాబట్టి ఎన్నుకొన్నారేమో? మిశ్రగతిలో సాగే ఈ ఛందస్సుకు ఒక తూగు ఉన్నది. వ్యక్తిగతముగా నా ఉద్దేశములో అది వ్యధకు, బాధకు, విరహానికి సముచితము కాదేమో? దానికి బదులు ఖండగతిలో ఐదు మాత్రలతో ఉంటే అది బరువును సూచించగలదు. ఈ విషయాలను నేను చర్చించలేదు, ఎందుకంటే నా గురి మందాక్రాంతవృత్తము మాత్రమే కావడమువల్ల. నా ఉద్దేశములో పాదాలలోని పదాలకు సరిగా విరుపును కలిగించి ఉంటే మందాక్రాంతములో కూడ పై 50మంది కవులలో ఏ కొందరైనా దీనిని తప్పకుండ సాధించి యుంటారు. నావంటి అల్ప భాషాజ్ఞానియే దీనిని ప్రయత్నము చేసినప్పుడు, సంస్కృతాంధ్రములలో పాండిత్యము ఉన్నవారికి ఇది నల్లేరుపై బండి నడకే.
6) కామేశ్వరరావుగారు, సంస్కృత యతిని గురించి ఒక రెండు వాక్యాలు. నాట్యశాస్త్ర రచయితవంటివారు యతిని పూర్తిగా అంగీకరించలేదు. మిగిలినవారు కూడ మొట్ట మొదట తప్పకుండా పాటించినా, తరువాత పదాలను సంధితో యతిస్థానము వద్ద కలపడము ఒక ఆభరణములాటిది అనుకొన్నారు. దీనికి కాళిదాసాదికవులను పొగిడారు కూడ. నావరకు నేను యతి స్థానము వద్ద విరుపు లేక సంధి అవసరమని భావిస్తాను. పదాలను యతి స్థానములో దూసుకొని వెళ్లేటట్లు వ్రాయడము, పాదాంత యతి లేకుండ వ్రాయడము నాకు రుచించదు. పాదాంతయతి ఉపజాతులలో తప్పక అందరు పాటిస్తారు, కందములో రెండవ పాదానికి పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు యిది నియతము. ఇక పోతే ఆషాఢస్య ప్రథమదివసే అనేటప్పుడు స్య గురుతుల్యమే. ఉదాహరణగా సంస్కృతములో పాదాంత లఘువును గురువుగా అంగీకరిస్తారు, ఎందుకంటే అక్కడ విరామము వస్తుంది కనుక. విరామము ఉన్నప్పుడు సంస్కృతములో లఘువు సామాన్యముగా గురుతుల్యమే.
పాదాంత యతి ఉన్నప్పుడు, పాదారంభములో అచ్చులను వాడుతారు, సంధి లేకుండా కూడ. ఇక మధ్యలో సామాన్యముగా అచ్చులను య-కారముతో తెలుపుతారు.
7) కామేశ్వరరావు గారు, నేను ఇంకా మందాక్రాంత వృత్తరచనను అభ్యాసము చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 30 వ్రాసినాను, మందాక్రాంతపు లయతో సుమారు 15 పద్యాలు, జాతి పద్యముగా సుమారు 25 వ్రాసియున్నాను. ఇందులోని కిటుకులను ఇంకా నేర్చుకొంటున్నాను. వీలు దొరికినప్పుడు వీటిని అంతా ఒకే చోట ఉంచడానికి ప్రయత్నము చేస్తాను.
ఇదే ఒక చిన్న వ్యాసములా తయారైనందులకు సంపాదకులు మన్నిస్తారనే ఆశతో
మోహనరావు, బ్రహ్మానందం, జయప్రభ పాఠకస్పందన గురించి చాలా లోతైన విషయావలోకనకి దారితీసే అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ వ్యాసానికి నేరుగా సంబంధించకపోయినా ఈ “పాఠకస్పందన” గురించి నాకు కలిగిన కొన్ని సాధకబాధకాల్ని “ఈమాట” పాఠకుల ముందుంచుతాను.
1. రచనలో రచయిత పాత్ర. మీరు ఒక సాంకేతిక పరిశోధనాపత్రం రాసి ప్రచురించదల్చుకున్నారనుకోండి. దాన్లో విధిగా మొదల్లోనో (కొన్నిట్లో చివర్లోనో) ఆ విషయం మీద అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిశోధనల్ని క్లుప్తంగా వివరించి, మీరు చేస్తున్నపని వాటికన్నా ఏ విషయాల్లో భిన్నమైందో, ఎలా ఆ సమస్య పట్ల మన అవగాహనని విస్తృతం చేస్తుందో, మీరు చేస్తున్న ముఖ్యమైన contributions ఏమిటో ఏకరువు పెడతారు. అప్పుడు ఆ పత్రాన్ని పరిశీలించే పరిశీలకులు (reviewers) మిగిలిన వాళ్ల, మరియు మీసొంత contributions గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యాలో కాదో నిర్ణయించి, మీ contributions విలువ మీరు ప్రచురించ ప్రయత్నిస్తున్న పత్రిక (journal, conference proceedings etc) స్థాయికి సరితూగుతుందా లేదా అని బేరీజు వేసి ఆ పత్రాన్ని ప్రచురణార్హమైందో కాదో తేలుస్తారు. ఆ పరిశీలకులు మీరు పనిచేస్తున్న అంశం లోనో, దానికి దగ్గరగా వుండే అంశాల లోనో ఉద్దండులు కనుక ఈ పని చెయ్యగలుగుతారు (ఎప్పుడూ కాకపోవచ్చు కాని అత్యధిక శాతం విషయంలో ఇది నిజం).
కవితల్నీ కథల్నీ బావుందనో లేదనో చెప్పటానికి విస్తృతమైన పాండిత్యం పనికొస్తుందేమో కాని అవసరం మాత్రం కాదు, ఎందుకంటే వాటిని బేరీజు వెయ్యటం హృదయసంబంధి విషయం. వ్యాసాలు అలా కాదు. అవి మేధోసంబంధితాలు. (చాలా మంది తెలుగు కవులు ఈ తేడా తెలియక వ్యాసాల్ని కవితల్లా రాయటానికి ప్రయత్నించటమూ కవితలరూపంలో అప్రయత్నంగానే వ్యాసాలు రాయటమూ మనకు కొత్తకాదు గాని, అది ప్రస్తుతం అప్రస్తుతం.) కనుక ఒక వ్యాసాన్ని చదివినప్పుడు ఆ రచయిత contribution ఏమిటో ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు, (అ) ఎవరో రాసిన విషయాన్ని తన మాటల్లో మళ్లీ రాశాడా, (ఆ) రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాల్ని క్రోడీకరించి ఒకచోట చేర్చాడా, (ఇ) అదివరకు ఉన్న విషయాల్ని తీసుకుని వాటికి కొంత కొత్త అవగాహనని కలిపాడా, (ఈ) ఇదివరకు ఎవరూ చూడని ఒక కొత్త కోణం చూపిస్తున్నాడా, (ఉ) ఇదివరకు ఎవరూ ఊహించని కొత్త ఊహతో అదివరకున్న అవగాహనని తల్లకిందులు చేశాడా, (ఊ) అదివరకు అవగాహనే లేని విషయానికి ఒక సిద్ధాంత ప్రాతిపదికని కల్పించాడా,.. ఇలా ఎన్నో levels ఉన్నాయి. ముందే అనుకున్నట్టు సాంకేతిక రంగాల్లో ఐతే తను చేసిన పని ఏమిటో ఈ విశాల రేఖ మీద దాని స్థానం ఎక్కడని తను నమ్ముతున్నాడో చెప్పటం రచయిత పని. అతని ఆ అవగాహన ఖచ్చితమైందో కాదో నిశ్చయించటం పరిశీలకుల పని.
