సోమవారం పేజీలో అఫ్సర్ గారి ఈ కవితనే మీరు ఉదాహరణ గా ఇచ్చారు. చాలా ధన్య వాదాలు. మీరు లింకు ఇచ్చి వుంటె బాగుండె. వెతికి పట్టె సరికి ఆలస్యం అయ్యింది. అయినా, మంచి కవిత కోసం ఆ మాత్రం శ్రమ పడాల్లెండి.
ఇందులో కూడా కవి ‘నా యబ్బ ‘ అనే సంబోధన ప్రయోగించారు. అది అశ్ల్లీలమా కాదా అనేది నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ‘నా యబ్బ’ అనకుండా ‘ నా తల్లి’ నీ అమ్మ’ అని వుంటే ఈ కవిత అశ్లీలం్ అయ్యేదా?
అమెరికా ఆర్ధిక మాంద్యం మీద ఇంకా ఏమయినా కవితలు వస్తే, దయచేసి, ఎవరయినా చెప్పండి. తెలుగు కవులు దీన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారా అని మనం ఆలోచించాలి. నిజానికి ‘బోడి’ (అంటే నిరలంకార -నిరాడంబర – అతి సాధారణ అని నాకు అర్ధమయింది) పద్యాలు ఆ విషయం మీద ఒక ఇంకా రావాలి, మీలో కసి, ఉద్వేగం అనేవి వుంటే. తెల్లారి లేచి, మీరు అదే పనిగా కాగితాలు, ఈ మాట స్పేసూ ఖరాబు చేసే బదులు ఒక శీలవంతమయిన పద్యం రాస్తే బాగుంటుందేమో చూడండి.
రవీందర్
బాగుంది. నేను బాగుందన్నది ‘బోడిపద్యం’ కవిత గురించి కాదు. ఆ కవిత మీద జరుగుతున్న చర్చ గురించి. వారపత్రికల్లో, దినపత్రికల సాహిత్యానుబంధాలలో కనిపించే కవితలను ఒకటి, రెండు లైన్లు చదివి నచ్చితే చివరంటా చదవడం, లేకుంటే వదిలేయడం ఆ తర్వాత మరచిపోవడం ఇదీ ప్రస్తుత (నా) పరిస్థితి. కాని కవితల గురించి ఇంత విస్తృతంగా, సాధికారంగా, సమర్థంగా, సమగ్రంగా చర్చ కొనసాగడం చాలా బాగుంది. తెలుగు భాష, తెలుగు కవిత్వం, సాహిత్య విమర్ష కలకాలం సజీవంగా ఉంటాయన్న నమ్మకం కలిగింది. అందరికీ ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గురుతుల్యులైన బృందావన రావు గారికి
మీ వ్యాసంలోని చివరి పేరా ధూర్జటిని అమితంగా అభిమానించే నాకు ఖేదం కలిగించింది. పోతన తరువాత భక్తి రసాన్ని అద్భుతంగా పోషించిన మహా కవి ధూర్జటి.
వాకిట గాచియుండు హరి వారిజ సంభవ ముఖ్య దేవతా
నీకమునుం దలంప కవనీధరజా ధరహాస లోలతం
బోక సమీపవర్తులగు బుత్రుల చూడక భక్త భక్తి క
న్యా కర పంకజ గ్రహణ నైష్ఠికుడై కడు సంభ్రమంబునన్
అనే ఈయన పద్యం పోతన సిరికిం జెప్పడు పద్యానికి దీటైనది.
రాజ భోగ నిరాసక్తుడై, దుష్కర్మ నిరత రాజ నిరసనానికి అణుమాత్రం జంకక, జగత్సర్వం తన ఇష్ట దేవ (శివ) మయమని భావించి, ఈ భావాలనే తన కృతులలో పలుమార్లు ప్రస్ఫుటంగా వెలువరించిన ఈ మహ భక్త కవిని రాయలే తన కీర్తి నినుమడింపచేసుకోడానికి సాదరంగా ప్రార్ధించి తన ఆస్థానంలో ఉంచుకొనివుండవచ్చు గానీ ఈకవి తనంతట తాను రాజాశ్రయం అర్థించాడని అనుకోలేము. ఈయన తన కృతి నరాంకితం చేయలేదు సరిగదా ఏ మూలలోనూ రాయలవారి ప్రసక్తి తెచ్చి స్తుతించలేదు. తనని పెంచి పెద్ద చేసి రాజుగా నిలబెట్టిన అప్పాజీని రాయల వారు నిర్దాక్షిణ్యంగా శిక్షించినపుదు రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని బాహాటంగా గర్హించిన భక్త్యాసాదిత మహా ధైర్య సంపన్నుడు ధూర్జటి.
నీతుల కేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు సభలో
బూతులు నీతులు లోక
ఖ్యాతులు రా అని అరసికుడైన ప్రభు చిత్తానుసారులై వాడు విదిల్చే ధనం కోసం వారి మనో రంజనానికై తమ కవితలో బూతులు నిరాఘాటంగా చొప్పించే క్షుద్ర దరిద్ర నీచ కవులతో సమంగా ధూర్జటిని తలవడం
ఉరగ భూషణుతోడ ఊర జోగులను సరిచేసి ఎన్నిన చందాన మీరు
అమిత భక్తినిధి మహా కవి తోడ సమముగా కవి పిశాచముల లెక్కింప
డమే అవుతుంది.
మంచెల మీద కెక్కి కటి మండలి చుట్టిన పారుటాకు లిం
చించుక సంచలించి మరునిల్లు బయల్పడ సేయునట్లుగా
చెంచెత లార్చి వేయుదురు అనే 1-2 పద్యాలను చూసి చాటు పద్యం ఆధారంగా ఈయనను వేశ్యాలోలుడిగా భావించడం తప్పేమో . పోతన కూడా కొన్నిచోట్ల శృంగార రసాన్ని పోషించాడు.
దినముం జిత్తములో సువర్ణ ముఖరీ తీర ప్రదేశామ్ర ……….
గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు .. ఇలా అనేక పద్యాలు ఈయన స్వఛ్ఛ ప్రవర్తనని ఎత్తిచూపిస్తాయి.
ఓ సామీ! ఇటువంటి కొండ దరిలో ఒంటిం బులుల్ సింగముల్
గాసిం బెట్టెడి కుట్ర నట్టడవిలో కల్జువ్వి క్రీనీడ యే
యాసం గట్టితి వేటిగడ్డ నిలు నీ వాకొన్నచో కూడు నీ
ళ్ళే సుట్టాలును దెచ్చి పోసెదరు నీ కిందేటికే లింగమా అనే పద్యంలో
భక్తుని ఆత్రత ఆర్ద్రత నిండి కనిపిస్తాయి.
అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వలే? కడుం
బచ్చని రాలు బిల్వ నవ పత్రములే? అరుణాశ్మ భంగముల్
విచ్చిన తెల్ల దామరలె? విశ్వపతీ! విషమోపలంబు లె
ట్లచ్చుదలయ్యె నీకు? అవి అందునె గంధ మృదుత్వ శైత్యముల్
అంటూ
ఉనికి శిలోచ్చయంబు; నిజయోష శిలోచ్చయ రాజ పుత్రి; నీ
ధనువు శిలోచ్చయంబు; పురదాహ! రధీకృత రత్నగర్భ! నీ
మనమునకీ శిలా శకల మండన మెట్లు ప్రియంబు సేసె? నే
మనగల వాద నిన్ను వ్రత హాని యొనర్చు దురాత్ముడుండగన్
అని ఏనుగు ఉపాలంభించడం హృద్యంగా వుంటుంది.
