Comment navigation


15815

« 1 ... 1183 1184 1185 1186 1187 ... 1582 »

  1. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    02/08/2010 11:53 pm

    రమ గారూ, కల్పన అన్నది ఒకటి కాదు, చాలా వుంటాయి.

    నా చిన్నప్పుడు మా తాత వీపు తొక్కుతూ నేను చెప్పిన నలభై రోజుల ధారా వాహిక కూడా కల్పనే. అది నాకూ, మా తాతకీ తప్ప మరెవరికీ ఆసక్తికరంగా వుండదు. సోదమ్మలూ, సోమిదేవమ్మలూ చెప్పేవి కూడా కల్పనలే. అభూత కల్పనలూ వుంటాయి, కవిత్వాలూ వుంటాయి, దెయ్యం కథలూ, బూతు కథలూ కూడా కల్పనలే. ఆఫీసునించి లేటుగా రావటానికి భర్తలు చెప్పే కారణాల్లోనూ, నెలవారీ ఖర్చుల్లోంచి పొదుపు చేసే భార్యలూ, పీకలదాకా నష్టాల్లో కూరుకు పోయినా షేరు మార్కెట్లో నిలదొక్కుకోవటానికి సీయీవోలు చార్టర్డ్ అక్కౌంటెంట్లూ పడే తంటాలూ కల్పన మీద ఆధార పడేవే.

    సమస్య అదికాదు. సినిమాల్లో నేపథ్య గానాలున్నట్టుగా నిజ జీవితంలో ఎక్కడా మనము పాటలు పాడుకోక పోయినా, సినిమా అన్న కళామాధ్యమంలో నేపథ్య గానానికి వుండే విలువని మనమందరమూ గుర్తిస్తాము. ఇక్కడ విషయం పాటా సినిమా నమ్మదగ్గవిగా వున్నాయా లేదా అన్నది కాదు.

    సూక్ష్మంగా చెప్పాలంటే, తెలుగు వీర లేవరా అన్న పాట శ్రీ శ్రీ రాసిన పాటల్లో అంత గొప్పదేమీ కాదు అన్నది నా వ్యాఖ్య. ఆమాటకొస్తే ఇదే సినిమాలో పాటలు రాసిన ఆరుద్ర, కొసరాజులు కూడా ఇందులో పాటల కన్నా చాలా చక్కటి సినిమా పాటలు రాసిన సందర్భాలు చాలానే వున్నాయి అన్న విషయం మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వ్యాఖ్య వ్రాసినప్పుడు దానిని ఒక విమర్శగానో వివరించవలసిన అభిప్రాయంగానో అనుకోకపోవటం నా పొరపాటే.

    కొంచెం వివరంగా చెప్పాలంటే , కథ మరొక దగ్గర మొదలు పెట్టక తప్పదు. అల్లూరి సీతారామరాజు సినిమాకీ, అందులో జాతీయ అవార్డు వచ్చిన ఈ పాటకి మనం విస్మరించరాని చారిత్రక భౌగోళిక నేపథ్యం వుంది. సినిమా విడుదల అయినది 1974 లో. విశాలాంధ్ర అవతరించి గట్టిగా ఇరవయి సంవత్సరాలు కూడా కాకుండానే, అప్పటికి అయిదు సంవత్సరాలుగా తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో మూల మూలలా భాషా సంస్కృతులలో భేదాల పేరు మీదనే చెలరేగిన తీవ్రమైన అశాంతి (జై తెలంగాణ, జై ఆంధ్రా వుద్యమాలు) ఇంకా సద్దుమణగలేదు. పోలీసు కాల్పుల్లో నాలుగు వందల మంది చని పోయి వుంటారని అంచనా. వేలాది మంది విద్యార్థుల చదువులు, జీవికల మీద ఆశలూ కోల్పోయారు.