తను చేస్తున్న పని ఏమిటో చెప్పటం మన రచయితలకు అలవాటు లేదు. ఆ పని స్థాయి ఏమిటో చెప్పగలిగే పరిశీలకులు సాహిత్య ఔత్సాహికుల్లో చాలా కొద్దిమంది.
2. దేని గురించి రచయితని అభినందించాలి? ఒక వ్యాసంలో రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు ఆ రచయితని దేని గురించి అభినందించాలి? ఉదాహరణకి ఒక రచయిత చేసిన పని ఎన్నో చోట్ల ఉన్న విషయాల్ని సంగ్రహించి క్రోడీకరించి సంక్షిప్తీకరిచటం అనుకోండి. అప్పుడు అవసరమైన అన్ని విషయాల్ని సంగ్రహించాడా లేక ఏవైనా ముఖ్యమైన వాటిని సంప్రదించలేదా, క్రోడీకరణమూ సంక్షిపీకరణమూ సరిగా ఉన్నాయా లేవా అని వాటి గురించి అభినందనలో చీవాట్లో అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు. రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు, అది తెలుసుకునే జ్ఞానం పాఠకుడికి లేనప్పుడు, చేసే వ్యాఖ్యలు గుడ్డివాడి చేతిలోని రాయి వంటివే ఔతాయి కదా.
3. ఎవరు సరైన వ్యాఖలు చెయ్యగలరు? రచయితా, పరిశీలకులు పాఠకుడికి ఎలాటి సమాచారమూ ఇవ్వనప్పుడు బాధ్యతంతా పాఠకుడి మీదే పడుతుంది. పాఠకుడే ఆ రచనలో రచయిత తెచ్చిన కొత్త అవగాహన ఏమైనా వుందా? ఉంటే అదేమిటి? దాని విలువేమిటి? ఆ విలువ స్థాయి ఏమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది నేలబారుదా, సామాన్యమైందా, సగటుదా, ఉన్నతమైందా, అత్యున్నతమైందా, అద్భుతమైందా – అని బేరీజు వెయ్యగలగాలి. మామూలు పాఠకులకి ఇది సాధ్యం కాదు. కనుక ఏదో అనాలి కదా అనటమో లేకపోతే లేని పెద్దరికాన్ని మీద వేసుకుని తెలియని విషయాల్ని తెలిసినట్టు నటించటమో లేదా అలాటి నటన అలవాటైపోయి నిజంగానే పండితుణ్ణని భ్రమించటమో జరుగుతుంది.
4. అందరూ ఔత్సాహికులే ఐనప్పుడు. “ఈమాట” లాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు (ఏ నారాయణ రావు లాటి వారో తప్ప) ఔత్సాహికులు. అలాటి వారు తమకున్న అనేక ఇతర వ్యాపకాల నుంచి సమయం వెచ్చించి ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయటమే గొప్ప విషయం. కనుక అలాటి వారు రాసే వ్యాసాలకి professional స్థాయి ప్రమాణాలు వర్తిస్తాయా? వర్తించాలా? అది సాధ్యమా? కొంత lenience అవసరం అని బహుశా అందరూ ఒప్పుకోవచ్చుననుకుంటాను. ఐతే, ఎంత? ఉదాహరణకు, ఒక professionalకి “ఉన్నత” స్థాయి ఔత్సాహికుడి “సగటు” స్థాయికి సమానం అనొచ్చా? అంటే, professional scale మీద “సగటు” స్థాయిని చేరే వ్యాసాన్ని ఒక ఔత్సాహికుడు రాస్తే, దాన్ని “ఉన్నత” స్థాయి అని లెక్కవెయ్యొచ్చా? మరోవిధంగా చెప్పాలంటే, professionalకి, ఔత్సాహికుడికి తేడా “ఒక స్థాయి” అన్నమాట. కాదు, అది మరీ దగ్గర, రెండు స్థాయిల తేడా ప్రమాణం ఐతే బాగుంటుంది అనొచ్చు. ఏదో ఒకటి, ఒక ప్రమాణం ఒప్పుకుంటే అప్పుడు professional scale ని కొలమానంగా తీసుకుని ఔత్సాహికుల రచనల విలువని అంచనా కట్టొచ్చు.
చివరగా: మంచి రచనల్ని, మంచివి కాని వాటిని విడదియ్యలేనప్పుడు ఇటు వాసి రచయితలకూ అటు నాసి రచయితలకూ మరోవైపు పాఠకులకూ మంచి జరగదు. నాసి రచయితలు గొప్పవాళ్లమని విర్రవీగి విజృంభించటం, వాసి రచయితలు నీరుగారి నీరసించటం, పాఠకులు చెత్తలో కూరుకుపోయి ఆక్రందించటం జరుగుతాయి. తెలుగు సాహిత్యరంగంలో అలా విడదియ్యటానికి ఇప్పుడు కాలం అనుకూలం కాదు. ఈ జటిలసమస్యకి పరిష్కారం నాకు తెలియదు.
ఎందరో పెద్దవాళ్లు చెప్పినట్టు, రాయగలిగిన వాళ్లు రాస్తూ వుండాలి. ప్రతివారు చేసే ప్రతి రచన కళాఖండం కాదు కాని అభ్యాసంతో ఎప్పుడైనా ఒకటి బయటకు వచ్చే అవకాశం వుంది. “అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు”. ఈ విషయం రచయితలూ పాఠకులూ గ్రహిస్తే అందరికీ హాయి.
వారి వ్యాసంతో సంబంధంలేని విషయాల్ని రాసే అవకాశం ఇచ్చిన మోహనరావు గారి వ్యాసానికి అభినందనలు.
చాల ఆనందముగ వున్నది ఎందువలనంతటే శిశువు నా పదవ తరగతి పాఠ్యాంశము. అప్పుడు నాకు అర్దం అవలేదు కాని నాకు అబ్బాయి జన్మించిన తర్వాత తెలిసింది కవి గొప్పతనము. నిజముగ ఇలాంటి గొప్ప కవులు జన్మించిన ఈ తెలుగుగడ్ద మీద జన్మించినందుకు గర్వపడుతున్నాను.
సంస్కృత తెలుగు యతులను రెండిటినీ పాటిస్తూ మీరు వ్రాసిన తెలుగు పద్యాలు బాగున్నాయి. అయితే వాటిలో మీరు చేసిన యడాగమ సంధుల గురించి చిన్న అనుమానం.
