వేలూరి గారికీ, వారికంటే ముందు నిడదవోలు గారికీ అభినందనలు. రచనలోని వస్తువు ఆనాటి రచయిత్రుల శైలి గురించి అయినప్పుడు, తెలుగులోనే రాస్తే మరింత హత్తుకునేదేమో! మీరు పేర్కొన్న రచయిత్రుల రచనలు చదివి వుండడంచేత, కొంత సహజమైన కుతూహలంతో వ్యాసమంతా ఏకబిగిన చదివేను. పదిలంగా వున్న జ్ఞాపకాలు, ఈ వ్యాసం తెలుగులో వుండివుంటే, మరింత ఉక్కిరి బిక్కిరి చెయ్యవా అనిపించింది. ఏ వుద్దేశంతో మూల రచనని ఆంగ్లంలో చేసేరోగానీ, ఉపశీర్షికలతో (సబ్ టైటిల్సు) “మాయా బజారు” చూడమన్నట్టుంది.
ఢారావాహికలూ, నవలలూ తెలుగు సాహిత్యంలో హెచ్చవడంలో రచయిత్రుల పాత్ర విశిష్టమైంది. రచయిత్రులకి ఎంత ఆదరణ వుండేదంటే, కొంతమంది రచయితలుకూడా రచయిత్రులుగా కలం పేరుతో రాసేవారు. నాకు జ్ఞాపకమున్న పేర్లు : బీనాదేవి, లల్లాదేవి, ఎం.డీ సౌజన్య, వీరపల్లె వీణావాణి, తోటకూర ఆశాలత మొ. వారు.
తిరుగుబాటు ధోరణి కాకుండా, పాఠకులని పాత్రల ద్వారా ప్రభావితం చేసిన రచయిత్రి మాలతీ చందూర్. ఎన్నో రచనలని చేసిన జొన్నలగడ లలితాదేవి, కావలిపాటి విజయలక్ష్మి, విలక్షణంగా తమ పేరు రాసుకునే ఆరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి, తురగా (మోచర్ల) జయశ్యామల లని మూల రచనలో ప్రస్తావించి వుంటారనుకుంటాను.
పెద్దలెవరైనా పూనుకుని ఈ మూల రచనని తెనిగించరా అని నా ఆశ.
సేకరణ అద్భుతం. ధ్వని కూడా బహు నాణ్యంగా వుంది. రచన పూర్తి పాఠం విడిగా ఇవ్వడం చాలా బాగుంది.
అప్పట్లో రేడియో నాటకాలు ఆదివారం మధ్యాహ్నం రెండూ మూడూ మధ్య వచ్చేవి. అన్ని కేంద్రాల్లోనూ (హైదరా, విజయ,, విశాఖ, కడప) ఒకేసారి ప్రసారమయ్యేవి. ఏ కేంద్రం వారు నిర్మిస్తే వారి పేరు ముందొస్తుంది. సినిమాకి ముందు పేర్లేసినట్టు, రేడియో నాటకానికి ముందు పేర్లు చదివేవారు. ” ఇందలి పాత్రలూ, పాత్రధారులూ… ” అంటూ “శబ్ద” దానం చేసిన వారి పేర్లూ, అటు వెంబడి “నిశ్శబ్దంగా” వెనుక పనిచేసిన వారి పేర్లూ చదివేవారు. వాటిలో ఎక్కువగా వినిపించి నాకు జ్ఞాపకమున్న పేర్లు – శారదా శ్రీనివాసన్ (పాత్రధారి), వాడ్రేవు పురుషోత్తం (నిర్వాహకులు).
శ్రోతల ఆదరణ పొందిన మరో నాటకం “దీక్షాంతం”. ఇందులోనూ ఊర్వశి పాత్ర వుంటుంది. ఎవరి గొంతో జ్ఞాపకం లేక పోయినప్పటికీ, నిర్వాహకులు మాత్రం శ్రీ వాడ్రేవు పురుషోత్తం.
మీ కృషి శ్లాఘనీయం. మరిన్ని అజరామరమైన రేడియో నాటకాలని వినిపిస్తారని ఆశిస్తాను.
మంచి వ్యాసవేఁ నిస్సందేహంగా. భాషాశాస్త్రవేత్తలందరకీ ఒక విన్నపం, నదికెదురీదో మరోలాగో దాని పుట్టుపూర్వోత్తరాలు నిర్ణయించొచ్చు. భాష విషయం అలా కాదు. భాషాశాస్త్రవేత్తలు వాళ్ళ కుస్తీలు వాళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే భాష ఎక్కడపుట్టిందో తెలియని “జీవనది”. ముఖ్యంగా కవిత్వాన్ని “రిఫరెన్స్” గా తీసుకుని భాష గురించీ, అప్పటి బతుకు గురించీ వూహాగానాలు చెయ్యడం సరైనది కాదని నా నామ్మకం. కవులు వారివారి అభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తారు తప్ప, వారి వ్యాఖ్యలు “నోటరీ సర్టిఫైడ్” కాదు. అనగా వాటిని పట్టుకు వేలాడ్డం తప్పవచ్చు.
తల్లి ఎవరికి పుట్టిందీ, ఎలా పుట్టిందీ, ఎలాటి మార్పులికి లోనయ్యిందీ లాటివి మాట్లాడం, అది దండగ. ఆడవాళ్ళ వయసు గురించీ, మగవాళ్ళ జీతం గురించీ అని సురేశ్ గారు మీర్రాయడం బాగోలేదు, దాని బదులు “ఋషుల” పుట్టుక గురించంటే ఇంకా బాగుండేది. కుండలో పుట్టేవా, ఎవరో చేపల్దానికి పుట్టేవాఅని మహా ఋషుల్ని అడగం, దానివల్ల వాళ్ళు చెప్పిన మంచి ముక్కల్ని “ఛీ” కొట్టం.
