భారత సాహిత్యంలో చారిత్రక రచన ఏ ఒక్క సాహిత్యవర్గానికో పరిమితమై ఉండలేదు. అటువంటి విభజనలకి అతీతంగా పద్య మహాకావ్యం నుంచి తెలుగు వచన చారిత్రము దాకా సాహిత్యంలో ఎన్నో రూపాలలో అది విస్తరించింది. ఈ సాహిత్య రూపాలేవీ కూడా స్వతస్సిద్ధంగా చారిత్రక రచనలు కావు; ఆ రకంగా అవి ఎప్పుడూ ఆ సమాజంలో చూడబడలేదు.