శతావధాన ప్రబంధం అనే సుబ్బన్నగారి పుస్తకం నాకు యాధృఛ్ఛికంగా ప్లాటు ఫారం మీద అమ్మే పుస్తకాల కొట్లో (సుమారు 25 ఏళ్ళ క్రితం) ఐదు రూపాయలకు దొరికింది. అది సుబ్బన్న కవిగారు స్వహస్తాలతో కొణిజేటి రోశయ్య (నేటీ ఆర్ధిక మంత్రి) గారి పేరు లిఖించి ఆయనకు బహూకరించింది. ఇందులో కవిగారి శతాధిక శత-అష్టావధానాలలోని ముఖ్యమైన పద్యాలను తేదీ ఊరు వివరాలతో ప్రచురించారు. దత్తపదులూ, న్యస్తాక్షరులూ, నిషేధాక్షరులూ, సమస్యలూ, వర్ణనలూ కలిసిన ఈ గ్రంధం చాలా మనో రంజకంగా ఉంటుంది. నేనుదహరించిన మత్తేభమాలిక భాగాలు ఇందులోనివే. ఇది చదివి నేను వారి ప్రగాఢాభిమానినై ఆ కాలంలో (1975-78 సమీపంలో)
ఒక పోతన్నను చెప్ప వచ్చు, ప్రతి నింకొక్కండుగా సూరన
ప్రకట ప్రజ్ఞుని బల్కవచ్చు, నిక చాల్ రమ్యాతి రమ్యంబు తా
వక వైధుష్య కవిత్వ సాధిగత భవ్యత్వంబుతో బోల్పగా
సుకవుల్ నన్నయ దొట్టి చెళ్ళపిళ వంశ్యుల్ వామనుల్ సుబ్బనా!
అని ఇంకొన్ని పద్యాలతో వారికి అభివందనలు పంపించాను. ప్రతిగా వారు
తాము రచించిన ధనుర్దాసు, గోపవధూ కైవల్యం అనే లఘు కావ్యాలను పంపించారు. (ఇవి ఏవీ నన్నయ,పోతనల కవితా ప్రమాణాలను అంద లేదు). ఆరి వేరొక రచన అవధాన విద్య గురించి మీరే ప్రస్తావించారు కాబట్టి దాన్ని గురించి నేను తెలుపక్కరలేదని భావిస్తాను.
కానీ అవధాన పద్యాలన్నీ చాలా చాలా రసవత్తరంగా వున్నాయి. ముఖ్యంగా వృత్తమాలికలు – నా స్మృతిపధంలో నిలిచిన ఒక మాలికలోని కొంత భాగాన్ని
మీతో పంచుకుంటాను. ఇందులో కవి తన పృచ్ఛక సంఘాన్ని గ్రహ దేవతలతో పోలుస్తాడు
అకలంకాత్ములు, హవ్యవాహ సమ తేజోలంకృతుల్, లోక దీ
పకు, లారాధ్యు, లకుత్సితుల్, నత జగద్బంధుల్, త్రయీ మూర్తు, లా
ఢ్య కృపా పూర్ణులు, సర్వ దేవమయు, లవ్యాఘాత నిత్యోదయుల్
సుకృతి శ్రెష్టులు మీరు సూర్యులనుచున్ , శుద్ధాంత రంగుల్, సుధా
ముకుర స్వఛ్ఛముఖ ప్రసన్నరుచి రమ్యుల్, నిత్య వర్ధిష్ణు చా
రు కళా స్నిగ్ధు, లమేయ సత్పధ విహారుల్, మీరహో దేవదే
వ కపర్దాభరణుల్ హిమాంశు లనియున్ స్వర్ణ ప్రభా భాసురుల్
ప్రకట ప్రజ్ఞులు సత్య వాదులు యువత్వ ప్రౌఢు లత్యంత ధ
ర్మ కఠోరుల్ ……………………………………………
వికచాబ్జాక్షులు పాండితీ భర వయో వృద్ధుల్ ధనుర్మీన నా
యకు లాంగీరస కీర్తనీయులనుచున్ అభ్యస్త తర్కాది శా
స్త్ర కలాపుల్ సుయశో ధురీణులనుచున్ క్ష్మా నందనుల్ మీరు మా
మక భాగ్యామృత భాగ దాన శుభ ధామస్వామితా వైభవా
త్మకులై తత్తదనూన భాగ్య ఫల సంపద్దాన దీక్షా క్షమ
ప్రకృతుల్ మీరని మీకు మీకు వినయ వ్యాపార మేపార మ
స్తక విన్యస్త శయ ప్రకారము నమస్కారమ్ము గావించి గొం
కక భావించెద సభ్యులార వినతిన్ గావించెదన్ మీకు పృ
ఛ్ఛక సంఘంబున వృద్ధమూర్తి వరుణాశన్ దోచునో సౌరి, త
న్నికట క్షోణి రహించునో బుధుడు, పృశ్ని స్వాంత లబ్దాశయుం
డకఠోరోత్పల మాలికా సుభగ కన్యా మోహనాపాంగ దృక్
ప్రకరావలంబి విజృంభి విక్రముడు రక్షఃశ్శాస్తనున్ మించునో
— ——-
సుబ్బన్న శతావధాని గారు పొద్దుటూరు (కడవ జిల్లా) వాస్తవ్యులు. ఆ కాలంలో సుబ్బన్న శతావధాని పొద్దుటూరు అంటే పోష్టు వెళ్ళేది. నా దగ్గర వున్నపుస్తకాన్నివెదకి చిరునామా దొరికితే పంపుతాను. దీనికి కొంత వ్యవధి కావాలి.
సంగీతం చెవుల్ని రంజింప చేస్తే, సాహిత్యం మనసుని తాకుతుంది. అప్పుడే ఆ సంగీతాన్ని మరింతగా ఆస్వాదిస్తాం.
కేవలం సరిగమలతోనే పాడుతూ, సాహిత్యం లేని సంగీతం అందర్నీ అలరించలేదు. లోతైన అవగాహన లేకపోయినా సంగీతాన్ని పామరుల వరకూ తీసుకెళ్ళేది సాహిత్యమేనని నేననుకుంటున్నాను. “సాహిత్యం కావాలంటే యింట్లో కూర్చుని చదువుకో. సంగీతం కోసమే కృతులు విను” అన్న వ్యాఖ్యలో తొందరపాటు కనిపిస్తోంది. “ఎందరో మహానుభావులు – అందరికీ వందనములు” అనే సరళమైన సాహిత్యం లేకపోతే ఆ శ్రీరాగ కృతి ఎంతమందికి చేరేదో చెప్పండి? సాహిత్యం లేకపోతే వర్ణంలా తయారయ్యేది.
త్యాగరాజు కృతుల్లో సంగీతమున్నంత స్థాయిలో సాహిత్యం లేదన్నారు. ఇదే మాట మరి క్షేత్రయ్య విషయంలో ఎందుకనలేదు? రామదాసు కెందుకాపాదించ లేదు?
