విద్యా సుందరి (సుందరి ఐన సరస్వతి) అనే శీర్షిక నాగ రత్నమ్మ గారి బిరుద నామమౌనో కాదో తెలియదు గానీ, ఆమెకు అన్వర్ధ నామం అని నాకు అనిపిస్తోంది. మహాత్ములైన వారు ఏ కులానికి, జాతికి, మతానికి సంబంధించరు. వారు మా కులం, మా జాతి, మా మతం అని వేరే వారు అతిశయపడాలే గానీ, వారు సర్వ ప్రపంచానికి సంబంధించిన వారు. అట్టి మహోన్నతమైన వ్యక్తిత్వాలకు ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతుంది. నివాళులర్పిస్తుంది. స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత చరిత్ర తెలుసుకుని ధన్యుడనయ్యాను. కృతజ్ఞతలు. ఆమె ఆర్జించిన, విశిష్టపరచుకున్న అనర్ఘ గుణసాహస్రంలో దేవదాసీ విధానాన్ని సమర్ధించడం, రాధికా సాంత్వనం వంటి పరమ బూతు కావ్యాన్ని పట్టుదలగా ముద్రింపించడం వంటి 1-2 విషయాలు నాకు అణుమాత్రం రుచింపకున్నా ఆమె పట్ల గౌరవం ఇసుమంత తగ్గలేదు.
ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః
ఇంకొక మాట. వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు రసిక మనో రంజనం అనే ఒక బూతు కావ్యంగా వ్రాసారని తెలిసి ఆయన మీద ఇదివరకుండే గౌరవం లుప్తమైంది. మరి ఆయన ముందు ఇదివరకు విలపించిన సరస్వతి ఇది విని సంతోషించింది కాబోలు.
పై పద్యంలో ధార, భావం అన్నీ బాగా వున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను. మీకీ పద్యం అవగతం కాలేదన్నారు లేదా భావోత్కృష్టత అంత ప్రశంసనీయం గా మీ కనిపించలేదన్నారు కనుక, నా అల్ప మేధస్సుకి అది ఎందుకు అనర్ఘంగా తోచిందో వివరింప ప్రయత్నిస్తాను.
ధనము శాశ్వతము కాదు. శరీరం క్షణ భంగురము. జీవనము తత్వార్ధముల వలె (అహమ్ బ్రహ్మస్మి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి వగైరా) నిత్యము కాదు. కాల పాశానికి ఏ నిముషమైనా చిక్కవచ్చు. కావున మనుషులైన వారు దీని వ్యావృతిని నమ్మక, మహాత్ముడైన అమ్మెన ప్రెగ్గడ వలె పేర్మితో వరార్ధము (భగవచ్చింతన), ఎన్నడునూ చేటు లేని ధర్మార్ధము (ధర్మ నిరతి) చేయవలయును.
ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. మిగిలిన పదాలు, ధార అవధరిస్తే కవి అసమర్ధుడుగా భాసించడు. ఆ లోపాలు సమ్యగ్రీతిని సంస్కరిస్తే ఈ పద్యం మీకు కూడా హృద్యంగానే వుంటుందని అనుకుంటాను. ఆ విధంగా సంస్కరింపబడినా కూడా అది అంత మంచి పద్యం అని మీకనిపించక పోతే అది మీ అభిరుచి. లోకో భిన్న రుచిః నాలాంటి కొందరికి నచ్చిన దాన్నే ఉత్తమ సాహిత్యమని పలకడం దుస్సాహసమౌతుంది గదా.
