పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఛందోధర్మము గురించి Bhushan అభిప్రాయం:

    08/29/2008 1:03 am

    శ్రీరంగనీతులు చెప్పేవాళ్లు దొంగదారులు దూరొచ్చు. మనకు నీతి కథలు రాసేవాళ్లు అవినీతిగా వుండొచ్చు. తానే ఆచరించలేనిదాన్ని ఇతరులకెందుకు చెప్పాలి? దెయ్యాలు వున్నట్టు ఆద్యంతం కథ రాసిన రచయిత ఆఖర్న తన జుట్టులోని వెంట్రుకల్ని చేతబడి చేసేవాళ్ళకెవరికైనా పంపించడానికి రెడీ అంటాడు. కథలోని మంచిని సమర్థించేవాళ్లు, కథకుళ్లోని చెడ్డని ఖండించకపోతే అప్పుడు ఎటు వైపున వున్నట్టు? ఇలా అభిప్రాయాన్నిచెప్పిన జె.యు.బి.వి.గారూ, సాయిబ్రహ్మానంద గొర్తిగారూ, మీ దగ్గర మహాప్రస్థానాలు వుంటే వాటిని మహాసముద్రంలో విసిరెయ్యాల్సిన పని లేదు గానీ, అలాంటి రచయితల వ్యక్తిగతజీవితాల కుళ్ళుని విమర్శించి తీరాల్సిందే. లేకపోతే చాలామంది పాఠకులు, ఆ రచయితల కథల్లాగే, కవితల్లాగే వాళ్ళని కూడా వుత్తములనుకునే ప్రమాదముంది.

    భూషణ్
    nagabhushanamr@hotmail.com

  2. ఛందోధర్మము గురించి baabjeelu అభిప్రాయం:

    08/28/2008 11:50 pm

    బాబ్బాబు, అందరూ వొక్క సిటం ఆగండి,
    మనం మాటాడీది, “చెందస్సు” కాణ్ణించీ, “స్టాండర్డ్” బాస కాణ్ణించీ “చైల్డ్ మోలెస్టర్స్” మీంచీ ఇంకో యేపెల్ల కుండా సూసీసుకుందాం.
    “చెందస్సు”:
    సాలా సెప్పుకునీ, బోరుకొట్టిందందరికీ, ముఖ్యంగా చదివీవాళ్ళకీ, బాగా చదువుకున్నోళ్ళకీ.
    “స్టాండర్డ్” బాస:
    దానికీ గొడవేటీ లేదు.
    అయితే రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి, యివ్వకపోతే రాసినోడిది తాప్పు అని నాను రాసిందానికి. (బాబ్జీలు ఉవాచ అని రాయకూడదు. కళ్ళుపోతాయ్. నాలాటివాళ్ళు, తెలిసిన వారని నేను నమ్మిన వాళ్ళు చెప్పినవాటికీ, మాకన్నీ తెలుసు అని వారికి వారే నమ్మీ వాళ్ళు చెప్పినవాటిని మాత్రంమే “ఉవాచ” లనాలి.) విప్లవ్ బాబు ఉవాచ:..కాదు చదివేవాడి అర్హత ప్రశ్నార్థకం.??????
    “నీతి”: పెద్దలు చెప్పినివి ఆలకిద్దాం.
    జెయుబివిపి ఉవాచ:
    “ఏది నీతీ, ఏది అవినీతీ? అన్నీ కాలాన్నిబట్టి మారుతూవుంటాయి” అని అడ్డగోలుగా మాట్టాడే సూడో ఫెమినిస్టులు, సూడో కమ్యూనిస్టులూ వుంటారు.
    విప్లవ్ బాబు ఉవాచ:
    కాలాన్నీ, ప్రాంతాన్నీ బట్టి నీతి మారుతుంది. నిజాయితీ మారదు.
    “అర్హత”:
    విప్లవ్ బాబు ఉవాచ:”ఇది రాయటానికి నాకేం అర్హత వుందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివేవాళ్ళు డిసైడ్ చెయ్యాలని చెప్పటం తప్ప మరోమాట లేదు. “మరోమాటచెప్పు” అని మనం మారుబేరం చెయ్యకుండా తెగ్గొట్టీసేరు.
    పెద్దలందరూ చెప్పిందే. చదివీవోళ్ళు, ముందుగా, రాసినదాని అర్హత ని డిసైడ్ చేస్తారు. దాని అర్హత మరీ ఎక్కువగావుంటే “ఎవర్రాసేరండీ?” అని మొదలెడతారు. “కాంటెంపరరీ” అయితే అప్పుడు నిస్సందేహంగా కవి నిజాయితీ, ఆయెనక నీతీ వల్ల అప్పటిదాకా “లొట్టలు” యేసుకుని చదివినా “చేదు” గా మారొచ్చు, లేదా “అర్హత” మరీ పెరిగిపోవచ్చు. వుదాహరణకి “అతడు అడివిని జయించాడు” గురించి ఏవంటారు అని “వొక పెద్దాయనని” అడిగితే, “ఆ పసువుల డాట్రు ఏదో వైద్యం చేసుకోక కాపీ కథలూ అవీ ఎందుకు? అలాటి వాటి గురించి నేను మాట్లాడను” అన్నారు.
    ఇంకో ఉవాచ విప్లవ్ బాబుదే అర్హత గురించి: తెలవటం ఒక అర్హత.
    బతుకు తెలియాలి అంతే, మరేటీ తెలక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడెవరూ “ప్రభువుల్ని” హీటెక్కించడానికో, లేదా ప్రభువు “నడుం పట్టీసిందయ్యా కవీ, పాండ్రంగ మహచ్చెవో, మరోటో, సదువు రెండ్రోజులు” అంటే “హీటు” తగ్గడానికి “వస్తా వట్టిదే, పోతావట్టిదే” మొదలెట్టక్కర్లేదు. మొదలెట్టినా తప్పుకాదు, బతకడం కోసం కాబట్టి. “రసన” 133 పేజీ కాళ్ళ మీద పడితే తప్పకుండా బుధ్ధొస్తుంది, బుధ్ధిజీవులకి కూడా.
    “నిజాయితీ”:
    విప్లవ్ బాబు ఉవాచ: నిజాయితీ మరో అర్హత రాయటానికి
    దిక్కుమాలిపోయిన ఈ బూమ్మీద, ఎవరేపని చేసినా, నిజాయితో చేస్తేనే రాణిస్తుంది.
    నిజాయితీ, రాసేవాళ్ళకి ఓ “డోసు” ఎక్కువుండక్కర్లేదు.
    ఆఖరవుకి “క్షవరం” చేసే వాడుకూడా నిజాయితీ తో చేస్తేనే, గిరాకీ. ఏదో వొహలా “డెక్కీ” వోడు “ఓ క్షవరానికి, ఇంకో క్షవరం ఫ్రీ” అన్నా ఎవరూ పట్టించుకోరు.