అలాగే సాహిత్యంలో తప్పొప్పులు పాడే వారిదా, లేక అవి రాసి, మనకందరికీ అందించిన శిష్యుల చేతి చలవా అన్నది తెలుగు భాషొచ్చిన మనం చెప్పగలం. తమిళులు తప్పు పాడితే క్షమంచచ్చు. తెలుగు వారి మాతృభాష కాదని సరిపెట్టుకోవాలి. మహాను భావుల్ని, మగాను భావులుగా పాడే తెలుగు ప్రముఖులూ వున్నారు. వారినేమనాలి?
త్యాగరాజు శిష్యులందరికీ తెలుగొచ్చు. వారందరూ తెలుగులోనే కృతులూ, వర్ణాలూ స్వరపరిచారు. వీణ కుప్పయ్యర్, వెంకట రమణ భాగవతార్, మనంబుచవాది వారూ అందరూ తెలుగులోనే రచించారు. ఇప్పుడు మనకున్న కృతులు వీరు పొందుపరచగా వచ్చినవే! కాబట్టి వారు భాష రాక సరిగా రాసుండక పోవచ్చుననడానికి అవకాశం లేదు. పైగా వారందరూ ఆ కృతులు పాడ్డం నేర్చుకున్నారు కదా? అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశముంది. ఎవరూ కాదనరు. పండితులు ( నేను కాదు ) చూపించిన తప్పులన్నింటికీ శిష్యుల్ని బోనులో నిలబెట్టడం సరికాదు.
పాడేవాళ్ళు ఎవరికి తోచినట్లుగా వారు సాహిత్యాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. ఆ మధ్య అమెరికాలో ఓ ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు అప్ప రామ భక్తి కృతిలో “కపి వారిధి దాటునా
కలికి రోట కట్టునా?” అనే చరణాన్ని “కపి వారిధి దాటునా – కలికి రోట కొట్టినా” అని పాడింది. విన్నందరూ “ఆహా – ఓహో” అంటూ మెచ్చుకున్నారు. పాడినావిడ తమిళావిడ కాబట్టి ఎవరూ అనలేదు. ఇదే తెలుగు వాళ్ళు ఓ తమిళ కృతినో, కీర్తన్నో సాహిత్యాన్ని ఖూనీ చేస్తూ పాడమనండి చూద్దాం. ఆ గాయకుడు ఆ సభా ప్రాంగణాన్ని దాటి బయటకొస్తే ఒట్టు. కానీ ఏం చేస్తాం? కర్ణాటక సంగీతమూ, త్యాగరాజూ ఈ రోజువరకూ అందరి గొంతులోనూ పలకడానికి కారణం తమిళులే! తెలుగు వారెవరూ పట్టించుకోరు. ఇదీ మన దౌర్భాగ్యం.
త్యాగరాజు కవయినా కాకపోయినా కొన్ని కృతుల్లో వాడిన భాషా, భావమూ కవిత్వంలాగే వుంటాయి. అందులో కొన్ని వాక్యాలు ఇప్పటికీ మనం వాడుతూనే వుంటాం.
ఈమాటలో సురయ్య మీద, కొత్త ప్రాణహితలో నవ్వు మీద అఫ్సర్ గారి కవితలు చదివాను.
ఆ రెండిటికీ చాలా తేడాగా వుంది ‘బోడి పద్యం”
ఈ తేడా గురించి అసలు చర్చ జరగాలి.
ఒకే కవి రాసిన మూడు కవితలు ఇంత భిన్నంగా ఎందుకు వున్నాయి? ఏ కవితలో కవి ఆత్మ దొరుకుతుంది? (ఈ ఆత్మల గొడవ నాకు నచ్చలేదు కాని, కొద్దిసేపు ఆలోచిద్దాం)
ఆ కవితలు సుతారంగా వున్నాయి, ఈ కవిత మోటుగా వుంది. అసలు కవిత్వ లక్షణం ఏమిటి? ఒకే కవి రెండు రకాలుగా రాసినప్పుడు ఆ కవిని ఎలా అర్ధం చేసుకోవాలి?
త్యాగరాజుల వారి సాహిత్యం మీద చర్చ సరైనదేనా? చర్చించవలసినంత సాహిత్యం త్యాగరాజుల వారిదా? త్యాగరాజ సాహిత్యం, సంగీతానికి poor cousin ట గదా? త్యాగరాజుల వారి సాహిత్యాన్ని శిష్యులూ వగైరాలు సరిగ్గా రాసుకోలేదుటగదా? ముందు సాహిత్యాన్ని సరిగ్గా రాసుకోపోవడం గురించి:
కర్రపలక మీద గంటంతో మహీధర రామశాస్త్రి గారు వ్రాసుకొన్న ప్రతిని చూసి పెనుమర్తి రామశర్మ గారు వ్రాసుకొన్న పాట.
నగుమోముఁ గనలేని
నగుమోముఁ గనలేని
నా జాలిఁ దెలిసి
ననుఁ బ్రోవగ రావ,
నా రఘువర! నీ //న//
నగరాజధర!నిన్నుఁ
బొగడు వారెల్ల
ఒగి బోధనలనుఁ జే
యగ రాలేదే!
మొగమోడితిరేమో! నీ //న//
ఖగరాజు నీ యానతి
దిగనాడి, చనలేదో!
గగనానికి ఉర్వికిని
తెగ దూరంబని నాడో!
జగమేలే పరమాత్మ!
తగ నీతో మొరలిడుదు
వగఁ దీర్పుము, తాళను,
వేగనేలు కోరా!
రఘువర! శుభచరిత!
త్యాగరాజనుత! నీ //న//
దీనికీ ఇప్పుడు పాడుతున్న సాహిత్యానికీ తేడా గమనించాలి. అలాగే ఇంకో క్రుతిలో:
తప్పకనే వచ్చు! నా
తనువుకు లంపట, నీ కృపఁ
దప్పగనే వచ్చు!
రూకలకై, పైకి మంచి
కోకలకై, కూటి కొరకు
నూకలకై ధ్యానించితి!
నుతుని త్యాగరాజ భజనఁ //దప్పఁగనే//
“తప్పకనే అంటే తప్పకుండా అని, భజనఁ దప్పఁగనే అంటే భజన తప్పిపోగానే అని త్యాగరాజు చమత్కార ప్రయోగాన్ని పాట వ్రాసుకున్న వారు గమనించలేదు. ఆఖరి పాదంలోని poetic order తెలుసుకోలేదు. అందుచేత మూలంలోనున్న నుతుని త్యాగరాజ భజనఁ మార్పు చేయబడి త్యాగరాజ నుతుని భజన గా కనిపిస్తుంది. సి.రామానుజాచారి “తప్పగనే వచ్చునా తనువుకు లంపట?” అని ప్రశ్నార్థకచిహ్నం పెట్టేరు. త్యాగరాజు ప్రశ్న వేయలేదు, సందేహించనూ లేదు.
ఇదంతా నా ప్రతిభ గాదు. ఎక్కడో చదివినది.
ఇదంతా ఒకెత్తు, శ్రీపాద పినాకపాణి గారూ, వారి అన్నగారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారూ సంగీతంలోని సాహిత్యం గురించి:
శ్రీపాద కృష్ణమూర్తి గారు: When I listen to music, I care a damn for poetry…. సాహిత్యం కావాలంటే యింట్లో కూర్చుని చదువుకో. సంగీతమునకు ఔన్నత్యము చేకూర్చిన కారణము చేతనే త్యాగరాజునకు గౌరవము వచ్చినది కాని అందమైన సాహిత్యభావములను వెలిబుచ్చినందుకు కాదు.