ఈ వ్యాసం ఎంతో బాగుంది. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికే గాక, ఇది వరకే తెలిసిన విషయాలలో అవగాహన ఇంకా పెరగడానికి దోహదపడింది. వ్యాసకర్తకీ రంగంలో వున్న అభినివేశం, అభిరుచి, సాధికారత, ప్రామాణికత్వం శ్లాఘనీయమైనది. లక్షణాలకు లక్ష్యాలను స్వయంగా సమకూర్చడంలో (సర్వ) జన వేద్యమైన సరళ సంస్కృత భాషా పద ప్రయోగం అమోఘం. ఆదిలోనే ఉదహరించిన శ్లేషాలంకార సహితమైన మాఘుని సంస్కృత చంపకమాల ఆకట్టుకుంది. చంపకమాల, ఉత్పలమాల, కందం, తేటగీతి, మధ్యాక్కర, సీసం వగైరా వృత్తాల సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ సృష్టించిన (చిత్ర విస్తర కవిత్వాలలో ఒకటిగా చెప్పబడిన) గర్భ కవిత్వం ప్రశంసార్హం. ఈ గర్భిత వృత్తాలలో భిన్న వృత్తాలలో భిన్న భావాలు ప్రదర్శించే అద్భుత నైపుణ్యాన్ని ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలిపివుండాలనిపించింది. ఉదాహరణకి ఈ క్రింది పద్యాన్ని చూడండి
శ్రీరామ స్తుతి
గురు కరుణాకరా! సమద కుంజర దానవ శక్తి హార సం
భరిత మనా! త్రయీ భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన! ఈ
శ్వర గురు ధర్మ భంజన! నిశాచర వర్ధన శస్త శూల! క్ష్మా
ధర వర! జానకీ సతి హృదంతర మందిర! సర్వ పాలకా!
దేవీ స్తుతి
కరుణాకరా! సమద కుం జర దానవ శక్తి హార సంభరిత మనా!
గురు ధర్మ భంజన! నిశా
చర వర్ధన శస్త శూల! క్ష్మాధర వరజా!
శివ స్తుతి
సమద కుంజర దానవ శక్తి హార
భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన!
జన! నిశాచర వర్ధన శస్త శూల!
సతి హృదంతర మందిర! సర్వ పాల!
తరువాత అగ్ని ర గణం అని, సూర్య జ గణం అని, చంద్ర భగణం అని, ఇంద్ర నగణం అని తెలిపారు. మిగిలిన గణాలు అంటే య, మా, తా, స, వ, లఘు గురువులకు ఏవి వర్తిస్తాయో తెలుపవలసినదిగా ప్రార్ధన.
చివరగా
అనుపమ మద్భుతావహ మనన్య జనాచరితం బమోఘమున్
అనితర మన్య దుర్లభ మనంత మనోజ్ఞ రసాభిరామమై
దనరెడు మీ వచో నిపుణతా, కవితాతుల రీతి మెత్తు, మో
హన కవితా వశీకృత దిగంత సుధీజన! కృష్ణ మోహనా!
భవదీయుడు
రాజకీయలపై కన్నేసి వుంచేవాళ్ళకి అవే కనపడ్డాయి. కులం, మతం కవితల్లో ఆసక్తివున్నోళ్ళకి అదే కనపడింది. అంచాత చర్చ కూడా నానాజాతి సమితి శిఖరాగ్ర సమావేశంలా సాగుతూనే వుంది.
జననీ శివకామిని పాట నాకు చాలా ఇష్టం. సావిత్రి గారి మాట వింటుంటే మళ్ళీ ఆ మహానటిని చూస్తున్నట్టే ఉంది. ఇంత మంచి ప్రోగ్రాం ని పెట్టినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.
మీరు బి.వి.రామన్ గారు గాంధి గురించి వ్రాసిన దానిని ఎగతాళి చేసారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చి పోతున్నారు. జాతకము లోని వివిధ కాంబినేషన్ల బట్టి వివిధ విషయములు చూడాలి. ద్వాదశం, శయ్య సుఖము, మోక్షము, వ్యయము లను సూచించును. ఆత్మ కారకుడు మోక్షస్థానములో ఉండటము వలన అధ్యాత్మికత గురించిన ప్రస్తావన సరియేగదా. ఇది మీరన్నట్లు 2+2=4 లాగా కాదు కదా. వివిధ సిధ్ధాంతములు మనకు సూచకములే (గైడులైనులే).
