ఉపేంద్రగారూ!! మీ అభిప్రాయం మరికొంచెం క్లుప్తం గానూ..సరళమైన వాక్యాలతోనూ ఉండిఉంటే ఎక్కువ బాగుండేదనుకుంటున్నాను. మీరు వేసిన ప్రశ్నల ననువర్తిస్తూ కనీసం ఒకటి రెండు కధలని పేర్కొని [ప్రవాసాంధ్రులవే కానఖ్ఖరలేదు..ఇటీవలి తెలుగు కధలైనా గానీ..మీ అభిప్రాయాలకి బలాన్నిచ్చేవిధంగా ] ఉంటే మరింతవీలుగా ఉండి ఉండేది కూడా!!
పొగాకు వ్యాపారస్తుల మిగులుధనం[ surplus economy] మీడియాలో చేరి చేసిన నష్టం ఎలాంటిదో మనకి కధలు వచ్చాయా? అసలు సినిమాని నేపధ్యంగా చేసుకుని రాసినవి. ముళ్ళపూడి వెంకట రమణ, రావి కొండలరావు, ప్రసన్న కుమార్ సర్రాజు వంటి వాళ్ళు రాసిన కధలు ఉన్నా ఈ కోణం అందులో లేదనుకుంటాను. ఈ మధ్య సినిమా పెట్టుబడిలోని విధ్వంసాన్ని గురించి కూడా వచ్చిన కధలు అరుదే!!
బయటి దేశాలకి పిల్లలు వెళ్తూ అక్కడినించి రాకపోకలు తగ్గి క్రమేణా కుటుంబ సంబంధాల్లో వస్తున్న ఒంటరితనాల మీద కధలు బాగానే వచ్చినట్టున్నాయి, కానీ చప్పున అందులోంచి గుర్తుపెట్టుకోగల కధ ఏమన్నా ఉందా అంటే మాత్రం జవాబు కన్పించడంలేదు. తెలుగుదేశాన “కధ” ఇంకా గ్రామీణ వాతావరణమ్ లోంచి వస్తున్న వైనమ్ మనమ్ గుర్తించవచ్చు. ఒక మూసధోరణి లో కధలు ఉండటం ..కధానిర్మాణలో గానీ..శైలీ సంవిధానంలోగానీ చెప్పుకోతగ్గ కధ రాకపోవడమూ కూడా ఉంది. మీరు చెప్పినట్టూ ” ఉద్యమాల” ప్రభావం ఈనాటికీ తెలుగు కధ మీద బలంగానే ఉంది. సిధ్ధాంతాలు సృజనమీద యధాతధంగా వ్యక్తీకరణలోకి చొచ్చుకురాకూడదని తెలుగులో కధలు రాసే వాళ్ళు ఇంకా నమ్ముతున్నట్టు కనబడదు. అది ఒక బలమైన కారణమే తెలుగు కధలో పస చావడానికి.
ఇంక ప్రవాసాంధ్ర కధ విషయానికి వచ్చినాకూడా జీవితలో ఉన్న సంక్లిష్టత కధనలోకి రాగా నేను చూడలేదు. అందుకు కధకుల ఊహాలేమిని నెపమ్పెట్టక తప్పదు. కధరాసే వాళ్ళు ఏ పాఠకుల కోసం రాస్తున్నారూ..ఏం చెప్పాలని రాస్తున్నారూ అన్నది కూడా అంతే ముఖ్యం. కాళీపట్నమ్ రామారావుగారు “యజ్నం” లో ఆర్ధిక సంబంధాలు మనిషి జీవితాన్ని ఎంతగా విధ్వంసమ్ చేసిందీ గాఢంగా చెప్పారు. ఆ కధని మరిచిపోలేకపోవడమ్ అందువల్లనే! అలాంటి గాఢత ఉన్న కధలు అటు తర్వాతి కాలంలో అస్సలు లేవని కాదు కానీ సంఖ్యలో తక్కువ.
కన్నడిగుడైన రాజారావు తన ప్రపంచానుభవాన్ని వ్యక్తీకరించిన వైనం డయాస్పోరా సృజనకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జీవితాన్ని ఆయన చూసిన తీరూ..దాన్ని తన నవలల్లో చూపించినతీరూ గొప్పగా ఉంటాయి. వాళ్ళకి పేరు ఊరికే రాలేదు. అలాగే ఎ.కె.రామానుజన్ కూడా! అలాగ తెలుగులో ఎవరూ ఇవాళ్టిదాకా అమెరికానించి గానీ..లేదా ఇతర యూరోప్ దేశాలనించిగానీ మనకి కన్పించడలేదు. ఒక్క విమర్శలో మాత్రం వెల్చేరు నారాయణరావు చెప్పుకోతగ్గ కృషిచేసారు.
ఏతావాతా చెప్పేదేమంటే రాస్తున్నవాళ్ళు ఆ ప్రక్రియకి తగినవాళ్ళు కాకపోవడమో..లేదా రాయతగిన వాళ్ళు ఇంకా ఈ ప్రక్రియ వైపు చూపుతిప్పక పోవడమో జరుగుతున్నట్టు అర్ధమ్ చేసుకోవచ్చు. ఎవరెంత చెప్పుకున్నా ఒక ఇతివృత్తమ్ మీద పట్టూ ..దాని నిర్మాణపు విషయంలో సామర్ధ్యం రెండూ పుష్కలంగా లేనిదే కధలు పుట్టవు. అందువలన మీడియోకర్ రచనలే వస్తాయి. వాటిని పెద్దగా పాఠకులు గుర్తించరు. ఎన్ని సంకలనాలు రానీ గాక ఫలితమ్ ఒకటే! బహుశా ఉత్తరోత్తరా తరువాతి తరాల్లో ఇంకెవరైనా కాల్పనిక సాహిత్యం పట్ల నిజంగా శ్రధ్ధ కలిగిన వారు మంచి సృజన కల్గిన వారూ ఇందులోకి అడుగిడితే తప్ప.
రమ.
