మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు గార్లకు ధన్యవాదాలు.
శ్రీ శ్రీ గారిని చూడటంతో పాటూ, పురాణేతిహాసాల సాహిత్యం పట్ల వారి ఆశక్తి, విశేష ప్రతిభ ఎంతటివో తెలిశాయి.
నేల నుండి సాము చేసి మహాకవి అయ్యారని అని నిరూపించుకున్నారు.
this is a good poem – nostalgia for joyful times that would never come again. Contentment and hard work were the qualities of that bygone era. Send me the telugu poem in pdf and i’d render it into english when find a little free time.
దాసరి సుబ్రహ్మణ్యంగారు మరణించిన వార్తను ఈ కథనంలో ప్రచురించారు. మా నాన్న కుటుంబరావుగారు మరణించాక 1980 నవంబర్ తరవాత మాత్రమే ఆయన బేతాళ కథలు రాయడం మొదలుపెట్టారు.
రెండు మూడు తెలిసీ తెలియని విషయాల గురించి నాలుగు మాటలు.
శ్రీశ్రీ మీద థీసిస్ చేసింది మిరియాల లక్ష్మీపతి గారన్నారు; రామకృష్ణ గారని గుర్తు.
“నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే.”
శరచ్చంద్రిక రాసింది మహాప్రస్థానం తర్వాతేననుకుంటాను. దాంట్లో నిరాశ తోనే మొదలెడతాడు కాని ఆశాభావంతో ముగిస్తాడు. ఇక్కడే కాక కొన్ని ఇతర పద్యాలలో కూడా ఈ నిరాశా నిస్పహలకి కారణం తన వ్యక్తిగత జీవితం కాదు, సామాన్యుని వాస్తవ జీవితం.
“నువ్వో … కావాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి,” అన్నదానిని చవకబారు కవిత్వమంటే ఒప్పుకోవచ్చు కాని, “నిజానికి ఏ సందేహానికైనా నిశ్చయమైన, ఖచ్చితమైన సమాధానం లభించిందని సంతృప్తిపడితే రచన ఆగిపోవటమే జరుగుతుంది,” అన్నదానికి ఇంకాస్త ఆధారాలు కావాలి. “కలడు కలండెడు వాడు కలడొ లేడో” అన్న కవి “ఇందుగలడందు లేడను సందేహము వలదు” లాంటిది రాస్తే అది కవిత్వం కాకుండా పోతుందా?
శ్రీశ్రీ జీవితాంతమూ కవిగా అన్వేషణ తోనే గడిపానని చెప్పుకున్నాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మినంతనే, ఇక తన జీవితంలో వేరే అన్వేషణే లేదనడం సరికాదు.
ఇస్మాయిల్ గారు కూడా, మహాప్రస్థానంలోని గీతాలన్నీ శ్రీశ్రీ మార్క్సిజం గురించి తెలుసుకోక మునుపు రాసినవే నన్నారు. కాపిటల్ చదవలేదేమో కాని, 1930 ప్రాంతాల్లో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో చదవదగ్గ పుస్తకాలన్నీ చదివానని చెప్పుకున్న కవికి మార్క్సిజం గురించి తెలియదంటే నమ్మడమెలా? కాస్తోకూస్తో తెలియకుండానే “దేశచరిత్రలు” రాసి ఉంటాడా?
మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రాసినవన్నీ మరీ దసరా పద్యాల స్థాయిలో ఉన్నాయనుకోను. వాటిల్లో చెప్పుకోదగ్గవీ, మహాప్రస్థానం గీతాలతో పోల్చదగ్గవీ, వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చునంటే ఒప్పుకంటాను. మరి డెబ్భై ఏళ్ళకి పైగా బ్రతికి, చివరిదాకా ఏదో ఒకటి రాస్తూ ఉన్నశ్రీశ్రీ కవిత్వంలో చెప్పుకోదగ్గది దాదాపు అంతా మూడు పదులు నిండక ముందే రాయడానికి కారణం, ఆ తర్వాత ఆయన మార్క్సిజం తీర్థం పుచ్చుకోవడమేనని రవిశంకర్ గారు స్పష్టంగా చెప్పకపోయినా సూచనప్రాయంగా అన్నారు.