“యలయై రావా – యలఘుతర మో – దాబ్ధిలో ముంచ రావా”
వంటి చోట్ల యడాగమం చెయ్యవచ్చా అని.
తెలుగులో మందాక్రాంతం ఎందుకు అరుదు అన్న మీ ప్రశ్నకి మీ, “వాణిశ్రీదా – వరము లొసగన్ – వందన మ్మిత్తు దేవీ” అన్న పద్యమే సమాధానం అని నాకనిపించింది. మిగతా మూడు పాదాలలో ఉన్న అందం మొదటిపాదంలో ఉందా?
సంస్కృత యతుల గురించి నాకు చాలా రోజులుగా ఉన్న ఒక సందేహం ఇక్కడ అడగడం అసందర్భం కాదనుకుంటాను. సంస్కృతంలో యతి విరామస్థానం కదా. అంటే పద్యం చదువుతున్నప్పుడు అక్కడ కచ్చితంగా ఒక క్షణం ఆగాలి కదా. మరి అలాంటప్పుడు యతి స్థానంలోని అక్షరం సంయుక్తమైతే దాని ముందరి అక్షరం గురువవ్వడం సమంజసమెలా అవుతుంది? ఉదాహరణకి, “ఆషాఢస్య ప్రథమ దివసే” అన్నప్పుడు “స్య” అన్న అక్షరం “ప్ర” అక్షరం సంయుక్తం కావడం వల్ల గురువవుతోంది. కాని “ఆషాఢస్య” అని ఆపి తర్వాత “ప్రథమ దివసే” అని చదివేటప్పుడు “స్య” లఘువే కదా అవ్వాలి?
@Srinivas Vuruputuri గారు: నాకు తెలిసి అన్నమయ్య ఏడుకొండలు అని గానీ, ఏడుకొండల రాయడు అనిగానీ ఎక్కడా ప్రస్తావించలేదు. శాండిల్య సారథ్యంలో విడుదల చేసిన కాసెట్లలో మాత్రం “ఎండగానీ, నీడగానీ” అన్న పాటలో “కొండలరాయడే మా కులదైవము, ఏడు కొండలరాయడే మా కులదైవము” అని పాడారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన సాహిత్యంలో ఈ పాటలో “కొండలరాయడే మా కులదైవము” అని మాత్రమే ఉంది. ఏడుకొండలు, ఏడుకొండల రాయడు అన్న పదబంధాలు ఈ మధ్య కాలంలోనివనే నా అభిప్రాయం.
@Chintu గారు: చీంతు అంటే date-palm. తెలుగులో అది ఈఁత, ఈఁతాడ (సంస్కృతం: హింతాళ).
@సిద్దినెని గారు: Mayrhofer నిఘంటువు చాలా పాతది. అందులో ఎన్నో ధాతు నిర్ణయాలు ఇప్పుడు ప్రశ్నార్థకం. Witzel పేపరుతో పాటు, Fuller పేపర్లు, ఆయన బ్లాగులో చర్చలు, ఈ సంవత్సరమే వచ్చిన Southworth పేపరు కూడా చూడండి. Southworth ప్రతిపాదించిన విషయాలన్నీ నేను ఒప్పుకోను (ముఖ్యంగా బ్రాహుయి, ఈలమైట్ భాషల సంబంధం గురించి).
Rice in Dravidian, Franklin Southworth, RICE Volume 4, Numbers 3-4 (2011), 142-148, DOI: 10.1007/s12284-011-9076-9
మోహన గారు, మీ వ్యాసాన్ని సమీక్షించి లేదా విమర్శించే స్థాయి నాకు లేదు. చక్కగా ఉంది అంటే సరిపోదు, ఈ వ్యాసం అలా ఉబుసుపోక చదివి అభిప్రాయం చెప్పేదీ కాదు, అంచేత నాకు కలిగిన కొన్ని ఆలోచనలు పంచుకుంటున్నాను.
>>కోపాన్ని, ధిక్కారాన్ని సూచించడానికి పృథ్వీవృత్తము ఉచితమైనది, అది ఈ భారాన్ని మోయగలదు. వర్షాకాలములో ప్రవాసములో విరహానుభవాన్ని వివరించడానికి మందాక్రాంతము చక్కగా శోభిస్తుంది.
మీరు ఉటంకించిన క్షేమేంద్రుని వ్యాఖ్య సంస్కృతానికి సరిగ్గా సరిపోతుంది. అయితే అదే విరహాన్ని తెలుగులో వర్ణించాలంటే మందాక్రాంతము సరిపోగలదా అన్న అనుమానం కలుగుతోంది. అందుకు కారణం యేభై పైగా తెలుగు అనువాదాలున్న ఈ కావ్యానికి ఒక్క అనువాదం కూడా తెలుగు మందాక్రాంతం లో లేదు.
భారతదేశంలో ఈ కావ్యానికి అత్యధికమైన అనువాదాలు తెలుగులోనే ఉన్నాయట. వీటిలో మొదటిది కొటికలపూడి వెంకటకృష్ణసోమయాజి గారి అముద్రితరచన (1864), మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయంలో ఉందట. అప్పటి నుండి నేటి వరకూ యేభై కి పైగా అనువాదాలు, గేయాలు, వచనాల రూపంలో కూడా వెలువడినాయి. వీటిలో కాస్త ప్రాచుర్యమైనవి రాయప్రోలు సుబ్బారావు గారి దూతమత్తేభము, విద్వాన్ విశ్వం గారి మేఘసందేశానువాదము, దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి రచనా మూడూ వరుసగా మత్తేభ, కంద, వృత్తాలలో వ్రాసి ఉన్నవి. ఇతర కవుల అనువాదాలు కూడా వృత్తాలలో, గేయాలలో ఉన్నవి. మందాక్రాన్తాన్ని యథాతథంగా తెలుగులో మేఘసందేశానువాదానికి వాడుకున్న కవులు కనిపించడం లేదు.
నిడదవోలు వెంకటరావుగారు ’షట్పదీ మేఘసందేశం’ అన్న ఒక అనువాదానికి పీఠిక వ్రాసి ఒకమాట ఇలా అన్నారు. “భామినీషట్పది వృత్తం మందాక్రాంత వృత్తముతో సన్నిహిత సంబంధమున్నది.” బహుశా మందాక్రాంతాన్ని అనువదించడానికి లేదా మంద్రాక్రాంతములో చెప్పగలిగిన భావానికి తెలుగులో సరిపోలగల వృత్తం షట్పదీ వృత్తం అయి ఉండవచ్చునని ఆయన అలా అన్నారేమోనని నా అనుకోలు. ఈ కావ్యంలో మొదటి పద్యాన్ని ఉటంకిస్తున్నాను. (కశ్చిత్కాన్తా … శ్లోకానికి అనువాదం)
మీరు మందాక్రాంత లయకు దగ్గరగా ఉన్న మందాకిని అనువాదాలను సూచించారు. బావుంది. అయితే విరహానుభవం తెలుగులో ఉద్యోతించడానికి బహుశా షట్పదీ వృత్తం ఎక్కువగా పొసగవచ్చునన్న వెంకటరావు గారి అభిప్రాయం ఆలోచింపజేస్తున్నది.
