గుఱ్ఱం జాషువా
జీవిత విశేషాలు
ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (1895 – 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావకవిత్వ రీతినుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.