ఇంకొక సంగతి: డీన్ చేసిన ప్రయోగం చాలా సరళమైనది. ఒక జాతకం సరిగా చెప్పాలంటే, వివిధ వర్గ (రాశి, నవాంశ, దశాంశ, …), ఏ విషయము కావలయునో ఆ దశ భుక్తి తదితర విచారము, గోచార, తిథి ప్రవేశ ఫల నిర్ణయము ఇటువంటి వివిధ ప్రకార చింతనము ఆవశ్యకము. అంచేత, డీన్ ప్రయోగ ఫలితము నాకు అంత ఆశ్చర్యము కలిగింపలేదు. అదీ కాక, ఆయన నమ్మకము అధికమని నిరోపించాడే కాని జ్యోతిష్యము పని చేయదని నిరూపించలేదని నా అభిప్రాయము.
నా అభిప్రాయము ఏమన జ్యోతిష్యము ఎడ్యుకేటెడ్ గెస్ చేయటానికి సాయం చేస్తుంది.
మోహన రావు గారికి
మీ వ్యాసం సంస్కృత వృత్త ఛందస్సుల నభ్యసించే విద్యార్ధులకు లక్షణ లక్ష్య సముపేతమైన పాఠ్యగ్రంధం వంటిది. అభ్యాసకులకు రిఫరెన్స్ బుక్. అంతే కాక వృత్తాల పూర్వాపరాలు,తత్సంబంధిత కధలు చాలా హృద్యంగా ఉండి పాఠకులను చదివింపచేస్తాయి. జగద్గురు శంకరాచార్యులు వారు రచించిన దేవీ దేవతా స్తోత్రాలను నిత్య పూజా విధానంలో భాగంగా అనుసంధించని హైందవ కుటుంబం ఉండదు. ఐతే ఈ స్తోత్రాలలో ఇమిడివున్న వృత్తాల పేరులు ఇప్పుడు తెలిసుకొని ఆ పరిజ్ఞానం మా కందించిన మీకు అనేకానేక కృతజ్ఞతలు.
ముఖ్యంగా శ్లోకాలలో పాదానికి 16 అక్షరాలు వుండి మాత్రా చందస్సులో వుంటుంది అనే తప్ప పూర్వర్ధంలో 5,6,7 అక్షరాలు య గణం, అవే ఉత్తరార్ధంలో జ గణం కావాలని నేను మీ వ్యాసం ద్వారానే తెలుసుకున్నాను. కృతజ్ఞుడను. పూజలో నిత్యం అనుసంధీంచే స్వరచిత శ్లోకాలలో ఈ నియమం దైవికంగా అనుసరించబడడం నా అదృష్టం.
దేవ్యపరాధ స్తోత్రం వచనం గా భావించిన నాకు ఇది శిఖరిణీ వృత్తం అని తెలిసి ఆశ్చర్యం కలిగించింది. అక్కడక్కడా క్రమబద్ధమైన లయ గమనించినా అంతా ఒక క్రమంలో వున్నదని గమనించలేదు. ముద్రించిన వారి లోపాలు ఇందుకు కారణం కావచ్చును.
మాధవ్ గారికి
స్పందన తెలుపమన్నందుకు ఈ క్రింది రెండు మాటలు…
“కొందరు శబ్దాలకు తలూపుతారు. కొందరు శబ్దాలకు నాట్యం చేస్తారు. కొందరు శబ్దాలకు ‘చెవి’ విరుస్తారు. కాని కొందరు నిశ్శబ్దసౌందర్యాన్ని దర్శించడం కోసం శబ్దలోకయాత్ర మొదలుపెడతారు.
చివరివారికి లోయలు స్వాగతం పలుకుతాయి. మీకు స్వాగతం పలికిన లోయల్ని పరిచయం చేసుకున్నాను. సంతోషం.
ఈ కథ గురించి రచయితగా చెప్పడానికి ఏమీలేదు. ఎవరి లోయల మీద ఎగురుతొన్న పక్షుల రెక్కల చప్పుళ్ళని వారి రక్తంలోకి అనువదించుకుని ఆనందించడమే…
ప్రసాద్ గారికి నమస్కారం – మీరు రాసింది బాగానే ఉంది. చివరి పాదంలో దురితలోని రితో యతి సరిపోదు. సామాన్యముగా శ్రీకు రికు యతి చెల్లుతుంది. కాని పాదంలో ఒక యతికంటె ఎక్కువగా ఉంటే, మొదటి
అక్షరము సంయుక్తాక్షరమయితే అందులో ఒక అక్షరంతోనే పాదమంతా యతి చెల్లించాలి. అంటే దురితలోని రికు బదులు శీ అక్షరముతో యతి చెల్లించాలి. నా ఈమెయిలు చిరునామా jkmrao@yahoo.com
అక్కడికి మీరు రాస్తే మిగిలిన విషయాలను చర్చించుకోవచ్చు.
