>పుస్తకాలమనిషి లంకా సూర్యనారాయణగారు నిర్వహిస్తున్న అపురూపమైన అన్నమయ్య గ్రంథాలయం సందర్శించాను.
ఆ గ్రంథాలయంలోనే చాగంటివారు వ్రాసిన ‘ఆధునికవిజ్ఞానము – మానవుడు’ (యం. శేషాచలం అండ్ కంపెని 1958, 64) మూడు ప్రతులున్నాయి. ఆ పుస్తకపు చివరి అట్టపై డాక్టర్ చాగంటివారి ఫొటో ఉంది.
డా భార్గవి: డా చాగంటి సూర్యనారాయణ మూర్తిగారి గురించి ఈ విషయం నాకు ఇప్పటిదాకా తెలీదమ్మా. బెజవాడలో వారి హస్పిటల్ బాగా ఫెమిలియర్ ప్లేస్. నా చిన్నతనంలో – మూడు, నాలుగు తరగతుల రోజులు – సరస్వతీ టాకీస్ దగ్గరలో ఉన్న మా ఇంటికి వచ్చి మా తాతగారికి ఇంటి దగ్గరే సర్జరీలు చేయడం గుర్తుంది.
మరొక పెళ్ళికూతురు: సీత: (ఈమధ్య నా పెద్దన్న నాకు వాట్సాప్లో పంపినది యథాతథంగా: పంపినది పంపినట్టుగా)
మరొక జ్ఞాపకం: ముఖపుస్తక మిత్రురాలు చి.సౌ.శిరీష తంగిరాలగారి సీతను చదవంగానే నాఆత్మీయమిత్రుడు శ్రీ చల్లాసీతారామాంజనేయులు గారు స్ఫురించారు. వారిప్పుడు కీర్తిశేషులు.
వారొకప్పుడు వారి మేనల్లుడు చదువుతున్న “బారులు తీరి కేల కరవాలములం ధరియించి కూరుచున్నారు… జానకి చూచువారి నోరూరగ…” పద్యాన్ని విని ఎవర్రా రాసింది? అని అడిగారట. మేనల్లుడు సమాధానమిచ్చాడు. చూచువారి నోరూరటానికి సీతాదేవి మిఠాయిపొట్లమా! అన్నారట.నువ్వైతే ఎలా రాస్తావు మామా? అని అల్లుడు అడిగాడట. వీరు మరునాడు అల్లుడిని పిలిచి సీత అంటే ఏమిటో విను:
పతింవర
******
“మనసులోనున్న వాంఛితమ్మునకు రూప మొదవినట్టుల నా పురామృదుల పుణ్యలతకు ఫలమట్ల ఈ వీర లలిత మూర్తి, తా నవతరించి నన్ను సౌఖ్యాన కెత్తు! 1
మళ్ళీ నేను: చల్లావారితొ పరిచయం 1973,74లలో ఒక సంక్రాంతికి బెజవాడ సోనొవిజన్ మేడమీద జరిగిన స్వీయకవితా పఠన కార్యక్రమలో నేనూ నా పెద్దన్న శ్రీ సుబ్రహ్మణ్య శర్మా శ్రీ చల్లా మా మా కవితలు చదివిన సందర్భంలో కార్యక్రమం ముగిసిన తర్వాత కలిసిన పలకరింపులతో మొదలై 2004-05ల దాకా నడిచింది. వారు విశ్వనాథకు పరమ ఆత్మీయులు. వారు నాకు రెండు మూడు సార్లు చెప్పిన ఒక వివరం: “ఆంజనేయులూ నా పెళ్ళికి పంచరత్నాలు నువ్వు సంస్కృతంలో రాయి. తెలుగులో నేను రాసుకుంటానులే!” శ్రీ కొంగర జగ్గయ్య – గుంటూరు లో వారి సహాధ్యాయి మిత్రుడు.
శ్రీ చల్లా నా పెళ్ళికీ మా అబ్బాయి పెళ్ళికీ పంచరత్నాలు రాశారు.
Beautiful writing.
Once you read it, Debussy’s ‘Claire de Lune’ will be the perfect piece of music to listen to, tonight, it occurs to me.
Have a lovely week all! – Lyla
సుకుమారసుందరమైన ఊహ, దానికి తగిన పద్యరచన, దానికి సరితూగే వ్యాఖ్య. సీతాదేవి రూపంలో తిలక్ తానే శ్రీరాముని దర్శించి పరవశించి వ్రాసిన కవిత అనిపిస్తుంది.
“తిలక్ పద్యరచనావిధానం చూసినప్పుడల్లా నాకు కలిగే ఆలోచన, దీన్ని ఏ మాత్రం గ్రాంథికంగా బిగించినా ప్రబంధకవుల పద్యమైపోతుంది. సడలిస్తే పద్యం కాకుండా పేలవమై వ్యావహారికమైపోతుంది.”