    మాట మన్నించి, “జారుడు బండ” మీద రెండో కాలు కూడా పెట్టిన విప్లవ్ గారికి ధన్యవాదములు. “ఈ మాట” రచ్చబండ కాదని మీరే అన్నారు. అవనివ్వం అని మా అందరి తరపున నేను మాటిస్తున్నాను. సూస్తూ, సూస్తూ, చేజేతులా, సుబ్బరంగా వున్న ఈ మాట ని “యూపీ”, “ఏపీ”, “టిఎన్” లేదా మరొహ దాందో “అసెంబ్లీ” లాగా చెయ్యనివ్వం.
    విప్లవ్ బాబూ మరిక మీరు సెలవు తీసుకోవచ్చు.

    శ్రీనివాస్ నాగులపల్లి గారికి: నేను రాసిన “వేమన” వుదాహరణ లో, వేమన ని కానీ, వేమన పద్యాలని కానీ కించపరచ లేదు.

  3. విలువలు గురించి ashok అభిప్రాయం:

    08/28/2008 9:36 pm

    ధన్యవాదాలు. ఇది ఒక మంచి కథ చాల బాగుంది.

  4. ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    08/28/2008 5:31 pm

    సత్య గారు చెప్పిన దాంట్లో చిన్న అసత్య ముంది.
    అది వారు తెలివి తక్కువ అని చెప్పుకోవడం.
    సత్య గారు క్షమిస్తారని ఆశిస్తూ
    విధేయుడు
    Srinivas

  5. ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    08/28/2008 5:22 pm

    చక్కగా సత్య గారు సత్యాన్నే చెప్పారు.