సృజనా శక్తి వయసుతో, అనుభవంతో, జ్ఞాన సముపార్జనతో పెరుగుతుందా? ఇది సాహిత్యంలోనేనా, అన్ని రంగాల్లోనూ సహజమా? అన్న సందేహముంది నాకు. హార్డీ తన “సంజాయిషీ” లో [1] రామానుజన్ ముప్ఫై రెండేళ్ళకే చనిపోవడాన గణితానికి వచ్చిన నష్టమేమీ లెదన్నాడు! ఆ వయసు తర్వాత ఏ గణితవేత్తయినా పెద్దగా సాధించేదేమీ లేదని హార్డీకి గట్టి నమ్మకం.
S. చంద్రశేఖర్ కి సృజన తీరు మీద కుతూహలం కలిగి ఓ మంచి ఉపన్యాసం [2] ఇచ్చాడు. షేక్స్పియర్, బీథోవన్ ల సృజనా కౌశల్యం పెరుగుతూ జీవిత చరమదశ దాకా పరిపక్వత చేరిందంటాడు. వాళ్ళతో పోలిస్తే, సృజనా పరంగా మహోన్నతమైన గురుత్వాకర్షణ సూత్రాల ని న్యూటన్ కనుగొన్నది పాతికేళ్ళ వయసు లోపలే!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “A Mathematician’s Apology,” by G. H. Hardy. Cambridge University Press, 1967. గణితమంటే ఇష్టమున్నా లేకపోయనా, కవత్వమంటే ఆసక్తిగల వాళ్ళు చదవాల్సిన పుస్తకం.
[2] Shakespeare, Newton, and Beethoven, or Patterns of Creativity. Nora and Edward Ryerson lecture delivered at the University of Chicago, Center for Public Policy on 22 April 1975. Published in “Truth and Beauty: Aesthetics and Motivations in Science,” by S. ChandraSekhar. The University of Chicago Press, 1987.
పైనించి కింది దాకా మూడు సార్లు చదివినా ఈ యమ్మ గొడవేంటో తెలియలేదు. వాడ్రేవు వీరలక్ష్మి గారిని అక్కా అని పిలిచే చనువు రచయిత్రికి వుండచ్చు. వీర్లక్ష్మక్క ప్రేమ గురించి లోతయిన సాధన చేసి వుండొచ్చు.
ఆ చనువుకి ఆధారమేంటో మనకి చెప్పనక్కరలేదు కానీ, కనీసం వీరలక్ష్మక్కకి ప్రేమగురించి వున్న పరిజ్ఞానమేమిటో సూచన ప్రాయంగానయిన పాఠకులకి చెప్తే సమీక్షకురాలి ముల్లె ఎంబోతుందో ? మొగిలి రేకుల ప్రవాహం తో మొదలై నెమలి ఈకలు, అమాయకత్వంతో సముద్రంలో కలిసిపొయిన ఈ సమీక్ష ఎన్నిసార్లు చదివినా యదుకుల భూషణ్ ఎవరో, ఏమిటో, ఏమి రాశాడో తెలియదు.
సమీక్షిస్తున్న పుస్తకం పట్ల గాని, ఆ పుస్తకం రాసిన రచయిత పట్లగాని, దాన్ని చదవమని చెప్పిన వ్యక్తి పట్లగాని, ఆ సమీక్ష చదవటం కోసం సమయం వెచ్చించే పాఠకుడి పట్లగాని ఏమాత్రం గౌరవం లేకుండా కలం నిండా సిరా నింపుకుని కాగితాల మీద వలకబోసే ధైర్యం తెలుగునాట రచయితలకి ఎట్లా అబ్బిందో తెలిసిన వాళ్ళు చెప్పాలి. (నాకయితే రాయప్రోలు సుబ్బరావు దీనికి కారకుడని నమ్మకం)
చాకిరేవు ఉపేంద్ర
పి.ఎస్. పై వాక్యాలలో ‘పాఠకుడు’ అన్న పదం వచ్చినప్పుడల్లా కీ బోర్డ్ ‘పాతకుడు’ అని సూచిస్తూ వచ్చింది. నిజమే ఏ పూర్వ దుష్కృతమో కాకపోతే ఈనాటి తెలుగు రచయితలు, రచయిత్రులు, సమీక్షకుల బారిన పడతాము.!!