“అమ్మభాష” నేర్చుకోవడం గురించి: బతకడానికి ఏ భాష మంచిదయితే “అమ్మ” కూడా అదే భాష నేర్చుకోమంటుంది. ఎందుకంటే బతకడం ముఖ్యం గనుక. “వెంకటేశం” తల్లి, అగ్రహారీకురాలు, ఆ కుర్రాడి “ఇంగ్లీషు” గురించెందుకు బెంగపెట్టుకుంటుంది. బతకడానికి పనికిరాని భాష బతకదు.
తెలుగు భాష “ఆంధ్రప్రదేశ్” లో బతికుంటే, అది బతికున్నట్టే. పాఠశాలల వ్యవహారం చాలా తక్కువ శాతం. “ఆంధ్రప్రదేశ్” జనాభాలో ఎంత శాతం పాఠశాలలకెళ్ళి చదువుకుంటున్నారు? ఎంత మంది చదువుకున్నారు? పాఠశాలలకెళ్ళి చదువుకోని వాళ్ళే ఎక్కువ శాతం అని నా నమ్మకం. వీళ్ళకి తెలుగొచ్చు. రాయడం రాకపోవచ్చు. “అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబొలె..” కి ప్రతిపదార్థం రాయడం రాకపోవచ్చు. “రావో!రావో!లోల లోల…” యక్షగానంలోని లోలకి అర్థం తెలియకపోవచ్చు, కానీ లక్షణవైన తెలుగు వచ్చు.
ఇంకో విషయం. పరిపాలించేవాళ్ళు ఏ భాషని ఆదరిస్తే పాలింపబడేవాళ్ళు ఆభాషని నేర్చుకుంటారు. నిజాం రోజుల్లో ఎంతమంది తెలుగువాళ్ళు ఉర్దూ నేర్చుకోలేదు, అయినా తెలుగు మర్చిపోలేదు. ఇంగ్లీషు వాళ్ళ హయాం లో ఇంగ్లీషు నేర్చుకున్నా తెలుగు మర్చిపోలేదు. ప్రస్తుతానికి, అంత పట్టించుకోకుండానే, “ఆంధ్రప్రదేశ్” లో తెలుగు అమలులో వుంది. శ్రీ ఏ.బి.కే. ప్రసాదు గారి ప్రకారం మూడో నాలుగో జిల్లాల్లో అంతా తెలుగులోనే వ్యవహారం. మిగిలిన జిల్లాలు కూడా “ఫాలో” అవుతాయి.
ఈ మధ్యనే “పంచాయితీ రాజ్ డిపార్ట్ మెంట్” కి వెళ్తే అక్కడ చక్కని తెలుగులో వ్యవహారం అంతా చూసి “హమ్మయ్య” అనుకున్నాను.
నా ప్రస్తుత “ప్రోజెక్టు” విషయంలో గ్రామ పంచాయితీ వారిచ్చిన “నోటీసు” చూడండి: “…..కావున ఈ నోటీసు అందిన వెంటనే నిర్మాణము ఆపుదల చేయగలరు లేనిచో అట్టి నిర్మాణము నోటీసు ఇవ్వకుండానే కూలగొట్టబడునని ఈ నోటీసు ద్వారా తెలియచేయనైనది.” రాసింది బి.ఏ పేసవని కుర్రాడు.
బహుశా ఈ అభిప్రాయవేదికల్లో అందరం భయపడుతున్న విషయం మన పిల్లలు తెలుగు నేర్చుకోవట్లేదనేమో? మనదే తప్పు. పిల్లలది కాదు, భాషది కాదు. మనదే, ముమ్మాటికీ మనదే.
సాహితీవేత్తలకీ, భాషాశాస్త్రవేత్తలకీ వినమ్రవైఁన విన్నపం: బాగా బతకడానికి పనికొచ్చే “సామాన్య, సాంగీక మరియు లెక్కల” పుస్తకాలు “అమ్మభాష” లో రాయండి. అవి చదువుకుని మా బతుకుల్ని బాగు చేసుకుంటాం.
అన్నట్టు, తెలుగు “ప్రాచీన భాషా?” “క్లాసికల్ భాషా?”
చాలా మంచి వ్యాసం. తెలియని విషయాలెన్నో ఆసక్తికరంగా చెప్పారు.
“తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు జిల్లా అమరావతిలో దొరికింది.”
అన్నారు. అంటే అప్పటికి తెలుగుకు లిపి లేదో, లేక వేరే కారణాల(రాజకీయంగానైనా కాకపోయినా) వల్ల బ్రాహ్మీలిపి నే వాడాల్సివచ్చిందో తెలియదు. సురేశ్, వీలైతే మీ అభిప్రాయం చెప్పండి.
తెలుగెందుకు నేర్చుకోవాలి గురించి రెండు మూడు వాక్యాలు రాద్దామనుకున్నాను. చెప్పాల్సిన పాయింటు పక్కకు పెట్టి, దానికి ముందు నాలో జరిగిన ఆలోచన ఘర్షణ నాకు షాకిచ్చింది. దీన్ని ఇంగ్లీషులో రాస్తున్నందుకు క్షమించమని కోరుతూ, ఏందుకో కూడా చెప్తాను, బాధతో.
To finish writing this in short time I can afford, I have two choices. Quickly say in English, or postpone to say in Telugu to my satisfaction.
