రామారావు గారంటే నాకు గౌరవం వుంది, ఆయన కొంచెం ఆలోచించి రాస్తారని. ఆ గౌరవానికి భంగం కలగకుండానే, ఈ నాలుగు మాటలూ రాస్తున్నా.
ఈమాట తరఫు నించి ఆయన చెప్పిన మాటలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఈమాటకి సంబంధించిన విషయం.
కాని, రచయితలూ, “ఉహా” పాఠకుల గురించి ఆయన చేసిన ఊహలు నాకు కొంచెం ఆశ్చర్యంగా వున్నాయి. మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ? ఆంధ్ర దేశంలో వొకే రకం పాఠకులు వున్నారన్న ఈ అంచనా ఎక్కడినించి వచ్చింది?
అక్కడి రచయితలకూ, పాఠకులకూ అమెరికాలోని తెలుగు రచయితలకూ, పాఠకులకూ నిజంగా తేడా వుందా? అమెరికాలోని తెలుగు రచయితలూ, తెలుగు పాఠకులూ వొక “ఫ్రోజెన్”తెలుగు సమాజంలో ఇప్పటికీ బతుకుతున్నారు. అది అరవయి, డెబ్బయిల ఆంధ్ర.
అమెరికాలోని తెలుగు వాళ్ళకి మల్లెనే, అక్కడా కొందరు ఫ్రోజెన్ తెలుగు వారు వుండవచ్చు. వారికి విప్లవ రచయితలని తిట్టడమే ఏకైక పని.
నాకు తెలిసీ ఆంధ్రాలో పాఠకుల స్వభావం మారింది, ఇటీవలి ఉనికి చైతన్యమూ, రాజకీయాల తరవాత.
దళిత, ముస్లిం, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర రచయితల ప్రభావం అమెరికాలోని ఈ ఫ్రోజెన్ తెలుగు సమూహాలకు ఇంకా అర్ధం అవుతున్నట్టు లేదు. అవి అందరూ అనుకుంటున్న “విప్లవ” లేదా వామ పక్ష కక్కులు కావు. అమెరికాలోని వివిధ భాషీయుల, జాతుల వేదన కూడా అ.తెలుగులకు అర్ధం అవుతున్నట్టు లేదు. అది వేరే మాట్లాడుకుందాం. అక్కడి ఉనికి వేదనకూ, ఇక్కడి అనేక భిన్న జాతుల వేదనకూ కొంత చుట్టరికం దూరంగానయినా వుంది. కాని, ఆంధ్రాలో ఉనికి చైతన్యం రాజకీయ పరంగా ఎటు మళ్ళినా, సాహిత్య, సాంస్కృతిక రంగాల పరిధిని విశాలం చేసింది. ఆ విశాలమయిన పరిధిలోంచి కొత్త పాఠకుడిని చూడాలని నా అభిప్రాయం.
రామారావు గారి “ఊహా పాఠకులు” ఎవరో , వారి వర్తమానం ఏమిటో తెలుసుకోవాలని వుంది. అలాగే,”అక్కడి” తెలుగు రచయితలు చేయలేకపోతున్న సాహసాలు / విదేశీ తెలుగు రచయితలు సేయంగల సాహసాల భోగట్టా కూడా.
ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో! (కొంత మంది అ.తెలుగు రచయితలు క్షమిస్తే, ఈ నిజం చెప్పక తప్పదు. లైలా లాంటి వారి కామెంట్లు చదువుతున్నప్పుడు అది ఇంకా మూడు నాలుగు తరాలు కూడా పట్టవచ్చని దిగులుగా వుంది)
కన్నడములో దేవరనామ వైష్ణవభక్తిగీతాలను వ్రాయడము మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడైన నరహరితీర్థులతో ప్రారంభమయిది. మధ్వాచార్యులు కూడా వ్రాసినరని అంటారు, కాని కన్నడములో వారి పాటలు దొరక లేదు. కాని సంస్కృతములో వారి ద్వాదశస్తోత్రము పాడడానికి ఎంతో బాగుంటుంది. నేడు కూడా ఈ ద్వాదశస్తోత్రాన్ని నైవేద్య సమయములో పాడుతారు. వ్యాసరాయలపైన దీర్ఘంగానే చర్చించాను. అక్కడ వారి గురువులైన శ్రీపాద రాయలనుగురించి కూడా వ్రాసాను. ఈ శ్రీపాదరాయల మఠము ముళ్బాగలులో ఉంది (బెంగళూరు తిరుపతి బస్సు మార్గములో). కానీ స్థలాభావమువల్ల అదంతా కత్తెరవేటుకి పడ్డది. పురందరదాసు కనకదాసులతో సహా శ్రీపాదరాయలు, వ్యాసరాయలను హరిదాసకూటానికి పితామహులని అనుకొంటారు. శ్రీపాదరాయల ఆనతిపైననో లేక తనంతట తానో చాలా యేళ్ల శిష్యరికం పిదప వ్యాసతీర్థులు ముళ్బాగలునుండి చంద్రగిరికి వెళ్లారు. అక్కడ సాళువ నరసింహరాయలకు రాజగురువుగా ఉన్నారు. శ్రీపాదరాయలు కూడా రాయలకు గురువే. ఆ సమయములో తిరుమలపైన అర్చకులు లంచగొండితనంవల్ల తీవ్రశిక్షకు పాల్పడ్డారు. స్వామివారి అర్చనకు ఎవ్వరూ లేనందువలన నరసింహరాయలు వ్యాసతీర్థులను శ్రీవారికి పూజ చేయమని అడగ్గా, అలాగే సుమారు 12 సంవత్సరాలు పూజ చేసారు ఇంతలో పూజారి వంశపు పసివాళ్లు పెద్ద వాళ్లయ్యారు. వారికి పూజా భారాన్ని అప్పగించారు వ్యాసతీర్థులు. సాళువ నరసింహరాయలతో ఇతడు కూడా విజయనగరానికి వెళ్లారు. తిరుపతిలో ఉన్నప్పుడు వ్యాసతీర్థులు బహుశా అన్నమయ్యను కలిసుంటారనే నా ఊహ. కృష్ణరయలపైని గౌరవము, వాత్సల్యము వలన తన పాటలకు వ్యాసరాయలు కృష్ణ ముద్రను ఉంచారని కొందరు అంటారు. శ్రీపాదరాయలు రచించిన కొన్ని దేవరనామాలు – పోపు హోగోణ బారో రంగ, బారో మనెగె రంగ నిన్నంఘ్రికమలవ తోరో, ఇక్కో నోడే రంగనాథన పుట్టపాదవ, నా నినగేను బేడువుదిల్ల, భూషణకె భూషణ ఇదు భూషణ, ఆవ జనుమద తాయి ఆవ జనుమద తందె మున్నగునవి. నాకు భూషణకె భూషణ ఎంతో ఇష్టం. అతని ఒక పాట కింద ఇస్తున్నాను –
ఈ పుస్తకం గాని, అఫ్సర్ గారి పుస్తకం గాని చదవకుండా రాస్తున్న అభిప్రాయం ఇది. లైలా, రమ గార్ల అభిప్రాయాలు ఆలోచనా ప్రేరకాలుగా వుండటంతో చేస్తున్న సాహసం.
మామూలుగానే కవిత్వసమీక్ష కత్తిమీద సాము. దానికితోడు ఒక పత్రిక సంపాదకుడే ఆడా పాడా మద్దెల కొట్టా అన్నట్టు ఆ పని కూడ చెయ్యాల్సి వస్తే ఇంకా ఇరకాటం. చూస్తూ చూస్తూ బాగా తెలిసిన, తమ పత్రికలో అప్పుడప్పుడు ప్రచురిస్తున్న, ఒకరి రచనని గురించి ప్రతికూలంగా రాయలేరు. అదీ లబ్ధప్రతిష్టులైన రచయితలైతే మరీ కష్టం. ఇది వేలూరి గారి పరిస్థితిలో ఉన్న చిక్కు.
సాధారణంగా సమీక్షకులెవరైనా ఒక రచన గురించి వాళ్లు చూపే సానుభూతికీ, వాళ్లకీ ఆ రచయితకీ ఉన్న ప్రత్యక్ష పరిచయానికీ డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ (తెలుగు పదాలు గుర్తుకురావటం లేదు) ఉంటుందని నా నమ్మకం. అలాటి సానుకూల సమీక్షలలో నిజంగా అర్హమయే రచనలే లేవని అనలేము కాని చాలా తక్కువ శాతం. ఐతే మనకు తెలియని వారి గురించి ప్రతికూలంగా అనటం తేలిక కదా !
