ఎంత చ క్కగా వ్రాసారు సారు
దీనికి ముందు కవిత దాని మీది అభిప్రాయాలు చదివి చాలా పిచ్చెక్కింది
ఇప్పుదు మనసు చాలా తెలికయ్యింది
మరీ మరీ చదవాలనిపించింది.
థన్యవాదాలు.
నేను ఎప్పటినుంచో రాద్దామనుకున్న విషయం మీద మీరు రాస్తున్నారు. చాలా మంచిది. నేను రాసి ఉంటే ఇంత బాగా ఉండేది కాదు. మరయితే, నిదానంగా మన పాత రోజులు, అంటే స్కిట్ ఏర్పడినప్పటి నుంచి అంతర్జాలంలో తెలుగు వాళ్ళు ఒకొళ్ళనొకళ్ళు తెలుగులో పలకరింపుల మొదలు, జరిగిన విషయాలు గుర్తుంచుకోవలసిన వివరాలను విపులంగా రాయండి. ఈ నాడు అంతర్జాలంలో తరచు తెలుగులో రాస్తున్నవారికి చాలా మందికి ఈ వివరాలు తెలియకపోవచ్చు. వారికోసమైనా విపులంగా రాయండి.
సంగీత, సాహిత్య, శిల్ప, చిత్రకళాది లలిత కళలు కెవల దైవ దత్త వరాలు. ఈశ్వరానుగ్రహం ఉన్న వారికే ఇవి లభ్యం అవుతాయి. జాతి కుల మతాలని ఈ దౌర్భాగ్య మానవులు చూపే వివక్ష పరమేశ్వరుడెన్నడూ అణుమాత్రం పాటించడని ఈ మహా కవి అనర్ఘ కవితా వైభవాన్ని చూస్తే అర్ధం అవుతుంది.
బోడి పద్యం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
04/02/2009 9:50 am
రచన స్పృశించిన కొన్ని అంశాలు అర్థం చేసుకోవాలంటే సమాజంలో బతికితే సరిపోదనుకుంటాను. ప్రస్తుతానికి వెనకున్న విస్తారమైన విషాదమైన ఎన్నో చారిత్రిక సంఘటలు గుచ్చినట్టుగా ప్రశ్నిస్తాయి, లోతుగా.
నిరుడు నిలిచిన బౌద్ధ ఆరామాలేవి, నాడు నడిచిన నలందా ఏది, మొన్నటిదాకా పాత బస్తీలో ప్రాణాలుపోయిన వారికుటుంబాలకిచ్చే జవాబేది. మతం పేరుతో పారిన, పారుతున్న రక్తంతోనైనా శాంతి వృక్షం పెరిగే రోజేది?
____
విధేయుడు
-Srinivas
బోడి పద్యం గురించి ravinder posani గారి అభిప్రాయం:
04/01/2009 1:13 pm
ఈ పద్యాన్ని నిజంగా అర్ధం చేసుకోవాల్నే అని వుంటే అన్ని ఆధారాలు, సమీక్షకుల సర్టీఫీకెట్లు అక్కర లేదు. లైలా గారి విశ్లేషణ చాలు…
కాని, అర్ధం చేసుకోవాలన్న తపన కన్నా, తప్పులెన్నాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తోంది.
ఈ పద్యాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు మీరు ఈ సమాజంలో బతుకుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోగలిగిన వాళ్లకి ఈ కవిత తేలికగానే అర్ధం అవ్వాలి.
మీరు చెప్పిన “కూనిరాగం”తీయగల్గటం రామ దాసు పాటలకి సాధ్యం.అవి”భజన సంప్రదాయానికి”చెందినవి గనక. కానీ త్యాగయ్య popular గేయకర్త కాడు. సంగీతాన్ని నేర్చుకున్న వాళ్ళో..లేదా..regular గా classical music ని వినే అలవాటున్న వాళ్ళో తప్ప..త్యాగరాజస్వామి వారి పాటల్ని కూనిరాగం తీయటం కుదిరే పని కాదు. మిమిక్రీ చెయ్యొచ్చు..మ హా అయితే!
ఇంక అన్నమయ్య పదాల్ని అరవైల్లో ఆల్ ఇండియా రేడియో లో మొదటిగా గాయనీ గాయకుల చేత పాడీంచేదాకా కూడా..ఆయన పాటలు తెలుగుదేశంలో ప్రచారం కాలేదు. అందువల్ల ఆయగుపాట గురించి తెలుగువారికి తెలిసిందే ఈమధ్య. ఒకవేళ మీరు ఉదాహరించబోయే”జో అచ్యుతానంద జోజో ముకుందా”..అన్నమయ్య పదంగా చెలామణీ అయిందే గానీ..అది అన్నమయ్య పదం అవునో కాదో తెలియదు. ఇంక గద్దర్ పాటతో తెలుగుతల్లులు కూనిరాగాలు తీస్తూ పిల్లల్ని పెంచుతున్నారని నేను అనుకోవడం లేదు.