    అప్పటికి నాలుగు సంవత్సరాల క్రితమే, మైదాన ప్రాంతపు ప్రజలు మన్య ప్రాంతాలలో గిరిజనుల భూములను ఆక్రమించుకుంటున్నారని , దాన్ని అరికట్టక పోతే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వచ్చే ప్రమాదం వుందనీ భావించి రాష్ట్రపతి ద్వారా గిరిజనుల భూములను మైదాన ప్రాంతపు ప్రజల నించి రక్షించటానికి వన్ ఆఫ్ సెవెంటీ (1970 సంవత్సరంలో వచ్చిన మొదటి ఆదేశాలు కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ అన్న మాట) ఇప్పించవలసి వచ్చింది. (ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెలుగు వాడు అన్న శబ్దాలు వినపడుతుంటే క్షమించండి.. మాట వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు. అవే మన్య ప్రాంత భూములని, అదే వన్ ఆఫ్ సెవెంటీ ఆదేశాలకి వ్యతిరేకంగా గత పది సంవత్సరాలలో మైనింగ్ లీజులకింద, సినిమా నిర్మాతలకి స్టూడియోలూ గట్రా నిర్మించుకోవడానికి లీజులకిందా ఇస్తూ పోతున్నారనీ చాలా కేసులు హై కోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ పడి వున్నాయి).

    సినిమా రిలీజయిన నాటికి, దేశ భద్రతకి అంతర్గతంగా విచ్ఛిన్నకర శక్తులవల్లనూ, బాహ్య శక్తుల కుట్ర వల్లనూ ప్రమాదం పొంచి వుందని చెప్పి, శ్రీమతి ఇందిరా గాంధీ నెమ్మది నెమ్మదిగా అధికారాన్ని అంతటినీ తన చేతిలో కేంద్రీకృతం చేసుకుంటూ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లోనే రాష్ట్రపతి పాలన విధించవలసిన అగత్యం వుందని అప్పటికే చేసి చూపించింది.

    ఇటువంటి కల్లోల పరిస్థితిలో, అనేకానేక చారిత్రక భౌగోళిక కారణాల వలన తునా తునకలయిన ప్రజల ఐక్యత నేపథ్యంలో, అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలయింది. అటువంటి సందర్భంలో మన్య ప్రాంతంలో మైదాన ప్రాంత ప్రజల వీరోచిత సేవని నిరూపించటంలోనో, నిజ జీవితంలో సాధ్యం కానీ ఐక్యతని సినిమా ద్వారా చూపించటంలోనో నిర్మాతకి ఏదో తక్షణ స్వార్ధం వున్నదని అంత క్రూడ్ గా చెప్పుకోవలసిన పని లేదు కానీ, ఆ నేపథ్యంలో ఈ సినిమా ఏం సాధించింది? ఎందుకు అంత గుర్తింపు పొందింది, ఈ సినిమాని ఏ ప్రజలు ఎందుకు ఆదరించారు? అందులో శ్రీ శ్రీ పాట పాత్ర ఏమిటి అన్న ప్రశ్నలు వేసుకోవటం అవసరం. ఆ ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఈ రోజు నెలకొన్న పరిస్థితులేమిటి అన్న గ్రహింపు కూడా వుండడం అవసరం.

    ఇంతకు ముందు నేను సూచన ప్రాయంగా చెప్పిన నేపథ్యం అంతా శ్రీ శ్రీ కి బాగానే తెలుసును. అటువంటి పరిస్థితులలో తెలుగు వీరత్వాన్ని, శూరత్వాన్ని, బాహ్య శత్రువుని తరిమి తరిమి కొట్టమని ఉద్బోధిస్తకీ భాష పాట రాయాలంటే శబ్దాడంబరం ద్వారా, భాష పేరిటా, సంస్కృతి పేరిటా, జాతి పేరిటా , మగతనం పేరిటా క్షణికావేశం సృష్టించడం తప్ప వేరే మార్గం లేదు. శ్రీ శ్రీ ని అందుకు మనం తప్పు పట్టనవసరం లేదు కానీ, పాటకు లేని గొప్పదనాన్ని ఆపాదించనవసరం కూడా లేదు.