విధేయుడు – మోహన
విద్యాసుందరి గురించి M.S.Prasad అభిప్రాయం:
04/20/2009 2:50 am
విద్యా సుందరి (సుందరి ఐన సరస్వతి) అనే శీర్షిక నాగ రత్నమ్మ గారి బిరుద నామమౌనో కాదో తెలియదు గానీ, ఆమెకు అన్వర్ధ నామం అని నాకు అనిపిస్తోంది. మహాత్ములైన వారు ఏ కులానికి, జాతికి, మతానికి సంబంధించరు. వారు మా కులం, మా జాతి, మా మతం అని వేరే వారు అతిశయపడాలే గానీ, వారు సర్వ ప్రపంచానికి సంబంధించిన వారు. అట్టి మహోన్నతమైన వ్యక్తిత్వాలకు ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతుంది. నివాళులర్పిస్తుంది. స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత చరిత్ర తెలుసుకుని ధన్యుడనయ్యాను. కృతజ్ఞతలు. ఆమె ఆర్జించిన, విశిష్టపరచుకున్న అనర్ఘ గుణసాహస్రంలో దేవదాసీ విధానాన్ని సమర్ధించడం, రాధికా సాంత్వనం వంటి పరమ బూతు కావ్యాన్ని పట్టుదలగా ముద్రింపించడం వంటి 1-2 విషయాలు నాకు అణుమాత్రం రుచింపకున్నా ఆమె పట్ల గౌరవం ఇసుమంత తగ్గలేదు.
ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః
ఇంకొక మాట. వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు రసిక మనో రంజనం అనే ఒక బూతు కావ్యంగా వ్రాసారని తెలిసి ఆయన మీద ఇదివరకుండే గౌరవం లుప్తమైంది. మరి ఆయన ముందు ఇదివరకు విలపించిన సరస్వతి ఇది విని సంతోషించింది కాబోలు.
చంపకోత్పలమాలల కథ గురించి M.S.Prasad అభిప్రాయం:
04/20/2009 1:37 am
లైలా గారికి
అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్
పై పద్యంలో ధార, భావం అన్నీ బాగా వున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను. మీకీ పద్యం అవగతం కాలేదన్నారు లేదా భావోత్కృష్టత అంత ప్రశంసనీయం గా మీ కనిపించలేదన్నారు కనుక, నా అల్ప మేధస్సుకి అది ఎందుకు అనర్ఘంగా తోచిందో వివరింప ప్రయత్నిస్తాను.
ధనము శాశ్వతము కాదు. శరీరం క్షణ భంగురము. జీవనము తత్వార్ధముల వలె (అహమ్ బ్రహ్మస్మి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి వగైరా) నిత్యము కాదు. కాల పాశానికి ఏ నిముషమైనా చిక్కవచ్చు. కావున మనుషులైన వారు దీని వ్యావృతిని నమ్మక, మహాత్ముడైన అమ్మెన ప్రెగ్గడ వలె పేర్మితో వరార్ధము (భగవచ్చింతన), ఎన్నడునూ చేటు లేని ధర్మార్ధము (ధర్మ నిరతి) చేయవలయును.
ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. మిగిలిన పదాలు, ధార అవధరిస్తే కవి అసమర్ధుడుగా భాసించడు. ఆ లోపాలు సమ్యగ్రీతిని సంస్కరిస్తే ఈ పద్యం మీకు కూడా హృద్యంగానే వుంటుందని అనుకుంటాను. ఆ విధంగా సంస్కరింపబడినా కూడా అది అంత మంచి పద్యం అని మీకనిపించక పోతే అది మీ అభిరుచి. లోకో భిన్న రుచిః నాలాంటి కొందరికి నచ్చిన దాన్నే ఉత్తమ సాహిత్యమని పలకడం దుస్సాహసమౌతుంది గదా.