వరలక్ష్మి గారు అద్భుతమైన గాయని. “రాజట రాజ ధర్మమట” అనే పద్యం “లవకుశ” సినిమాలో ఆమె పాడుతున్నప్పుడు, ఆమె చేతి లోంచి త్రిశూలం లాక్కుని, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాలంత కోపం వచ్చేది. 🙂
మొన్నామధ్య ఆమె పాడిన పాట ఏదో విన్నాను. “నమో పార్వతీ వల్లభా దీనబంధూ” అన్న ముక్కలు గుర్తున్నాయి. ఘంటశాల గారితో కలిసి పాడినట్టు గుర్తు. ఆ పాటలో వరలక్ష్మి గారు ఒక చోట వత్తు పాడనట్టూ, ఇంకో చోట ఇంకేదో తప్పుగా వున్నట్టూ గుర్తు. ఎవరైనా ఈ పాటకి ఇంటరునెట్టులో లింకు ఇచ్చేటట్టయితే, మళ్ళీ ఆ పాట విని, ఆ రెండు విషయాలూ స్పష్టంగా చెప్పగలను. ఇదంత గొప్ప తప్పేమీ కాదు. విషయం తెలియడానికి మాత్రమే చెబుతున్నాను. నా మీద విరుచుకు పడకండి. నేనూ ఆవిడ అభిమానినే. 🙂
తెలుగు సాహిత్య చరిత్రలొ అంగాంగవర్ణన ఆనందించగలిగిన తరం నవలాసాహిత్యంలొ స్త్రీ అంతరంగ ప్రతిధ్వనిని విచ్చలవిడి తనంగా చలం రచించాడని వెలివేసినా నిలద్రొక్కుకోవడానికికారణం శ్రోత్రియజీవిత స్త్రీ వ్యవస్థకు హెచ్చరికగా పరిగణించి చాటుగా చదివినతరం క్రొత్త ఆలోచనలలో చలాన్ని సజీవంగా నిలుపుకోవడమువల్లనెఅన్నది వాస్తవము. అ సజీవ వాణిని భద్రపరిచి రజనిమాట ఆకాశఃవాణి ఈమాటగ అభినందనలకు అందనిది.
ఈ సంకలనాన్ని నేను ఇప్పట్లో చదివే అవకాశం లేదు. నేను ఈ క్రింద రాసినది కేవలం ఈ సమీక్షా వ్యాసానికి స్పందన మాత్రమే. అది కూడా, బ్లాక్ అట్లాంటిక్ , తెలుగు డయా స్పోరా, హెమింగ్వే మూడూ ఒకే వ్యాసంలో చోటుచేసుకోవటం ముచ్చటగా అనిపించినందు వల్లనే.
వెబ్ పత్రికల్లో స్థలాభావం అన్న సమస్య వుండదు కాబట్టి వెంకటేశ్వరరావు గారు కొంచెం వివరంగా చెప్పి వుండవలసిన ది . బ్లాక్ అట్లాంటిక్ పుస్తకం , ‘దేశము’ అనే భౌగోళిక ఎల్లలను దాటే జీవితానుభవాలలో ( బానిస వ్యాపారాల ద్వారా నయితేనేమి, బానిసత్వాన్నించి బయట పడటంలో నయితేనేమి), నల్లజాతీయులు పడిన ఘర్షణలో చైతన్యపు పొరలు ఎట్లా ఏర్పడ్డాయి అన్నది తవ్వి తీసే పుస్తకం. జాతి, దేశము ఈ రెండూ కూడా చరిత్ర గమనములో ఏర్పడిన శిలాజాలే తప్ప వాటికి కాలాతీతమైన వునికి ఏమీ వుండదు అన్న జ్ఞానం , బ్లాక్ అట్లాంటిక్ పుస్తకానికి వుపోద్ఘాతంగా చెప్పుకోవచ్చును. అక్కడినించి ఎత్తుకుని, పాల్ గిల్రాయ్ ఈ నల్లజాతి చైతన్యపు పార్శ్వాలను తడుముకుంటూ దాని రూపు రేఖాలను పునర్నిర్మిస్తాడు. ఇక్కడ ‘పునర్నిర్మిస్తాడు’ అన్న మాట కావాలని వాడుతున్నదే. సాంస్కృతిక విమర్శ అయినా సాహిత్య సృష్టి అయినా మనిషి చైతన్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలే — ఒక్కొక్క సారి అవి విజయవంతంగా, అందరికీ పనికొచ్చేలా జరిగితే, ఒక్కొక్క సారి ప్రయత్నం కూడా చేయకుండా విఫలమైపోతాయి.
పాల్ గిల్రాయ్ రాసిన బ్లాక్ అట్లాంటిక్ పుస్తకాన్ని కానీ, హెమింగ్వే కధల్లోనూ, జర్నలిస్టుగా నూ ఆవిష్కరించిన సత్యాలను కానీ, మనకి పనికొచ్చేలా అన్వయించుకోవాలంటే, ప్రయత్న పూర్వకంగా మనం చేయాల్సిన పని చాలా వుంది. వేంకటేశ్వర రావు గారు, చూచాయగా చెప్పి వదిలేసిన విషయాన్నే తీసుకుందాము. తెలుగు వారు అమెరికాలో వుంటున్నా ఆంధ్రలో వుంటున్నట్టే ఎందుకు కనపడతారు ? ఇది తెలుగు వారో, వారి తరఫున , తెలుగు కథలూ కవిత్వమూ రాసే వారో తమ ధోరణి కొంచెం మార్చుకుంటే మారిపోతుందా ? తెలుగు లో అమెరికా లో వస్తున్న కథలూ, ఆంధ్ర ప్రదేశ్ లో వస్తున్న కథలూ ఒకేలా వుండటానికి కారణం కేవలం వూహా శక్తి లోపించటమే మరేమైనా వుందా ?
ఇలాటి ప్రశ్నలకు తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎప్పుడూ ఎలావచ్చిందో అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును. ఈ తెలుగు జాతి అన్న శిలాజంలో జిల్లాల వారీగా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ యే సంఘర్షణల చిహ్నాలు కనిపిస్తాయి అన్నది కూడా ఆలోచించ వలసిన విషయమే. వేంకటేశ్వర రావు గారు సూచించిన కాల పరిధి లో ఆంధ్ర ప్రదేశ్ లో సాంఘిక జీవనంలో చాలా పెద్ద ఎత్తున తుఫానులు వచ్చాయి. నాగార్జున సాగర్ కట్టడంతో – గుంటూరు జిల్లా గుర్తు పట్ట రానంతగా మారిపోయింది.