శ్రీపాద పినాకపాణి గారు: పొయెట్రీ లేదు. బెగ్గింగ్ ఫర్ మెర్సీ అంతే…. హి ఈజ్ నాట్ ఎ గ్రేట్ పొయెట్. తెలుగు సంస్కృతం అద్భుతంగా వచ్చు, అంతే తప్ప కవి అంటే ఒప్పుకోను.
రసం సంగీతం. సాహిత్యం పిప్పి. ( ఇద్దరూనూ)
ఇది కూడా ఎక్కడో చదివింది. అతడు – ఆమె లో కూడా “లక్ష్మి గారు” శాస్త్రి తోనూ, శాంతం తోనూ మంచి చర్చ చేస్తారు త్యాగరాజుల వారి సాహిత్యం గురించి.
సెబితే సానా వుంది/యింటే ఎంతో వుంది/సెబుతా, యినుకోరా యెంకట సావిఁ ( టియెమ్మెస్సో, శీర్కాళో గుర్తులేదు. డబ్బింగ్ సినిమాయేననుకుంటున్నాను. వావివరసలెవరవో కూడా తెలీదు)
అయ్యా, నేను ముస్లింని కాను. నాకు ముస్లిం సంప్రదాయాల గురించి అసలు తెలియదు కూడా. కాని, కవి ఈ కవిత ‘సుంతీ’ గురించి రాశారనీ, ఆ చిన్న అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ మత విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుతున్నారనీ నా కొద్దిపాటి జ్నానం చెప్పింది. కాని, అంతకంటే బలమయిన అనుభూతి/ ఉద్వేగం (దీన్ని బాబా కవితా ధార అన్నారేమో!) ఈ కవితలో నన్ను కట్టి పడేశాయి.
ఇది నాకు తెలియని అనుభూతి (భవిష్యత్తులో తెలిసే అవకాశమూ లేదు). అయినా, కవిత నన్ను చాలాసేపు ఆలోచింప జేసింది. చాలా విషయాలు , మతానికి సంబంధించినవి ఉదా:
దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
అన్నప్పుడు దర్గాలకి వెళ్లే నేనే గుర్తు వచ్చాను.
మా నెల్లురు , ఒంగోలు జిల్లాలో మస్తానయ్య, నాంచారయ్యని ఎవరిని అడిగినా ఈ పంక్తికి అర్ధం చెప్పగలడు. నా బ్రాహ్మణత్వం గాయత్రీ మంత్రం. కాని, దర్గా దగ్గిర మా అమ్మ మన్నతు చేసుకుంటుంది. అంత వరకే నాకు తురక మతం తెలుసు.
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
పల్లెల్లో తురకల్ని ఎవరిని అడిగినా, వాళ్ల బతుకు పద్ధతి సగం కింది కులాల వారితో కలుస్తుంది.
ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది. లైలా గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి వారి పఠనం. నాకు ఆ విషయాలు తెలియవు. ఈ కవితని నేను ఒక పల్లెటూరి వాడిగా చదివాను. ఇందులో అశ్లీలం ఎమిటొ నాకు తెలియదు.
ఈ కవిత రాసినందుకు కవికీ, వేసినందుకు ఈమాటకి ధన్యవాదాలు. ఈ కవితకి ముందు అఫ్సర్ అనే పేరు నాకు తెలియదు. వెనక్కి వెళ్లి, ఆయన రాసిన్ కవితలు చదివాను. సురయ్య గురించి కవిత చదవండి. ఆర్యులకు అది బాగా నచ్చె పద్యం.
రాళ్లపల్లి
బోడి పద్యం
గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:
03/26/2009
7:18 am
బొల్లొజు బాబా గారు,
ఈ కవిత, అఫ్సర్ గారు కాకుండా, ఏ రవికిరణో, బల్లోజు బాబా గారో, లేకపోతే మరొకరో వ్రాశారనుకోండి, అప్పుడు కూడా మీరు, ఏర్నేని గారు ఈ కవితని ఈ రకంగానే అర్థం చేసుకునుండే వారా?
“The reader then muses – The poet is a teacher of literature. He reads lot of poetry of his own students. He reads lot of other poets all over the world,” రచయిత గురించి ఈ విషయం తెలియకపోతే బహుశా కవితకి ఈ కవితార్థం మనసుకి వచ్చుండదేవో!
నిజంగా ఈ కవిత “Look! Each piece creates a broken image. Look! multiple discordant images are lying all over the place. Each broken stanza, oh! even more painful – each broken sentence, phrase, – sings a different song. For Heavens sake! , the pieces do not even sing in one language. There is no one cohesive religious tune. Not one unified theme . Not a single consolidated thought. Nothing makes any sense,” అఫ్సర్ గారు కాకుండా మరొకరు వ్రాసుంటే పైన ఉదాహరణతోనే ఆఖరయ్యుండేదేవో, ఆలొచింఛారా.
లైలా గారి అబిప్రాయం తప్పని చెప్పటం నా ఉద్దేశం కాదు. అఫ్సర్ గారి పేరు, ఆయన యు.టి ఆస్టిన్ పేరు ఈ కవితలోకి విస్తరించాయెమోనని నా అనుమానం, అంతే.
నాకైతే, ఈ కవిత చాలా బోడిగానే కనిపిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది.
ఒక మతాచారం బ్లిస్ అని అనుకున్న తర్వాత దానిమీద మరోరకవైన అభిప్రాయం ఎలా వీలవుతుంది లైలా గారు?
“By all means. Cry all you want. But, if you are a doctor, for God’s sake , why such agony over a few words? Really, it is teensy bleeding which can be easily stopped and after all, excised prepuce is a tiny piece of useless skin.” కదా కవి అయినంత మాత్రాన “If you are an artist, let it bleed. Let it bleed” అనేది హిపాక్రసి నేవో.
I hope the editors allow me to post this message in English. DLI means Digital Library of India. IISc (http://www.new.dli.ernet.in/index.html.en) IIIT (http://dli.iiit.ac.in/) CDAC (http://www.dli.cdacnoida.in/) Carnegie-Mellon (http://www.archive.org/advancedsearch.php) These institutions started the initiative of scanning books and making them available to one and all. One can download whole books in pdf or djvu formats from archive.org. At the other places, they are available as individual tif files. These have to be downloaded and a pdf file has to be created. It is possible to read them on-line too. But, it is a bit cumbersome. There are nearly 100,000 Telugu books in these places with duplications. But a note of caution – the organisation is a bit chaotic with very unfriendly features and unimaginable spelling errors. Inspite of these, the end results justify the efforts. Of late, there is no forward movement in these places, probably for lack of funds. Hope this helps all literary enthusiasts. Regards! – J K Mohana Rao
బోడి పద్యం గురించి ravinder posani అభిప్రాయం:
03/28/2009 8:56 am
http://www.sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=22306&subcatid=3&categoryid=1
బాబ్జీలు గారు:
సోమవారం పేజీలో అఫ్సర్ గారి ఈ కవితనే మీరు ఉదాహరణ గా ఇచ్చారు. చాలా ధన్య వాదాలు. మీరు లింకు ఇచ్చి వుంటె బాగుండె. వెతికి పట్టె సరికి ఆలస్యం అయ్యింది. అయినా, మంచి కవిత కోసం ఆ మాత్రం శ్రమ పడాల్లెండి.