ఇదివరకూ చెప్పిన ట్టే ఇప్పుడూ చెబుతున్నాను.” కవి” గా త్యాగయ్య గారు చాలరు. కాదూ మేము త్యాగరాజుని గొప్ప కవిగా అనుకుంటూ ఉన్నాము…అని ఎవరైనా అన దల్చుకుంటే..అలా వారు అనుకున్న కారణాల్ని
వివరించిచెప్పొచ్చు…సోదాహరణంగా!!
కవిత్వం భాషతో..పదచిత్రాల్తో..భావచిత్రాల్తో..ఊహల్తో విశిష్టంగా మన మనఃప్రవేశం చేయాలి.అలా చేసే అక్షరం కల్గించే స్పందనలు వేరు. అది వాదించే విషయం కాదు. అనుభవించగల విషయం.అదీ తేడా!!
రమ.
బోడి పద్యం గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
బోడి పద్యం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
03/31/2009 2:29 pm
నర్సింహ గారు,
పూలు, పూబోడులు, పిరుదులు మీకొంటబట్టవని చెప్పేరు గానె, ఎవరిష్టం వాళ్ళది దానికెవరేం జేస్తాం దేనికైనా అదురుష్టవుండాల. మీరోరంలో ఏడ్రోజులు దిద్దుతారా అ, ఆలు. మీ మందల మీరు జెప్పేరు, మీ దోస్తుల మందల కూడా మీరే జెప్పాలా, ఏంది వాళ్ళకి అ,ఆ లు దిద్దడం ఇంకా వొగదెగలా?
శానరోజులకి ఈమాటలొ టీ గురించి, టీ పొడి గురించి ఇన్నాను. టీ తాక్కుండా, టీ పొడి తింటే వచ్చే కెఫిన్ హైలో ఈమాట సంపాదకత్వానికి మీరిచ్చిన చరిటిపికెట్టు వాళ్ళు ప్రేంగట్టిచ్చుకుని పెట్టుకోవాల. మరీ అంత డయిరెట్టుగా ఎవరోజెప్తే గాని ఈమాట సదవనంటే వోళ్ళు పీలవుతారేవో. అద్సరేగానె, తెల్ల పవరేంది? అదేడనుంచి పట్తకొచ్చావు. కెఫిన్ లెవెల్స్ కొంచం తగ్గిన తర్వాత, అప్సరు గోరి కవిత మీద ఒక అదరగొట్టే ఇమర్స రాయగూడదా మీరు.
నర్సింహ గారూ,
పని మాల సదివిన కవిత్వం గురించి ఒక్కముక్కకూడా రాయలేదు మీరు.
తెల్ల పొగరు అణిగిపోయేట్టు ఈ “బోడి పద్యం” దేని గురించో రాయరూ, దయచేసి.
అక్షరలక్షలు చేసీ ముక్కొహటి అన్నారు, ఈ మాట ఎడిటర్ల గురించి “అనాడీ” లు కారని. సంతోషం. మిగతావన్నీ పక్కనబెట్టి పైనున్న కవిత్వం లో ని విశేషాలగురించి రాయండీ. దెబ్బకు ఠా దొంగలముఠా అయిపోతుంది.
భ్రంశధార గురించి raman గారి అభిప్రాయం:
04/03/2009 4:40 pm
ఎంత చ క్కగా వ్రాసారు సారు
దీనికి ముందు కవిత దాని మీది అభిప్రాయాలు చదివి చాలా పిచ్చెక్కింది
ఇప్పుదు మనసు చాలా తెలికయ్యింది
మరీ మరీ చదవాలనిపించింది.
థన్యవాదాలు.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
04/03/2009 11:11 am
సురేష్ :
నేను ఎప్పటినుంచో రాద్దామనుకున్న విషయం మీద మీరు రాస్తున్నారు. చాలా మంచిది. నేను రాసి ఉంటే ఇంత బాగా ఉండేది కాదు. మరయితే, నిదానంగా మన పాత రోజులు, అంటే స్కిట్ ఏర్పడినప్పటి నుంచి అంతర్జాలంలో తెలుగు వాళ్ళు ఒకొళ్ళనొకళ్ళు తెలుగులో పలకరింపుల మొదలు, జరిగిన విషయాలు గుర్తుంచుకోవలసిన వివరాలను విపులంగా రాయండి. ఈ నాడు అంతర్జాలంలో తరచు తెలుగులో రాస్తున్నవారికి చాలా మందికి ఈ వివరాలు తెలియకపోవచ్చు. వారికోసమైనా విపులంగా రాయండి.