కొద్ది రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా జంగా రెడ్డి గూడెం నించి, మద్రాసు పాండీ బజారు వరకూ, గుంటూరు జిల్లా పిడుగు రాళ్లనించి హైదరాబాదు శివార్లలో ఈ మేడ్చల్, హైదరాబాదులోనే ఏ యెస్ రావు నగర్ నించి యెల్బీ నగర్ వరకూ ఇటు తిరిగి ఇటు తిరిగీ అమీర్ పేట నించి డెట్రాయిట్ వరకూ ఈ మార్పుల తాలూకా ప్రభావం కనిపిస్తుంది.(ఇక్కడ శిలాజం అన్న మాట ఇంగ్లీషులో ఫాసిల్ అన్న మాటకి తత్సమంగా వాడుతున్నట్లు అనిపించొచ్చు. సామాజిక రూపాలు పూర్తిగా ఫాసిల్స్ గా ఎప్పుడూ వుండవు. పొలం గట్ల లాగా అవి నీరు పారటానికి మార్గాలు చూపించినా ఎప్పటికప్పుడు ప్రయత్న పూర్వకంగానో అప్రయత్నంగానో మారుతూనే వుంటాయి. )
అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవన చరిత్ర వేంకటేశ్వర రావు గారు చెప్పినట్లు – అంతా కలిపి నలభై ఏళ్లు కూడా వుండదు. అమెరికాలో పంజాబీల చరిత్ర దాదాపు వంద సంవత్సరాలుంటుంది. అమెరికాలో గుజరాతీల రోజు వారీ జీవితం , వ్యాపార రంగం ద్వారా అమెరికన్ నాగరికుల రోజు వారీ జీవితంతో కలిసి వుంటుంది. బెంగాలీల సాంస్కృతిక జీవనం – అమెరికన్ యూనివర్సిటీల మేధోత్పాదనలో — ప్రత్యేకించి – లిటరేచర్ , హిస్టరీ , ఇలాటి డిపార్టుమెంట్లలో పెద్ద పాత్ర వహిస్తుంది. ఈ భాషలు మాట్లాడే వాళ్లంతా ఈయీ పనులే చేస్తుంటారని కాదు కానీ, వారి చైతన్యంలో ఈ అనుభవాల ప్రభావం చాలానే వుంటుంది. వేంకటేశ్వర రావు గారు సూచించినట్లు – అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవనంలో ఆఫీసుల్లో , ప్రత్యేకించి ఐటి రంగంలో పనులు చేసుకోవటం, గ్రీన్ కార్డు సంపాదించుకోవటం, కట్నం మాట్లాడుకోవడం , పెళ్లిళ్లు చేసుకోవడం, హైదరాబాదులాంటి చోట ఇల్లో స్థలమో కొనుక్కోవడం, తెల్ల అమెరికన్ సబర్బన్ లైఫ్ లో ఒక చిన్న చోటు వెతుక్కోవటం, ఇలాటివి చాలా ముఖ్యమైన ఘట్టాలు. ఇక్కడా అక్కడా కూడా నగర జీవితంతో సంబంధం లేకుండా , పెళ్లిళ్లూ కట్నాల ద్వారానో , వ్యవసాయమూ – దాన్ని అంటుకునుని వుండే ఇతర రంగాలనుండి కుటుంబాలు మిగుల్చుకున్న డబ్బులతోనో – తల్లి తండ్రులు గుట్టు గా సర్కారీ వుద్యోగాలు చేసుకుని మిగుల్చుకున్న డబ్బులతోనో, అమెరికాకి పోవటం అన్నది సర్వత్రా జరిగింది.
హైదరాబాదు లో ఏదో కొన్నేళ్ళు వుండి , అక్కడ కొంత ఆధారం సంపాదించుకున్నాకూడా, ఇలాటి ప్రవాసులలో ఎవరూ కూడా – తమ చుట్టూ కమ్ముకు వస్తున్న పెను మార్పులని గమనించేటంత వోపిక వున్న వాళ్ళు కాదు. అమెరికా దాకా ఎందుకు – గ్రామం వదిలి, చిన్న పట్టణం, చిన్న పట్టణం వదిలి హైదరాబాదు నగరం , హైదరాబాదు నగరం నించి అమెరికాకో, యూరప్ కో ఎగిరి వెళ్ళటం — ఈ క్రమంలో కూడా ఎక్కడా కూడా కొంచెం వూపిరి పీల్చుకుని, తమ చుట్టూ ఏమీ జరుగుతోందో తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ముందు పరిస్థితి ఇంత ఇరుకుగా వుండేది కాదనుకుంటాను. తెనాలి లో వున్నా, విజయవాడలో వున్నా, వరంగల్లు లోనో , హైదరాబాదులోనో వున్నా తమ చుట్టూతా ఏమి జరుగుతోందో తెలుసుకోక తప్పేది కాదు. బతుకు తెరువుకోసమే అయినా బొంబాయికో, మద్రాసుకో వెళ్ళే వాళ్ళు. ఆ వెళ్లిన అనుభవానికి కేవలం వ్యక్తిగత పరిధిలో కాకుండా పెద్ద కాన్వాసులో భాష్యం చెప్పుకునే వాళ్ళు.
ఎమెర్జెన్సీ తరవాత – ప్రత్యేకించి, ఈనాడు పత్రిక బలంగా ఎదిగిన తర్వాత, తెలుగు దేశం పార్టీ ఉవ్వెత్తున వచ్చిన తర్వాత దేశ రాజకీయాలలో తెలుగు సాంఘిక జీవనమూ, ఆంధ్ర ప్రదేశ్ లో కుటుంబ జీవనమూ పూర్తిగా అంతర్ముఖమైపోయినాయి. జీవితాన్ని , సాహిత్యాన్ని అనుభవించడం కాకుండా వినిమయం చేసుకోవటం పాతుకు పోయింది. సినిమాలు ఈ విషయంలో చాలా కృషి చేసాయనే చెప్పుకోవాలి. ( గుంటూరు జిల్లా వ్యవసాయపు మిగులు ధనం మద్రాసు వెళ్ళి పనికిమాలిన చెత్త ఎట్లా ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిందో – బాలగోపాల్ ఎక్కడో చాలా చక్కగా చెప్పినట్టు గుర్తు). తెలుగు మాట్లాడే వాళ్ళ జ్ఞానేంద్రియాలకి ఆవకాయకీ, ఆత్మకధకీ తేడా తెలియకుండా అయిపోయింది. ఒకే తూనిక రాయి — ఎంత మంది కొన్నారు, ఎంత మంది ఆమోదించారు, ఏ సెలెబ్రిటీ ఎండోర్స్ చేశారు – ఇదీ లెక్క.