  2. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    02/08/2010 1:49 pm

    హనుమంతరావు గారు,

    నాకు చెప్పడానికి చేతగాని విషయాన్ని మహా బాగా చెప్పేరు. ఖచ్చిత తత్వం చేరిన తర్వాత కవిత్వం లుప్తమైపొయ్యేపనైతే, మన ప్రాచీన సాహిత్యంలో అసలు కవిత్వవే లేదనుకోవాలేవో. నేనేవీ ప్రాచీన సాహిత్యాన్ని ఔపోసన పట్టలేదు కానీ ఆ ఖచ్చిత తత్వం తర్వాత కవిత్వం లేదంటే, పాపం నైషధ కర్తలనించి, లేదు, లేదని మహా ఖచ్చితవైన అభిప్రాయాలు కల ఇస్మాయిల్ గారిదాకా అందరూ కవులు కాకుండా పోతారేవో. అదేందో అంటారు చూడండి, కొని తెచ్చుకోవటవని అలాగుంది రవి శంకర్ గారి వాదం. ఖచ్చిత తత్వం వుంటే కవులుగారని వారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. పాపం కవి ఏ అభిప్రాయాలు లేకుండా, ఏ నమ్మకాలూ లేకుండా, ఏమాత్రం ఏ మానవ లక్షణాలు లేకుండా, ఏ చెట్టుగానో, ఏ పువ్వు గానో, లేకపోతే, పచ్చ, పచ్చగా ఎండలో మిల, మిల మెరుస్తూ ఎండుతున్న ఏ పిడగ్గానో అయ్యుండాలేవో.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది – సం.]

  3. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/08/2010 10:54 am

    “కల్పన” అని ఒక విషయం ఉంటుంది చాకిరేవు ఉపేంద్ర గారూ!! అందులో మనం విశ్లేషించే reality పొసగదు. మన్నెం దొరల లో లోలోపల ఉన్న ఆవేశాలని, సీతారామరాజు తెల్లదొరలకి వ్యతిరేకంగా రౌద్రాన్ని ఉసిగొలిపేలా బయటికి తీస్తున్నాడు అని చూసినప్పుడు ఆ పాట సహజంగానే కన్పిస్తుంది.

    సిన్మా మొత్తం మీద సీతారామారాజు అటు తెల్లదొరలతో ఆంగ్లంలోనూ..ఇటు మన్నెం దొరలతో కొండభాషలోనూ మాట్లాడాలి మరి న్యాయంగా మీ వాస్తవికత ప్రకారం. కానీ రూదర్ ఫర్డ్ గా ఇంగ్లీషు వాడిని పెట్టి తియ్యలేని ఆ తెలుగు సినిమా లో జగ్గయ్యని తెల్లదొరగా జనం ఊహించుకోవలసినట్టుగానే..సీతారామరాజు మాట్లాడిన తెలుగు భాషని కూడా మనం ఆయా సందర్భానుసారం ఊహించుకోవాలన్నమాట! లేకపోతే మన్నెం భాషలోనో లేదా ఇంగ్లీషు భాషలోనో తియ్యాల్సిన సినిమాని సీతారామరాజు సొంత భాష అయిన తెలుగులో తియ్యడం ఏమిటీ?? ప్రేక్షకులు “తెలుగు”వాళ్ళు గనక. కొండదొరలు కారు గనకానూ!! తెలుగువీరలేవరా అని మీకు నచ్చకపోతే “కొండవీర లేవరా”!! అని మీరు మీ కోసం పాడుకుంటే గనక శ్రీశ్రీకి ఏమంతగా అభ్యంతరం ఉండకపోవచ్చు.