You know what I chose and therein lies my point and pain.
Language is merely a vehicle to communicate thoughts. To the extent the vehicle is agile, convenient and suitable we jump into it to transport and receive thoughts. Just that this vehicle changes all the time. And some vehicles are (made to be?) very efficient and effective to handle certain goods. One can go from A to B in many vehicles, but each one gives and leaves different experiences. Some enrich while others encumber!
Telugu is one of the very efficient vehicles to express and receive the most sublime ideas from Indian spirituality. And, its resonating sounds add unique and lasting charm that heightens one’s feeling and thrill. Those who don’t know it have no idea what they are missing! Learning for sentimental value goes only so far. But learning to experience its enthralling beauty and thrill make it all the more worth it! That is the gain, but the irony and pain is I had to use English to say that quickly.
మన (మాతృ) భాష మనమెందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నకు ఒక సమాధానం: తన సంస్కృతిని గుర్తించి గౌరవించలేనివాడు ఏ సంస్కృతినీ గుర్తించి గౌరవించజాలడు అని అంటారు. పుట్టినప్పటినించీ ప్రవాసాంధ్రుడుగానే ఉంటున్న నేను ఈ విషయం నిజమని గట్టిగా చెప్పగలను.
బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో ప్రొఫెసర్ ఎం. ఎన్. గోగటేగారు ఈ తరం మరాఠీ పిల్లలు కామిక్స్ చదివి “లార్డ్ కృష్ణా” గురించి తెలుసుకుంటున్నారని వాపోయాడు. ఈ లార్డ్ బ్రిటిష్ లార్డా అని ఎద్దేవా చేశాడు. వీళ్ళకి సరైన ఇంగ్లీషూ రాదు, మరాఠీ ఎలాగూ రాదు అని హెచ్చరించాడు.
ఆంధ్రపదేశ్ లో తెలుగును గురించిన నేటి తరం అభిప్రాయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు.
టీవీ ట్రావెల్ చానల్ లో షేక్స్పియర్ జన్మస్థలాన్ని భద్రపరిచి టూరిజం ద్వారా ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూపించారు. మద్రాసు చింతాద్రిపేటలో ఒక పాత ఇంటిని చూపించి, అందులో వీరేశలింగంగారు కొన్నాళ్ళు గడిపారని మానాన్న నాకు చెప్పారు. ఈపాటికి దాన్ని కూల్చేసి ఉంటారు. రాజమండ్రిలో ఆయన ఇంటినీ, విజయనగరంలో అప్పారావుగారి ఇంటినీ టూరిజం పేరుతో జాగ్రత్తపరచాలనే భావన మన అధికారులకు ఉందా? నేటి ‘రాజశేఖర చరిత్ర’ ఎటువంటిది?
చాల బాగుంది. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ లో తెలుగు బోధించే ప్రయత్నాలు చేస్తూన్నప్పుడు (ఇంకా ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి) మమ్ము తరచుగా ఎదుర్కున్న ప్రశ్న “మనం తెలుగు భాషని ఎందుకు నేర్చుకోవాలి?” అన్నది. మొదట్లో విరాళం ఇవ్వకుండా తప్పించుకుందికి ఈ ఎదురు ప్రశ్న వేస్తున్నారనుకున్నాను. కాని ఈ వ్యాసం సందర్భంలో రమేష్ బాబు కూడ ఈ ప్రశ్న అడిగేరు కనుక దీనికి సాలోచనగా సమాధానం చెప్ప వలసిన అవసరం ఉన్నట్లనిపిస్తున్నాది. సురేశ్ కి ఈ సామర్ధ్యం ఉంది కనుక నేనూ అడుగుతున్నాను. తెలుగుదేశంలో ఉన్న తెలుగువారు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ప్రవాసాంధ్రులు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? అన్న ప్రశ్నలని కూలంకషంగా ఎవ్వరయినా చర్చించండి. నేను నా బ్లాగులో ప్రయత్నించేను కాని బాగా రాలేదు.
రావు వేమూరి http://latebloomer-usa.blogspot.com/
అయ్యా! బాగా ఉందండీ. తెలుగు భాష గురించిన వివరాలను తెలియజేయాలన్ని మీ ప్రయత్నానికి జోహార్లు. కానీ మీరేమి అనుకోకపోతే నాదో చిన్న విన్నపం. మీ వ్యాసంలో చాలా వరకు సాధారణ ప్రజలకు తెలియని కొన్ని పదాలు దొర్లాయి. ఇవి సాధారణ ప్రజలకే కాదు ఓ మోస్తరు చదువుకున్న వారికి కూడా తెలియదని నా భావన.
మీరు ఒ సారి దయచేసి అలాంటి పదాలకు కూడా అర్థాన్నిస్తూ కొంత వివరించగలిగితే, మీ వ్యాసం మరింత ఎక్కువ మందికి చేరి వారికి తెలుగు పట్ల ఉన్న ధోరణిని మార్చుకునేలా చెయ్యగలదని అనుకుంటున్నాను. అటు తర్వాత మీకు వీలైతే ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి..? అన్న దానిపై కూడా మీ సమగ్ర రచనా సంపుటితో మరో వ్యాసాన్ని అందించగలరని కోరుకుంటున్నాను.
[జరిగిన పొరపాటుకు చింతిస్తూ, రచయిత కోరికపై కవితని సవరించాము. -సం]
శ్రీనివాస్ గారు,
మంచి పరిశీలన. చిత్తు ప్రతిలో “జోళ్ళు” అనే వ్రాసుకున్నాను.టైపుకు వచ్చేటప్పటికి యధాలాపంగా జరిగిన పొరబాటు ఇది.మీరు చెప్పకపోతే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు
మరిన్ని చేసి ఉండేదాన్నేమో.