అది జరుగుతుండగానే విప్లవ రాజకీయాల పట్ల ఏదో ఒక రోమాంటిక్ వూహాలుండటమూ , అలా మాకు వున్నాయని – అది లేని వాళ్ళందరూ ఉదారవాద మూర్ఖులో, వర్గ శత్రువులో అయి వుంటారని బూకరించటం లోనే సాహిత్య విమర్శకులకు తీరిక లేకుండా పోయింది. మొదట్లో విమర్శకులు చేసిన ఈ పనిని, తరవాత తరవాత రచయితలూ, రచయిత్రులూ, కవులూ, కవయిత్రులూ వాళ్ళని సమర్ధించే వాళ్లూ కూడా అలవాటు చేసేసుకున్నారు. ఇటువంటి సంస్కృతిలో ఎవరికీ దేని పట్లా జవాబు దారీ తనం వుండదు. కష్ట పడి పని నేర్చుకోవలసిన అవసరమూ వుండదు. బుకాయించటం, బూకరించటం వస్తే చాలు. మహా అయితే, తమ కులానికో, తమ వీధికో, తమ జిల్లాకో సంబంధించిన కొంత పనికి మాలిన జ్ఞానం సంపాదించుకుంటే చాలు.
బతకడానికి సరిపోయే దినుసులే ఇట్లా వుంటే ఇందులోంచి సాహిత్యం పుట్టించాలంటే దానికి కావలసిన పనిముట్లు ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వుంది. విమర్శకులు చేయ వలసిన పని అది.
తెలుగులో మంచి కధ ఎట్లా వుండాలి అని చెప్పే కన్నా, మనకు కనపడుతున్న సాహిత్యంలో ఏవి మంచి ధోరణులు — అన్నది చెప్పుకోవలసిన అవసరం వున్నది అని మాలతి గారు అడగటం సబబే. కానీ , దానికి సమాధానం ఇప్పుడు వస్తున్న తెలుగు కధల్లోనించే వెతుక్కో నవసరం లేదు. తెలుగు సాహిత్యం మొత్తం నించే కాక ఇతర భారతీయ భాషలనించో ప్రపంచ సాహిత్యంలో ఎక్కడినించో నయినా చూపించుకోవచ్చును. అసలు కధల వూసే ఎత్తకుండా తెలుగు వారి సంస్కృతులని నిర్మొహమాటంగా విమర్శించి చెప్పుకున్నా చాలు.
రోజు వారీ జీవితంలో లేని లోతుని పాఠకులకి అందు బాటులోకి తేవటం రచయిత చేయవలసిన పని. దానికి కావలసిన నైపుణ్యం షెల్ఫ్ మీద దొరకదు. తయారు చేసుకోవాలి. తెలుగు డయాస్పోరా రూపు రేఖలూ, దాని చైతన్యానికి ఆయువు పట్లూ ఇలాటి వాటి గురించి మాట్లాడుకోవటం ఆ దిశగా ఒక మంచి అడుగే. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. సమస్యకి మూలం ఎక్కడో స్థూలంగానానయినా గుర్తించ గలిగితే, ఆ తరువాత దానికి పరిష్కారాలు అందులోంచే దొరుకుతాయి.
మీ విశ్లేషణ మాధవ్ వ్యాసం కంటే బాగుంది. పరిశీలనలో ఎంత తేడా. మాధవ్ గారు తన స్కూలు అనుభవాలనుచి, లెక్కలమాష్టారు, తను వగైర చెప్తూ తనలోంచి సీతారామారావుని చూసారు. ఆయన వ్యాసం అసమగ్రంగా అనిపించింది. ఇక పాత్రతో పొంతనలేని ఉన్మాదస్థితి ఏమీలేదు. పాత్రకు తగినట్లుగా అంటూ, వాస్తవ స్థితికి దర్పణం అంటూ పోతే రచయిత స్వేచ్చని హరించినట్లే అవుతుంది.
శ్రీనివాస్
బలే ఉంది. నాదమ్మొక్కటి పిక్కటిల్లె దిశలన్ నవ్యామృతావ్యాహతాస్వాదమై.. షట్పదీ నాదమో.. కలకంఠనాదమో… వివరింపగా రాదు.. పరమానందానుసంధానమై.. ( పెద్దన).. ఇంత హడావుడి లేకుండా ఓసారి పై పాటలు వింటే చాలు.. పై పద్యం లో చివరి రెండు ముక్కల తో సరిపెట్టుకోచ్చు.
బాలరాజు లో “వరుణా” అన్న పాట కూడా బలె ఉంటుంది ఎవరినే తో పాటు. వీలుంటే దయచేయించండి.
రమానాథ్
తెలుగు డయాస్పోరా: సాహిత్యం, సంస్కృతి గురించి aksharamohanam గారి అభిప్రాయం:
03/06/2010 1:39 am
అఫ్సర్ విషయాన్ని చాల సమగ్రంగా వివరించారు.
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/06/2010 1:03 am
ఉపేంద్రగారూ!! మీ అభిప్రాయం మరికొంచెం క్లుప్తం గానూ..సరళమైన వాక్యాలతోనూ ఉండిఉంటే ఎక్కువ బాగుండేదనుకుంటున్నాను. మీరు వేసిన ప్రశ్నల ననువర్తిస్తూ కనీసం ఒకటి రెండు కధలని పేర్కొని [ప్రవాసాంధ్రులవే కానఖ్ఖరలేదు..ఇటీవలి తెలుగు కధలైనా గానీ..మీ అభిప్రాయాలకి బలాన్నిచ్చేవిధంగా ] ఉంటే మరింతవీలుగా ఉండి ఉండేది కూడా!!