    ఇంకొక్క ఆలోచన. రచయిత వివరాలేమీ తెలియకుండానే రచనను ఆదర్శవంతం అని అనుకున్నట్లే, రచయిత నడవడి తెలిసింతరువాత, అది రచన యొక్క ప్రధానాంశానికి పచ్చి విరుద్ధంగా ఉన్నప్పుడు, అయ్యో రచన అందించిన ఆదర్శం రచయితకే ఎంత దూరంగా ఉంది అనుకొని, ఆ రచన యొక్క ఆదర్శ స్ఫూర్తితోనే ఆ రచయితను సైతం బేరీజు వేసుకోవడం సహజమూ, సమంజసమే అనుకుంటాను. అంతమాత్రాన రచన గుణాలు తగ్గాయని కాదు. రచన చూపించే వెలుగుతోనే రచయితను కూడా నిగ్గుదేల్చి, స్పష్టంగా చూడడం మాత్రమే.

    ఇది కేవలం రచన, రచయితలకే పరిమితం అయిన విషయం కాదని కూడా అనిపిస్తుంది. ఎటుచూస్తే అటు అంతటా ఉన్న విషయమేనేమో!

    ఎకరాలకెకరాలు భూకబ్జాలు చేసి, గజాలకొద్ది మాత్రం గుడికో, ఆసుపత్రికో విరాళం ఇవ్వడం, ప్రశంసనీయమా, “విచార”ణీయమా! భారీగా పన్నులు ఎగ్గొట్టి, ప్రభుత్వ నియమాలను నేలరాసి, ప్రకృతి ఉపద్రవాలొచ్చినప్పుడు ప్రధాన మంత్రి relief fund కు కొన్ని పైసలివ్వడం గొప్పనా, దారుణమా! ఇట్లా ఎన్నో!

    ఆధునిక తెలుగు సాహితీలోకంలోనే మన ముందున్న ఒక ప్రముఖ ఉదాహరణ. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి అవధాన ప్రజ్ఞను, పాండితిని ప్రశంసించిన అభిమాన సంఘాలు, సంస్థలే ఆయన వ్యక్తిగత అంశాలను తెలుసుకున్నాక ఆయనలోని కళాకౌశలాన్ని దూరం నుంచి మాత్రమే అందుకోవడానికి ముందుకురావడం చూస్తునే ఉన్నాం. దూరంగా ఉంచింది రచనను, కళను కాదు, రచయితనో, కళాకారున్నో మాత్రమే. ఇది ఏదో నా అభిప్రాయం కాదు, కళ్ళెదుటున్న వాస్తవం.

    విధేయుడు
    Srinivas

  6. వినాయక చవితి కథ గురించి phani DokkA అభిప్రాయం:

    08/28/2008 1:19 pm

    ఎర్రమిల్లి ఫణీ,

    నేను డొక్కా శ్రీను అన్నమాట. నాకు తెలిసి నా తోటివాళ్ళు ముగ్గురు
    ఫణులున్నారు. బాలాంత్రపు ఫణి, ఎర్రమిల్లి ఫణి, కొంచెం చిన్నవాడు చావలి ఫణీను. నాపేరులో ఫణున్నా అందరూ చిన్నప్పుడు శ్రీను అనే పిలిచేవారు. నా ఈమెయిలు ఫణిడొక్కా ఎట్ యాహూ డాట్ కాం. వీలుచూసుకుని మెయిలు పంపించు.
    మళ్ళీ వినాయకచవితొచ్చేస్తోంది, మీ సీతాఫలం చెట్టు జాగర్త 🙂

    డొక్కా ఫణి.

  7. ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    08/28/2008 12:39 pm

    నాకు చందమామ పుస్తకాలంటే చాలా ఇష్టం. నేను తెలుగులో ఈ మాత్రం వెలగ బెట్టగలుగుతున్నానంటే వాటి తోడ్పాటు వల్లే నని ఒప్పుకోక తప్పదు.

    హనుమంతరావుగారన్న మాటలు చదివాక నాకు ఎవరి టీ షర్టు మీదో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. “Please take my advice. I don’t use it anyway!”

    వారు “నమ్మకాలు బ్రతుకుతెరువు” అన్న శీర్షిక కింద రాసిన విషయాలు నమ్మదగినట్టే వున్నాయి. కానీ మనము ఇలా కూడా ఆలోచించవచ్చేమో!

    ఒక స్థూలకాయుడో స్థూలకాయురాలో నేను మీ బరువు తగ్గిస్తానని ఆర్భాటంగా ఏదైనా పత్రికలో ప్రకటన ఇచ్చారనుకుందాం. దానికి ప్రజల స్పందన ఎలావుంటుంది?