ఎవరి మెప్పు కోసమో రాసే కవిత్వంలో నిజాయితీ ఉండదని, అది మాటలపేర్పు తప్ప గుండెలోతుల్లోంచి వచ్చి పాఠకుల మనసు పొరల్ని స్పృశించలేదనీ చెప్పనక్కర్లేదు. అలా ఇతరుల మెప్పుని ఆశించకుండా రాసుకోగలిగే అవకాశం విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో వుండే రచయితలు/కవులకు ఉన్నది. (అలాటి వారిని ప్రోత్సహించటం “ఈమాట” మౌలికలక్ష్యాల్లో ముఖ్యమైందని మరోమారు గుర్తుచేసుకోవటం తప్పుకాకపోవచ్చు.) ఐతే దురదృష్టం ఏమిటంటే చాలా కొద్దిమంది – మహా ఐతే ఒక చేతి వేళ్లమీద లెక్కించగలిగేంత మంది – మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు భౌతికంగా ఎక్కడ వున్నా వాళ్ల ఊహాపాఠకులు మాత్రం ఆంధ్రదేశంలో వున్నవారే. వాళ్ల మెప్పు కోసమే వీళ్ల రాతలు. అందుకే వీటికీ అక్కడ వస్తున్న వాటికీ తేడా వుండదు – అవే భావాలు, అవే బాధలు, అవే విప్లవాలు, అవే వాదాలు, అవే నినాదాలు. అదే గాడి, అదే వేడి, అదే ఒరవడి.
ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ.
ఆంధ్రదేశంలో వున్న వారు ఎలాగూ రమ గారు చెప్పిన నానా ఒత్తిళ్ల మూలాన ఈ పని చెయ్యలేరు. ఆ ఒత్తిళ్లు లేని వారు వాటిని కొనితెచ్చుకుని మరీ ఆ ఇరుకు పరిధుల్లోనే గుడుగుడు కుంచాలాడుకోవటం ఎందుకు? విశాల ప్రపంచాన్ని చూశాక కూడ రచనలు చెయ్యబోయేసరికి ఉష్ట్ర దృష్టి ఎందుకు?
ఇదేమరి విమర్శని తీసుకోలేకపోవడం అంటే . విమర్శ చేస్తే ఆ చేసిన వాళ్ళంతా భోగలాలసులు ..కష్టజీవుల కష్టాలు పట్టని వాళ్ళూ ..సమర్ధించిన వాళ్ళంతా వీర విప్లవవాదులూ అన్న బుకాయింపు. ఎన్నాళ్ళీ hipocracy?? విమర్శించిన వాళ్ళు పట్టుచీరల్లో తిరుగుతూంటే సమర్ధించినవాళ్ళూ గోచీలు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారా?? హంబక్ రాతలతో false arguments చేస్తూ ఎలా ఒప్పించగలరూ ?? ఏం రాస్తున్నారన్నదే కాదు ఎలా రాస్తున్నారన్నది ఇక్కడ విషయం. మనసుకి ఎక్కని రాతని ఓహో!! అని మెచ్చుకుందికి తెలుగుదేశాన కోకొల్లలున్నారు. విమర్శ అన్నది లేదు గనకే ఏది బాగులేదో ఎందుకు బాగులేదో ఎవరూ మాట్లాడడం లేదు గనకే పుట్టగొడుగుల్లా కవిత్వం పేర పుస్తకాలు పుట్టుకు వస్తున్నాయి. చెప్పిన వాళ్ళని తిట్టే కార్యక్రమం లేదా ఇప్పుడీ ఇస్మాయిల్ చేసిన పధ్ధతిలో ఇటువంటి కామెంట్స్ కి పూనుకోవడం వల్లనే ఆధునిక కవిత్వపు మంచిచెడ్డలు అన్నది ఎవరూ ముట్టని అంశం అయింది. ఆధునిక కవిత్వం అంటే ఒక హేళన అందువల్లనే స్థిరపడింది. తెలుగులో ఒక సామెత ఉంది “తలపాగా చుట్టుకోడం రాక తల వంకర అన్నాట్ట” అని. అలాంటిదే ఈ ఆధునిక కవితావ్యాపారంలో ఉన్నవాళ్ళవైఖరి. తమకి తోచదు. చెపితే ఆలోచన చేయరు. ఎవరన్నా ఒక కవితని పాఠకుల మనసులలోకి ఎలా బలంగా పంపించగలమా అని ఆలోచన చేయాలి అంతే గానీ బాగులేదని విమర్శించినవాళ్ళని పిల్లిశాపనార్ధాలు పెట్టడం కాదు. వెనకటికి ఒక విమర్శకుడు అంటూండే వాడు మనకి నచ్చంది మరొకరికి నచ్చవచ్చు అని. కానీ బాగున్న కవిత అది దేనిగురించిరాసినా ఎందరినో ఆకట్టుకోగలదు మరి. అలా ఆకట్టుకున్నవి నిలబడ్డాయి. ఆకట్టుకోలేనివి ఎవరెన్ని కితాబులిచ్చినా బోల్తాపడ్డాయి.