చంపకోత్పలమాలల కథ గురించి M.S.Prasad అభిప్రాయం:
04/20/2009 12:07 am
ఈ వ్యాసం ఎంతో బాగుంది. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికే గాక, ఇది వరకే తెలిసిన విషయాలలో అవగాహన ఇంకా పెరగడానికి దోహదపడింది. వ్యాసకర్తకీ రంగంలో వున్న అభినివేశం, అభిరుచి, సాధికారత, ప్రామాణికత్వం శ్లాఘనీయమైనది. లక్షణాలకు లక్ష్యాలను స్వయంగా సమకూర్చడంలో (సర్వ) జన వేద్యమైన సరళ సంస్కృత భాషా పద ప్రయోగం అమోఘం. ఆదిలోనే ఉదహరించిన శ్లేషాలంకార సహితమైన మాఘుని సంస్కృత చంపకమాల ఆకట్టుకుంది. చంపకమాల, ఉత్పలమాల, కందం, తేటగీతి, మధ్యాక్కర, సీసం వగైరా వృత్తాల సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ సృష్టించిన (చిత్ర విస్తర కవిత్వాలలో ఒకటిగా చెప్పబడిన) గర్భ కవిత్వం ప్రశంసార్హం. ఈ గర్భిత వృత్తాలలో భిన్న వృత్తాలలో భిన్న భావాలు ప్రదర్శించే అద్భుత నైపుణ్యాన్ని ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలిపివుండాలనిపించింది. ఉదాహరణకి ఈ క్రింది పద్యాన్ని చూడండి
శ్రీరామ స్తుతి
గురు కరుణాకరా! సమద కుంజర దానవ శక్తి హార సం
భరిత మనా! త్రయీ భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన! ఈ
శ్వర గురు ధర్మ భంజన! నిశాచర వర్ధన శస్త శూల! క్ష్మా
ధర వర! జానకీ సతి హృదంతర మందిర! సర్వ పాలకా!
దేవీ స్తుతి
కరుణాకరా! సమద కుం జర దానవ శక్తి హార సంభరిత మనా!
గురు ధర్మ భంజన! నిశా
చర వర్ధన శస్త శూల! క్ష్మాధర వరజా!
శివ స్తుతి
సమద కుంజర దానవ శక్తి హార
భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన!
జన! నిశాచర వర్ధన శస్త శూల!
సతి హృదంతర మందిర! సర్వ పాల!
తరువాత అగ్ని ర గణం అని, సూర్య జ గణం అని, చంద్ర భగణం అని, ఇంద్ర నగణం అని తెలిపారు. మిగిలిన గణాలు అంటే య, మా, తా, స, వ, లఘు గురువులకు ఏవి వర్తిస్తాయో తెలుపవలసినదిగా ప్రార్ధన.
చివరగా
అనుపమ మద్భుతావహ మనన్య జనాచరితం బమోఘమున్
అనితర మన్య దుర్లభ మనంత మనోజ్ఞ రసాభిరామమై
దనరెడు మీ వచో నిపుణతా, కవితాతుల రీతి మెత్తు, మో
హన కవితా వశీకృత దిగంత సుధీజన! కృష్ణ మోహనా!
భవదీయుడు
బోడి పద్యం గురించి Alok అభిప్రాయం:
04/19/2009 11:19 pm
ఇప్పటికాలంలో గూడా “వచన” కవిత్వాన్ని “పద్య” మనడం జరుగుతోంది. అంచాత ఇది కవిత్వమా, పద్యమా అన్న మీమాంస అక్కర్లేదు.
చూడగా, ఇందులో నాలుగు భాగాలున్నాయి.
1. కవిత్వం పుట్టక-కవి బాధలు (1, 3, 6వ స్టాంజాలు)
2. భిన్న మతాలు – సౌహార్ద్రత (2, 4వ స్టాంజాలు)
3. కులం – వైయక్తిక వేదన (4, 5 వ స్టాంజాలు)
4. రాజకీయాలు – అభిప్రాయ ప్రకటన (కూలిన మసీదు గోడ, బ్రోచేవారెవరురా వగైరా వాక్యాలు)
యిన్నేసి భావాలు, అభిప్రాయాలు, ప్రకటనలు, నిట్టూర్పులూ వొకేచోట గుమిగూడ్డంతో కవిలోని సంకీర్ణత, అస్పష్టత పాఠకుల్లోకీ వరదలా పారాయి.