    అలాగే మనము కొన్ని సార్లు టీవీ లో చూస్తూ ఉంటాము. ఏదో ఒక ఇంద్రలుప్తకుడు ఇతరుల కేశసంపదనీ సౌందర్యాన్నీ పెంపొందిస్తానని (సంకోచం ఏమాత్రమూ లేకుండా) అనర్గళంగా వ్యాఖ్యానించి నిష్క్రమిస్తారు. అది ఎలా వుంటుంది?

    స్థూలంగా ఉండటమో, బట్టతల కలిగి ఉండటమో అపరాధాలు కావు. నేను కూడా కొద్దిగా స్థూలంగానూ, బట్టతలతోనూ వున్నానని అనుకుంటున్నాను. 🙂

    కానీ ఇలాంటి ప్రకటనలకీ వ్యాఖ్యానాలకీ ప్రజలు ఎలా స్పందిస్తారో అదే విధంగానే రచయితల రచనలక్కూడా స్పందిస్తారని ఊహించడం అసమంజసం కాదనుకుంటాను.

    ఇకపోతే నమ్మకాలనూ, స్వభావాలానూ సులభంగా కప్పిపుచ్చవచ్చు. తమ తమ ఆశయ ఆకాంక్ష, నమ్మకాలకు వ్యతిరేకంగా రచయితలు తమ రచనలను సాగించవచ్చు. రచయితలందరూ నీతిమంతులుగా ఉండాలన్నది లేదు.

    జైళ్ళల్లో కూరుచుని రాసే/రాసేసిన రచయితలు లేరా?

    ఎవరి ఇష్టం వారిది. ఎవరి జీవితం వారిది. రచయితలు భ్రష్టులతే అభ్యంతరం చెప్పవలిసిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. లేదనే నేననుకుంటున్నాను. రాయడం సవ్యంగా వస్తే చాలు. చెత్త రచనలకి వెల ఎంతైనా ఎక్కువే, విలువ ఎంతైనా తక్కువే అని వేరే చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను.

    వారేమి రాసినా దాని గతో దుర్గతో నిర్గతో నిర్ణయించడాన్ని పాఠకులే చూసుకుంటారు.

    మరి చివరి విషయం. రచయితలలో రెండు రకాలు. తెలివైన వారూ, తెలివితక్కువవారు. అదేలాగా పాఠకులు కూడా రెండు విధాలు. తెలివైన వారూ, తెలివితక్కువవారు.

    రచయితలందరూ తెలివైన వారైతే బాధ లేదు. అలాగే పాఠకులందరూ తెలివైన వారైనా బాధ ఏమాత్రమూ లేదు.

    పాఠకులు కొందరు మాత్రమే తెలివైన వాళ్ళైతే రచయితలు భ్రష్టులైనా నీతిమంతులైనా ఒక్కటే. అటువంటి పాఠకులు చదివిన ప్రతిదానినీ విచక్షణా దృక్పథంతో చూచి తమకు నచ్చినది మాత్రం ఏరుకుంటారు. మిగిలిన చెత్తని విసర్జిస్తారు.

    ఇక పోతే మిగిలినది బుద్ధితక్కువ పాఠకుల విషయం.

    పాఠకులు బుద్ధి హీనులైతే బుద్ధిహీనుల రచనలనే సమర్థిస్తారు. అవే వారికి నచ్చుతాయి. వారు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్న ధోరణిలో ఉంటారు. వారికి ఏమీ చెప్పకుండా, వారిని ఎక్కడా గిల్లకుండా ఉంటే ఏ బాధా లేదు.

    ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే తెలివితక్కువ వారికి తెలివిగలవాళ్ళు తెలివితక్కువ వాళ్ళుగా కనిపిస్తారు. తెలివిగలవాళ్ళకి తెలివి తక్కువవారు తెలివితక్కువ వారుగానే కనిపిస్తారు.

    అంటే ఒక విధంగా అందరూ తెలివితక్కువ వాళ్ళే. ఇంకో విధంగా అందరూ తెలివిగలవాళ్ళే. కాబట్టి అస్సలు బాధే లేదు.

    మీరెవరైనా చెప్పే ముందే ఒప్పేసుకుంటాను. నేను తెలివి తక్కువ వాణ్ణేను.