బృందావన రావుగారి పద్య పరిచయం జనవరి సంచికలో ఉంటుందని, కొత్త సంవత్సరం కోసం సంబరంగా ఎదురుచూస్తున్నాను.
ఈ పద్య వివరణా వ్యాసం, వారిచ్చిన సమాధానాలు, మరోసారి చదువుకుని రాస్తున్నాను.
నా దగ్గర నన్నెచోడుని తెలుగు పుస్తకం లేదు. కాని కోలాచల మల్లినాథ సూరి తెలుగు టీకా తాత్పర్యంతో -కాళిదాసు కుమార సంభవం ఉంది.
ప్రధమ సర్గలో పార్వతిని పాదాల దగ్గరనుండి తలవరకు వర్ణించారు కాళిదాస కవి. దేవతలను కిందినుండి పైకి, మానవులను పైనుండి కిందకు వర్ణించడం ఆచారమట. ఆ వర్ణన ” మధ్యేన సావేదివిలగ్నమధ్యా వళి త్రయంచారు బభార బాలా..” నుండి -త్రివళులంటే నడుము మీద ఉండే మూడు మడతలని తెలిసింది. అవి నాభికి పైభాగంలో ఉంటాయనీ నాకు తెలిసింది. ( ఎందుకంటే అంతకు ముందు పద్యంలో అప్పటికి నాభి వరకూ వర్ణన ఐపోయింది కాబట్టి. అప్పుడే పార్వతి నతనాభి అని కూడా తెలిసింది. “తస్యా ప్రవిష్టా నతనాభి రంధ్రంరరాజ తన్వీ…” )
తర్వాత పంచమ స్సర్గములో పార్వతి తపస్సు ఘట్టములో కాళిదాసు శ్లోకానికీ, మీరిచ్చిన నన్నెచోడుని పద్యమునకూ గల పొలికలు చూచాను. తేడా అల్లా కాళిదాసువి గ్రీష్మం తర్వాతి తొలి నీటి చుక్కలు. నన్నెచోడునవి నవాంబు ధారలు. కాబట్టి ఇంకా వేగంతో ప్రవహించాయి. (ఐనా కాళిదాసు ముందరి పద్యము లోనే పార్వతి అప్పటిదాకా చెట్లలాగానే వర్షపు నీరుతో మాత్రమే బ్రతికిందంటారు. మళ్ళీ అంతలోనే మరిచి, గ్రీష్మం వెళ్ళిపోయి మొదటి వానకు తడిసి పార్వతి శరీరంలోచి, భూమి లోంచి సెగలుపైకి లేచాయని రాశారు. 🙂 ఆ తర్వాత పద్యమే ఆ వాన పార్వతి మీదుగా ఎలా జారిందొ చెప్పే పద్యం. ) పద్యములు అతి చక్కనివి. కవులు బాగా రాశారు.
కానీ వాన ( ప్రకృతి )సామాన్య విషయమూ, కవులది సుందర కళాసృష్టి అనుకోటానికి నా మనసొప్పదు. కవులు తలకిందులుగా తపస్సు చేసినా భగవంతుని సృష్టిని మేచ్ చెయ్యలేరు. ఒక సౌందర్యవతిని, ఆమె చిత్రాన్నీ చూసి ” జో బాత్ తుఝ్ మే హై, ఒ తేరీ తస్ వీర్ మే నహీ ” అన్న కవిరాజుకి నా నమస్కారము. పకృతి అందాన్ని, ప్రకృతిలో మానవ సౌందర్యాన్ని, చూసి ముందస్తుగా పరవశించని హృదయం, కవి రాసే మాటలకు ఉబ్బిపోటం ఉత్తిమాట. అసలు సౌందర్య స్పృహ, సౌందర్య కాంక్ష లేనివాడు కవే కాడు.
ఒక కవి నుంచి ఇంకొక కవి సంగ్రహించటం, ఒకరిని ఇంకొకరు అనువదించటం , అనుకరించటం -విద్యాభిలాషతో, కళపై కాంక్షతో, చేసే పనులు. కళాకారుడు అనుకరించడం మానడు. మానలేడు. అలా చెయ్యటం అవసరము. ముందు అనుసరించినా, కొన్నాళ్ళ తర్వాత కొత్త కళా స్రష్ట అవుతాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు నాకు నచ్చాయి. ఒకరి చక్కని భావాన్ని ఇంకో భాషలో, ఇంకో సమయంలో, -తన ఆనందం కోసం, పలువురి ఆనందం కోసం- కవి వాడటం, మీరన్నట్లు కవి పాండిత్యాన్నీ, రసికతను, చెపుతుంది. పాఠకులు కూడా ఎంత ఎక్కువగా చదివి ఉన్నవారైతే, ఏ రచనలోనైనా, అన్ని ఎక్కువ మూలాలు గుర్తించగలుగుతారు.
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
12/20/2008 11:59 am
వేలూరి గారికీ, వారికంటే ముందు నిడదవోలు గారికీ అభినందనలు. రచనలోని వస్తువు ఆనాటి రచయిత్రుల శైలి గురించి అయినప్పుడు, తెలుగులోనే రాస్తే మరింత హత్తుకునేదేమో! మీరు పేర్కొన్న రచయిత్రుల రచనలు చదివి వుండడంచేత, కొంత సహజమైన కుతూహలంతో వ్యాసమంతా ఏకబిగిన చదివేను. పదిలంగా వున్న జ్ఞాపకాలు, ఈ వ్యాసం తెలుగులో వుండివుంటే, మరింత ఉక్కిరి బిక్కిరి చెయ్యవా అనిపించింది. ఏ వుద్దేశంతో మూల రచనని ఆంగ్లంలో చేసేరోగానీ, ఉపశీర్షికలతో (సబ్ టైటిల్సు) “మాయా బజారు” చూడమన్నట్టుంది.