విశ్వనాథ సత్యనారాయణ తన నవల “దూత మేఘము – chapter 9, page 83. లో – ఉజ్జయినీ పురాధిపతి విక్రమాదిత్య చక్రవర్తి అస్థానములో ” ధన్వంతరి, క్షపణకుడు, అమరుడు, శంకరకవి, భేతాళభట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి అన్న నవరత్నములు – పెద్ద పండితులు, ఉన్నట్లు రాసారు.
అదే నవల మరొక పేజీలో (135) విక్రమాదిత్యుడు, కాళిదాసు సమవయస్కులనీ, విక్రమాదిత్యుడు కలి ప్రవేశించిన తరువాత మూడువేల ఒకటవ సంవత్సరములో జన్మించినట్లు రాసారు. విక్రమాదిత్యుని తండ్రి పేరు ప్రవరసేనుడు అని రాసారు.
ఈ వ్యాసములో – కాళిదాసు రెండవ చంద్రగుప్తుని కాలములో నివసించాడు, అతని ఆస్థానకవి. (క్రీ.శ .) నాలుగవ శతాబ్దపు అంత్యకాలములో జీవించాడు. చంద్రగుప్తుని తండ్రి సముద్రగుప్తుడు – అని ఇచ్చారు.
ధన్యవాదాలు. ”ram” ని she goat అనడం అచ్చు తప్పేమోనని, పునరుక్తి ఆని కాదు!
చావల్ ద్రవిద భాషల్లో ఉనికిలో ఉందంటారా/ తణ్దుల విషయం? భియ్యం అనే అర్ధం లో ‘వ్రిహి’ కి స్పష్టత వుంది.
The case of rice in Sanskrit is believed to be a loan from Proto Dravidian, first appeared in Yajurveda, and the sanskritised term, via The Avestan is the source for all the European languages.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:
05/06/2012 11:22 pm
రామారావుగారు, మీ అభిప్రాయలతో చాలవరకు నేను ఏకీభవిస్తాను. ఔత్సహికుల పరిశోధనలని మనము త్రోసివేయకూడదు. అన్ని పరిశోధన వ్యాసాలలాగే వాటిని కూడ పరీక్షించాలి. నా ఈ వ్యాసములోని కొత్త అంశాలను వ్యాసము చివర చెప్పి ఉండాలి, యిక మీద అలా చేస్తాను. ప్రస్తుతము వాటిని క్రింద విశదీకరిస్తున్నాను –
(1) ఇది మందాక్రాంతముపైన ఒక సమీక్షవ్యాసము లేక రెవ్యూ లాటిది. ఇందులో ఇతరుల కృషిని సంక్షిప్తముగా తెలిపి నేను కనుగొన్న కొత్త విషయాలను చర్చించాను. నేను ఉపయోగించిన గ్రంథాలను కూడ అందరి సౌలభ్యానికోసం వివరాలతో చెప్పాను.
(2) మందాక్రాంతపు జననము, శాసనాలలో ఆ వృత్తపు వాడుక ఈ రంగములో ఉండే కొందరికి తెలిసి ఉన్నా, అవి అంతగా అందుబాటులో లేనందువలన, ప్రయాగప్రశస్తి, వియత్నాం శాసనాలను సంగ్రహముగా తెలిపినాను.
(3) మందాక్రాంతవృత్తము వాడబడిన ఐదు సందేశకావ్యాలను గురించి సంక్షిప్త వివరణ, అందులో ఉండే కొన్ని పద్యాలకు అదే వృత్తములో తెలుగు అనువాదమును తెలిపినాను. సందేశకావ్యాలకు మందాక్రాంతవృత్తములో (యతిప్రాసలు లేకున్నా కూడ) తెలుగు అనువాదాలు నాకు తెలిసి ఎక్కడా లేదు. అసలు అనువాదాలే లేనప్పుడు, ఈ అనువాదాలు ఉత్తమ స్థాయిలో ఉన్నదో లేదో అన్నది వేరే విషయము.
(4) మందాక్రాంత వృత్తపు చర్చ చాలవరకు కొత్తదే. మందాక్రాంతమును బోలిన వృత్తాల పట్టిక చిత్రము పూర్తిగా కొత్తదే. చాల పుస్తకాలను తిరగవేసి ఈ వృత్తాలనుగురించి తెలిసికొని వాటి లక్షణాలను వివరించే ఈ పట్టికను వాటి నిర్మాణశిలలు లేక లెగోల ద్వారా తెలియబరచాను. వీటన్నిటికీ పద్యరూపముగా ఉదాహరణలను ఛందస్సు, రచ్చబండ గుంపులలో ఇచ్చి ఉన్నాను. ఇలాటి పట్టిక proteins, nucleic acids రంగములో amino acid or nucleotide sequence similarity వంటిది. ఛందశ్శాస్త్రములో కూడ వృత్తస్వరూపాలను ఇలా విశదీకరించడానికి వీలవుతుందన్నది ఒక కొత్త విషయమే.
(5) ఒక గురువును రెండు లఘువులుగా మార్చి మందాక్రాంతపు లయ గలిగిన నాలుగు వృత్తాల సృష్టి కూడ నవీనమే. అందులో ఒకటి మాత్రమే పాత లక్షణగ్రంథాలలో ఉన్నది.
(6) మందాక్రాంతపు లయను మందాకిని అనే ఒక జాతి పద్యముగా సృష్టించడము, వాటిని ఉపయోగించి సంస్కృత వృత్తాలను అనువదించడము కూడ సంపూర్ణముగా నూతనమే. ఇలాటి ప్రయత్నము మిగిలినవారికి మార్గదర్శి అవడానికి అవకాశము ఉన్నది.
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ మందాక్రాంతవృత్తముపై సుమారు ఐదారు సంవత్సరాలుగా చేసిన నా పరిశోధనల సారాంశాన్ని యిక్కడ పొందుపరచాను. ఇంకా ఎన్నో వివరాలను వ్యాసపు నిడివిని దృష్టిలో నుంచుకొని విడిచివేయవలసి వచ్చింది.
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:
05/06/2012 7:20 pm
1) బ్రహ్మానందం గారు, నచ్చిన విషయాలను ఎప్పుడు నచ్చాయి అనే చెప్పాలి. అందువల్ల మనము తక్కువ కాము. నేను చిన్నప్పుడు Yussouf by James Lowell లో చదివిన క్రింది పంక్తులు మెదడులో తేలుతున్నాయి –
As one lamp lights another, nor grows less,
So nobleness enkindleth nobleness.
2) జయప్రభ గారు, మీరు చెప్పినది నిజమే. నాకు ఎంతో యిష్టము కాబట్టే, ఛందశ్శాస్త్రములో నేను పరిశోధనలు చేస్తున్నాను. ఇవి ఎవరు బావుంది, బాగా లేదు అని చెప్పినా, వ్యాసాలు వ్రాయకున్నా కూడ ఆపను. ఎందుకంటే ఈ శాస్త్రములో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థము చేసికోవడానికి, నన్ను జ్ఞానవంతుడిని గావించుకోడానికి. మీ సలహాలకు కృతజ్ఞుడిని.