పొగాకు వ్యాపారస్తుల మిగులుధనం[ surplus economy] మీడియాలో చేరి చేసిన నష్టం ఎలాంటిదో మనకి కధలు వచ్చాయా? అసలు సినిమాని నేపధ్యంగా చేసుకుని రాసినవి. ముళ్ళపూడి వెంకట రమణ, రావి కొండలరావు, ప్రసన్న కుమార్ సర్రాజు వంటి వాళ్ళు రాసిన కధలు ఉన్నా ఈ కోణం అందులో లేదనుకుంటాను. ఈ మధ్య సినిమా పెట్టుబడిలోని విధ్వంసాన్ని గురించి కూడా వచ్చిన కధలు అరుదే!!
బయటి దేశాలకి పిల్లలు వెళ్తూ అక్కడినించి రాకపోకలు తగ్గి క్రమేణా కుటుంబ సంబంధాల్లో వస్తున్న ఒంటరితనాల మీద కధలు బాగానే వచ్చినట్టున్నాయి, కానీ చప్పున అందులోంచి గుర్తుపెట్టుకోగల కధ ఏమన్నా ఉందా అంటే మాత్రం జవాబు కన్పించడంలేదు. తెలుగుదేశాన “కధ” ఇంకా గ్రామీణ వాతావరణమ్ లోంచి వస్తున్న వైనమ్ మనమ్ గుర్తించవచ్చు. ఒక మూసధోరణి లో కధలు ఉండటం ..కధానిర్మాణలో గానీ..శైలీ సంవిధానంలోగానీ చెప్పుకోతగ్గ కధ రాకపోవడమూ కూడా ఉంది. మీరు చెప్పినట్టూ ” ఉద్యమాల” ప్రభావం ఈనాటికీ తెలుగు కధ మీద బలంగానే ఉంది. సిధ్ధాంతాలు సృజనమీద యధాతధంగా వ్యక్తీకరణలోకి చొచ్చుకురాకూడదని తెలుగులో కధలు రాసే వాళ్ళు ఇంకా నమ్ముతున్నట్టు కనబడదు. అది ఒక బలమైన కారణమే తెలుగు కధలో పస చావడానికి.
ఇంక ప్రవాసాంధ్ర కధ విషయానికి వచ్చినాకూడా జీవితలో ఉన్న సంక్లిష్టత కధనలోకి రాగా నేను చూడలేదు. అందుకు కధకుల ఊహాలేమిని నెపమ్పెట్టక తప్పదు. కధరాసే వాళ్ళు ఏ పాఠకుల కోసం రాస్తున్నారూ..ఏం చెప్పాలని రాస్తున్నారూ అన్నది కూడా అంతే ముఖ్యం. కాళీపట్నమ్ రామారావుగారు “యజ్నం” లో ఆర్ధిక సంబంధాలు మనిషి జీవితాన్ని ఎంతగా విధ్వంసమ్ చేసిందీ గాఢంగా చెప్పారు. ఆ కధని మరిచిపోలేకపోవడమ్ అందువల్లనే! అలాంటి గాఢత ఉన్న కధలు అటు తర్వాతి కాలంలో అస్సలు లేవని కాదు కానీ సంఖ్యలో తక్కువ.
కన్నడిగుడైన రాజారావు తన ప్రపంచానుభవాన్ని వ్యక్తీకరించిన వైనం డయాస్పోరా సృజనకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జీవితాన్ని ఆయన చూసిన తీరూ..దాన్ని తన నవలల్లో చూపించినతీరూ గొప్పగా ఉంటాయి. వాళ్ళకి పేరు ఊరికే రాలేదు. అలాగే ఎ.కె.రామానుజన్ కూడా! అలాగ తెలుగులో ఎవరూ ఇవాళ్టిదాకా అమెరికానించి గానీ..లేదా ఇతర యూరోప్ దేశాలనించిగానీ మనకి కన్పించడలేదు. ఒక్క విమర్శలో మాత్రం వెల్చేరు నారాయణరావు చెప్పుకోతగ్గ కృషిచేసారు.
ఏతావాతా చెప్పేదేమంటే రాస్తున్నవాళ్ళు ఆ ప్రక్రియకి తగినవాళ్ళు కాకపోవడమో..లేదా రాయతగిన వాళ్ళు ఇంకా ఈ ప్రక్రియ వైపు చూపుతిప్పక పోవడమో జరుగుతున్నట్టు అర్ధమ్ చేసుకోవచ్చు. ఎవరెంత చెప్పుకున్నా ఒక ఇతివృత్తమ్ మీద పట్టూ ..దాని నిర్మాణపు విషయంలో సామర్ధ్యం రెండూ పుష్కలంగా లేనిదే కధలు పుట్టవు. అందువలన మీడియోకర్ రచనలే వస్తాయి. వాటిని పెద్దగా పాఠకులు గుర్తించరు. ఎన్ని సంకలనాలు రానీ గాక ఫలితమ్ ఒకటే! బహుశా ఉత్తరోత్తరా తరువాతి తరాల్లో ఇంకెవరైనా కాల్పనిక సాహిత్యం పట్ల నిజంగా శ్రధ్ధ కలిగిన వారు మంచి సృజన కల్గిన వారూ ఇందులోకి అడుగిడితే తప్ప.
