మీకు ఈ వ్యాసం నచ్చితే సంతోషం. నచ్చ లేదని రాస్తే నేనేమీ అనుకోను. జిహ్వ కో రుచి అని సరిపెట్టుకుంటాను. రాసిన విషయంలో తప్పులు దొర్లాయా చెప్పండి, సరిదిద్దుకుంటాను.
ఈ వ్యాసం చదివాక నాటకం అంటే ఇదీ అన్న విషయం తెలియాలని కాస్త విస్తృతం గా రాసాను. ఇంకా చాలా విషయాలు చర్చించ వచ్చు. “ఈ మాట” లో ప్రోమినెంట్ రైటర్ల లో మీరు ముఖ్యులు అంటూ రాసారు. మీరు రాసిన కామెంటుకీ, ఈ వ్యాసానికీ, నా జవాబుకీ అది ఏ విధంగా వర్తిస్తుంది? నాకు అనిపించిన సమాధానం రాసాను.
చివరిగా, మీరు ఎద్దేవా చేసినట్లుగా నేను “పి.హెచ్.డి” కోసం ఈ వ్యాసం రాయలేదు. ఈ సారి నాటకాల మీద వ్యాసం రాయదల్చుకుంటే మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.
సాయి గారూ,
2008 లో రాసిన వ్యాసం ఇది. 1900 లలో రాసినట్టుంది.
నిజవే నాటకరంగం లో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం శుధ్ధ దండగ.
“ఈ మాట” లో ప్రోమినెంట్ రైటర్ల లో మీరు ముఖ్యులు.
“నా ఈ వ్యాసం పరిధి, పరిమితి ఉద్దేశ్యం వేరు” అని సెలవిచ్చేరు.
ఈ వ్యాసానికి పరిధి లేదు. పరిమితి అసలు లేదు. సదుద్దేశం వుంది. అందుకే పదకొండు పేజీలు చదివేను.
పదకొండు పేజీల “ఉద్గ్రంథం”. “పి.హెచ్.డి” సంపాదించగలదేమో.
సమకాలీన నాటకాలన్నీ ప్రస్తావించే అవసరం ఉందా? అది వేరొక వ్యాసంలా తయారవుతుంది. సమకాలీన నాటకాల గురించి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు పుస్తకం రాసారు. నా ఈ వ్యాసం పరిధి, పరిమితి, ఉద్దేశ్యం వేరు. తెలుగు నాటకరంగంలో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం వల్ల కొత్తగా చెప్పేదేమీ ఉండదని అనిపించింది. అన్నీ అందరికీ నచ్చాలని లేదు కదండీ?
ఈ కధ చదివాక, “రచయిత ధైర్యాన్ని మెచ్చుకోవడానికీ”, “విమర్శలు చేసిన రచనా దురంధురల (దుస్) సాహసాన్ని ప్రస్తావించడానికీ” మీకెంత ‘హక్కు’ వుందో, అంతే ‘హక్కు’, ఈ కధ నచ్చని వారికి, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడానికి వుంటుంది.
ప్రతీ కధా ఒక నీతిని బోధించాలి అని ఎవరూ అనరు. అయితే రచయిత ఆ కధని చెప్పేటప్పుడు, దాని లోని విషయాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏకీభవించడమో, విమర్శించడమో చేస్తాడు. వార్తా విలేఖరి మాత్రమే ఒక విషయంలోని సత్యాసత్యాల్ని ఒక వార్తలాగా చెప్పి వూరుకుంటాడు. రచయితలు సమాజం లోని విషయాలనే తమ రచనల్లోనూ ప్రతిబింబిస్తారు. దాన్ని బట్టీ పాఠకులు తమ చైతన్యానికి అనుగుణంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు.
“పాఠకులకు బాధ్యతలే వుంటాయీ, హక్కులు వుండవూ” అని మీరు అనడం నిజంగా సాహసమే. ఈ అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తాను. ఒక రకంగా చూస్తే, పాఠకుడికి రచనకి సంబంధించి ఒక బాధ్యత అంటగట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఒక రచనకి సంబంధించి, పరిమితుల్లో, తన చైతన్యానికి అనుగుణంగా, స్పందించే హక్కు ఒక పాఠకుడికి ఎప్పుడూ వుంటుంది. విమర్శ సహేతుకంగా వుంటే, ఇతర పాఠకులు కూడా అంగీకరించొచ్చు, లేదా విభేదించొచ్చు. లేకపోతే రెండు మాటల్లో, “నచ్చలేదూ, ఈ కధ అనవసరం” అంటూ, తన అభిప్రాయం చెప్పుకోవచ్చు. రచయిత తన రచనని పబ్లిక్ లో పెట్టినప్పుడు, ఇటువంటి విమర్శలకి సిద్ధపడి వుండాలి. అభిప్రాయాలని సెన్సార్ చెయ్యడానికి ఈమాట వారు ఎప్పుడూ వున్నారు.