ఢారావాహికలూ, నవలలూ తెలుగు సాహిత్యంలో హెచ్చవడంలో రచయిత్రుల పాత్ర విశిష్టమైంది. రచయిత్రులకి ఎంత ఆదరణ వుండేదంటే, కొంతమంది రచయితలుకూడా రచయిత్రులుగా కలం పేరుతో రాసేవారు. నాకు జ్ఞాపకమున్న పేర్లు : బీనాదేవి, లల్లాదేవి, ఎం.డీ సౌజన్య, వీరపల్లె వీణావాణి, తోటకూర ఆశాలత మొ. వారు.
తిరుగుబాటు ధోరణి కాకుండా, పాఠకులని పాత్రల ద్వారా ప్రభావితం చేసిన రచయిత్రి మాలతీ చందూర్. ఎన్నో రచనలని చేసిన జొన్నలగడ లలితాదేవి, కావలిపాటి విజయలక్ష్మి, విలక్షణంగా తమ పేరు రాసుకునే ఆరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి, తురగా (మోచర్ల) జయశ్యామల లని మూల రచనలో ప్రస్తావించి వుంటారనుకుంటాను.
పెద్దలెవరైనా పూనుకుని ఈ మూల రచనని తెనిగించరా అని నా ఆశ.
రంగు తోలు గురించి Motorolan గారి అభిప్రాయం:
12/20/2008 2:48 am
The real color is only skin-deep.
Excellent write-up ma’am !
పురూరవ: శ్రవ్య నాటిక గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
12/19/2008 9:29 am
సేకరణ అద్భుతం. ధ్వని కూడా బహు నాణ్యంగా వుంది. రచన పూర్తి పాఠం విడిగా ఇవ్వడం చాలా బాగుంది.
అప్పట్లో రేడియో నాటకాలు ఆదివారం మధ్యాహ్నం రెండూ మూడూ మధ్య వచ్చేవి. అన్ని కేంద్రాల్లోనూ (హైదరా, విజయ,, విశాఖ, కడప) ఒకేసారి ప్రసారమయ్యేవి. ఏ కేంద్రం వారు నిర్మిస్తే వారి పేరు ముందొస్తుంది. సినిమాకి ముందు పేర్లేసినట్టు, రేడియో నాటకానికి ముందు పేర్లు చదివేవారు. ” ఇందలి పాత్రలూ, పాత్రధారులూ… ” అంటూ “శబ్ద” దానం చేసిన వారి పేర్లూ, అటు వెంబడి “నిశ్శబ్దంగా” వెనుక పనిచేసిన వారి పేర్లూ చదివేవారు. వాటిలో ఎక్కువగా వినిపించి నాకు జ్ఞాపకమున్న పేర్లు – శారదా శ్రీనివాసన్ (పాత్రధారి), వాడ్రేవు పురుషోత్తం (నిర్వాహకులు).
శ్రోతల ఆదరణ పొందిన మరో నాటకం “దీక్షాంతం”. ఇందులోనూ ఊర్వశి పాత్ర వుంటుంది. ఎవరి గొంతో జ్ఞాపకం లేక పోయినప్పటికీ, నిర్వాహకులు మాత్రం శ్రీ వాడ్రేవు పురుషోత్తం.
మీ కృషి శ్లాఘనీయం. మరిన్ని అజరామరమైన రేడియో నాటకాలని వినిపిస్తారని ఆశిస్తాను.
తెలుగు భాష వయస్సెంత? గురించి baabjeelu గారి అభిప్రాయం:
12/19/2008 7:23 am
సురేశ్ గారికి,
మంచి వ్యాసవేఁ నిస్సందేహంగా. భాషాశాస్త్రవేత్తలందరకీ ఒక విన్నపం, నదికెదురీదో మరోలాగో దాని పుట్టుపూర్వోత్తరాలు నిర్ణయించొచ్చు. భాష విషయం అలా కాదు. భాషాశాస్త్రవేత్తలు వాళ్ళ కుస్తీలు వాళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే భాష ఎక్కడపుట్టిందో తెలియని “జీవనది”. ముఖ్యంగా కవిత్వాన్ని “రిఫరెన్స్” గా తీసుకుని భాష గురించీ, అప్పటి బతుకు గురించీ వూహాగానాలు చెయ్యడం సరైనది కాదని నా నామ్మకం. కవులు వారివారి అభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తారు తప్ప, వారి వ్యాఖ్యలు “నోటరీ సర్టిఫైడ్” కాదు. అనగా వాటిని పట్టుకు వేలాడ్డం తప్పవచ్చు.
తల్లి ఎవరికి పుట్టిందీ, ఎలా పుట్టిందీ, ఎలాటి మార్పులికి లోనయ్యిందీ లాటివి మాట్లాడం, అది దండగ. ఆడవాళ్ళ వయసు గురించీ, మగవాళ్ళ జీతం గురించీ అని సురేశ్ గారు మీర్రాయడం బాగోలేదు, దాని బదులు “ఋషుల” పుట్టుక గురించంటే ఇంకా బాగుండేది. కుండలో పుట్టేవా, ఎవరో చేపల్దానికి పుట్టేవాఅని మహా ఋషుల్ని అడగం, దానివల్ల వాళ్ళు చెప్పిన మంచి ముక్కల్ని “ఛీ” కొట్టం.