రమ.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి భూషణ్ గారి అభిప్రాయం:
03/05/2010 12:56 pm
వరలక్ష్మి గారు అద్భుతమైన గాయని. “రాజట రాజ ధర్మమట” అనే పద్యం “లవకుశ” సినిమాలో ఆమె పాడుతున్నప్పుడు, ఆమె చేతి లోంచి త్రిశూలం లాక్కుని, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాలంత కోపం వచ్చేది. 🙂
మొన్నామధ్య ఆమె పాడిన పాట ఏదో విన్నాను. “నమో పార్వతీ వల్లభా దీనబంధూ” అన్న ముక్కలు గుర్తున్నాయి. ఘంటశాల గారితో కలిసి పాడినట్టు గుర్తు. ఆ పాటలో వరలక్ష్మి గారు ఒక చోట వత్తు పాడనట్టూ, ఇంకో చోట ఇంకేదో తప్పుగా వున్నట్టూ గుర్తు. ఎవరైనా ఈ పాటకి ఇంటరునెట్టులో లింకు ఇచ్చేటట్టయితే, మళ్ళీ ఆ పాట విని, ఆ రెండు విషయాలూ స్పష్టంగా చెప్పగలను. ఇదంత గొప్ప తప్పేమీ కాదు. విషయం తెలియడానికి మాత్రమే చెబుతున్నాను. నా మీద విరుచుకు పడకండి. నేనూ ఆవిడ అభిమానినే. 🙂
భూషణ్, హోసూర్
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి నిడదవోలు మాలతి గారి అభిప్రాయం:
03/05/2010 12:08 pm
ఔచ్. పొరపాటు. నేను వంగూరివారి బృహత్ గ్రంథం చూడలేదు. అమెరికాకి రాకముందే రచయితలయినవారు ఉన్నారనడం నా పొరపాటే. అంచేత, తత్సంబంధమయిన వాక్యం ఉపసంహరించుకుంటున్నాను.
నిడదవోలు మాలతి. .
.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి aksharamohanam గారి అభిప్రాయం:
03/05/2010 8:36 am
అద్బుతం మీ ప్రయత్నం. నెనరులు మీకు..
చలంతో రజని ముఖాముఖి గురించి DR.Jonnalgadda Markandeyulu గారి అభిప్రాయం:
03/05/2010 3:54 am
తెలుగు సాహిత్య చరిత్రలొ అంగాంగవర్ణన ఆనందించగలిగిన తరం నవలాసాహిత్యంలొ స్త్రీ అంతరంగ ప్రతిధ్వనిని విచ్చలవిడి తనంగా చలం రచించాడని వెలివేసినా నిలద్రొక్కుకోవడానికికారణం శ్రోత్రియజీవిత స్త్రీ వ్యవస్థకు హెచ్చరికగా పరిగణించి చాటుగా చదివినతరం క్రొత్త ఆలోచనలలో చలాన్ని సజీవంగా నిలుపుకోవడమువల్లనెఅన్నది వాస్తవము. అ సజీవ వాణిని భద్రపరిచి రజనిమాట ఆకాశఃవాణి ఈమాటగ అభినందనలకు అందనిది.
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
03/05/2010 2:26 am
ఈ సంకలనాన్ని నేను ఇప్పట్లో చదివే అవకాశం లేదు. నేను ఈ క్రింద రాసినది కేవలం ఈ సమీక్షా వ్యాసానికి స్పందన మాత్రమే. అది కూడా, బ్లాక్ అట్లాంటిక్ , తెలుగు డయా స్పోరా, హెమింగ్వే మూడూ ఒకే వ్యాసంలో చోటుచేసుకోవటం ముచ్చటగా అనిపించినందు వల్లనే.
వెబ్ పత్రికల్లో స్థలాభావం అన్న సమస్య వుండదు కాబట్టి వెంకటేశ్వరరావు గారు కొంచెం వివరంగా చెప్పి వుండవలసిన ది . బ్లాక్ అట్లాంటిక్ పుస్తకం , ‘దేశము’ అనే భౌగోళిక ఎల్లలను దాటే జీవితానుభవాలలో ( బానిస వ్యాపారాల ద్వారా నయితేనేమి, బానిసత్వాన్నించి బయట పడటంలో నయితేనేమి), నల్లజాతీయులు పడిన ఘర్షణలో చైతన్యపు పొరలు ఎట్లా ఏర్పడ్డాయి అన్నది తవ్వి తీసే పుస్తకం. జాతి, దేశము ఈ రెండూ కూడా చరిత్ర గమనములో ఏర్పడిన శిలాజాలే తప్ప వాటికి కాలాతీతమైన వునికి ఏమీ వుండదు అన్న జ్ఞానం , బ్లాక్ అట్లాంటిక్ పుస్తకానికి వుపోద్ఘాతంగా చెప్పుకోవచ్చును. అక్కడినించి ఎత్తుకుని, పాల్ గిల్రాయ్ ఈ నల్లజాతి చైతన్యపు పార్శ్వాలను తడుముకుంటూ దాని రూపు రేఖాలను పునర్నిర్మిస్తాడు. ఇక్కడ ‘పునర్నిర్మిస్తాడు’ అన్న మాట కావాలని వాడుతున్నదే. సాంస్కృతిక విమర్శ అయినా సాహిత్య సృష్టి అయినా మనిషి చైతన్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలే — ఒక్కొక్క సారి అవి విజయవంతంగా, అందరికీ పనికొచ్చేలా జరిగితే, ఒక్కొక్క సారి ప్రయత్నం కూడా చేయకుండా విఫలమైపోతాయి.
పాల్ గిల్రాయ్ రాసిన బ్లాక్ అట్లాంటిక్ పుస్తకాన్ని కానీ, హెమింగ్వే కధల్లోనూ, జర్నలిస్టుగా నూ ఆవిష్కరించిన సత్యాలను కానీ, మనకి పనికొచ్చేలా అన్వయించుకోవాలంటే, ప్రయత్న పూర్వకంగా మనం చేయాల్సిన పని చాలా వుంది. వేంకటేశ్వర రావు గారు, చూచాయగా చెప్పి వదిలేసిన విషయాన్నే తీసుకుందాము. తెలుగు వారు అమెరికాలో వుంటున్నా ఆంధ్రలో వుంటున్నట్టే ఎందుకు కనపడతారు ? ఇది తెలుగు వారో, వారి తరఫున , తెలుగు కథలూ కవిత్వమూ రాసే వారో తమ ధోరణి కొంచెం మార్చుకుంటే మారిపోతుందా ? తెలుగు లో అమెరికా లో వస్తున్న కథలూ, ఆంధ్ర ప్రదేశ్ లో వస్తున్న కథలూ ఒకేలా వుండటానికి కారణం కేవలం వూహా శక్తి లోపించటమే మరేమైనా వుందా ?