3) లైలాగారు, కాళిదాసు నివసించిన కాలమునుగురించి ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇతడు క్రీస్తు పూర్వమే ఉన్నాడంటారు. మరి కొందరు నేను తెలిపినట్లు నాలుగవ శతాబ్దపు వాడంటారు. ఇతని కవిత్వములో అశ్వఘోషుని కొన్ని అనుసరణలు, అనుకరణలు ఉన్నాయి. కాళిదాసులాటి కవికి మిగిలినవారిని ఎందుకు అనుసరించాలి అనే వాళ్లు ఇతడు అశ్వఘోషునికి పూర్వకవి అంటారు. నా ఉద్దేశములో మందాక్రాంతమును వాడిన మొట్టమొదటి కవి కాళిదాసు హరిసేనుడివల్ల ప్రభావితుడై ఆ వృత్తాన్ని మేఘదూత రచనకు ఎన్నుకొన్నాడని అనుకొంటాను. ఇక పోతే, సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి శిలాక్షరాలు కాబట్టి ఇందులో ఎట్టి సందేహము లేదు. కావున నేను కాలిదాసు నాలుగవ శతాబ్దపు వాడనే నమ్ముతాను. సముద్రగుప్తుడన్నది ఒక బిరుదు మాత్రమే. ఇతని అసలు పేరు వేరైనది.
కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు. మీరు ఉదహరించిన ఘటకర్పరునికి పేరు అది కాదు, అదేమో తెలియదు. కాని సందేశకావ్యములలో ఇతడు వ్రాసిన ఘటకర్పరము ఉన్నది. ఇది ఒక యమక కావ్యము కూడ. కొందరు దీనిని చూచిన తరువాతే కాళిదాసు మేఘదూతాన్ని వ్రాసినాడంటారు.
4) రవి గారు, రాజగోపాల శర్మ వ్రాసిన పుస్తకములో (గ్రంథసూచిలో ఎనిమిదవది, ఇది DLI – IISc లో లభ్యము) తెలుగులో కొటికలపూడి వేంకటకృష్ణ పండితులు 1790లో అనువదించారు, అది నేడు దొరకడము లేదు. లభ్యమయిన పుస్తకాలలో వడ్డాది సుబ్బరాయకవి 1884లో చేసిన అనువాదము మొదటిది. సుమరు 50 అనువాదాలు ఇందులో పేర్కొనబడ్డాయి.
5) నిడదవోలు వేంకటరావుగారికి కన్నడ ఛందస్సుతో బాగుగా పరిచయము ఉన్నది. ఆందువలన వీరు భామినీషట్పదిని ఎన్నుకొన్నారేమో లేక కామేశ్వరరావుగారన్నట్లు ఈ ఛందస్సు తెలుగులో కూడ పరిచితము కాబట్టి ఎన్నుకొన్నారేమో? మిశ్రగతిలో సాగే ఈ ఛందస్సుకు ఒక తూగు ఉన్నది. వ్యక్తిగతముగా నా ఉద్దేశములో అది వ్యధకు, బాధకు, విరహానికి సముచితము కాదేమో? దానికి బదులు ఖండగతిలో ఐదు మాత్రలతో ఉంటే అది బరువును సూచించగలదు. ఈ విషయాలను నేను చర్చించలేదు, ఎందుకంటే నా గురి మందాక్రాంతవృత్తము మాత్రమే కావడమువల్ల. నా ఉద్దేశములో పాదాలలోని పదాలకు సరిగా విరుపును కలిగించి ఉంటే మందాక్రాంతములో కూడ పై 50మంది కవులలో ఏ కొందరైనా దీనిని తప్పకుండ సాధించి యుంటారు. నావంటి అల్ప భాషాజ్ఞానియే దీనిని ప్రయత్నము చేసినప్పుడు, సంస్కృతాంధ్రములలో పాండిత్యము ఉన్నవారికి ఇది నల్లేరుపై బండి నడకే.
6) కామేశ్వరరావుగారు, సంస్కృత యతిని గురించి ఒక రెండు వాక్యాలు. నాట్యశాస్త్ర రచయితవంటివారు యతిని పూర్తిగా అంగీకరించలేదు. మిగిలినవారు కూడ మొట్ట మొదట తప్పకుండా పాటించినా, తరువాత పదాలను సంధితో యతిస్థానము వద్ద కలపడము ఒక ఆభరణములాటిది అనుకొన్నారు. దీనికి కాళిదాసాదికవులను పొగిడారు కూడ. నావరకు నేను యతి స్థానము వద్ద విరుపు లేక సంధి అవసరమని భావిస్తాను. పదాలను యతి స్థానములో దూసుకొని వెళ్లేటట్లు వ్రాయడము, పాదాంత యతి లేకుండ వ్రాయడము నాకు రుచించదు. పాదాంతయతి ఉపజాతులలో తప్పక అందరు పాటిస్తారు, కందములో రెండవ పాదానికి పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు యిది నియతము. ఇక పోతే ఆషాఢస్య ప్రథమదివసే అనేటప్పుడు స్య గురుతుల్యమే. ఉదాహరణగా సంస్కృతములో పాదాంత లఘువును గురువుగా అంగీకరిస్తారు, ఎందుకంటే అక్కడ విరామము వస్తుంది కనుక. విరామము ఉన్నప్పుడు సంస్కృతములో లఘువు సామాన్యముగా గురుతుల్యమే.
పాదాంత యతి ఉన్నప్పుడు, పాదారంభములో అచ్చులను వాడుతారు, సంధి లేకుండా కూడ. ఇక మధ్యలో సామాన్యముగా అచ్చులను య-కారముతో తెలుపుతారు.
7) కామేశ్వరరావు గారు, నేను ఇంకా మందాక్రాంత వృత్తరచనను అభ్యాసము చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 30 వ్రాసినాను, మందాక్రాంతపు లయతో సుమారు 15 పద్యాలు, జాతి పద్యముగా సుమారు 25 వ్రాసియున్నాను. ఇందులోని కిటుకులను ఇంకా నేర్చుకొంటున్నాను. వీలు దొరికినప్పుడు వీటిని అంతా ఒకే చోట ఉంచడానికి ప్రయత్నము చేస్తాను.
ఇదే ఒక చిన్న వ్యాసములా తయారైనందులకు సంపాదకులు మన్నిస్తారనే ఆశతో
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
05/06/2012 6:13 pm
మోహనరావు, బ్రహ్మానందం, జయప్రభ పాఠకస్పందన గురించి చాలా లోతైన విషయావలోకనకి దారితీసే అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ వ్యాసానికి నేరుగా సంబంధించకపోయినా ఈ “పాఠకస్పందన” గురించి నాకు కలిగిన కొన్ని సాధకబాధకాల్ని “ఈమాట” పాఠకుల ముందుంచుతాను.