గొప్ప ఆలోచన!
నాకు నచ్చిన పద్యం శీర్షిక పరిమి శ్రీరామనాథ్ గారిచేత పునఃప్రారంభం కావడం చాల సంతోషంగా ఉంది.
మంచి రచనలు, అవి కథలు గాని, కవితలు గాని ఇప్పుడూ వస్తున్నాయి. కాని పాఠకులలో చదివే అలవాటు, అభిరుచి తగ్గిపోతున్నాయి. అందువల్ల పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. చివరికి రచయితలే పాఠకులుగా మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. ఏ రచనలైనా సమకాలీన సమాజంలోని సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, వీలైనంత పరిష్కారం చూపిస్తే అటువంటి రచనలు కొంత కాలమైనా నిలబడతాయని నా అభిప్రాయం. మన సినిమాలకు కథలు దొరక్క ఎలాగైతే ఒక స్తబ్ధత ఏర్పడిందో, అలాగే మన రచయితలకు సరైన కథా వస్తువులు దొరకటం లేదు. ఒక తరం వెనక్కు వెళితే సమాజంలో అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. క్రమంగా తగ్గుతున్నాయి. వరకట్నం, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం ఇతివృత్తంగా ఎన్నో రచనలు వచ్చేవి. ఇప్పుడు అసలు వైవాహిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా మారుతున్న సమాజంలో సరైన సమస్యలను ఎంచుకుని మంచి కథలుగా మలిచే రచయితలు తక్కువగా ఉన్నారు. ఇక పుస్తక ముద్రణ అనేది వ్యక్తిగతం. రచయితను అనిపించుకోవాలి, నా పేరు ప్రింట్ లో చూసుకోవాలి అనేవాళ్ళు ఆ పుస్తకాలను బంధు మిత్రులకు ఉచితంగా పంచుతున్నారు. కొన్ని పత్రికలు మంచి థీమ్ లను నిర్దేశిస్తూ కథల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఇది ముదావహం. ….జయంతి.
పరిచయం: డాక్టర్ కథ గురించి Yerikalapudi Vasudeva Rao అభిప్రాయం:
02/08/2023 1:29 pm
శ్రీ శేషతల్పశాయి,
డవున్లోడ్ చేసుకున్నాను. ధన్యవాదాలు. (ఆధునిక విజ్ఞానము-మానవుడు by చాగంటి సత్యనారాయణమూర్తి అని ఉంది గమనించారా.)
నమస్కారాలతో
-ఎ వా రా
ఆమె దుఃఖించింది గురించి k.venkata Rama Krishna అభిప్రాయం:
02/08/2023 8:38 am
చాలా బావుంది
పరిచయం: డాక్టర్ కథ గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:
02/07/2023 4:27 am
>పుస్తకాలమనిషి లంకా సూర్యనారాయణగారు నిర్వహిస్తున్న అపురూపమైన అన్నమయ్య గ్రంథాలయం సందర్శించాను.
ఆ గ్రంథాలయంలోనే చాగంటివారు వ్రాసిన ‘ఆధునికవిజ్ఞానము – మానవుడు’ (యం. శేషాచలం అండ్ కంపెని 1958, 64) మూడు ప్రతులున్నాయి. ఆ పుస్తకపు చివరి అట్టపై డాక్టర్ చాగంటివారి ఫొటో ఉంది.
https://archive.org/details/in.ernet.dli.2015.328681/page/n119/mode/2up
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
పరిచయం: డాక్టర్ కథ గురించి ఎరికలపూడి వాసుదేవ రావు అభిప్రాయం:
02/06/2023 6:51 pm
డా భార్గవి: డా చాగంటి సూర్యనారాయణ మూర్తిగారి గురించి ఈ విషయం నాకు ఇప్పటిదాకా తెలీదమ్మా. బెజవాడలో వారి హస్పిటల్ బాగా ఫెమిలియర్ ప్లేస్. నా చిన్నతనంలో – మూడు, నాలుగు తరగతుల రోజులు – సరస్వతీ టాకీస్ దగ్గరలో ఉన్న మా ఇంటికి వచ్చి మా తాతగారికి ఇంటి దగ్గరే సర్జరీలు చేయడం గుర్తుంది.
డా. జంధ్యాల దక్షిణామూర్తి గూడా వస్తూ ఉండేవారు.
నమస్కారాలతో
ఎ వా రా
పరిచయం: డాక్టర్ కథ గురించి Anwar అభిప్రాయం:
02/06/2023 11:48 am
చాలా గొప్ప పుస్తకం గురించి గొప్పగా సమీక్షించారు.