ఇందులో కూడా కవి ‘నా యబ్బ ‘ అనే సంబోధన ప్రయోగించారు. అది అశ్ల్లీలమా కాదా అనేది నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ‘నా యబ్బ’ అనకుండా ‘ నా తల్లి’ నీ అమ్మ’ అని వుంటే ఈ కవిత అశ్లీలం్ అయ్యేదా?
అమెరికా ఆర్ధిక మాంద్యం మీద ఇంకా ఏమయినా కవితలు వస్తే, దయచేసి, ఎవరయినా చెప్పండి. తెలుగు కవులు దీన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారా అని మనం ఆలోచించాలి. నిజానికి ‘బోడి’ (అంటే నిరలంకార -నిరాడంబర – అతి సాధారణ అని నాకు అర్ధమయింది) పద్యాలు ఆ విషయం మీద ఒక ఇంకా రావాలి, మీలో కసి, ఉద్వేగం అనేవి వుంటే. తెల్లారి లేచి, మీరు అదే పనిగా కాగితాలు, ఈ మాట స్పేసూ ఖరాబు చేసే బదులు ఒక శీలవంతమయిన పద్యం రాస్తే బాగుంటుందేమో చూడండి.
రవీందర్
బోడి పద్యం గురించి Shankar అభిప్రాయం:
03/28/2009 6:33 am
బాగుంది. నేను బాగుందన్నది ‘బోడిపద్యం’ కవిత గురించి కాదు. ఆ కవిత మీద జరుగుతున్న చర్చ గురించి. వారపత్రికల్లో, దినపత్రికల సాహిత్యానుబంధాలలో కనిపించే కవితలను ఒకటి, రెండు లైన్లు చదివి నచ్చితే చివరంటా చదవడం, లేకుంటే వదిలేయడం ఆ తర్వాత మరచిపోవడం ఇదీ ప్రస్తుత (నా) పరిస్థితి. కాని కవితల గురించి ఇంత విస్తృతంగా, సాధికారంగా, సమర్థంగా, సమగ్రంగా చర్చ కొనసాగడం చాలా బాగుంది. తెలుగు భాష, తెలుగు కవిత్వం, సాహిత్య విమర్ష కలకాలం సజీవంగా ఉంటాయన్న నమ్మకం కలిగింది. అందరికీ ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన గురించి M.S.Prasad అభిప్రాయం:
03/28/2009 3:52 am
గురుతుల్యులైన బృందావన రావు గారికి
మీ వ్యాసంలోని చివరి పేరా ధూర్జటిని అమితంగా అభిమానించే నాకు ఖేదం కలిగించింది. పోతన తరువాత భక్తి రసాన్ని అద్భుతంగా పోషించిన మహా కవి ధూర్జటి.
వాకిట గాచియుండు హరి వారిజ సంభవ ముఖ్య దేవతా
నీకమునుం దలంప కవనీధరజా ధరహాస లోలతం
బోక సమీపవర్తులగు బుత్రుల చూడక భక్త భక్తి క
న్యా కర పంకజ గ్రహణ నైష్ఠికుడై కడు సంభ్రమంబునన్
అనే ఈయన పద్యం పోతన సిరికిం జెప్పడు పద్యానికి దీటైనది.
రాజ భోగ నిరాసక్తుడై, దుష్కర్మ నిరత రాజ నిరసనానికి అణుమాత్రం జంకక, జగత్సర్వం తన ఇష్ట దేవ (శివ) మయమని భావించి, ఈ భావాలనే తన కృతులలో పలుమార్లు ప్రస్ఫుటంగా వెలువరించిన ఈ మహ భక్త కవిని రాయలే తన కీర్తి నినుమడింపచేసుకోడానికి సాదరంగా ప్రార్ధించి తన ఆస్థానంలో ఉంచుకొనివుండవచ్చు గానీ ఈకవి తనంతట తాను రాజాశ్రయం అర్థించాడని అనుకోలేము. ఈయన తన కృతి నరాంకితం చేయలేదు సరిగదా ఏ మూలలోనూ రాయలవారి ప్రసక్తి తెచ్చి స్తుతించలేదు. తనని పెంచి పెద్ద చేసి రాజుగా నిలబెట్టిన అప్పాజీని రాయల వారు నిర్దాక్షిణ్యంగా శిక్షించినపుదు రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని బాహాటంగా గర్హించిన భక్త్యాసాదిత మహా ధైర్య సంపన్నుడు ధూర్జటి.
నీతుల కేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు సభలో
బూతులు నీతులు లోక
ఖ్యాతులు రా అని అరసికుడైన ప్రభు చిత్తానుసారులై వాడు విదిల్చే ధనం కోసం వారి మనో రంజనానికై తమ కవితలో బూతులు నిరాఘాటంగా చొప్పించే క్షుద్ర దరిద్ర నీచ కవులతో సమంగా ధూర్జటిని తలవడం
ఉరగ భూషణుతోడ ఊర జోగులను సరిచేసి ఎన్నిన చందాన మీరు
అమిత భక్తినిధి మహా కవి తోడ సమముగా కవి పిశాచముల లెక్కింప
డమే అవుతుంది.
మంచెల మీద కెక్కి కటి మండలి చుట్టిన పారుటాకు లిం
చించుక సంచలించి మరునిల్లు బయల్పడ సేయునట్లుగా
చెంచెత లార్చి వేయుదురు అనే 1-2 పద్యాలను చూసి చాటు పద్యం ఆధారంగా ఈయనను వేశ్యాలోలుడిగా భావించడం తప్పేమో . పోతన కూడా కొన్నిచోట్ల శృంగార రసాన్ని పోషించాడు.
దినముం జిత్తములో సువర్ణ ముఖరీ తీర ప్రదేశామ్ర ……….
గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు .. ఇలా అనేక పద్యాలు ఈయన స్వఛ్ఛ ప్రవర్తనని ఎత్తిచూపిస్తాయి.
ఓ సామీ! ఇటువంటి కొండ దరిలో ఒంటిం బులుల్ సింగముల్
గాసిం బెట్టెడి కుట్ర నట్టడవిలో కల్జువ్వి క్రీనీడ యే
యాసం గట్టితి వేటిగడ్డ నిలు నీ వాకొన్నచో కూడు నీ
ళ్ళే సుట్టాలును దెచ్చి పోసెదరు నీ కిందేటికే లింగమా అనే పద్యంలో
భక్తుని ఆత్రత ఆర్ద్రత నిండి కనిపిస్తాయి.
అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వలే? కడుం
బచ్చని రాలు బిల్వ నవ పత్రములే? అరుణాశ్మ భంగముల్
విచ్చిన తెల్ల దామరలె? విశ్వపతీ! విషమోపలంబు లె
ట్లచ్చుదలయ్యె నీకు? అవి అందునె గంధ మృదుత్వ శైత్యముల్
అంటూ
ఉనికి శిలోచ్చయంబు; నిజయోష శిలోచ్చయ రాజ పుత్రి; నీ
ధనువు శిలోచ్చయంబు; పురదాహ! రధీకృత రత్నగర్భ! నీ
మనమునకీ శిలా శకల మండన మెట్లు ప్రియంబు సేసె? నే
మనగల వాద నిన్ను వ్రత హాని యొనర్చు దురాత్ముడుండగన్
అని ఏనుగు ఉపాలంభించడం హృద్యంగా వుంటుంది.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి M.S.Prasad అభిప్రాయం:
03/27/2009 10:31 pm
శతావధాన ప్రబంధం అనే సుబ్బన్నగారి పుస్తకం నాకు యాధృఛ్ఛికంగా ప్లాటు ఫారం మీద అమ్మే పుస్తకాల కొట్లో (సుమారు 25 ఏళ్ళ క్రితం) ఐదు రూపాయలకు దొరికింది. అది సుబ్బన్న కవిగారు స్వహస్తాలతో కొణిజేటి రోశయ్య (నేటీ ఆర్ధిక మంత్రి) గారి పేరు లిఖించి ఆయనకు బహూకరించింది. ఇందులో కవిగారి శతాధిక శత-అష్టావధానాలలోని ముఖ్యమైన పద్యాలను తేదీ ఊరు వివరాలతో ప్రచురించారు. దత్తపదులూ, న్యస్తాక్షరులూ, నిషేధాక్షరులూ, సమస్యలూ, వర్ణనలూ కలిసిన ఈ గ్రంధం చాలా మనో రంజకంగా ఉంటుంది. నేనుదహరించిన మత్తేభమాలిక భాగాలు ఇందులోనివే. ఇది చదివి నేను వారి ప్రగాఢాభిమానినై ఆ కాలంలో (1975-78 సమీపంలో)
ఒక పోతన్నను చెప్ప వచ్చు, ప్రతి నింకొక్కండుగా సూరన
ప్రకట ప్రజ్ఞుని బల్కవచ్చు, నిక చాల్ రమ్యాతి రమ్యంబు తా
వక వైధుష్య కవిత్వ సాధిగత భవ్యత్వంబుతో బోల్పగా
సుకవుల్ నన్నయ దొట్టి చెళ్ళపిళ వంశ్యుల్ వామనుల్ సుబ్బనా!
అని ఇంకొన్ని పద్యాలతో వారికి అభివందనలు పంపించాను. ప్రతిగా వారు
తాము రచించిన ధనుర్దాసు, గోపవధూ కైవల్యం అనే లఘు కావ్యాలను పంపించారు. (ఇవి ఏవీ నన్నయ,పోతనల కవితా ప్రమాణాలను అంద లేదు). ఆరి వేరొక రచన అవధాన విద్య గురించి మీరే ప్రస్తావించారు కాబట్టి దాన్ని గురించి నేను తెలుపక్కరలేదని భావిస్తాను.
కానీ అవధాన పద్యాలన్నీ చాలా చాలా రసవత్తరంగా వున్నాయి. ముఖ్యంగా వృత్తమాలికలు – నా స్మృతిపధంలో నిలిచిన ఒక మాలికలోని కొంత భాగాన్ని
మీతో పంచుకుంటాను. ఇందులో కవి తన పృచ్ఛక సంఘాన్ని గ్రహ దేవతలతో పోలుస్తాడు
అకలంకాత్ములు, హవ్యవాహ సమ తేజోలంకృతుల్, లోక దీ
పకు, లారాధ్యు, లకుత్సితుల్, నత జగద్బంధుల్, త్రయీ మూర్తు, లా
ఢ్య కృపా పూర్ణులు, సర్వ దేవమయు, లవ్యాఘాత నిత్యోదయుల్
సుకృతి శ్రెష్టులు మీరు సూర్యులనుచున్ , శుద్ధాంత రంగుల్, సుధా
ముకుర స్వఛ్ఛముఖ ప్రసన్నరుచి రమ్యుల్, నిత్య వర్ధిష్ణు చా
రు కళా స్నిగ్ధు, లమేయ సత్పధ విహారుల్, మీరహో దేవదే
వ కపర్దాభరణుల్ హిమాంశు లనియున్ స్వర్ణ ప్రభా భాసురుల్
ప్రకట ప్రజ్ఞులు సత్య వాదులు యువత్వ ప్రౌఢు లత్యంత ధ
ర్మ కఠోరుల్ ……………………………………………
వికచాబ్జాక్షులు పాండితీ భర వయో వృద్ధుల్ ధనుర్మీన నా
యకు లాంగీరస కీర్తనీయులనుచున్ అభ్యస్త తర్కాది శా
స్త్ర కలాపుల్ సుయశో ధురీణులనుచున్ క్ష్మా నందనుల్ మీరు మా
మక భాగ్యామృత భాగ దాన శుభ ధామస్వామితా వైభవా
త్మకులై తత్తదనూన భాగ్య ఫల సంపద్దాన దీక్షా క్షమ
ప్రకృతుల్ మీరని మీకు మీకు వినయ వ్యాపార మేపార మ
స్తక విన్యస్త శయ ప్రకారము నమస్కారమ్ము గావించి గొం
కక భావించెద సభ్యులార వినతిన్ గావించెదన్ మీకు పృ
ఛ్ఛక సంఘంబున వృద్ధమూర్తి వరుణాశన్ దోచునో సౌరి, త
న్నికట క్షోణి రహించునో బుధుడు, పృశ్ని స్వాంత లబ్దాశయుం
డకఠోరోత్పల మాలికా సుభగ కన్యా మోహనాపాంగ దృక్
ప్రకరావలంబి విజృంభి విక్రముడు రక్షఃశ్శాస్తనున్ మించునో
— ——-
సుబ్బన్న శతావధాని గారు పొద్దుటూరు (కడవ జిల్లా) వాస్తవ్యులు. ఆ కాలంలో సుబ్బన్న శతావధాని పొద్దుటూరు అంటే పోష్టు వెళ్ళేది. నా దగ్గర వున్నపుస్తకాన్నివెదకి చిరునామా దొరికితే పంపుతాను. దీనికి కొంత వ్యవధి కావాలి.
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
03/26/2009 11:30 pm
సంగీతం చెవుల్ని రంజింప చేస్తే, సాహిత్యం మనసుని తాకుతుంది. అప్పుడే ఆ సంగీతాన్ని మరింతగా ఆస్వాదిస్తాం.
కేవలం సరిగమలతోనే పాడుతూ, సాహిత్యం లేని సంగీతం అందర్నీ అలరించలేదు. లోతైన అవగాహన లేకపోయినా సంగీతాన్ని పామరుల వరకూ తీసుకెళ్ళేది సాహిత్యమేనని నేననుకుంటున్నాను. “సాహిత్యం కావాలంటే యింట్లో కూర్చుని చదువుకో. సంగీతం కోసమే కృతులు విను” అన్న వ్యాఖ్యలో తొందరపాటు కనిపిస్తోంది. “ఎందరో మహానుభావులు – అందరికీ వందనములు” అనే సరళమైన సాహిత్యం లేకపోతే ఆ శ్రీరాగ కృతి ఎంతమందికి చేరేదో చెప్పండి? సాహిత్యం లేకపోతే వర్ణంలా తయారయ్యేది.
త్యాగరాజు కృతుల్లో సంగీతమున్నంత స్థాయిలో సాహిత్యం లేదన్నారు. ఇదే మాట మరి క్షేత్రయ్య విషయంలో ఎందుకనలేదు? రామదాసు కెందుకాపాదించ లేదు?