సత్యానంద కుమార్ గారు,
మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీ ప్రయత్నము బాగుంది. అనువాదము చాలా కష్టమైన ప్రక్రియ. మీకు తెలియంది కాదు. భావములో ఏ మాత్రము తేడా రాకుండా మీరు అనువదించారు కానీ ఇంగ్లీషు పదాలు తెలుగు వాక్య నిర్మాణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మీరు ప్రయోగించిన ఇంగ్లీషు పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీషు వాక్య నిర్మాణం ప్రకారంగా మీరు దీన్ని మారిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. మీరేమంటారు?
శ్రీశ్రీ ఉపన్యాసం గురించి నారాయణ జి. అభిప్రాయం:
01/30/2010 5:58 pm
మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు గార్లకు ధన్యవాదాలు.
శ్రీ శ్రీ గారిని చూడటంతో పాటూ, పురాణేతిహాసాల సాహిత్యం పట్ల వారి ఆశక్తి, విశేష ప్రతిభ ఎంతటివో తెలిశాయి.
నేల నుండి సాము చేసి మహాకవి అయ్యారని అని నిరూపించుకున్నారు.
నారాయణ జి.
కలైన గోర్వెచ్చని పాట గురించి v v b rama rao అభిప్రాయం:
01/30/2010 9:11 am
this is a good poem – nostalgia for joyful times that would never come again. Contentment and hard work were the qualities of that bygone era. Send me the telugu poem in pdf and i’d render it into english when find a little free time.
good wishes
rama rao, noida-7
“చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
01/29/2010 2:51 pm
దాసరి సుబ్రహ్మణ్యంగారు మరణించిన వార్తను ఈ కథనంలో ప్రచురించారు. మా నాన్న కుటుంబరావుగారు మరణించాక 1980 నవంబర్ తరవాత మాత్రమే ఆయన బేతాళ కథలు రాయడం మొదలుపెట్టారు.
పండిన మొగలిరేకుల ఏకాంత ప్రవాహం: “సముద్రం” గురించి rama bharadwaj అభిప్రాయం:
01/29/2010 1:13 pm
చాకిరేవు ఉపేంద్ర గారూ!! ఏం ఉతుకు ఉతికారండీ!!
“చందమామ” జ్ఞాపకాలు గురించి కె.రాజశేఖర రాజు అభిప్రాయం:
01/29/2010 12:50 pm
బుదవారం -27-01-2010- కనుమూసిన చందమామ ధారావాహికల రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారితో రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాలను ఈ లింకులో చూడండి.
అలాగే దాసరి గారి అస్తమయంపై చందమామలో వచ్చిన మరో కథనాన్ని ఇక్కడ చూడండి.
దాసరి గారి కనుమూత తదనంతర పరిణామాలపై శివరాం ప్రసాద్ గారు రాసిన కథానికను ఇక్కడ చూడండి
దాసరి గురించి వేణు గారు పంచుకున్న జ్ఞాపకాలను ఇక్కడ చూడండి.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి mani అభిప్రాయం:
01/29/2010 11:08 am
Rao vemuri అభిప్రాయముతో నేను ఎకీభవిస్తాను. తెలుగు పద మహిత్యము మనకు అర్థమవ్వాలంటె అవధానము ఒక ఉదాహరణము.
శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/29/2010 2:33 am
రెండు మూడు తెలిసీ తెలియని విషయాల గురించి నాలుగు మాటలు.
శ్రీశ్రీ మీద థీసిస్ చేసింది మిరియాల లక్ష్మీపతి గారన్నారు; రామకృష్ణ గారని గుర్తు.
“నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే.”
శరచ్చంద్రిక రాసింది మహాప్రస్థానం తర్వాతేననుకుంటాను. దాంట్లో నిరాశ తోనే మొదలెడతాడు కాని ఆశాభావంతో ముగిస్తాడు. ఇక్కడే కాక కొన్ని ఇతర పద్యాలలో కూడా ఈ నిరాశా నిస్పహలకి కారణం తన వ్యక్తిగత జీవితం కాదు, సామాన్యుని వాస్తవ జీవితం.