“అమ్మభాష” నేర్చుకోవడం గురించి: బతకడానికి ఏ భాష మంచిదయితే “అమ్మ” కూడా అదే భాష నేర్చుకోమంటుంది. ఎందుకంటే బతకడం ముఖ్యం గనుక. “వెంకటేశం” తల్లి, అగ్రహారీకురాలు, ఆ కుర్రాడి “ఇంగ్లీషు” గురించెందుకు బెంగపెట్టుకుంటుంది. బతకడానికి పనికిరాని భాష బతకదు.
తెలుగు భాష “ఆంధ్రప్రదేశ్” లో బతికుంటే, అది బతికున్నట్టే. పాఠశాలల వ్యవహారం చాలా తక్కువ శాతం. “ఆంధ్రప్రదేశ్” జనాభాలో ఎంత శాతం పాఠశాలలకెళ్ళి చదువుకుంటున్నారు? ఎంత మంది చదువుకున్నారు? పాఠశాలలకెళ్ళి చదువుకోని వాళ్ళే ఎక్కువ శాతం అని నా నమ్మకం. వీళ్ళకి తెలుగొచ్చు. రాయడం రాకపోవచ్చు. “అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబొలె..” కి ప్రతిపదార్థం రాయడం రాకపోవచ్చు. “రావో!రావో!లోల లోల…” యక్షగానంలోని లోలకి అర్థం తెలియకపోవచ్చు, కానీ లక్షణవైన తెలుగు వచ్చు.
ఇంకో విషయం. పరిపాలించేవాళ్ళు ఏ భాషని ఆదరిస్తే పాలింపబడేవాళ్ళు ఆభాషని నేర్చుకుంటారు. నిజాం రోజుల్లో ఎంతమంది తెలుగువాళ్ళు ఉర్దూ నేర్చుకోలేదు, అయినా తెలుగు మర్చిపోలేదు. ఇంగ్లీషు వాళ్ళ హయాం లో ఇంగ్లీషు నేర్చుకున్నా తెలుగు మర్చిపోలేదు. ప్రస్తుతానికి, అంత పట్టించుకోకుండానే, “ఆంధ్రప్రదేశ్” లో తెలుగు అమలులో వుంది. శ్రీ ఏ.బి.కే. ప్రసాదు గారి ప్రకారం మూడో నాలుగో జిల్లాల్లో అంతా తెలుగులోనే వ్యవహారం. మిగిలిన జిల్లాలు కూడా “ఫాలో” అవుతాయి.
ఈ మధ్యనే “పంచాయితీ రాజ్ డిపార్ట్ మెంట్” కి వెళ్తే అక్కడ చక్కని తెలుగులో వ్యవహారం అంతా చూసి “హమ్మయ్య” అనుకున్నాను.
నా ప్రస్తుత “ప్రోజెక్టు” విషయంలో గ్రామ పంచాయితీ వారిచ్చిన “నోటీసు” చూడండి: “…..కావున ఈ నోటీసు అందిన వెంటనే నిర్మాణము ఆపుదల చేయగలరు లేనిచో అట్టి నిర్మాణము నోటీసు ఇవ్వకుండానే కూలగొట్టబడునని ఈ నోటీసు ద్వారా తెలియచేయనైనది.” రాసింది బి.ఏ పేసవని కుర్రాడు.
బహుశా ఈ అభిప్రాయవేదికల్లో అందరం భయపడుతున్న విషయం మన పిల్లలు తెలుగు నేర్చుకోవట్లేదనేమో? మనదే తప్పు. పిల్లలది కాదు, భాషది కాదు. మనదే, ముమ్మాటికీ మనదే.
సాహితీవేత్తలకీ, భాషాశాస్త్రవేత్తలకీ వినమ్రవైఁన విన్నపం: బాగా బతకడానికి పనికొచ్చే “సామాన్య, సాంగీక మరియు లెక్కల” పుస్తకాలు “అమ్మభాష” లో రాయండి. అవి చదువుకుని మా బతుకుల్ని బాగు చేసుకుంటాం.
అన్నట్టు, తెలుగు “ప్రాచీన భాషా?” “క్లాసికల్ భాషా?”
తెలుగు భాష వయస్సెంత? గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
12/18/2008 12:59 pm
చాలా మంచి వ్యాసం. తెలియని విషయాలెన్నో ఆసక్తికరంగా చెప్పారు.
“తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు జిల్లా అమరావతిలో దొరికింది.”
అన్నారు. అంటే అప్పటికి తెలుగుకు లిపి లేదో, లేక వేరే కారణాల(రాజకీయంగానైనా కాకపోయినా) వల్ల బ్రాహ్మీలిపి నే వాడాల్సివచ్చిందో తెలియదు. సురేశ్, వీలైతే మీ అభిప్రాయం చెప్పండి.
తెలుగెందుకు నేర్చుకోవాలి గురించి రెండు మూడు వాక్యాలు రాద్దామనుకున్నాను. చెప్పాల్సిన పాయింటు పక్కకు పెట్టి, దానికి ముందు నాలో జరిగిన ఆలోచన ఘర్షణ నాకు షాకిచ్చింది. దీన్ని ఇంగ్లీషులో రాస్తున్నందుకు క్షమించమని కోరుతూ, ఏందుకో కూడా చెప్తాను, బాధతో.
To finish writing this in short time I can afford, I have two choices. Quickly say in English, or postpone to say in Telugu to my satisfaction.