మీ తరవాత వ్యాసం కోసం ఎదురు చూస్తూ,
అభినందనలతో,
లక్ష్మన్న
జాషువా పిరదౌసి గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/03/2009 3:52 am
సంగీత, సాహిత్య, శిల్ప, చిత్రకళాది లలిత కళలు కెవల దైవ దత్త వరాలు. ఈశ్వరానుగ్రహం ఉన్న వారికే ఇవి లభ్యం అవుతాయి. జాతి కుల మతాలని ఈ దౌర్భాగ్య మానవులు చూపే వివక్ష పరమేశ్వరుడెన్నడూ అణుమాత్రం పాటించడని ఈ మహా కవి అనర్ఘ కవితా వైభవాన్ని చూస్తే అర్ధం అవుతుంది.
బోడి పద్యం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
04/02/2009 9:50 am
రచన స్పృశించిన కొన్ని అంశాలు అర్థం చేసుకోవాలంటే సమాజంలో బతికితే సరిపోదనుకుంటాను. ప్రస్తుతానికి వెనకున్న విస్తారమైన విషాదమైన ఎన్నో చారిత్రిక సంఘటలు గుచ్చినట్టుగా ప్రశ్నిస్తాయి, లోతుగా.
నిరుడు నిలిచిన బౌద్ధ ఆరామాలేవి, నాడు నడిచిన నలందా ఏది, మొన్నటిదాకా పాత బస్తీలో ప్రాణాలుపోయిన వారికుటుంబాలకిచ్చే జవాబేది. మతం పేరుతో పారిన, పారుతున్న రక్తంతోనైనా శాంతి వృక్షం పెరిగే రోజేది?
____
విధేయుడు
-Srinivas
బోడి పద్యం గురించి ravinder posani గారి అభిప్రాయం:
04/01/2009 1:13 pm
ఈ పద్యాన్ని నిజంగా అర్ధం చేసుకోవాల్నే అని వుంటే అన్ని ఆధారాలు, సమీక్షకుల సర్టీఫీకెట్లు అక్కర లేదు. లైలా గారి విశ్లేషణ చాలు…
కాని, అర్ధం చేసుకోవాలన్న తపన కన్నా, తప్పులెన్నాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తోంది.
ఈ పద్యాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు మీరు ఈ సమాజంలో బతుకుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోగలిగిన వాళ్లకి ఈ కవిత తేలికగానే అర్ధం అవ్వాలి.
రవి
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/31/2009 6:55 pm
రవికిరణ్ ,
మీరు చెప్పిన “కూనిరాగం”తీయగల్గటం రామ దాసు పాటలకి సాధ్యం.అవి”భజన సంప్రదాయానికి”చెందినవి గనక. కానీ త్యాగయ్య popular గేయకర్త కాడు. సంగీతాన్ని నేర్చుకున్న వాళ్ళో..లేదా..regular గా classical music ని వినే అలవాటున్న వాళ్ళో తప్ప..త్యాగరాజస్వామి వారి పాటల్ని కూనిరాగం తీయటం కుదిరే పని కాదు. మిమిక్రీ చెయ్యొచ్చు..మ హా అయితే!
ఇంక అన్నమయ్య పదాల్ని అరవైల్లో ఆల్ ఇండియా రేడియో లో మొదటిగా గాయనీ గాయకుల చేత పాడీంచేదాకా కూడా..ఆయన పాటలు తెలుగుదేశంలో ప్రచారం కాలేదు. అందువల్ల ఆయగుపాట గురించి తెలుగువారికి తెలిసిందే ఈమధ్య. ఒకవేళ మీరు ఉదాహరించబోయే”జో అచ్యుతానంద జోజో ముకుందా”..అన్నమయ్య పదంగా చెలామణీ అయిందే గానీ..అది అన్నమయ్య పదం అవునో కాదో తెలియదు. ఇంక గద్దర్ పాటతో తెలుగుతల్లులు కూనిరాగాలు తీస్తూ పిల్లల్ని పెంచుతున్నారని నేను అనుకోవడం లేదు.
ఇదివరకూ చెప్పిన ట్టే ఇప్పుడూ చెబుతున్నాను.” కవి” గా త్యాగయ్య గారు చాలరు. కాదూ మేము త్యాగరాజుని గొప్ప కవిగా అనుకుంటూ ఉన్నాము…అని ఎవరైనా అన దల్చుకుంటే..అలా వారు అనుకున్న కారణాల్ని
వివరించిచెప్పొచ్చు…సోదాహరణంగా!!