“నువ్వో … కావాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి,” అన్నదానిని చవకబారు కవిత్వమంటే ఒప్పుకోవచ్చు కాని, “నిజానికి ఏ సందేహానికైనా నిశ్చయమైన, ఖచ్చితమైన సమాధానం లభించిందని సంతృప్తిపడితే రచన ఆగిపోవటమే జరుగుతుంది,” అన్నదానికి ఇంకాస్త ఆధారాలు కావాలి. “కలడు కలండెడు వాడు కలడొ లేడో” అన్న కవి “ఇందుగలడందు లేడను సందేహము వలదు” లాంటిది రాస్తే అది కవిత్వం కాకుండా పోతుందా?
శ్రీశ్రీ జీవితాంతమూ కవిగా అన్వేషణ తోనే గడిపానని చెప్పుకున్నాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మినంతనే, ఇక తన జీవితంలో వేరే అన్వేషణే లేదనడం సరికాదు.
ఇస్మాయిల్ గారు కూడా, మహాప్రస్థానంలోని గీతాలన్నీ శ్రీశ్రీ మార్క్సిజం గురించి తెలుసుకోక మునుపు రాసినవే నన్నారు. కాపిటల్ చదవలేదేమో కాని, 1930 ప్రాంతాల్లో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో చదవదగ్గ పుస్తకాలన్నీ చదివానని చెప్పుకున్న కవికి మార్క్సిజం గురించి తెలియదంటే నమ్మడమెలా? కాస్తోకూస్తో తెలియకుండానే “దేశచరిత్రలు” రాసి ఉంటాడా?
మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రాసినవన్నీ మరీ దసరా పద్యాల స్థాయిలో ఉన్నాయనుకోను. వాటిల్లో చెప్పుకోదగ్గవీ, మహాప్రస్థానం గీతాలతో పోల్చదగ్గవీ, వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చునంటే ఒప్పుకంటాను. మరి డెబ్భై ఏళ్ళకి పైగా బ్రతికి, చివరిదాకా ఏదో ఒకటి రాస్తూ ఉన్నశ్రీశ్రీ కవిత్వంలో చెప్పుకోదగ్గది దాదాపు అంతా మూడు పదులు నిండక ముందే రాయడానికి కారణం, ఆ తర్వాత ఆయన మార్క్సిజం తీర్థం పుచ్చుకోవడమేనని రవిశంకర్ గారు స్పష్టంగా చెప్పకపోయినా సూచనప్రాయంగా అన్నారు.
సృజనా శక్తి వయసుతో, అనుభవంతో, జ్ఞాన సముపార్జనతో పెరుగుతుందా? ఇది సాహిత్యంలోనేనా, అన్ని రంగాల్లోనూ సహజమా? అన్న సందేహముంది నాకు. హార్డీ తన “సంజాయిషీ” లో [1] రామానుజన్ ముప్ఫై రెండేళ్ళకే చనిపోవడాన గణితానికి వచ్చిన నష్టమేమీ లెదన్నాడు! ఆ వయసు తర్వాత ఏ గణితవేత్తయినా పెద్దగా సాధించేదేమీ లేదని హార్డీకి గట్టి నమ్మకం.
S. చంద్రశేఖర్ కి సృజన తీరు మీద కుతూహలం కలిగి ఓ మంచి ఉపన్యాసం [2] ఇచ్చాడు. షేక్స్పియర్, బీథోవన్ ల సృజనా కౌశల్యం పెరుగుతూ జీవిత చరమదశ దాకా పరిపక్వత చేరిందంటాడు. వాళ్ళతో పోలిస్తే, సృజనా పరంగా మహోన్నతమైన గురుత్వాకర్షణ సూత్రాల ని న్యూటన్ కనుగొన్నది పాతికేళ్ళ వయసు లోపలే!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “A Mathematician’s Apology,” by G. H. Hardy. Cambridge University Press, 1967. గణితమంటే ఇష్టమున్నా లేకపోయనా, కవత్వమంటే ఆసక్తిగల వాళ్ళు చదవాల్సిన పుస్తకం.