రాజకీయలపై కన్నేసి వుంచేవాళ్ళకి అవే కనపడ్డాయి. కులం, మతం కవితల్లో ఆసక్తివున్నోళ్ళకి అదే కనపడింది. అంచాత చర్చ కూడా నానాజాతి సమితి శిఖరాగ్ర సమావేశంలా సాగుతూనే వుంది.
జనరంజని: మహానటి సావిత్రి గురించి revathi అభిప్రాయం:
04/19/2009 7:53 pm
జననీ శివకామిని పాట నాకు చాలా ఇష్టం. సావిత్రి గారి మాట వింటుంటే మళ్ళీ ఆ మహానటిని చూస్తున్నట్టే ఉంది. ఇంత మంచి ప్రోగ్రాం ని పెట్టినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.
సీతారాముడి “శివదర్పణం” గురించి vinay అభిప్రాయం:
04/18/2009 3:49 pm
చాలా చక్కగా వర్ణించారు.Thank you.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Vijaya KLNR Pingali అభిప్రాయం:
04/18/2009 10:49 am
మీరు బి.వి.రామన్ గారు గాంధి గురించి వ్రాసిన దానిని ఎగతాళి చేసారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చి పోతున్నారు. జాతకము లోని వివిధ కాంబినేషన్ల బట్టి వివిధ విషయములు చూడాలి. ద్వాదశం, శయ్య సుఖము, మోక్షము, వ్యయము లను సూచించును. ఆత్మ కారకుడు మోక్షస్థానములో ఉండటము వలన అధ్యాత్మికత గురించిన ప్రస్తావన సరియేగదా. ఇది మీరన్నట్లు 2+2=4 లాగా కాదు కదా. వివిధ సిధ్ధాంతములు మనకు సూచకములే (గైడులైనులే).
ఇంకొక సంగతి: డీన్ చేసిన ప్రయోగం చాలా సరళమైనది. ఒక జాతకం సరిగా చెప్పాలంటే, వివిధ వర్గ (రాశి, నవాంశ, దశాంశ, …), ఏ విషయము కావలయునో ఆ దశ భుక్తి తదితర విచారము, గోచార, తిథి ప్రవేశ ఫల నిర్ణయము ఇటువంటి వివిధ ప్రకార చింతనము ఆవశ్యకము. అంచేత, డీన్ ప్రయోగ ఫలితము నాకు అంత ఆశ్చర్యము కలిగింపలేదు. అదీ కాక, ఆయన నమ్మకము అధికమని నిరోపించాడే కాని జ్యోతిష్యము పని చేయదని నిరూపించలేదని నా అభిప్రాయము.
నా అభిప్రాయము ఏమన జ్యోతిష్యము ఎడ్యుకేటెడ్ గెస్ చేయటానికి సాయం చేస్తుంది.
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి M.S.Prasad అభిప్రాయం:
04/16/2009 11:51 pm
మోహన రావు గారికి
మీ వ్యాసం సంస్కృత వృత్త ఛందస్సుల నభ్యసించే విద్యార్ధులకు లక్షణ లక్ష్య సముపేతమైన పాఠ్యగ్రంధం వంటిది. అభ్యాసకులకు రిఫరెన్స్ బుక్. అంతే కాక వృత్తాల పూర్వాపరాలు,తత్సంబంధిత కధలు చాలా హృద్యంగా ఉండి పాఠకులను చదివింపచేస్తాయి. జగద్గురు శంకరాచార్యులు వారు రచించిన దేవీ దేవతా స్తోత్రాలను నిత్య పూజా విధానంలో భాగంగా అనుసంధించని హైందవ కుటుంబం ఉండదు. ఐతే ఈ స్తోత్రాలలో ఇమిడివున్న వృత్తాల పేరులు ఇప్పుడు తెలిసుకొని ఆ పరిజ్ఞానం మా కందించిన మీకు అనేకానేక కృతజ్ఞతలు.