    నమస్కారములతో

    పామర్తి సత్యనారాయణ

  8. ఛందోధర్మము గురించి mOhana అభిప్రాయం:

    08/28/2008 12:13 pm

    రచయితల పేరులను తొలగించి వారి “మంచి” రచనలను
    మన ముందు ఎవరైనా ఉంచితే, అందులో ఏ రచన
    నిజాయితీ ఉన్న రచయిత రాసింది, ఏ రచన నిజాయితీ
    లేని రచయిత రాసింది అనే విషయాన్ని చెప్పడం సులభం
    కాదనుకొంటాను. రచయిత దుర్బలుడుగా ఉండవచ్చు,
    అంత మాత్రాన అతడు (ఆమె) రాసిన రచనలు ఆదర్శవంతముగా
    ఎందుకు ఉండరాదు? రచయిత వ్యక్తిగత జీవితానికి
    ఆ రచయిత రాసిన రచనకు లంకె పెట్టడం సబబు కాదు.

    విధేయుడు – మోహన

  9. ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    08/28/2008 11:32 am

    It is unfair to take a dig at Vemana’s past. He wrote padyams after, not before, overcoming his past. Same thing with Valmiki et.al.

    శ్రీశ్రీ భక్తి రచనలు ఉపాధికోసం రాసాను అనడం వాస్తవికతనే కాక అతని నిజాయితీని కూడా చెప్పుతుంది. అయితే ఈ చర్చ కేవలం రచనలు, రచయితలకే పరిమితం చేయడం అన్యాయం!

    “తిట్టొద్దు, కొట్టొద్దు, (లేదా మీకిష్టమొచ్చిన తప్పిదాన్ని ఇరికించండి)
    అని చెప్పుతూ, నువ్వు అవ్వే చేయొచ్చు, కాని నేను అవి చేస్తే తప్పేంటి నాన్నా” అని అనడం, వినడం తెలియని వారెవ్వరు! మాటకు, చేతకు అదే సంబంధం. చేత మనిషి వ్యక్తిత్త్వం అయితే మాటలు ఆ వ్యక్తి రచనలు కావచ్చు.
    తప్పిదాలగురించి కాదు, వొప్పిదాల గురించి అయితే కూడా ఇదే పరిస్థితా అని అడుగొచ్చు.

    అందరికి తెలిసిన కథ గుర్తుకొచ్చింది.

    గాందీజీ దగ్గరకు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి వీడికి చక్కెర ఎక్కువ తినొద్దని చెప్పమని వేడుకుందట. తల్లి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి గాంధీజీ దగ్గరకు తీసుకొచ్చింది ఆయన చెపితేనన్నా వింటాడేమో అని ఆశతో.

    ఏముంది! ఇప్పుడు కాదు, వారం రోజులయింతరువాత తిరిగి రమ్మన్నారట గాంధీజీ. మళ్ళీ వారం తరువాత వెళ్ళితే, గాంధీజీ పిల్లవాడిని ప్రేమతో దగ్గరకు చేర్చుకొని చక్కెర ఎక్కువగా తినకు అని చెప్పాడట. ఈ మాత్రం ముక్క చెప్పడానికి వారం తరువాత ఎందుకు రమ్మన్నారు అని ఆ తల్లి ఆడిగిందట. వారం రోజుల క్రితం వరకు నేను కూడా చక్కెర ఎక్కువగా తినేవాడిని. నేను తగ్గించిన తరువాత ఇప్పుడు చెప్పాను అని వివరించాడట గాంధీజీ. కథ కంచికి.

    రచయిత అకారణంగానో, సకారణంగానో, ఒకరి దుకాణంకోసమో,లేక సవాలక్షల కారణాలతో రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? అందంగా, అధ్భుతంగా కూడా ఆ రచనలు రావొచ్చు. అవార్డులు కూడా పొందొచ్చు. అయితే నిజాయితీ లోపించే రచనలు ఆ తల్లి చెప్పిన మంచి మాటల్లాగానే మిగిలిపోతాయేమో.

    నిజాయితీతో చెప్పిన మాటలు పెద్ద రచయితవి అయినా కాకపోయినా, అవార్డులు రివార్డులేవి వచ్చినా రాకపోయినా, అసలు రాయడం చదవడం కూడా రాని వాడివైనా కూడా గుండెకు తగులుతాయి. మార్పుకు ఊపిరి ఇస్తాయి.

    విధేయుడు
    -Srinivas

  10. రచయితలకు సూచనలు గురించి Nirmala Kondepudi అభిప్రాయం:

    08/28/2008 8:38 am

    మీ పత్రిక బావుంది చాలా చాలా….అభినందనలు.