ఇలాటి ప్రశ్నలకు తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎప్పుడూ ఎలావచ్చిందో అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును. ఈ తెలుగు జాతి అన్న శిలాజంలో జిల్లాల వారీగా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ యే సంఘర్షణల చిహ్నాలు కనిపిస్తాయి అన్నది కూడా ఆలోచించ వలసిన విషయమే. వేంకటేశ్వర రావు గారు సూచించిన కాల పరిధి లో ఆంధ్ర ప్రదేశ్ లో సాంఘిక జీవనంలో చాలా పెద్ద ఎత్తున తుఫానులు వచ్చాయి. నాగార్జున సాగర్ కట్టడంతో – గుంటూరు జిల్లా గుర్తు పట్ట రానంతగా మారిపోయింది.
కొద్ది రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా జంగా రెడ్డి గూడెం నించి, మద్రాసు పాండీ బజారు వరకూ, గుంటూరు జిల్లా పిడుగు రాళ్లనించి హైదరాబాదు శివార్లలో ఈ మేడ్చల్, హైదరాబాదులోనే ఏ యెస్ రావు నగర్ నించి యెల్బీ నగర్ వరకూ ఇటు తిరిగి ఇటు తిరిగీ అమీర్ పేట నించి డెట్రాయిట్ వరకూ ఈ మార్పుల తాలూకా ప్రభావం కనిపిస్తుంది.(ఇక్కడ శిలాజం అన్న మాట ఇంగ్లీషులో ఫాసిల్ అన్న మాటకి తత్సమంగా వాడుతున్నట్లు అనిపించొచ్చు. సామాజిక రూపాలు పూర్తిగా ఫాసిల్స్ గా ఎప్పుడూ వుండవు. పొలం గట్ల లాగా అవి నీరు పారటానికి మార్గాలు చూపించినా ఎప్పటికప్పుడు ప్రయత్న పూర్వకంగానో అప్రయత్నంగానో మారుతూనే వుంటాయి. )
అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవన చరిత్ర వేంకటేశ్వర రావు గారు చెప్పినట్లు – అంతా కలిపి నలభై ఏళ్లు కూడా వుండదు. అమెరికాలో పంజాబీల చరిత్ర దాదాపు వంద సంవత్సరాలుంటుంది. అమెరికాలో గుజరాతీల రోజు వారీ జీవితం , వ్యాపార రంగం ద్వారా అమెరికన్ నాగరికుల రోజు వారీ జీవితంతో కలిసి వుంటుంది. బెంగాలీల సాంస్కృతిక జీవనం – అమెరికన్ యూనివర్సిటీల మేధోత్పాదనలో — ప్రత్యేకించి – లిటరేచర్ , హిస్టరీ , ఇలాటి డిపార్టుమెంట్లలో పెద్ద పాత్ర వహిస్తుంది. ఈ భాషలు మాట్లాడే వాళ్లంతా ఈయీ పనులే చేస్తుంటారని కాదు కానీ, వారి చైతన్యంలో ఈ అనుభవాల ప్రభావం చాలానే వుంటుంది. వేంకటేశ్వర రావు గారు సూచించినట్లు – అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవనంలో ఆఫీసుల్లో , ప్రత్యేకించి ఐటి రంగంలో పనులు చేసుకోవటం, గ్రీన్ కార్డు సంపాదించుకోవటం, కట్నం మాట్లాడుకోవడం , పెళ్లిళ్లు చేసుకోవడం, హైదరాబాదులాంటి చోట ఇల్లో స్థలమో కొనుక్కోవడం, తెల్ల అమెరికన్ సబర్బన్ లైఫ్ లో ఒక చిన్న చోటు వెతుక్కోవటం, ఇలాటివి చాలా ముఖ్యమైన ఘట్టాలు. ఇక్కడా అక్కడా కూడా నగర జీవితంతో సంబంధం లేకుండా , పెళ్లిళ్లూ కట్నాల ద్వారానో , వ్యవసాయమూ – దాన్ని అంటుకునుని వుండే ఇతర రంగాలనుండి కుటుంబాలు మిగుల్చుకున్న డబ్బులతోనో – తల్లి తండ్రులు గుట్టు గా సర్కారీ వుద్యోగాలు చేసుకుని మిగుల్చుకున్న డబ్బులతోనో, అమెరికాకి పోవటం అన్నది సర్వత్రా జరిగింది.
హైదరాబాదు లో ఏదో కొన్నేళ్ళు వుండి , అక్కడ కొంత ఆధారం సంపాదించుకున్నాకూడా, ఇలాటి ప్రవాసులలో ఎవరూ కూడా – తమ చుట్టూ కమ్ముకు వస్తున్న పెను మార్పులని గమనించేటంత వోపిక వున్న వాళ్ళు కాదు. అమెరికా దాకా ఎందుకు – గ్రామం వదిలి, చిన్న పట్టణం, చిన్న పట్టణం వదిలి హైదరాబాదు నగరం , హైదరాబాదు నగరం నించి అమెరికాకో, యూరప్ కో ఎగిరి వెళ్ళటం — ఈ క్రమంలో కూడా ఎక్కడా కూడా కొంచెం వూపిరి పీల్చుకుని, తమ చుట్టూ ఏమీ జరుగుతోందో తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ముందు పరిస్థితి ఇంత ఇరుకుగా వుండేది కాదనుకుంటాను. తెనాలి లో వున్నా, విజయవాడలో వున్నా, వరంగల్లు లోనో , హైదరాబాదులోనో వున్నా తమ చుట్టూతా ఏమి జరుగుతోందో తెలుసుకోక తప్పేది కాదు. బతుకు తెరువుకోసమే అయినా బొంబాయికో, మద్రాసుకో వెళ్ళే వాళ్ళు. ఆ వెళ్లిన అనుభవానికి కేవలం వ్యక్తిగత పరిధిలో కాకుండా పెద్ద కాన్వాసులో భాష్యం చెప్పుకునే వాళ్ళు.