ఆఖరుగా చెప్పొచ్చేదేమంటే, పరిమితుల్లో, ఒక పాఠకుడికి ఒక కధ ఎంత వరకూ పనికి వస్తుందీ అని చెప్పే హక్కు వుంటుంది అని. రచయితలు రాసేదే పాఠకుల కోసం కనుక.
ఇంకో విషయం. మీరు, “లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా” అని అడిగారు.
కధలోని పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడం ఏమిటీ? అవి కధలో పాత్రలు కదా? కధ చదివే వాళ్ళు ఆ పని చేస్తారు. రచన చేసేటప్పుడు రచయిత కూడా ఆ పని చేస్తాడు. తాను సరి అనుకున్నదే తన పాత్రల చేత చెప్పిస్తాడు విమర్శ లేకుండా. పాఠకులు కూడా తాము సరి అనుకున్నవాటితో ఏకీభవిస్తారు. లేదా విమర్శిస్తారు. వారికి ఆ హక్కు లేదనే హక్కు మీకు లేదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒక పాఠకులే కదా?
సాయి బ్రహ్మానందం గారూ,
“తెరమరుగౌతున్న తెలుగు నాటకం” శీర్షికన మీరు సంస్కృత నాటకాల్ని స్పృశించి, పద్య నాటకాల్ని పరామర్శించి, ఆ తరవాత నాటకం ఎలా రాయాలి, ఎలా “డైరెక్ట్” చెయ్యలి, ఎలా నటించాలి, “మేకప్పు”, రంగాలంకరణ, నంది ఎవార్డులు ఇత్యాది అద్భుతంగా వివరించేరు.
ఈ వ్యాసంలో వుదహరించిన నాటకాలన్నీ “కాంటెంపరరీ” నాటకాలు కావు. బహుశా “నిజం” ఒక్కటే అనుకుంటాను.
గణేష్ పాత్రో “పావలా”, ధవళ కుర్రాడి “షిప్పొచ్చింది” ఇత్యాది అసలు ప్రస్తావించబడలేదు.
మధ్యలో వీధి నాటకాలొచ్చేయి: “టామీ టామీ టామీ” ఇత్యాది.
ఎ.ఆర్.కృష్ణ “కష్టం” మీ వ్యాసంలో కనబడలేదు.
రావి కొండల రావు గారు ఓ ఇరవైయ్యేళ్ళ కిందటే “తెలుగు సినిమాని కాపీ కొట్టి తెలుగు నాటక రంగం భ్రష్టు పట్టి పోతోంది” అని “ఆంధ్రజ్యోతి” లో బాధపడ్డారు.
ఇంత “సబ్జెక్ట్” వుండి ఇలాటి వ్యాసం?
మొత్తం పదకొండు పేజీలూ చదివిన తరవాత, ఆచార్య తిరుమల రామచంద్ర గారు ఈ మాట మొదటి సంచికలో రాసిన “తెలుగు వ్యాసం” మరొకసారి చదివితే గాని మనసు నిమ్మళించలేదు.
క్షమించాలి.
నిన్న పార్లమెంటులో ప్రధాని ప్రసంగంలో జ్యోతిష్యాన్ని గురించి ప్రస్తావించారు. కొందరు రాజకీయ ప్రముఖులు జ్యోతిష్కుల సలహాలని అనుసరించే తమ స్ట్రాటజీల్ని నిర్ణయించుకున్నారట. జ్యోతిష్యంలో సత్తా ఉందో లేదో తెలియదు గానీ, డబ్బుతో పాటూ ఇది కూడా భారత రాజకీయాల్ని కూడా శాసిస్తోంది. ఏదేమైనా జ్యోతిష్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వెయ్యకూడదు.
అంతర్మథనం గురించి narsi అభిప్రాయం:
07/24/2008 2:57 am
నిజంగా చాలా బాగుంది.
నేను – నువ్వు గురించి sravanthi అభిప్రాయం:
07/24/2008 2:14 am
“ఆ క్షణం నేను
నీ మనసున మనసవుతాను
నేను నువ్వవుతాను”
కవిత లోని ఈ చివరి వాక్యాలు మనసుని స్పందించేల చేసాయి..