    పాటపాడుతున్నది అల్లూరి. పాడాల్సిన పాట సీతారామరాజు మనస్సుని ప్రతిబింబించేలా ఉండాలి. ఆ సినిమాకి నాయకుడు ఆయన గనక.మల్లుదొరో..గంటందొరో పాడే సందర్భం కాదది. తెలుగు మన్యం అది. వాళ్ళలో వాళ్ళేం మాట్లాడుకున్నా మైదానప్ప్రాంతపు నాయకులతో ఆ గిరిజనులు వాళ్ళ యాసలోనే కావచ్చుగాక కానీ తెలుగులోనే మాట్లాడాలి.

    యుధ్ధంలో తొడగొట్టే ఉద్రేకం అవసరం గనక అలాంటి భావనకి అవకాశం ఉంటే అది సహజమే!! పాట రాసిన శ్రీశ్రీ, పాట పాడిన ఘంటశాల, ఆ సినిమా తీసిన ఘట్టమనేని కృష్ణ, ఆ సినిమాని చూసిన కోట్లాది ప్రజ ఇందరూ తెలుగువాళ్ళు. ఆ సినిమాకి రావాల్సిన డబ్బులు తెలుగు వారినించి. అది తెలుగువారి ఆవేశాల దర్పణం గా ఉండటమే సబబు అని వాళ్ళకందరికీ స్పష్టత ఉంది. మరి మీరు మీ ఉతకడంలో భాగంగా ఇన్నింటినీ మరిచి బాదుడు బాదుతానంటే ఎలా??
    రమ.

  4. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    02/08/2010 9:47 am

    ఏక వచన బహు వచనాలే కాదు, అర్ధాలలో కూడా పొంతన లేని పాట ఇది.. యుద్ధానికి ప్రేరేపించే పాటలకి అర్ధంలో పొందిక వొద్దిక వుండనక్కర లేదనుకుంటేనో లేక పోతే ఏదో పెద్దాయన రాసుకున్నాడులే అని సరిపెట్టుకుంటేనో తప్ప, ఈ పాట వినడానికి నిజానికి చాలా చికాకు కలిగిస్తుంది.

    శ్రుంఖలాలలో వున్న మనిషి ఎవడయినా తొడలు కొట్ట గలుగుతాదా ? చురకత్తులు చేత పట్టి దాడి చేసే మనిషి ప్రవృత్తి తొడలు కొట్టి సవాలు చేసేదిగా వుంటుందా ?

    అన్నిటికీ మించి ఈ పాట అటు తెలుగు సంస్కృతికీ ఇటు మన్నే ప్రాంత సంస్కృతికీ జనరంజకమైన కట్టుకధ ద్వారా అన్యాయం చేస్తుంది. అల్లూరి సీతా రామరాజు చేసింది మన్నెం పితూరీ. మన్నే ప్రాంత ప్రజలలో తాము తెలుగు వారిమన్న స్పృహ , ఇప్పటికీ వుండదు. 1920 వ దశకంలో వుండే దన్న అబద్ధం సినిమా చెప్తే, దానికి ఒక మార్చింగ్ సాంగు కవి రాయవలసి వచ్చింది. పైగా అందులోకి మనకి అర్ధం కానీ భాషలో రాసిన పాట అని మనకి మనం నచ్చ జెప్పుకుని వింటే ఒక మాదిరిగా రిపబ్లిక్ డే రోజు పేరేడు లో ఎన్ సి సి కుర్రాళ్ళ బాండ్ లాగా బాగానే వుంటుంది. యదాలాపంగా వింటే వొళ్ళు గగుర్పొడుస్తుంది కూడానూ.

  5. పాఠకులకు సూచనలు గురించి Pavankumar Krovvidi గారి అభిప్రాయం:

    02/07/2010 2:43 am

    అమెరికాలో ఇతరత్రా దేశాల్లో మన వాళ్ళు ఈ రకమైన తెలుగోష్ఠి చెయ్యడము చాలా ఆహ్లాదకరమైన విషయము.