అద్భుతమైన పుస్తకాన్ని మళ్లీ ముందుకు తెచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు
నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు గురించి ఎరికలపూడి వాసుదేవ రావు అభిప్రాయం:
02/06/2023 10:20 am
మరొక పెళ్ళికూతురు: సీత: (ఈమధ్య నా పెద్దన్న నాకు వాట్సాప్లో పంపినది యథాతథంగా: పంపినది పంపినట్టుగా)
మరొక జ్ఞాపకం: ముఖపుస్తక మిత్రురాలు చి.సౌ.శిరీష తంగిరాలగారి సీతను చదవంగానే నాఆత్మీయమిత్రుడు శ్రీ చల్లాసీతారామాంజనేయులు గారు స్ఫురించారు. వారిప్పుడు కీర్తిశేషులు.
వారొకప్పుడు వారి మేనల్లుడు చదువుతున్న “బారులు తీరి కేల కరవాలములం ధరియించి కూరుచున్నారు… జానకి చూచువారి నోరూరగ…” పద్యాన్ని విని ఎవర్రా రాసింది? అని అడిగారట. మేనల్లుడు సమాధానమిచ్చాడు. చూచువారి నోరూరటానికి సీతాదేవి మిఠాయిపొట్లమా! అన్నారట.నువ్వైతే ఎలా రాస్తావు మామా? అని అల్లుడు అడిగాడట. వీరు మరునాడు అల్లుడిని పిలిచి సీత అంటే ఏమిటో విను:
పతింవర
******
“మనసులోనున్న వాంఛితమ్మునకు రూప మొదవినట్టుల నా పురామృదుల పుణ్యలతకు ఫలమట్ల ఈ వీర లలిత మూర్తి, తా నవతరించి నన్ను సౌఖ్యాన కెత్తు! 1
తాత్త్వికులెల్ల మన్నిటల తాండవకుంకుమ రాగ వీరప
త్నీత్వ మహోగ్రరేఖ గణుతించి వచించిరి తండ్రి “కీమె శౌ
ర్యత్వ మహత్త్వపూర్ణుడగు రాజసమూర్తికి రాజ్ఞియౌ”నటం-
చా త్వరపెట్టు వాంఛ హృదయమ్మున నేండ్లు భరించి యుంచితిన్! 2
భోగము ఆస చేయను;విభుత్వ ప్రభుత్వము కోరుకోను నా-
యోగము పండెనేని ప్రథనోగ్ర భుజోజ్వల శౌర్యమూర్తి అ-
భ్యాగతుడౌను గావుత; ప్రభావిత మామక భాగ్యమౌ ధను
-ర్యాగ మహోత్సవమ్మునకు రాగ నవోదయ మైన వేళకున్! 3
ఈతని చేత వింటి కొన లెంతగ వంగెనొ!శత్రు వక్ర రే-
ఖాతి పరాక్రమమ్ములటు,లల్లరి తుమ్మెద లల్లెత్రాటి మ్రో-
తై తెగి యాడెనే ప్రణయ తాండవ కన్యక వోలె నారి;నా-
చేతము నందు; కండ్ల నును సిగ్గులు మూయగ వీని చూపులై! 4
మా జనకుడు నా కొరకు మంగళమే పొనరించినాడునా
పూజలకైన లక్ష్యంమగు పుణ్యుడటే;యితడాత్మ శౌర్యహే
లాజయ సూచకోన్నత విలాసం వలాహక నీల మూర్తి;వే
లాజలు చల్లునట్లు చెలులందరు ఈతనివైపె చూస్తుంటే! 5
జయలక్ష్మీ మృదుపీఠమైన విరళాశ్మ ప్రౌడ వక్షస్సము-
ఛ్ఛ్రయదేశంబున మాలకట్టెదను హస్తాబ్జాత యుగ్మాన; హై
మ యశఃక్షౌమము చుట్టెదన్ పృధు మహాంసస్నిగ్ధతూణీరమౌ
గ్ధ్యయుతోపాంతమునన్, మనోజ్ విశిఖాకారంబులౌ వ్రేళులన్!6
శ్రీ సుమదీప్తిమన్మమతలే,తలబ్రాలుగ చల్లెదన్,లతా
పేశలకుంతలాఢ్యునకు; వేణు మృగాలకు రాగతోయముల్
పోసెద క్షాత్రధారలుగ,భౄధనురంతర దేశలగ్న దీ
ర్ఘాసమ నాసికాశుగ విరాడ్యువతీ వికసన్మనోహరున్! 7
క్షమ హృదయమ్ము,బుద్ధిని వికాసము, చిత్తము సుస్థిరత్వ మం
గమును శుచిత్వమై,విషయకంటక దూరగమౌ మనస్సుతో,
విమలయశో2భివర్తను, పవిత్ర చరిత్రు,పతింవరాశిరో2
గ్రమణి వరించె,నీలమృదులద్యుతిమత్సమభక్త దేహునిన్!!8
(శ్రీ చల్లా సీతారామాంజనేయులుగారి కావ్యమాల (1968)నుండి. అంతర్వాణి-వారి కలంపేరు)
****
మళ్ళీ నేను: చల్లావారితొ పరిచయం 1973,74లలో ఒక సంక్రాంతికి బెజవాడ సోనొవిజన్ మేడమీద జరిగిన స్వీయకవితా పఠన కార్యక్రమలో నేనూ నా పెద్దన్న శ్రీ సుబ్రహ్మణ్య శర్మా శ్రీ చల్లా మా మా కవితలు చదివిన సందర్భంలో కార్యక్రమం ముగిసిన తర్వాత కలిసిన పలకరింపులతో మొదలై 2004-05ల దాకా నడిచింది. వారు విశ్వనాథకు పరమ ఆత్మీయులు. వారు నాకు రెండు మూడు సార్లు చెప్పిన ఒక వివరం: “ఆంజనేయులూ నా పెళ్ళికి పంచరత్నాలు నువ్వు సంస్కృతంలో రాయి. తెలుగులో నేను రాసుకుంటానులే!” శ్రీ కొంగర జగ్గయ్య – గుంటూరు లో వారి సహాధ్యాయి మిత్రుడు.