రమ.
మానవల్లి రామకృష్ణ కవి అభిప్రాయపడినట్టుగా ఒక్క తుఖ్ఖాదేవి ని గురించిన వే కాదు రాయలని గురించి అనేకమైనవి కట్టుకధలే!! రాయలు విడిచిన ఒకానొక భార్య కంబం [రాయలసీమ ప్రాంతం] దగ్గర వంటరిగా బతికిందనీ ప్రజాహిత కార్యక్రమాలు చేసి జీవించిందనీ మాత్రమే ఉంది. [ఖమ్మం కాదు. ఖమ్మం తెలంగాణా ప్రాంతం, దీనినే పాతరోజుల్లో ఖమ్మంమెట్టు అని అనేవారు. ఖమ్మం వేరు కంబం వేరు.]
కట్టు కధలలోకెల్లా ముఖ్యమైనదీ తెలుగువారికి ప్రీతిపాత్రమైనదీ అయినది కృష్ణ్దదేవరాయలే ఆముక్తమాల్యదని రాసినవాడని నమ్మడం. ఇది పెద్దన విరచితమనీ తనకి అమిత స్నేహపాత్రుడైన రాయని పేర ఈ కృతిని అల్లసాని పెద్దనే రచించి పెట్టాడనీ అనేకానేక రుజువులతో ఇదివరలో ఎన్నో చర్చలు జరిగాయి. అయినా అదంతా భ్రాహ్మణుల కుట్ర అనీ కృష్ణరాయడే ఆముక్తమాల్యదని రాసినవాడనీ నమ్మి వాదించే వాళ్ళూ ఉన్నారు. కృతిని అంకితం పుచ్చుకున్నట్టుగానే కృతి రచనని కూడా కీర్తి కోసం రాజులు స్వీకరించిన దాఖలాలు అనేకం ఉన్నాయి.
ఇకపోతే దాసకూటములని ఏర్పరిచినది శ్రీపాదరాయలు. వ్యాసరాయలు/ లేదా వ్యాసతీర్థులు కాదు శ్రీపాదరాయలు వ్యాసరాయలవారికి గురువు. అన్నమాచార్యులవారికి సమకాలికుడు. సాళువ నరసింగనాయకునికి కూడా గురువు. చాలా వైభవోపేతమైన జీవితాన్ని గడిపిన సాధువు ఈయన.
రమ, లైలా గార్లు మీరు కవిత్వంగా భావించే నాలుగు వాక్యాలు రాస్తే బాగుణ్ణు. ఎంతకాలం చీకటికి రంగులద్ది బతుకుతారు. లేని స్వర్గాన్ని ఊహించుకొని మత్తులో జోగడం కవిత్వమా? 90 శాతం బహిష్కృతుల గురించి, కోల్పోయిన దానిని గురించి, వేదనను పంచుకోవడం మీకు కవిత్వంగా కనపడదా?
ఈ కథంతా ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇన్స్యూరెన్సు డబ్బు రాదూ అనే ప్రాతిపదిక మీద నడుస్తుంది. ఈ విషయం ఇండియాలో మాత్రమే కరెక్టు. అమెరికాలో పూర్తిగా కరెక్టు కాదు. పాలసీ తీసుకున్న ఒక యేడాది తర్వాత (ఈ పరిమితి ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలాగా వుండొచ్చు), ఆ పాలసీ తీసుకున్న మనిషి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఇన్స్యూరెన్సు కంపెనీ డబ్బు ఆ మనిషి కుటుంబానికి ఇచ్చి తీరాలి.