అలాగే సాహిత్యంలో తప్పొప్పులు పాడే వారిదా, లేక అవి రాసి, మనకందరికీ అందించిన శిష్యుల చేతి చలవా అన్నది తెలుగు భాషొచ్చిన మనం చెప్పగలం. తమిళులు తప్పు పాడితే క్షమంచచ్చు. తెలుగు వారి మాతృభాష కాదని సరిపెట్టుకోవాలి. మహాను భావుల్ని, మగాను భావులుగా పాడే తెలుగు ప్రముఖులూ వున్నారు. వారినేమనాలి?
త్యాగరాజు శిష్యులందరికీ తెలుగొచ్చు. వారందరూ తెలుగులోనే కృతులూ, వర్ణాలూ స్వరపరిచారు. వీణ కుప్పయ్యర్, వెంకట రమణ భాగవతార్, మనంబుచవాది వారూ అందరూ తెలుగులోనే రచించారు. ఇప్పుడు మనకున్న కృతులు వీరు పొందుపరచగా వచ్చినవే! కాబట్టి వారు భాష రాక సరిగా రాసుండక పోవచ్చుననడానికి అవకాశం లేదు. పైగా వారందరూ ఆ కృతులు పాడ్డం నేర్చుకున్నారు కదా? అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశముంది. ఎవరూ కాదనరు. పండితులు ( నేను కాదు ) చూపించిన తప్పులన్నింటికీ శిష్యుల్ని బోనులో నిలబెట్టడం సరికాదు.
పాడేవాళ్ళు ఎవరికి తోచినట్లుగా వారు సాహిత్యాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. ఆ మధ్య అమెరికాలో ఓ ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు అప్ప రామ భక్తి కృతిలో “కపి వారిధి దాటునా
కలికి రోట కట్టునా?” అనే చరణాన్ని “కపి వారిధి దాటునా – కలికి రోట కొట్టినా” అని పాడింది. విన్నందరూ “ఆహా – ఓహో” అంటూ మెచ్చుకున్నారు. పాడినావిడ తమిళావిడ కాబట్టి ఎవరూ అనలేదు. ఇదే తెలుగు వాళ్ళు ఓ తమిళ కృతినో, కీర్తన్నో సాహిత్యాన్ని ఖూనీ చేస్తూ పాడమనండి చూద్దాం. ఆ గాయకుడు ఆ సభా ప్రాంగణాన్ని దాటి బయటకొస్తే ఒట్టు. కానీ ఏం చేస్తాం? కర్ణాటక సంగీతమూ, త్యాగరాజూ ఈ రోజువరకూ అందరి గొంతులోనూ పలకడానికి కారణం తమిళులే! తెలుగు వారెవరూ పట్టించుకోరు. ఇదీ మన దౌర్భాగ్యం.
త్యాగరాజు కవయినా కాకపోయినా కొన్ని కృతుల్లో వాడిన భాషా, భావమూ కవిత్వంలాగే వుంటాయి. అందులో కొన్ని వాక్యాలు ఇప్పటికీ మనం వాడుతూనే వుంటాం.
బోడి పద్యం గురించి sreelata raavuri అభిప్రాయం:
03/26/2009 11:56 am
http://www.pranahita.org/2009/03/nallanallani_navvu/
ఈమాటలో సురయ్య మీద, కొత్త ప్రాణహితలో నవ్వు మీద అఫ్సర్ గారి కవితలు చదివాను.
ఆ రెండిటికీ చాలా తేడాగా వుంది ‘బోడి పద్యం”
ఈ తేడా గురించి అసలు చర్చ జరగాలి.
ఒకే కవి రాసిన మూడు కవితలు ఇంత భిన్నంగా ఎందుకు వున్నాయి? ఏ కవితలో కవి ఆత్మ దొరుకుతుంది? (ఈ ఆత్మల గొడవ నాకు నచ్చలేదు కాని, కొద్దిసేపు ఆలోచిద్దాం)
ఆ కవితలు సుతారంగా వున్నాయి, ఈ కవిత మోటుగా వుంది. అసలు కవిత్వ లక్షణం ఏమిటి? ఒకే కవి రెండు రకాలుగా రాసినప్పుడు ఆ కవిని ఎలా అర్ధం చేసుకోవాలి?
శ్రీలత
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి baabjeelu అభిప్రాయం:
03/26/2009 9:09 am
త్యాగరాజుల వారి సాహిత్యం మీద చర్చ సరైనదేనా? చర్చించవలసినంత సాహిత్యం త్యాగరాజుల వారిదా? త్యాగరాజ సాహిత్యం, సంగీతానికి poor cousin ట గదా? త్యాగరాజుల వారి సాహిత్యాన్ని శిష్యులూ వగైరాలు సరిగ్గా రాసుకోలేదుటగదా? ముందు సాహిత్యాన్ని సరిగ్గా రాసుకోపోవడం గురించి:
కర్రపలక మీద గంటంతో మహీధర రామశాస్త్రి గారు వ్రాసుకొన్న ప్రతిని చూసి పెనుమర్తి రామశర్మ గారు వ్రాసుకొన్న పాట.
నగుమోముఁ గనలేని
నగుమోముఁ గనలేని
నా జాలిఁ దెలిసి
ననుఁ బ్రోవగ రావ,
నా రఘువర! నీ //న//
నగరాజధర!నిన్నుఁ
బొగడు వారెల్ల
ఒగి బోధనలనుఁ జే
యగ రాలేదే!
మొగమోడితిరేమో! నీ //న//
ఖగరాజు నీ యానతి
దిగనాడి, చనలేదో!
గగనానికి ఉర్వికిని
తెగ దూరంబని నాడో!
జగమేలే పరమాత్మ!
తగ నీతో మొరలిడుదు
వగఁ దీర్పుము, తాళను,
వేగనేలు కోరా!
రఘువర! శుభచరిత!
త్యాగరాజనుత! నీ //న//
దీనికీ ఇప్పుడు పాడుతున్న సాహిత్యానికీ తేడా గమనించాలి. అలాగే ఇంకో క్రుతిలో:
తప్పకనే వచ్చు! నా
తనువుకు లంపట, నీ కృపఁ
దప్పగనే వచ్చు!
మెప్పులకై, కొప్పులుగల
మేటి జనులఁ జూచి, భజనఁ //దప్పఁగఁనే//
రూకలకై, పైకి మంచి
కోకలకై, కూటి కొరకు
నూకలకై ధ్యానించితి!
నుతుని త్యాగరాజ భజనఁ //దప్పఁగనే//
“తప్పకనే అంటే తప్పకుండా అని, భజనఁ దప్పఁగనే అంటే భజన తప్పిపోగానే అని త్యాగరాజు చమత్కార ప్రయోగాన్ని పాట వ్రాసుకున్న వారు గమనించలేదు. ఆఖరి పాదంలోని poetic order తెలుసుకోలేదు. అందుచేత మూలంలోనున్న నుతుని త్యాగరాజ భజనఁ మార్పు చేయబడి త్యాగరాజ నుతుని భజన గా కనిపిస్తుంది. సి.రామానుజాచారి “తప్పగనే వచ్చునా తనువుకు లంపట?” అని ప్రశ్నార్థకచిహ్నం పెట్టేరు. త్యాగరాజు ప్రశ్న వేయలేదు, సందేహించనూ లేదు.
ఇదంతా నా ప్రతిభ గాదు. ఎక్కడో చదివినది.