1. రచనలో రచయిత పాత్ర. మీరు ఒక సాంకేతిక పరిశోధనాపత్రం రాసి ప్రచురించదల్చుకున్నారనుకోండి. దాన్లో విధిగా మొదల్లోనో (కొన్నిట్లో చివర్లోనో) ఆ విషయం మీద అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిశోధనల్ని క్లుప్తంగా వివరించి, మీరు చేస్తున్నపని వాటికన్నా ఏ విషయాల్లో భిన్నమైందో, ఎలా ఆ సమస్య పట్ల మన అవగాహనని విస్తృతం చేస్తుందో, మీరు చేస్తున్న ముఖ్యమైన contributions ఏమిటో ఏకరువు పెడతారు. అప్పుడు ఆ పత్రాన్ని పరిశీలించే పరిశీలకులు (reviewers) మిగిలిన వాళ్ల, మరియు మీసొంత contributions గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యాలో కాదో నిర్ణయించి, మీ contributions విలువ మీరు ప్రచురించ ప్రయత్నిస్తున్న పత్రిక (journal, conference proceedings etc) స్థాయికి సరితూగుతుందా లేదా అని బేరీజు వేసి ఆ పత్రాన్ని ప్రచురణార్హమైందో కాదో తేలుస్తారు. ఆ పరిశీలకులు మీరు పనిచేస్తున్న అంశం లోనో, దానికి దగ్గరగా వుండే అంశాల లోనో ఉద్దండులు కనుక ఈ పని చెయ్యగలుగుతారు (ఎప్పుడూ కాకపోవచ్చు కాని అత్యధిక శాతం విషయంలో ఇది నిజం).
కవితల్నీ కథల్నీ బావుందనో లేదనో చెప్పటానికి విస్తృతమైన పాండిత్యం పనికొస్తుందేమో కాని అవసరం మాత్రం కాదు, ఎందుకంటే వాటిని బేరీజు వెయ్యటం హృదయసంబంధి విషయం. వ్యాసాలు అలా కాదు. అవి మేధోసంబంధితాలు. (చాలా మంది తెలుగు కవులు ఈ తేడా తెలియక వ్యాసాల్ని కవితల్లా రాయటానికి ప్రయత్నించటమూ కవితలరూపంలో అప్రయత్నంగానే వ్యాసాలు రాయటమూ మనకు కొత్తకాదు గాని, అది ప్రస్తుతం అప్రస్తుతం.) కనుక ఒక వ్యాసాన్ని చదివినప్పుడు ఆ రచయిత contribution ఏమిటో ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు, (అ) ఎవరో రాసిన విషయాన్ని తన మాటల్లో మళ్లీ రాశాడా, (ఆ) రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాల్ని క్రోడీకరించి ఒకచోట చేర్చాడా, (ఇ) అదివరకు ఉన్న విషయాల్ని తీసుకుని వాటికి కొంత కొత్త అవగాహనని కలిపాడా, (ఈ) ఇదివరకు ఎవరూ చూడని ఒక కొత్త కోణం చూపిస్తున్నాడా, (ఉ) ఇదివరకు ఎవరూ ఊహించని కొత్త ఊహతో అదివరకున్న అవగాహనని తల్లకిందులు చేశాడా, (ఊ) అదివరకు అవగాహనే లేని విషయానికి ఒక సిద్ధాంత ప్రాతిపదికని కల్పించాడా,.. ఇలా ఎన్నో levels ఉన్నాయి. ముందే అనుకున్నట్టు సాంకేతిక రంగాల్లో ఐతే తను చేసిన పని ఏమిటో ఈ విశాల రేఖ మీద దాని స్థానం ఎక్కడని తను నమ్ముతున్నాడో చెప్పటం రచయిత పని. అతని ఆ అవగాహన ఖచ్చితమైందో కాదో నిశ్చయించటం పరిశీలకుల పని.
తను చేస్తున్న పని ఏమిటో చెప్పటం మన రచయితలకు అలవాటు లేదు. ఆ పని స్థాయి ఏమిటో చెప్పగలిగే పరిశీలకులు సాహిత్య ఔత్సాహికుల్లో చాలా కొద్దిమంది.
2. దేని గురించి రచయితని అభినందించాలి? ఒక వ్యాసంలో రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు ఆ రచయితని దేని గురించి అభినందించాలి? ఉదాహరణకి ఒక రచయిత చేసిన పని ఎన్నో చోట్ల ఉన్న విషయాల్ని సంగ్రహించి క్రోడీకరించి సంక్షిప్తీకరిచటం అనుకోండి. అప్పుడు అవసరమైన అన్ని విషయాల్ని సంగ్రహించాడా లేక ఏవైనా ముఖ్యమైన వాటిని సంప్రదించలేదా, క్రోడీకరణమూ సంక్షిపీకరణమూ సరిగా ఉన్నాయా లేవా అని వాటి గురించి అభినందనలో చీవాట్లో అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు. రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు, అది తెలుసుకునే జ్ఞానం పాఠకుడికి లేనప్పుడు, చేసే వ్యాఖ్యలు గుడ్డివాడి చేతిలోని రాయి వంటివే ఔతాయి కదా.
3. ఎవరు సరైన వ్యాఖలు చెయ్యగలరు? రచయితా, పరిశీలకులు పాఠకుడికి ఎలాటి సమాచారమూ ఇవ్వనప్పుడు బాధ్యతంతా పాఠకుడి మీదే పడుతుంది. పాఠకుడే ఆ రచనలో రచయిత తెచ్చిన కొత్త అవగాహన ఏమైనా వుందా? ఉంటే అదేమిటి? దాని విలువేమిటి? ఆ విలువ స్థాయి ఏమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది నేలబారుదా, సామాన్యమైందా, సగటుదా, ఉన్నతమైందా, అత్యున్నతమైందా, అద్భుతమైందా – అని బేరీజు వెయ్యగలగాలి. మామూలు పాఠకులకి ఇది సాధ్యం కాదు. కనుక ఏదో అనాలి కదా అనటమో లేకపోతే లేని పెద్దరికాన్ని మీద వేసుకుని తెలియని విషయాల్ని తెలిసినట్టు నటించటమో లేదా అలాటి నటన అలవాటైపోయి నిజంగానే పండితుణ్ణని భ్రమించటమో జరుగుతుంది.
4. అందరూ ఔత్సాహికులే ఐనప్పుడు. “ఈమాట” లాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు (ఏ నారాయణ రావు లాటి వారో తప్ప) ఔత్సాహికులు. అలాటి వారు తమకున్న అనేక ఇతర వ్యాపకాల నుంచి సమయం వెచ్చించి ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయటమే గొప్ప విషయం. కనుక అలాటి వారు రాసే వ్యాసాలకి professional స్థాయి ప్రమాణాలు వర్తిస్తాయా? వర్తించాలా? అది సాధ్యమా? కొంత lenience అవసరం అని బహుశా అందరూ ఒప్పుకోవచ్చుననుకుంటాను. ఐతే, ఎంత? ఉదాహరణకు, ఒక professionalకి “ఉన్నత” స్థాయి ఔత్సాహికుడి “సగటు” స్థాయికి సమానం అనొచ్చా? అంటే, professional scale మీద “సగటు” స్థాయిని చేరే వ్యాసాన్ని ఒక ఔత్సాహికుడు రాస్తే, దాన్ని “ఉన్నత” స్థాయి అని లెక్కవెయ్యొచ్చా? మరోవిధంగా చెప్పాలంటే, professionalకి, ఔత్సాహికుడికి తేడా “ఒక స్థాయి” అన్నమాట. కాదు, అది మరీ దగ్గర, రెండు స్థాయిల తేడా ప్రమాణం ఐతే బాగుంటుంది అనొచ్చు. ఏదో ఒకటి, ఒక ప్రమాణం ఒప్పుకుంటే అప్పుడు professional scale ని కొలమానంగా తీసుకుని ఔత్సాహికుల రచనల విలువని అంచనా కట్టొచ్చు.