  6. తెలుగు వీర లేవరా గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    02/06/2010 4:29 pm

    సేకరణ శ్లాఘనీయం. ఒక చిన్న అప్రస్తుత విషయం,.
    ప్రతి మనిషీ తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి, చురకత్తులు పదును బెట్టి, తుది సమరం మొదలు బెట్టీ, సింహాలై గర్జించాలీ……..”
    ప్రతి మనిషీ – సింహాలై”; ఏక వచనానికీ, బహు వచనానికీ పొత్తు కుదరలేదు కదా! ఇన్నాళ్ల తరవాత ఈ మధ్యే ఏదో బ్లాగులో చదివేను. మహాకవి మహా కవే.

  7. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Lokeshwar గారి అభిప్రాయం:

    02/06/2010 8:01 am

    మనుచరిత్ర తెలుగులొ వచన రూపము లొ వుంటే బాగుండును.

  8. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి PARANKUSHAM SRINIVASA SWAMY గారి అభిప్రాయం:

    02/04/2010 7:12 am

    కథ చాలా బాగుంది. ఎంతో శృంగారంగా వుంది. ఎన్నిమలుపులో.. కథలో కథ.

  9. తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి గురించి Geddapu Lakshmi Prasad గారి అభిప్రాయం:

    01/31/2010 12:25 pm

    సోదాహరణంగా మౌలిక కవితా లక్షణాలను వివరించడమే కాకుండా, ప్రక్రియా భిన్నత్వం లో లక్షణాపరమైన ఏకత్వం ఉంటుందని ఆ లక్షణాలను పాటించడం వల్లే ఏ రచనైనా కవితా స్థాయిని పొందగలుగుతుందని చాలా చక్కగా విశ్లేషించారు. ఆధునిక కవితలు వ్రాయడానికి, ప్రాచీన కవితా “స్పృహ” (కనీసం) అక్కరలేదనీ, పద పరిజ్ఙానం అవసరం లేదని, భావించే నేటి వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని నిలవాలని నా ఆకాంక్ష!

  10. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    01/31/2010 4:42 am

    జీవితంలో అనుకోకుండా ఎదురయిన విరామం.

    పనీ పాటా లేకుండా కూర్చోవలసి రావటంతో తెలుగు సాహిత్యంలో ఏం జరుగుతోందో తెలుసుకో వాలని కుతూహలం పుట్టుకొచ్చింది. ఎక్కడో వీపుమీద చీమ పాకినట్టు మొదలయి, జరజరా పాకి మాడులోకి అంటుకుంది.

    తెలుగులో రెండు రకాల పత్రికలు వున్నాయి. సౌలభ్యం కోసం వాటిని గబ్బు పత్రికలు, వెబ్బు పత్రికలుగా వర్గీకరించుకోవచ్చును. గబ్బు పత్రికలు మళ్ళీ రెండు రకాలు. సమస్త జ్ఞాన రంధ్రాలనీ మూసుకుంటే తప్ప భరించ లేనివి కొన్ని. ముక్కు వొక్కటీ మూసుకుంటే చడవగలగినవి మరి కొన్ని. ఈ రెండో రకం పత్రికలలో మురుగుతో పాటు అడపా దడపా బంగారమ్ముక్కలు కూడా కొట్టుక వస్తవి. వాటిని జల్లెడ పట్టి ఏడాదికో రెండేళ్ళకో ఎవరో వొకరు సంకలనాలు ప్రచురిస్తూ వుంటారు. అటువంటి సాహిత్య కార్మికులకి మన సమాజంలో తగిన గుర్తింపు లేదు.