ఇదంతా ఒకెత్తు, శ్రీపాద పినాకపాణి గారూ, వారి అన్నగారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారూ సంగీతంలోని సాహిత్యం గురించి:
శ్రీపాద కృష్ణమూర్తి గారు: When I listen to music, I care a damn for poetry…. సాహిత్యం కావాలంటే యింట్లో కూర్చుని చదువుకో. సంగీతమునకు ఔన్నత్యము చేకూర్చిన కారణము చేతనే త్యాగరాజునకు గౌరవము వచ్చినది కాని అందమైన సాహిత్యభావములను వెలిబుచ్చినందుకు కాదు.
శ్రీపాద పినాకపాణి గారు: పొయెట్రీ లేదు. బెగ్గింగ్ ఫర్ మెర్సీ అంతే…. హి ఈజ్ నాట్ ఎ గ్రేట్ పొయెట్. తెలుగు సంస్కృతం అద్భుతంగా వచ్చు, అంతే తప్ప కవి అంటే ఒప్పుకోను.
రసం సంగీతం. సాహిత్యం పిప్పి. ( ఇద్దరూనూ)
ఇది కూడా ఎక్కడో చదివింది. అతడు – ఆమె లో కూడా “లక్ష్మి గారు” శాస్త్రి తోనూ, శాంతం తోనూ మంచి చర్చ చేస్తారు త్యాగరాజుల వారి సాహిత్యం గురించి.
సెబితే సానా వుంది/యింటే ఎంతో వుంది/సెబుతా, యినుకోరా యెంకట సావిఁ ( టియెమ్మెస్సో, శీర్కాళో గుర్తులేదు. డబ్బింగ్ సినిమాయేననుకుంటున్నాను. వావివరసలెవరవో కూడా తెలీదు)
బోడి పద్యం గురించి sarma rallapalli అభిప్రాయం:
03/26/2009 8:39 am
అయ్యా, నేను ముస్లింని కాను. నాకు ముస్లిం సంప్రదాయాల గురించి అసలు తెలియదు కూడా. కాని, కవి ఈ కవిత ‘సుంతీ’ గురించి రాశారనీ, ఆ చిన్న అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ మత విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుతున్నారనీ నా కొద్దిపాటి జ్నానం చెప్పింది. కాని, అంతకంటే బలమయిన అనుభూతి/ ఉద్వేగం (దీన్ని బాబా కవితా ధార అన్నారేమో!) ఈ కవితలో నన్ను కట్టి పడేశాయి.
ఇది నాకు తెలియని అనుభూతి (భవిష్యత్తులో తెలిసే అవకాశమూ లేదు). అయినా, కవిత నన్ను చాలాసేపు ఆలోచింప జేసింది. చాలా విషయాలు , మతానికి సంబంధించినవి ఉదా:
దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
అన్నప్పుడు దర్గాలకి వెళ్లే నేనే గుర్తు వచ్చాను.
మా నెల్లురు , ఒంగోలు జిల్లాలో మస్తానయ్య, నాంచారయ్యని ఎవరిని అడిగినా ఈ పంక్తికి అర్ధం చెప్పగలడు. నా బ్రాహ్మణత్వం గాయత్రీ మంత్రం. కాని, దర్గా దగ్గిర మా అమ్మ మన్నతు చేసుకుంటుంది. అంత వరకే నాకు తురక మతం తెలుసు.
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
పల్లెల్లో తురకల్ని ఎవరిని అడిగినా, వాళ్ల బతుకు పద్ధతి సగం కింది కులాల వారితో కలుస్తుంది.
ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది. లైలా గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి వారి పఠనం. నాకు ఆ విషయాలు తెలియవు. ఈ కవితని నేను ఒక పల్లెటూరి వాడిగా చదివాను. ఇందులో అశ్లీలం ఎమిటొ నాకు తెలియదు.
ఈ కవిత రాసినందుకు కవికీ, వేసినందుకు ఈమాటకి ధన్యవాదాలు. ఈ కవితకి ముందు అఫ్సర్ అనే పేరు నాకు తెలియదు. వెనక్కి వెళ్లి, ఆయన రాసిన్ కవితలు చదివాను. సురయ్య గురించి కవిత చదవండి. ఆర్యులకు అది బాగా నచ్చె పద్యం.
రాళ్లపల్లి
బోడి పద్యం గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:
03/26/2009 7:18 am
బొల్లొజు బాబా గారు,
ఈ కవిత, అఫ్సర్ గారు కాకుండా, ఏ రవికిరణో, బల్లోజు బాబా గారో, లేకపోతే మరొకరో వ్రాశారనుకోండి, అప్పుడు కూడా మీరు, ఏర్నేని గారు ఈ కవితని ఈ రకంగానే అర్థం చేసుకునుండే వారా?
“The reader then muses – The poet is a teacher of literature. He reads lot of poetry of his own students. He reads lot of other poets all over the world,” రచయిత గురించి ఈ విషయం తెలియకపోతే బహుశా కవితకి ఈ కవితార్థం మనసుకి వచ్చుండదేవో!
నిజంగా ఈ కవిత “Look! Each piece creates a broken image. Look! multiple discordant images are lying all over the place. Each broken stanza, oh! even more painful – each broken sentence, phrase, – sings a different song. For Heavens sake! , the pieces do not even sing in one language. There is no one cohesive religious tune. Not one unified theme . Not a single consolidated thought. Nothing makes any sense,” అఫ్సర్ గారు కాకుండా మరొకరు వ్రాసుంటే పైన ఉదాహరణతోనే ఆఖరయ్యుండేదేవో, ఆలొచింఛారా.
లైలా గారి అబిప్రాయం తప్పని చెప్పటం నా ఉద్దేశం కాదు. అఫ్సర్ గారి పేరు, ఆయన యు.టి ఆస్టిన్ పేరు ఈ కవితలోకి విస్తరించాయెమోనని నా అనుమానం, అంతే.
నాకైతే, ఈ కవిత చాలా బోడిగానే కనిపిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది.
ఒక మతాచారం బ్లిస్ అని అనుకున్న తర్వాత దానిమీద మరోరకవైన అభిప్రాయం ఎలా వీలవుతుంది లైలా గారు?
“By all means. Cry all you want. But, if you are a doctor, for God’s sake , why such agony over a few words? Really, it is teensy bleeding which can be easily stopped and after all, excised prepuce is a tiny piece of useless skin.” కదా కవి అయినంత మాత్రాన “If you are an artist, let it bleed. Let it bleed” అనేది హిపాక్రసి నేవో.
రవి
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి mOhana అభిప్రాయం:
03/26/2009 6:37 am
I hope the editors allow me to post this message in English. DLI means Digital Library of India. IISc (http://www.new.dli.ernet.in/index.html.en) IIIT (http://dli.iiit.ac.in/) CDAC (http://www.dli.cdacnoida.in/) Carnegie-Mellon (http://www.archive.org/advancedsearch.php) These institutions started the initiative of scanning books and making them available to one and all. One can download whole books in pdf or djvu formats from archive.org. At the other places, they are available as individual tif files. These have to be downloaded and a pdf file has to be created. It is possible to read them on-line too. But, it is a bit cumbersome. There are nearly 100,000 Telugu books in these places with duplications. But a note of caution – the organisation is a bit chaotic with very unfriendly features and unimaginable spelling errors. Inspite of these, the end results justify the efforts. Of late, there is no forward movement in these places, probably for lack of funds. Hope this helps all literary enthusiasts. Regards! – J K Mohana Rao