చివరగా: మంచి రచనల్ని, మంచివి కాని వాటిని విడదియ్యలేనప్పుడు ఇటు వాసి రచయితలకూ అటు నాసి రచయితలకూ మరోవైపు పాఠకులకూ మంచి జరగదు. నాసి రచయితలు గొప్పవాళ్లమని విర్రవీగి విజృంభించటం, వాసి రచయితలు నీరుగారి నీరసించటం, పాఠకులు చెత్తలో కూరుకుపోయి ఆక్రందించటం జరుగుతాయి. తెలుగు సాహిత్యరంగంలో అలా విడదియ్యటానికి ఇప్పుడు కాలం అనుకూలం కాదు. ఈ జటిలసమస్యకి పరిష్కారం నాకు తెలియదు.
ఎందరో పెద్దవాళ్లు చెప్పినట్టు, రాయగలిగిన వాళ్లు రాస్తూ వుండాలి. ప్రతివారు చేసే ప్రతి రచన కళాఖండం కాదు కాని అభ్యాసంతో ఎప్పుడైనా ఒకటి బయటకు వచ్చే అవకాశం వుంది. “అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు”. ఈ విషయం రచయితలూ పాఠకులూ గ్రహిస్తే అందరికీ హాయి.
వారి వ్యాసంతో సంబంధంలేని విషయాల్ని రాసే అవకాశం ఇచ్చిన మోహనరావు గారి వ్యాసానికి అభినందనలు.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి Ramakrishna Reddy అభిప్రాయం:
05/06/2012 6:00 pm
చాల ఆనందముగ వున్నది ఎందువలనంతటే శిశువు నా పదవ తరగతి పాఠ్యాంశము. అప్పుడు నాకు అర్దం అవలేదు కాని నాకు అబ్బాయి జన్మించిన తర్వాత తెలిసింది కవి గొప్పతనము. నిజముగ ఇలాంటి గొప్ప కవులు జన్మించిన ఈ తెలుగుగడ్ద మీద జన్మించినందుకు గర్వపడుతున్నాను.
ప్రేమ కవితలు గురించి kambala rajendra అభిప్రాయం:
05/06/2012 5:11 pm
మీ కవిత నాకు చాలా బాగా నచ్చినది
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
05/06/2012 1:03 pm
మోహనగారు,
సంస్కృత తెలుగు యతులను రెండిటినీ పాటిస్తూ మీరు వ్రాసిన తెలుగు పద్యాలు బాగున్నాయి. అయితే వాటిలో మీరు చేసిన యడాగమ సంధుల గురించి చిన్న అనుమానం.
“యలయై రావా – యలఘుతర మో – దాబ్ధిలో ముంచ రావా”
వంటి చోట్ల యడాగమం చెయ్యవచ్చా అని.
తెలుగులో మందాక్రాంతం ఎందుకు అరుదు అన్న మీ ప్రశ్నకి మీ, “వాణిశ్రీదా – వరము లొసగన్ – వందన మ్మిత్తు దేవీ” అన్న పద్యమే సమాధానం అని నాకనిపించింది. మిగతా మూడు పాదాలలో ఉన్న అందం మొదటిపాదంలో ఉందా?
సంస్కృత యతుల గురించి నాకు చాలా రోజులుగా ఉన్న ఒక సందేహం ఇక్కడ అడగడం అసందర్భం కాదనుకుంటాను. సంస్కృతంలో యతి విరామస్థానం కదా. అంటే పద్యం చదువుతున్నప్పుడు అక్కడ కచ్చితంగా ఒక క్షణం ఆగాలి కదా. మరి అలాంటప్పుడు యతి స్థానంలోని అక్షరం సంయుక్తమైతే దాని ముందరి అక్షరం గురువవ్వడం సమంజసమెలా అవుతుంది? ఉదాహరణకి, “ఆషాఢస్య ప్రథమ దివసే” అన్నప్పుడు “స్య” అన్న అక్షరం “ప్ర” అక్షరం సంయుక్తం కావడం వల్ల గురువవుతోంది. కాని “ఆషాఢస్య” అని ఆపి తర్వాత “ప్రథమ దివసే” అని చదివేటప్పుడు “స్య” లఘువే కదా అవ్వాలి?
రవీ,
మీరుదహరించిన షట్పదికి “ఆధునిక”నామం ఏమిటో గుర్తించారా?:-)
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/06/2012 5:40 am
@Srinivas Vuruputuri గారు: నాకు తెలిసి అన్నమయ్య ఏడుకొండలు అని గానీ, ఏడుకొండల రాయడు అనిగానీ ఎక్కడా ప్రస్తావించలేదు. శాండిల్య సారథ్యంలో విడుదల చేసిన కాసెట్లలో మాత్రం “ఎండగానీ, నీడగానీ” అన్న పాటలో “కొండలరాయడే మా కులదైవము, ఏడు కొండలరాయడే మా కులదైవము” అని పాడారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన సాహిత్యంలో ఈ పాటలో “కొండలరాయడే మా కులదైవము” అని మాత్రమే ఉంది. ఏడుకొండలు, ఏడుకొండల రాయడు అన్న పదబంధాలు ఈ మధ్య కాలంలోనివనే నా అభిప్రాయం.
@Chintu గారు: చీంతు అంటే date-palm. తెలుగులో అది ఈఁత, ఈఁతాడ (సంస్కృతం: హింతాళ).
@సిద్దినెని గారు: Mayrhofer నిఘంటువు చాలా పాతది. అందులో ఎన్నో ధాతు నిర్ణయాలు ఇప్పుడు ప్రశ్నార్థకం. Witzel పేపరుతో పాటు, Fuller పేపర్లు, ఆయన బ్లాగులో చర్చలు, ఈ సంవత్సరమే వచ్చిన Southworth పేపరు కూడా చూడండి. Southworth ప్రతిపాదించిన విషయాలన్నీ నేను ఒప్పుకోను (ముఖ్యంగా బ్రాహుయి, ఈలమైట్ భాషల సంబంధం గురించి).
ధాన్య సంబంధమైన పదాల గురించి వివరంగా మరెప్పుడైనా చర్చించుకుందాం.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి రవి అభిప్రాయం:
05/06/2012 3:11 am
మోహన గారు, మీ వ్యాసాన్ని సమీక్షించి లేదా విమర్శించే స్థాయి నాకు లేదు. చక్కగా ఉంది అంటే సరిపోదు, ఈ వ్యాసం అలా ఉబుసుపోక చదివి అభిప్రాయం చెప్పేదీ కాదు, అంచేత నాకు కలిగిన కొన్ని ఆలోచనలు పంచుకుంటున్నాను.