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
07/23/2008 10:14 pm
బాబ్జీలు గారూ,
మీకు ఈ వ్యాసం నచ్చితే సంతోషం. నచ్చ లేదని రాస్తే నేనేమీ అనుకోను. జిహ్వ కో రుచి అని సరిపెట్టుకుంటాను. రాసిన విషయంలో తప్పులు దొర్లాయా చెప్పండి, సరిదిద్దుకుంటాను.
ఈ వ్యాసం చదివాక నాటకం అంటే ఇదీ అన్న విషయం తెలియాలని కాస్త విస్తృతం గా రాసాను. ఇంకా చాలా విషయాలు చర్చించ వచ్చు. “ఈ మాట” లో ప్రోమినెంట్ రైటర్ల లో మీరు ముఖ్యులు అంటూ రాసారు. మీరు రాసిన కామెంటుకీ, ఈ వ్యాసానికీ, నా జవాబుకీ అది ఏ విధంగా వర్తిస్తుంది? నాకు అనిపించిన సమాధానం రాసాను.
చివరిగా, మీరు ఎద్దేవా చేసినట్లుగా నేను “పి.హెచ్.డి” కోసం ఈ వ్యాసం రాయలేదు. ఈ సారి నాటకాల మీద వ్యాసం రాయదల్చుకుంటే మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి baabjeelu అభిప్రాయం:
07/23/2008 5:02 pm
సాయి గారూ,
2008 లో రాసిన వ్యాసం ఇది. 1900 లలో రాసినట్టుంది.
నిజవే నాటకరంగం లో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం శుధ్ధ దండగ.
“ఈ మాట” లో ప్రోమినెంట్ రైటర్ల లో మీరు ముఖ్యులు.
“నా ఈ వ్యాసం పరిధి, పరిమితి ఉద్దేశ్యం వేరు” అని సెలవిచ్చేరు.
ఈ వ్యాసానికి పరిధి లేదు. పరిమితి అసలు లేదు. సదుద్దేశం వుంది. అందుకే పదకొండు పేజీలు చదివేను.
పదకొండు పేజీల “ఉద్గ్రంథం”. “పి.హెచ్.డి” సంపాదించగలదేమో.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
07/23/2008 11:07 am
సమకాలీన నాటకాలన్నీ ప్రస్తావించే అవసరం ఉందా? అది వేరొక వ్యాసంలా తయారవుతుంది. సమకాలీన నాటకాల గురించి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు పుస్తకం రాసారు. నా ఈ వ్యాసం పరిధి, పరిమితి, ఉద్దేశ్యం వేరు. తెలుగు నాటకరంగంలో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం వల్ల కొత్తగా చెప్పేదేమీ ఉండదని అనిపించింది. అన్నీ అందరికీ నచ్చాలని లేదు కదండీ?
ఇద్దరు దుర్మార్గులు గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
07/23/2008 10:47 am
అసంఖ్య ధవళ గారూ,
ఈ కధ చదివాక, “రచయిత ధైర్యాన్ని మెచ్చుకోవడానికీ”, “విమర్శలు చేసిన రచనా దురంధురల (దుస్) సాహసాన్ని ప్రస్తావించడానికీ” మీకెంత ‘హక్కు’ వుందో, అంతే ‘హక్కు’, ఈ కధ నచ్చని వారికి, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడానికి వుంటుంది.
ప్రతీ కధా ఒక నీతిని బోధించాలి అని ఎవరూ అనరు. అయితే రచయిత ఆ కధని చెప్పేటప్పుడు, దాని లోని విషయాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏకీభవించడమో, విమర్శించడమో చేస్తాడు. వార్తా విలేఖరి మాత్రమే ఒక విషయంలోని సత్యాసత్యాల్ని ఒక వార్తలాగా చెప్పి వూరుకుంటాడు. రచయితలు సమాజం లోని విషయాలనే తమ రచనల్లోనూ ప్రతిబింబిస్తారు. దాన్ని బట్టీ పాఠకులు తమ చైతన్యానికి అనుగుణంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు.
“పాఠకులకు బాధ్యతలే వుంటాయీ, హక్కులు వుండవూ” అని మీరు అనడం నిజంగా సాహసమే. ఈ అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తాను. ఒక రకంగా చూస్తే, పాఠకుడికి రచనకి సంబంధించి ఒక బాధ్యత అంటగట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఒక రచనకి సంబంధించి, పరిమితుల్లో, తన చైతన్యానికి అనుగుణంగా, స్పందించే హక్కు ఒక పాఠకుడికి ఎప్పుడూ వుంటుంది. విమర్శ సహేతుకంగా వుంటే, ఇతర పాఠకులు కూడా అంగీకరించొచ్చు, లేదా విభేదించొచ్చు. లేకపోతే రెండు మాటల్లో, “నచ్చలేదూ, ఈ కధ అనవసరం” అంటూ, తన అభిప్రాయం చెప్పుకోవచ్చు. రచయిత తన రచనని పబ్లిక్ లో పెట్టినప్పుడు, ఇటువంటి విమర్శలకి సిద్ధపడి వుండాలి. అభిప్రాయాలని సెన్సార్ చెయ్యడానికి ఈమాట వారు ఎప్పుడూ వున్నారు.