శ్రీ చల్లా నా పెళ్ళికీ మా అబ్బాయి పెళ్ళికీ పంచరత్నాలు రాశారు.
ఎ వా రా
నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు గురించి Lyla yerneni అభిప్రాయం:
02/05/2023 8:30 pm
Beautiful writing.
Once you read it, Debussy’s ‘Claire de Lune’ will be the perfect piece of music to listen to, tonight, it occurs to me.
Have a lovely week all! – Lyla
నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
02/05/2023 4:43 am
సుకుమారసుందరమైన ఊహ, దానికి తగిన పద్యరచన, దానికి సరితూగే వ్యాఖ్య. సీతాదేవి రూపంలో తిలక్ తానే శ్రీరాముని దర్శించి పరవశించి వ్రాసిన కవిత అనిపిస్తుంది.
“తిలక్ పద్యరచనావిధానం చూసినప్పుడల్లా నాకు కలిగే ఆలోచన, దీన్ని ఏ మాత్రం గ్రాంథికంగా బిగించినా ప్రబంధకవుల పద్యమైపోతుంది. సడలిస్తే పద్యం కాకుండా పేలవమై వ్యావహారికమైపోతుంది.”
గొప్ప ఆలోచన!
నాకు నచ్చిన పద్యం శీర్షిక పరిమి శ్రీరామనాథ్ గారిచేత పునఃప్రారంభం కావడం చాల సంతోషంగా ఉంది.
ఫిబ్రవరి 2023 గురించి JVVSN Murthy అభిప్రాయం:
02/05/2023 2:30 am
మంచి రచనలు, అవి కథలు గాని, కవితలు గాని ఇప్పుడూ వస్తున్నాయి. కాని పాఠకులలో చదివే అలవాటు, అభిరుచి తగ్గిపోతున్నాయి. అందువల్ల పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. చివరికి రచయితలే పాఠకులుగా మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. ఏ రచనలైనా సమకాలీన సమాజంలోని సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, వీలైనంత పరిష్కారం చూపిస్తే అటువంటి రచనలు కొంత కాలమైనా నిలబడతాయని నా అభిప్రాయం. మన సినిమాలకు కథలు దొరక్క ఎలాగైతే ఒక స్తబ్ధత ఏర్పడిందో, అలాగే మన రచయితలకు సరైన కథా వస్తువులు దొరకటం లేదు. ఒక తరం వెనక్కు వెళితే సమాజంలో అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. క్రమంగా తగ్గుతున్నాయి. వరకట్నం, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం ఇతివృత్తంగా ఎన్నో రచనలు వచ్చేవి. ఇప్పుడు అసలు వైవాహిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా మారుతున్న సమాజంలో సరైన సమస్యలను ఎంచుకుని మంచి కథలుగా మలిచే రచయితలు తక్కువగా ఉన్నారు. ఇక పుస్తక ముద్రణ అనేది వ్యక్తిగతం. రచయితను అనిపించుకోవాలి, నా పేరు ప్రింట్ లో చూసుకోవాలి అనేవాళ్ళు ఆ పుస్తకాలను బంధు మిత్రులకు ఉచితంగా పంచుతున్నారు. కొన్ని పత్రికలు మంచి థీమ్ లను నిర్దేశిస్తూ కథల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఇది ముదావహం. ….జయంతి.
వాడి కథ గురించి ప్రగతి అభిప్రాయం:
02/04/2023 8:25 am
అద్భుతమైన కథ రాశావు భాస్కర్. రచయితలుగా చెప్పుకుంటున్న వాళ్లంతా చదవాల్సిన కథ.