ముఖ్యంగా శ్లోకాలలో పాదానికి 16 అక్షరాలు వుండి మాత్రా చందస్సులో వుంటుంది అనే తప్ప పూర్వర్ధంలో 5,6,7 అక్షరాలు య గణం, అవే ఉత్తరార్ధంలో జ గణం కావాలని నేను మీ వ్యాసం ద్వారానే తెలుసుకున్నాను. కృతజ్ఞుడను. పూజలో నిత్యం అనుసంధీంచే స్వరచిత శ్లోకాలలో ఈ నియమం దైవికంగా అనుసరించబడడం నా అదృష్టం.
దేవ్యపరాధ స్తోత్రం వచనం గా భావించిన నాకు ఇది శిఖరిణీ వృత్తం అని తెలిసి ఆశ్చర్యం కలిగించింది. అక్కడక్కడా క్రమబద్ధమైన లయ గమనించినా అంతా ఒక క్రమంలో వున్నదని గమనించలేదు. ముద్రించిన వారి లోపాలు ఇందుకు కారణం కావచ్చును.
భుజంగ ప్రయాతాది ఛందేషు పూర్వం
నిజేష్టేశ్వ రారాధనం భక్తి పూర్ణో (అ)
సృజం యేషు తజ్జ్ఞాన దాతార మార్యం
భజామ్యద్య బెజ్జాల కృష్ణం మహంతం
(పూర్వం యేషు భుజంగ ప్రయాతాది ఛందేషు భక్తి పూర్ణో నిజేష్టేశ్వ రారాధనం (అహమ) అసృజం, అద్య తత్ (నామ) జ్జ్ఞాన దాతారం, ఆర్యం, మహంతం బెజ్జాల కృష్ణం భజామి.)
సంస్కృతే శ్లోక నిర్మాణ క్రియా వాంఛిత లక్షణ
పరిజ్ఞాన ప్రదాతారం కృష్ణం వందే సుధీనిధీం
భవదీయుడు
అతడు, నేను, అతడి కథ గురించి B H A G A V A N T A M అభిప్రాయం:
04/16/2009 11:00 pm
మాధవ్ గారికి
స్పందన తెలుపమన్నందుకు ఈ క్రింది రెండు మాటలు…
“కొందరు శబ్దాలకు తలూపుతారు. కొందరు శబ్దాలకు నాట్యం చేస్తారు. కొందరు శబ్దాలకు ‘చెవి’ విరుస్తారు. కాని కొందరు నిశ్శబ్దసౌందర్యాన్ని దర్శించడం కోసం శబ్దలోకయాత్ర మొదలుపెడతారు.
చివరివారికి లోయలు స్వాగతం పలుకుతాయి. మీకు స్వాగతం పలికిన లోయల్ని పరిచయం చేసుకున్నాను. సంతోషం.
ఈ కథ గురించి రచయితగా చెప్పడానికి ఏమీలేదు. ఎవరి లోయల మీద ఎగురుతొన్న పక్షుల రెక్కల చప్పుళ్ళని వారి రక్తంలోకి అనువదించుకుని ఆనందించడమే…
భగవంతం
16.04.2009.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana అభిప్రాయం:
04/16/2009 7:20 am
ప్రసాద్ గారికి నమస్కారం – మీరు రాసింది బాగానే ఉంది. చివరి పాదంలో దురితలోని రితో యతి సరిపోదు. సామాన్యముగా శ్రీకు రికు యతి చెల్లుతుంది. కాని పాదంలో ఒక యతికంటె ఎక్కువగా ఉంటే, మొదటి
అక్షరము సంయుక్తాక్షరమయితే అందులో ఒక అక్షరంతోనే పాదమంతా యతి చెల్లించాలి. అంటే దురితలోని రికు బదులు శీ అక్షరముతో యతి చెల్లించాలి. నా ఈమెయిలు చిరునామా jkmrao@yahoo.com
అక్కడికి మీరు రాస్తే మిగిలిన విషయాలను చర్చించుకోవచ్చు.
విధేయుడు – మోహన