ఆఖరుగా చెప్పొచ్చేదేమంటే, పరిమితుల్లో, ఒక పాఠకుడికి ఒక కధ ఎంత వరకూ పనికి వస్తుందీ అని చెప్పే హక్కు వుంటుంది అని. రచయితలు రాసేదే పాఠకుల కోసం కనుక.
ఇంకో విషయం. మీరు, “లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా” అని అడిగారు.
కధలోని పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడం ఏమిటీ? అవి కధలో పాత్రలు కదా? కధ చదివే వాళ్ళు ఆ పని చేస్తారు. రచన చేసేటప్పుడు రచయిత కూడా ఆ పని చేస్తాడు. తాను సరి అనుకున్నదే తన పాత్రల చేత చెప్పిస్తాడు విమర్శ లేకుండా. పాఠకులు కూడా తాము సరి అనుకున్నవాటితో ఏకీభవిస్తారు. లేదా విమర్శిస్తారు. వారికి ఆ హక్కు లేదనే హక్కు మీకు లేదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒక పాఠకులే కదా?
– ప్రసాద్
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి baabjeelu అభిప్రాయం:
07/23/2008 8:39 am
సాయి బ్రహ్మానందం గారూ,
“తెరమరుగౌతున్న తెలుగు నాటకం” శీర్షికన మీరు సంస్కృత నాటకాల్ని స్పృశించి, పద్య నాటకాల్ని పరామర్శించి, ఆ తరవాత నాటకం ఎలా రాయాలి, ఎలా “డైరెక్ట్” చెయ్యలి, ఎలా నటించాలి, “మేకప్పు”, రంగాలంకరణ, నంది ఎవార్డులు ఇత్యాది అద్భుతంగా వివరించేరు.
ఈ వ్యాసంలో వుదహరించిన నాటకాలన్నీ “కాంటెంపరరీ” నాటకాలు కావు. బహుశా “నిజం” ఒక్కటే అనుకుంటాను.
గణేష్ పాత్రో “పావలా”, ధవళ కుర్రాడి “షిప్పొచ్చింది” ఇత్యాది అసలు ప్రస్తావించబడలేదు.
మధ్యలో వీధి నాటకాలొచ్చేయి: “టామీ టామీ టామీ” ఇత్యాది.
ఎ.ఆర్.కృష్ణ “కష్టం” మీ వ్యాసంలో కనబడలేదు.
రావి కొండల రావు గారు ఓ ఇరవైయ్యేళ్ళ కిందటే “తెలుగు సినిమాని కాపీ కొట్టి తెలుగు నాటక రంగం భ్రష్టు పట్టి పోతోంది” అని “ఆంధ్రజ్యోతి” లో బాధపడ్డారు.
ఇంత “సబ్జెక్ట్” వుండి ఇలాటి వ్యాసం?
మొత్తం పదకొండు పేజీలూ చదివిన తరవాత, ఆచార్య తిరుమల రామచంద్ర గారు ఈ మాట మొదటి సంచికలో రాసిన “తెలుగు వ్యాసం” మరొకసారి చదివితే గాని మనసు నిమ్మళించలేదు.
క్షమించాలి.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి సూర్య అభిప్రాయం:
07/23/2008 6:40 am
నిన్న పార్లమెంటులో ప్రధాని ప్రసంగంలో జ్యోతిష్యాన్ని గురించి ప్రస్తావించారు. కొందరు రాజకీయ ప్రముఖులు జ్యోతిష్కుల సలహాలని అనుసరించే తమ స్ట్రాటజీల్ని నిర్ణయించుకున్నారట. జ్యోతిష్యంలో సత్తా ఉందో లేదో తెలియదు గానీ, డబ్బుతో పాటూ ఇది కూడా భారత రాజకీయాల్ని కూడా శాసిస్తోంది. ఏదేమైనా జ్యోతిష్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వెయ్యకూడదు.
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Subbu అభిప్రాయం:
07/22/2008 7:25 pm
Thanks for a great article. Well written. When you casually mentioned over the weekend that you knew Jim Grey, I did not realize the story behind.
Regards,
Subbu
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Srinivas అభిప్రాయం:
07/22/2008 10:54 am
Excellent articles. Very informative. Waiting for the next parts. Thank you.