కవిత్వం భాషతో..పదచిత్రాల్తో..భావచిత్రాల్తో..ఊహల్తో విశిష్టంగా మన మనఃప్రవేశం చేయాలి.అలా చేసే అక్షరం కల్గించే స్పందనలు వేరు. అది వాదించే విషయం కాదు. అనుభవించగల విషయం.అదీ తేడా!!
రమ.
బోడి పద్యం గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
03/31/2009 4:39 pm
ఈ కవితని, కవిని అర్థం చేసుకోవడానికి ఈ లంకెలోని వ్యాసం ఉపయోగపడుతుంది “అఫ్సర్ “వలస”, కల్పనా రెంటాల “కనిపించే పదం”” – మే 2002 ఈ మాట సంచిక http://www.eemaata.com/em/issues/200205/552.html
గరికపాటి పవన్ కుమార్
బోడి పద్యం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
03/31/2009 2:29 pm
నర్సింహ గారు,
పూలు, పూబోడులు, పిరుదులు మీకొంటబట్టవని చెప్పేరు గానె, ఎవరిష్టం వాళ్ళది దానికెవరేం జేస్తాం దేనికైనా అదురుష్టవుండాల. మీరోరంలో ఏడ్రోజులు దిద్దుతారా అ, ఆలు. మీ మందల మీరు జెప్పేరు, మీ దోస్తుల మందల కూడా మీరే జెప్పాలా, ఏంది వాళ్ళకి అ,ఆ లు దిద్దడం ఇంకా వొగదెగలా?
శానరోజులకి ఈమాటలొ టీ గురించి, టీ పొడి గురించి ఇన్నాను. టీ తాక్కుండా, టీ పొడి తింటే వచ్చే కెఫిన్ హైలో ఈమాట సంపాదకత్వానికి మీరిచ్చిన చరిటిపికెట్టు వాళ్ళు ప్రేంగట్టిచ్చుకుని పెట్టుకోవాల. మరీ అంత డయిరెట్టుగా ఎవరోజెప్తే గాని ఈమాట సదవనంటే వోళ్ళు పీలవుతారేవో. అద్సరేగానె, తెల్ల పవరేంది? అదేడనుంచి పట్తకొచ్చావు. కెఫిన్ లెవెల్స్ కొంచం తగ్గిన తర్వాత, అప్సరు గోరి కవిత మీద ఒక అదరగొట్టే ఇమర్స రాయగూడదా మీరు.
రవి
బోడి పద్యం గురించి యాద్గిరి గారి అభిప్రాయం:
03/31/2009 12:02 pm
అన్నా నర్సిమ్మన్నా, మస్తుగ రాసినవే.
గీ లొల్లి పడుడేందే? మా ఊళ్ళ లొల్లి జేస్తరు. ఇంకొన్ని ఊర్లళ్ళ గొడవ జేస్తరు/పడ్తరు. నీ బాస జరింత అటీటు గాకుండుంది. నువ్వు అ,ఆలు ఏడ నేర్సినవే?
గీడ తెల్లోల్లెవరె? ఎప్పుడో మనదేశం ఇడిసిపెట్టిండ్రు గదనే. కొంపదీసి గీ కైత అమ్రికోళ్ళ మీదన యేంది?
ఈమాటల కైతలు ఏడిటర్లు రాయరె నర్సిమ్మన్నా. శనాది వారలల్ల అ,ఆ,ఇ,ఈ లు నేర్సినోల్లే రాస్తరే. ఎడిటర్లు ఎస్కోవల్నా లేదా అని డిసైడ్ జేస్తరు. నీకేం సమజయిందో నాకైతే సమజ్ గాలె.
సల్లగుండు మరి.
యాద్గిరి
బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/31/2009 9:26 am
నర్సింహ గారూ,
పని మాల సదివిన కవిత్వం గురించి ఒక్కముక్కకూడా రాయలేదు మీరు.
తెల్ల పొగరు అణిగిపోయేట్టు ఈ “బోడి పద్యం” దేని గురించో రాయరూ, దయచేసి.
అక్షరలక్షలు చేసీ ముక్కొహటి అన్నారు, ఈ మాట ఎడిటర్ల గురించి “అనాడీ” లు కారని. సంతోషం. మిగతావన్నీ పక్కనబెట్టి పైనున్న కవిత్వం లో ని విశేషాలగురించి రాయండీ. దెబ్బకు ఠా దొంగలముఠా అయిపోతుంది.