ఎమెర్జెన్సీ తరవాత – ప్రత్యేకించి, ఈనాడు పత్రిక బలంగా ఎదిగిన తర్వాత, తెలుగు దేశం పార్టీ ఉవ్వెత్తున వచ్చిన తర్వాత దేశ రాజకీయాలలో తెలుగు సాంఘిక జీవనమూ, ఆంధ్ర ప్రదేశ్ లో కుటుంబ జీవనమూ పూర్తిగా అంతర్ముఖమైపోయినాయి. జీవితాన్ని , సాహిత్యాన్ని అనుభవించడం కాకుండా వినిమయం చేసుకోవటం పాతుకు పోయింది. సినిమాలు ఈ విషయంలో చాలా కృషి చేసాయనే చెప్పుకోవాలి. ( గుంటూరు జిల్లా వ్యవసాయపు మిగులు ధనం మద్రాసు వెళ్ళి పనికిమాలిన చెత్త ఎట్లా ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిందో – బాలగోపాల్ ఎక్కడో చాలా చక్కగా చెప్పినట్టు గుర్తు). తెలుగు మాట్లాడే వాళ్ళ జ్ఞానేంద్రియాలకి ఆవకాయకీ, ఆత్మకధకీ తేడా తెలియకుండా అయిపోయింది. ఒకే తూనిక రాయి — ఎంత మంది కొన్నారు, ఎంత మంది ఆమోదించారు, ఏ సెలెబ్రిటీ ఎండోర్స్ చేశారు – ఇదీ లెక్క.
అది జరుగుతుండగానే విప్లవ రాజకీయాల పట్ల ఏదో ఒక రోమాంటిక్ వూహాలుండటమూ , అలా మాకు వున్నాయని – అది లేని వాళ్ళందరూ ఉదారవాద మూర్ఖులో, వర్గ శత్రువులో అయి వుంటారని బూకరించటం లోనే సాహిత్య విమర్శకులకు తీరిక లేకుండా పోయింది. మొదట్లో విమర్శకులు చేసిన ఈ పనిని, తరవాత తరవాత రచయితలూ, రచయిత్రులూ, కవులూ, కవయిత్రులూ వాళ్ళని సమర్ధించే వాళ్లూ కూడా అలవాటు చేసేసుకున్నారు. ఇటువంటి సంస్కృతిలో ఎవరికీ దేని పట్లా జవాబు దారీ తనం వుండదు. కష్ట పడి పని నేర్చుకోవలసిన అవసరమూ వుండదు. బుకాయించటం, బూకరించటం వస్తే చాలు. మహా అయితే, తమ కులానికో, తమ వీధికో, తమ జిల్లాకో సంబంధించిన కొంత పనికి మాలిన జ్ఞానం సంపాదించుకుంటే చాలు.
బతకడానికి సరిపోయే దినుసులే ఇట్లా వుంటే ఇందులోంచి సాహిత్యం పుట్టించాలంటే దానికి కావలసిన పనిముట్లు ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వుంది. విమర్శకులు చేయ వలసిన పని అది.
తెలుగులో మంచి కధ ఎట్లా వుండాలి అని చెప్పే కన్నా, మనకు కనపడుతున్న సాహిత్యంలో ఏవి మంచి ధోరణులు — అన్నది చెప్పుకోవలసిన అవసరం వున్నది అని మాలతి గారు అడగటం సబబే. కానీ , దానికి సమాధానం ఇప్పుడు వస్తున్న తెలుగు కధల్లోనించే వెతుక్కో నవసరం లేదు. తెలుగు సాహిత్యం మొత్తం నించే కాక ఇతర భారతీయ భాషలనించో ప్రపంచ సాహిత్యంలో ఎక్కడినించో నయినా చూపించుకోవచ్చును. అసలు కధల వూసే ఎత్తకుండా తెలుగు వారి సంస్కృతులని నిర్మొహమాటంగా విమర్శించి చెప్పుకున్నా చాలు.
రోజు వారీ జీవితంలో లేని లోతుని పాఠకులకి అందు బాటులోకి తేవటం రచయిత చేయవలసిన పని. దానికి కావలసిన నైపుణ్యం షెల్ఫ్ మీద దొరకదు. తయారు చేసుకోవాలి. తెలుగు డయాస్పోరా రూపు రేఖలూ, దాని చైతన్యానికి ఆయువు పట్లూ ఇలాటి వాటి గురించి మాట్లాడుకోవటం ఆ దిశగా ఒక మంచి అడుగే. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. సమస్యకి మూలం ఎక్కడో స్థూలంగానానయినా గుర్తించ గలిగితే, ఆ తరువాత దానికి పరిష్కారాలు అందులోంచే దొరుకుతాయి.
అసమర్ధుని జీవయాత్రే! గురించి sarangadhara గారి అభిప్రాయం:
03/05/2010 12:49 am
మీ విశ్లేషణ మాధవ్ వ్యాసం కంటే బాగుంది. పరిశీలనలో ఎంత తేడా. మాధవ్ గారు తన స్కూలు అనుభవాలనుచి, లెక్కలమాష్టారు, తను వగైర చెప్తూ తనలోంచి సీతారామారావుని చూసారు. ఆయన వ్యాసం అసమగ్రంగా అనిపించింది. ఇక పాత్రతో పొంతనలేని ఉన్మాదస్థితి ఏమీలేదు. పాత్రకు తగినట్లుగా అంటూ, వాస్తవ స్థితికి దర్పణం అంటూ పోతే రచయిత స్వేచ్చని హరించినట్లే అవుతుంది.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి ramaanaath గారి అభిప్రాయం:
03/04/2010 11:21 pm
శ్రీనివాస్
బలే ఉంది. నాదమ్మొక్కటి పిక్కటిల్లె దిశలన్ నవ్యామృతావ్యాహతాస్వాదమై.. షట్పదీ నాదమో.. కలకంఠనాదమో… వివరింపగా రాదు.. పరమానందానుసంధానమై.. ( పెద్దన).. ఇంత హడావుడి లేకుండా ఓసారి పై పాటలు వింటే చాలు.. పై పద్యం లో చివరి రెండు ముక్కల తో సరిపెట్టుకోచ్చు.
బాలరాజు లో “వరుణా” అన్న పాట కూడా బలె ఉంటుంది ఎవరినే తో పాటు. వీలుంటే దయచేయించండి.
రమానాథ్
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Ramesh Srirangam గారి అభిప్రాయం:
03/04/2010 11:14 pm
యేదో ప్రత్యేకత ఉన్నది ఆమె గొంతులో.ఎంతో శ్రమతొ చక్కటి శ్రావ్యమైన గీతాలు అందించారు.ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.