You know what I chose and therein lies my point and pain.
Language is merely a vehicle to communicate thoughts. To the extent the vehicle is agile, convenient and suitable we jump into it to transport and receive thoughts. Just that this vehicle changes all the time. And some vehicles are (made to be?) very efficient and effective to handle certain goods. One can go from A to B in many vehicles, but each one gives and leaves different experiences. Some enrich while others encumber!
Telugu is one of the very efficient vehicles to express and receive the most sublime ideas from Indian spirituality. And, its resonating sounds add unique and lasting charm that heightens one’s feeling and thrill. Those who don’t know it have no idea what they are missing! Learning for sentimental value goes only so far. But learning to experience its enthralling beauty and thrill make it all the more worth it! That is the gain, but the irony and pain is I had to use English to say that quickly.
Regards
========
-Srinivas
తెలుగు భాష వయస్సెంత? గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
12/18/2008 8:53 am
మన (మాతృ) భాష మనమెందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నకు ఒక సమాధానం: తన సంస్కృతిని గుర్తించి గౌరవించలేనివాడు ఏ సంస్కృతినీ గుర్తించి గౌరవించజాలడు అని అంటారు. పుట్టినప్పటినించీ ప్రవాసాంధ్రుడుగానే ఉంటున్న నేను ఈ విషయం నిజమని గట్టిగా చెప్పగలను.
బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో ప్రొఫెసర్ ఎం. ఎన్. గోగటేగారు ఈ తరం మరాఠీ పిల్లలు కామిక్స్ చదివి “లార్డ్ కృష్ణా” గురించి తెలుసుకుంటున్నారని వాపోయాడు. ఈ లార్డ్ బ్రిటిష్ లార్డా అని ఎద్దేవా చేశాడు. వీళ్ళకి సరైన ఇంగ్లీషూ రాదు, మరాఠీ ఎలాగూ రాదు అని హెచ్చరించాడు.
ఆంధ్రపదేశ్ లో తెలుగును గురించిన నేటి తరం అభిప్రాయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు.
టీవీ ట్రావెల్ చానల్ లో షేక్స్పియర్ జన్మస్థలాన్ని భద్రపరిచి టూరిజం ద్వారా ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూపించారు. మద్రాసు చింతాద్రిపేటలో ఒక పాత ఇంటిని చూపించి, అందులో వీరేశలింగంగారు కొన్నాళ్ళు గడిపారని మానాన్న నాకు చెప్పారు. ఈపాటికి దాన్ని కూల్చేసి ఉంటారు. రాజమండ్రిలో ఆయన ఇంటినీ, విజయనగరంలో అప్పారావుగారి ఇంటినీ టూరిజం పేరుతో జాగ్రత్తపరచాలనే భావన మన అధికారులకు ఉందా? నేటి ‘రాజశేఖర చరిత్ర’ ఎటువంటిది?
తెలుగు భాష వయస్సెంత? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
12/18/2008 8:08 am
చాల బాగుంది. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ లో తెలుగు బోధించే ప్రయత్నాలు చేస్తూన్నప్పుడు (ఇంకా ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి) మమ్ము తరచుగా ఎదుర్కున్న ప్రశ్న “మనం తెలుగు భాషని ఎందుకు నేర్చుకోవాలి?” అన్నది. మొదట్లో విరాళం ఇవ్వకుండా తప్పించుకుందికి ఈ ఎదురు ప్రశ్న వేస్తున్నారనుకున్నాను. కాని ఈ వ్యాసం సందర్భంలో రమేష్ బాబు కూడ ఈ ప్రశ్న అడిగేరు కనుక దీనికి సాలోచనగా సమాధానం చెప్ప వలసిన అవసరం ఉన్నట్లనిపిస్తున్నాది. సురేశ్ కి ఈ సామర్ధ్యం ఉంది కనుక నేనూ అడుగుతున్నాను. తెలుగుదేశంలో ఉన్న తెలుగువారు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ప్రవాసాంధ్రులు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? అన్న ప్రశ్నలని కూలంకషంగా ఎవ్వరయినా చర్చించండి. నేను నా బ్లాగులో ప్రయత్నించేను కాని బాగా రాలేదు.
రావు వేమూరి
http://latebloomer-usa.blogspot.com/
తెలుగు భాష వయస్సెంత? గురించి Ramesh గారి అభిప్రాయం:
12/17/2008 11:44 pm
అయ్యా! బాగా ఉందండీ. తెలుగు భాష గురించిన వివరాలను తెలియజేయాలన్ని మీ ప్రయత్నానికి జోహార్లు. కానీ మీరేమి అనుకోకపోతే నాదో చిన్న విన్నపం. మీ వ్యాసంలో చాలా వరకు సాధారణ ప్రజలకు తెలియని కొన్ని పదాలు దొర్లాయి. ఇవి సాధారణ ప్రజలకే కాదు ఓ మోస్తరు చదువుకున్న వారికి కూడా తెలియదని నా భావన.
మీరు ఒ సారి దయచేసి అలాంటి పదాలకు కూడా అర్థాన్నిస్తూ కొంత వివరించగలిగితే, మీ వ్యాసం మరింత ఎక్కువ మందికి చేరి వారికి తెలుగు పట్ల ఉన్న ధోరణిని మార్చుకునేలా చెయ్యగలదని అనుకుంటున్నాను. అటు తర్వాత మీకు వీలైతే ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి..? అన్న దానిపై కూడా మీ సమగ్ర రచనా సంపుటితో మరో వ్యాసాన్ని అందించగలరని కోరుకుంటున్నాను.
