గడియారం రామకృష్ణ శర్మ
జీవిత విశేషాలు
గడియారం రామకృష్ణ శర్మ (1919-2006) ఆలంపూర్కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు వెలువరించారు. వారి గ్రంథం మాధవిద్యారణ్య ప్రామాణికమైనది. వీరి సాహితీసేవలకు గుర్తింపుగా 2007 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తెలుగు భాషలో) మరణానంతరం ప్రకటించారు. సాహితీవేత్తగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడుగానూ పేరొందిన శర్మగారు సంఘ సంస్కరణాభిలాషి, రంగస్థల నటుడు కూడా.