[2] Shakespeare, Newton, and Beethoven, or Patterns of Creativity. Nora and Edward Ryerson lecture delivered at the University of Chicago, Center for Public Policy on 22 April 1975. Published in “Truth and Beauty: Aesthetics and Motivations in Science,” by S. ChandraSekhar. The University of Chicago Press, 1987.
కృష్ణం వందే జగద్గురుం గురించి Narayana అభిప్రాయం:
01/29/2010 1:32 am
ధన్యవాదాలు రోహిణీ ప్రసాద్ గారు.
ప్రజాసాహితి లోని వ్యాసాలకి నేను ఎప్పటి నుండో ఇష్టంగా చదువుతున్నాను.
In other words, I am your fan (admirer).
Thank you,
Narayana.
పండిన మొగలిరేకుల ఏకాంత ప్రవాహం: “సముద్రం” గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
01/29/2010 1:13 am
పైనించి కింది దాకా మూడు సార్లు చదివినా ఈ యమ్మ గొడవేంటో తెలియలేదు. వాడ్రేవు వీరలక్ష్మి గారిని అక్కా అని పిలిచే చనువు రచయిత్రికి వుండచ్చు. వీర్లక్ష్మక్క ప్రేమ గురించి లోతయిన సాధన చేసి వుండొచ్చు.
ఆ చనువుకి ఆధారమేంటో మనకి చెప్పనక్కరలేదు కానీ, కనీసం వీరలక్ష్మక్కకి ప్రేమగురించి వున్న పరిజ్ఞానమేమిటో సూచన ప్రాయంగానయిన పాఠకులకి చెప్తే సమీక్షకురాలి ముల్లె ఎంబోతుందో ? మొగిలి రేకుల ప్రవాహం తో మొదలై నెమలి ఈకలు, అమాయకత్వంతో సముద్రంలో కలిసిపొయిన ఈ సమీక్ష ఎన్నిసార్లు చదివినా యదుకుల భూషణ్ ఎవరో, ఏమిటో, ఏమి రాశాడో తెలియదు.
సమీక్షిస్తున్న పుస్తకం పట్ల గాని, ఆ పుస్తకం రాసిన రచయిత పట్లగాని, దాన్ని చదవమని చెప్పిన వ్యక్తి పట్లగాని, ఆ సమీక్ష చదవటం కోసం సమయం వెచ్చించే పాఠకుడి పట్లగాని ఏమాత్రం గౌరవం లేకుండా కలం నిండా సిరా నింపుకుని కాగితాల మీద వలకబోసే ధైర్యం తెలుగునాట రచయితలకి ఎట్లా అబ్బిందో తెలిసిన వాళ్ళు చెప్పాలి. (నాకయితే రాయప్రోలు సుబ్బరావు దీనికి కారకుడని నమ్మకం)
చాకిరేవు ఉపేంద్ర
పి.ఎస్. పై వాక్యాలలో ‘పాఠకుడు’ అన్న పదం వచ్చినప్పుడల్లా కీ బోర్డ్ ‘పాతకుడు’ అని సూచిస్తూ వచ్చింది. నిజమే ఏ పూర్వ దుష్కృతమో కాకపోతే ఈనాటి తెలుగు రచయితలు, రచయిత్రులు, సమీక్షకుల బారిన పడతాము.!!
గాలిపటం గురించి sameer అభిప్రాయం:
01/27/2010 4:32 pm
సత్యానంద కుమార్ గారు,
మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీ ప్రయత్నము బాగుంది. అనువాదము చాలా కష్టమైన ప్రక్రియ. మీకు తెలియంది కాదు. భావములో ఏ మాత్రము తేడా రాకుండా మీరు అనువదించారు కానీ ఇంగ్లీషు పదాలు తెలుగు వాక్య నిర్మాణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మీరు ప్రయోగించిన ఇంగ్లీషు పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీషు వాక్య నిర్మాణం ప్రకారంగా మీరు దీన్ని మారిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. మీరేమంటారు?