శెలవు.
రమేష్ బాబు
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:
12/17/2008 11:04 pm
[జరిగిన పొరపాటుకు చింతిస్తూ, రచయిత కోరికపై కవితని సవరించాము. -సం]
శ్రీనివాస్ గారు,
మంచి పరిశీలన. చిత్తు ప్రతిలో “జోళ్ళు” అనే వ్రాసుకున్నాను.టైపుకు వచ్చేటప్పటికి యధాలాపంగా జరిగిన పొరబాటు ఇది.మీరు చెప్పకపోతే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు
మరిన్ని చేసి ఉండేదాన్నేమో.
కొన్ని లక్షల ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
12/17/2008 10:35 am
బృందావన రావుగారి పద్య పరిచయం జనవరి సంచికలో ఉంటుందని, కొత్త సంవత్సరం కోసం సంబరంగా ఎదురుచూస్తున్నాను.
ఈ పద్య వివరణా వ్యాసం, వారిచ్చిన సమాధానాలు, మరోసారి చదువుకుని రాస్తున్నాను.
నా దగ్గర నన్నెచోడుని తెలుగు పుస్తకం లేదు. కాని కోలాచల మల్లినాథ సూరి తెలుగు టీకా తాత్పర్యంతో -కాళిదాసు కుమార సంభవం ఉంది.
ప్రధమ సర్గలో పార్వతిని పాదాల దగ్గరనుండి తలవరకు వర్ణించారు కాళిదాస కవి. దేవతలను కిందినుండి పైకి, మానవులను పైనుండి కిందకు వర్ణించడం ఆచారమట. ఆ వర్ణన ” మధ్యేన సావేదివిలగ్నమధ్యా వళి త్రయంచారు బభార బాలా..” నుండి -త్రివళులంటే నడుము మీద ఉండే మూడు మడతలని తెలిసింది. అవి నాభికి పైభాగంలో ఉంటాయనీ నాకు తెలిసింది. ( ఎందుకంటే అంతకు ముందు పద్యంలో అప్పటికి నాభి వరకూ వర్ణన ఐపోయింది కాబట్టి. అప్పుడే పార్వతి నతనాభి అని కూడా తెలిసింది. “తస్యా ప్రవిష్టా నతనాభి రంధ్రంరరాజ తన్వీ…” )
తర్వాత పంచమ స్సర్గములో పార్వతి తపస్సు ఘట్టములో కాళిదాసు శ్లోకానికీ, మీరిచ్చిన నన్నెచోడుని పద్యమునకూ గల పొలికలు చూచాను. తేడా అల్లా కాళిదాసువి గ్రీష్మం తర్వాతి తొలి నీటి చుక్కలు. నన్నెచోడునవి నవాంబు ధారలు. కాబట్టి ఇంకా వేగంతో ప్రవహించాయి. (ఐనా కాళిదాసు ముందరి పద్యము లోనే పార్వతి అప్పటిదాకా చెట్లలాగానే వర్షపు నీరుతో మాత్రమే బ్రతికిందంటారు. మళ్ళీ అంతలోనే మరిచి, గ్రీష్మం వెళ్ళిపోయి మొదటి వానకు తడిసి పార్వతి శరీరంలోచి, భూమి లోంచి సెగలుపైకి లేచాయని రాశారు. 🙂 ఆ తర్వాత పద్యమే ఆ వాన పార్వతి మీదుగా ఎలా జారిందొ చెప్పే పద్యం. ) పద్యములు అతి చక్కనివి. కవులు బాగా రాశారు.
కానీ వాన ( ప్రకృతి )సామాన్య విషయమూ, కవులది సుందర కళాసృష్టి అనుకోటానికి నా మనసొప్పదు. కవులు తలకిందులుగా తపస్సు చేసినా భగవంతుని సృష్టిని మేచ్ చెయ్యలేరు. ఒక సౌందర్యవతిని, ఆమె చిత్రాన్నీ చూసి ” జో బాత్ తుఝ్ మే హై, ఒ తేరీ తస్ వీర్ మే నహీ ” అన్న కవిరాజుకి నా నమస్కారము. పకృతి అందాన్ని, ప్రకృతిలో మానవ సౌందర్యాన్ని, చూసి ముందస్తుగా పరవశించని హృదయం, కవి రాసే మాటలకు ఉబ్బిపోటం ఉత్తిమాట. అసలు సౌందర్య స్పృహ, సౌందర్య కాంక్ష లేనివాడు కవే కాడు.
ఒక కవి నుంచి ఇంకొక కవి సంగ్రహించటం, ఒకరిని ఇంకొకరు అనువదించటం , అనుకరించటం -విద్యాభిలాషతో, కళపై కాంక్షతో, చేసే పనులు. కళాకారుడు అనుకరించడం మానడు. మానలేడు. అలా చెయ్యటం అవసరము. ముందు అనుసరించినా, కొన్నాళ్ళ తర్వాత కొత్త కళా స్రష్ట అవుతాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు నాకు నచ్చాయి. ఒకరి చక్కని భావాన్ని ఇంకో భాషలో, ఇంకో సమయంలో, -తన ఆనందం కోసం, పలువురి ఆనందం కోసం- కవి వాడటం, మీరన్నట్లు కవి పాండిత్యాన్నీ, రసికతను, చెపుతుంది. పాఠకులు కూడా ఎంత ఎక్కువగా చదివి ఉన్నవారైతే, ఏ రచనలోనైనా, అన్ని ఎక్కువ మూలాలు గుర్తించగలుగుతారు.
లైలా