    వెబ్బు పత్రికలు గబ్బు పత్రికల చావుకి వచ్చాయా అన్నది పై వ్యాసమూ దాని మీద చర్చకూ మూలాంశము. దీనివలన తెలుగు సాహిత్యానికి ఏదో మేలు జరుగుతుందని నమ్మటానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదేంటో నాకు సరిగా తెలియక పోవటం వలన ఆ విషయాన్ని విజ్ఞులకే వదిలేస్తాను.
    వెబ్ పత్రికల వలన ప్రచురణా సంస్కృతులలో రాగల పరిణామాలు, వాటిని ఎట్లా ప్రయోజనకరంగా దిద్దుకోవచ్చును అన్న విషయం ఎవరూ ప్రస్తావించలేదు. (రమా భరద్వాజ్ గారూ – ఇది వుతుకుడు కాదు).

    1. ప్రచురణ అన్నది ఒక కాల చక్రానికి లోబడి వుంటుంది. టెక్నాలజిలో మార్పుల వలన ఆ కాల చక్రం మారిపోతుంది. పాఠకుల అభిప్రాయాలు వెంట వెంటనే ప్రచురితమవుతాయి. పేజీల పరిమితి వుండదు. మధ్యలో పోస్ట్ ఆఫీసు ప్రమేయం వుండదు కాబట్టి రచయితల కృషి ఫలం కూడా సంపాదకులకీ , విమర్శకులకీ, ఆపైన పాఠకులకీ తొందరగా అందుతుంది.

    2. వెబ్బు పత్రికలు అందరికీ అందుబాటులో వుండవు. పుస్తకం చేతిలో పట్టుకుని , పక్క మీద బోర్లా పడుకునో, దిండుమీద చేరబడో, వరండా లోనో బాల్కనీలోనో బస్సులోనో చదువుకునే వెసులుబాటు వుండదు. (నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న కొనుకున్నవో, లైబ్రరీ నుంచి తెచ్చుకున్నవో పుస్తకాలు ఎవరూ చూడకుండా మంచం కింద దూరి చదువుకొనే అవకాశం లేక పోయి వుంటే నేను ఎంత అజ్ఞానిని అయివుందునో తలచుకుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది).

    ఈ రెండు విషయాలనే తీసుకున్నా వెబ్బు పత్రికలు తెలుగు సాహిత్యంలో వొక ప్రయోజనకరమైన దిశా నిర్దేశం చెయ్యగాలవని ఆశించవచ్చు. గబ్బు పత్రికలలో ప్రచురించబడటానికి ప్రస్తుతం తెలుగులో సాహిత్య కృషికన్న ఎక్కువగా సంపాదకులతో, విమర్శకులతో, వునికివాద రాజకీయ సంఘాలతో, ఎన్.జి. వో. లతో, ఒక్క మాటలో చెప్పాలంటే నానా రకాల మఠాలతో, ముఠాలతో, పీఠాలతో సంబంధాలు ఏర్పరచుకోవాల్సి వస్తోంది.

    ఈ విష సంస్కృతిలో నిలదొక్కుకోవాలంటే , రచయిత (త్రు) లు అసాధారణమైన ప్రజ్ఞావంతులు, అసామాన్యమైన నైతిక స్థైర్యం కలిగి వున్న వాళ్ళూ, దార్శనికులూ అయి వుండాలి. కొత్త తరం సాహిత్య కర్షకులపైన ఇంత భారం మోపటం భావ్యం కాదు. అందుకే వెబ్బు పత్రికలు – అనుకోకుండా, మన చేతిలో పడ్డ కొబ్బరి కాయలుగా భావించి, కోతి సాయంగా కొత్త వారధులు కట్టడానికి శ్రమించడం మంచిది.

    చాకిరేవు ఉపేంద్ర

    పి.ఎస్.
    కొబ్బరి కాయనించి వారధికి ఎట్లా వచ్చానని ఎవరూ అడగరు అనే నమ్మకం, పొగరు బోతు తనం నాకు రావటానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో వచ్చిన తలా తోకా లేని అనేకానేక తెలుగు రచనలే అని గమనించగలరు.

« 1 ... 1183 1184 1185 1186 1187 ... 1582 »