>>కోపాన్ని, ధిక్కారాన్ని సూచించడానికి పృథ్వీవృత్తము ఉచితమైనది, అది ఈ భారాన్ని మోయగలదు. వర్షాకాలములో ప్రవాసములో విరహానుభవాన్ని వివరించడానికి మందాక్రాంతము చక్కగా శోభిస్తుంది.
మీరు ఉటంకించిన క్షేమేంద్రుని వ్యాఖ్య సంస్కృతానికి సరిగ్గా సరిపోతుంది. అయితే అదే విరహాన్ని తెలుగులో వర్ణించాలంటే మందాక్రాంతము సరిపోగలదా అన్న అనుమానం కలుగుతోంది. అందుకు కారణం యేభై పైగా తెలుగు అనువాదాలున్న ఈ కావ్యానికి ఒక్క అనువాదం కూడా తెలుగు మందాక్రాంతం లో లేదు.
భారతదేశంలో ఈ కావ్యానికి అత్యధికమైన అనువాదాలు తెలుగులోనే ఉన్నాయట. వీటిలో మొదటిది కొటికలపూడి వెంకటకృష్ణసోమయాజి గారి అముద్రితరచన (1864), మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయంలో ఉందట. అప్పటి నుండి నేటి వరకూ యేభై కి పైగా అనువాదాలు, గేయాలు, వచనాల రూపంలో కూడా వెలువడినాయి. వీటిలో కాస్త ప్రాచుర్యమైనవి రాయప్రోలు సుబ్బారావు గారి దూతమత్తేభము, విద్వాన్ విశ్వం గారి మేఘసందేశానువాదము, దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి రచనా మూడూ వరుసగా మత్తేభ, కంద, వృత్తాలలో వ్రాసి ఉన్నవి. ఇతర కవుల అనువాదాలు కూడా వృత్తాలలో, గేయాలలో ఉన్నవి. మందాక్రాన్తాన్ని యథాతథంగా తెలుగులో మేఘసందేశానువాదానికి వాడుకున్న కవులు కనిపించడం లేదు.
నిడదవోలు వెంకటరావుగారు ’షట్పదీ మేఘసందేశం’ అన్న ఒక అనువాదానికి పీఠిక వ్రాసి ఒకమాట ఇలా అన్నారు. “భామినీషట్పది వృత్తం మందాక్రాంత వృత్తముతో సన్నిహిత సంబంధమున్నది.” బహుశా మందాక్రాంతాన్ని అనువదించడానికి లేదా మంద్రాక్రాంతములో చెప్పగలిగిన భావానికి తెలుగులో సరిపోలగల వృత్తం షట్పదీ వృత్తం అయి ఉండవచ్చునని ఆయన అలా అన్నారేమోనని నా అనుకోలు. ఈ కావ్యంలో మొదటి పద్యాన్ని ఉటంకిస్తున్నాను. (కశ్చిత్కాన్తా … శ్లోకానికి అనువాదం)
“మునుపు యక్షుండొకఁడు తన ప్రియ
వనిత తోడుత నుండి యింటను
పనుపు సేయుట యందు నేమర వాంఛలకు లోఁగి
కనలి ధనదుఁడు శాపమిచ్చెను
వనజలోచనఁ బాసి వర్షము
వనములంబడి బ్రతుకు మంచును పవి కఠోరముగ
ఆననమ్మున గళలు దొరగఁగ
దీనుడై మిథిలేశ తనయా
స్నాన పుణ్యోదక వివర్ధిత సాంద్రతరుతతిని
మేని బడలిక మనసు సడలిక
మానుపంగల రామగిరిపై
పూనె నాతడు గడుప దినములు పోడిమిని వీడి.”
మీరు మందాక్రాంత లయకు దగ్గరగా ఉన్న మందాకిని అనువాదాలను సూచించారు. బావుంది. అయితే విరహానుభవం తెలుగులో ఉద్యోతించడానికి బహుశా షట్పదీ వృత్తం ఎక్కువగా పొసగవచ్చునన్న వెంకటరావు గారి అభిప్రాయం ఆలోచింపజేస్తున్నది.
జిజ్ఞాసువు,
రవి.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి lyla yerneni అభిప్రాయం:
05/06/2012 2:52 am
A treatise on మందాక్రాంతవృత్తము. A treat indeed.
Questions:
విశ్వనాథ సత్యనారాయణ తన నవల “దూత మేఘము – chapter 9, page 83. లో – ఉజ్జయినీ పురాధిపతి విక్రమాదిత్య చక్రవర్తి అస్థానములో ” ధన్వంతరి, క్షపణకుడు, అమరుడు, శంకరకవి, భేతాళభట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి అన్న నవరత్నములు – పెద్ద పండితులు, ఉన్నట్లు రాసారు.
అదే నవల మరొక పేజీలో (135) విక్రమాదిత్యుడు, కాళిదాసు సమవయస్కులనీ, విక్రమాదిత్యుడు కలి ప్రవేశించిన తరువాత మూడువేల ఒకటవ సంవత్సరములో జన్మించినట్లు రాసారు. విక్రమాదిత్యుని తండ్రి పేరు ప్రవరసేనుడు అని రాసారు.
ఈ వ్యాసములో – కాళిదాసు రెండవ చంద్రగుప్తుని కాలములో నివసించాడు, అతని ఆస్థానకవి. (క్రీ.శ .) నాలుగవ శతాబ్దపు అంత్యకాలములో జీవించాడు. చంద్రగుప్తుని తండ్రి సముద్రగుప్తుడు – అని ఇచ్చారు.
ఏమిటీ తేడాలు. వివరించరూ.
లైలా.
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
05/06/2012 12:46 am
సురేశ్ గారూ,
ధన్యవాదాలు. ”ram” ని she goat అనడం అచ్చు తప్పేమోనని, పునరుక్తి ఆని కాదు!
చావల్ ద్రవిద భాషల్లో ఉనికిలో ఉందంటారా/ తణ్దుల విషయం? భియ్యం అనే అర్ధం లో ‘వ్రిహి’ కి స్పష్టత వుంది.
The case of rice in Sanskrit is believed to be a loan from Proto Dravidian, first appeared in Yajurveda, and the sanskritised term, via The Avestan is the source for all the European languages.
Yajurveda vrihi/vrihis > vrize {Avestan/Old Persian]>oryza [Greek] >riso[Latin ]
All the European languages are believed to have borrowed the term either from Greek or from Latin.
Reis in German,
Riz in French,
reis in welsh,
ryz in Polish,
Rice in English
Riza in Polish.
Riso [Italian].
But the origin and growth of’ tandula ‘and ‘chaval’ are yet to be probed into..
Etymological Dictionary of Sanskrit by Mayrhofer and The Linguistic History of Sme Indian Domestic Plants by Michael Witzel, give relevant data.
విధేయుడు,
సిద్దినెని భావ నారాయణ.