The suicide clause is designed to prevent people who are contemplating taking their own lives from obtaining life insurance. To accomplish this, the clause states that if the insured commits suicide within a specified period of time, the policy will automatically be voided. The amount of time varies, but it’s usually the same length as the incontestable period: one or two years. The clause applies whether the insured is sane or insane at the time of the act.
Once the mandated period of time has elapsed, the insurance company must pay the claim even if the insured commits suicide. However, if suicide occurs while the time limit is still in effect, the company will usually only refund any premiums that the policy-owner has paid for the coverage. Accrued interest on the premiums typically won’t be refunded, as the company will use it to offset part of its costs in initially setting up the policy.
Although some states may not specifically mention the suicide clause in their laws, insurance companies generally use the silence as tacit permission to include the clause in their policies.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి అఫ్సర్ గారి అభిప్రాయం:
07/03/2010 9:46 am
రామారావు గారంటే నాకు గౌరవం వుంది, ఆయన కొంచెం ఆలోచించి రాస్తారని. ఆ గౌరవానికి భంగం కలగకుండానే, ఈ నాలుగు మాటలూ రాస్తున్నా.
ఈమాట తరఫు నించి ఆయన చెప్పిన మాటలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఈమాటకి సంబంధించిన విషయం.
కాని, రచయితలూ, “ఉహా” పాఠకుల గురించి ఆయన చేసిన ఊహలు నాకు కొంచెం ఆశ్చర్యంగా వున్నాయి. మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ? ఆంధ్ర దేశంలో వొకే రకం పాఠకులు వున్నారన్న ఈ అంచనా ఎక్కడినించి వచ్చింది?
అక్కడి రచయితలకూ, పాఠకులకూ అమెరికాలోని తెలుగు రచయితలకూ, పాఠకులకూ నిజంగా తేడా వుందా? అమెరికాలోని తెలుగు రచయితలూ, తెలుగు పాఠకులూ వొక “ఫ్రోజెన్”తెలుగు సమాజంలో ఇప్పటికీ బతుకుతున్నారు. అది అరవయి, డెబ్బయిల ఆంధ్ర.
అమెరికాలోని తెలుగు వాళ్ళకి మల్లెనే, అక్కడా కొందరు ఫ్రోజెన్ తెలుగు వారు వుండవచ్చు. వారికి విప్లవ రచయితలని తిట్టడమే ఏకైక పని.
నాకు తెలిసీ ఆంధ్రాలో పాఠకుల స్వభావం మారింది, ఇటీవలి ఉనికి చైతన్యమూ, రాజకీయాల తరవాత.
దళిత, ముస్లిం, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర రచయితల ప్రభావం అమెరికాలోని ఈ ఫ్రోజెన్ తెలుగు సమూహాలకు ఇంకా అర్ధం అవుతున్నట్టు లేదు. అవి అందరూ అనుకుంటున్న “విప్లవ” లేదా వామ పక్ష కక్కులు కావు. అమెరికాలోని వివిధ భాషీయుల, జాతుల వేదన కూడా అ.తెలుగులకు అర్ధం అవుతున్నట్టు లేదు. అది వేరే మాట్లాడుకుందాం. అక్కడి ఉనికి వేదనకూ, ఇక్కడి అనేక భిన్న జాతుల వేదనకూ కొంత చుట్టరికం దూరంగానయినా వుంది. కాని, ఆంధ్రాలో ఉనికి చైతన్యం రాజకీయ పరంగా ఎటు మళ్ళినా, సాహిత్య, సాంస్కృతిక రంగాల పరిధిని విశాలం చేసింది. ఆ విశాలమయిన పరిధిలోంచి కొత్త పాఠకుడిని చూడాలని నా అభిప్రాయం.
రామారావు గారి “ఊహా పాఠకులు” ఎవరో , వారి వర్తమానం ఏమిటో తెలుసుకోవాలని వుంది. అలాగే,”అక్కడి” తెలుగు రచయితలు చేయలేకపోతున్న సాహసాలు / విదేశీ తెలుగు రచయితలు సేయంగల సాహసాల భోగట్టా కూడా.
ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో! (కొంత మంది అ.తెలుగు రచయితలు క్షమిస్తే, ఈ నిజం చెప్పక తప్పదు. లైలా లాంటి వారి కామెంట్లు చదువుతున్నప్పుడు అది ఇంకా మూడు నాలుగు తరాలు కూడా పట్టవచ్చని దిగులుగా వుంది)
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana గారి అభిప్రాయం:
07/03/2010 9:14 am
కన్నడములో దేవరనామ వైష్ణవభక్తిగీతాలను వ్రాయడము మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడైన నరహరితీర్థులతో ప్రారంభమయిది. మధ్వాచార్యులు కూడా వ్రాసినరని అంటారు, కాని కన్నడములో వారి పాటలు దొరక లేదు. కాని సంస్కృతములో వారి ద్వాదశస్తోత్రము పాడడానికి ఎంతో బాగుంటుంది. నేడు కూడా ఈ ద్వాదశస్తోత్రాన్ని నైవేద్య సమయములో పాడుతారు. వ్యాసరాయలపైన దీర్ఘంగానే చర్చించాను. అక్కడ వారి గురువులైన శ్రీపాద రాయలనుగురించి కూడా వ్రాసాను. ఈ శ్రీపాదరాయల మఠము ముళ్బాగలులో ఉంది (బెంగళూరు తిరుపతి బస్సు మార్గములో). కానీ స్థలాభావమువల్ల అదంతా కత్తెరవేటుకి పడ్డది. పురందరదాసు కనకదాసులతో సహా శ్రీపాదరాయలు, వ్యాసరాయలను హరిదాసకూటానికి పితామహులని అనుకొంటారు. శ్రీపాదరాయల ఆనతిపైననో లేక తనంతట తానో చాలా యేళ్ల శిష్యరికం పిదప వ్యాసతీర్థులు ముళ్బాగలునుండి చంద్రగిరికి వెళ్లారు. అక్కడ సాళువ నరసింహరాయలకు రాజగురువుగా ఉన్నారు. శ్రీపాదరాయలు కూడా రాయలకు గురువే. ఆ సమయములో తిరుమలపైన అర్చకులు లంచగొండితనంవల్ల తీవ్రశిక్షకు పాల్పడ్డారు. స్వామివారి అర్చనకు ఎవ్వరూ లేనందువలన నరసింహరాయలు వ్యాసతీర్థులను శ్రీవారికి పూజ చేయమని అడగ్గా, అలాగే సుమారు 12 సంవత్సరాలు పూజ చేసారు ఇంతలో పూజారి వంశపు పసివాళ్లు పెద్ద వాళ్లయ్యారు. వారికి పూజా భారాన్ని అప్పగించారు వ్యాసతీర్థులు. సాళువ నరసింహరాయలతో ఇతడు కూడా విజయనగరానికి వెళ్లారు. తిరుపతిలో ఉన్నప్పుడు వ్యాసతీర్థులు బహుశా అన్నమయ్యను కలిసుంటారనే నా ఊహ. కృష్ణరయలపైని గౌరవము, వాత్సల్యము వలన తన పాటలకు వ్యాసరాయలు కృష్ణ ముద్రను ఉంచారని కొందరు అంటారు. శ్రీపాదరాయలు రచించిన కొన్ని దేవరనామాలు – పోపు హోగోణ బారో రంగ, బారో మనెగె రంగ నిన్నంఘ్రికమలవ తోరో, ఇక్కో నోడే రంగనాథన పుట్టపాదవ, నా నినగేను బేడువుదిల్ల, భూషణకె భూషణ ఇదు భూషణ, ఆవ జనుమద తాయి ఆవ జనుమద తందె మున్నగునవి. నాకు భూషణకె భూషణ ఎంతో ఇష్టం. అతని ఒక పాట కింద ఇస్తున్నాను –
మనెయింద సంతోష కెలవరిగె లోకదల్లి
ధనవింద సంతోష కెలవరిగె లోకదల్లి
వనితెయిం సంతోష కెలవరిగె లోకదల్లి
తనయరిం సంతోష కెలవరిగె లోకదల్లి
ఇనితు సంతోష అవరవరిగాగలి నిన్న
నెనెవో సంతోష ఎనగాగలి నమ్మ రంగవిఠల
( గృహమందు ముదమగును కొందరికి లోకమున
ధనమిచ్చు మోదమును కొందరికి లోకమున
వనిత లిత్తురు ముదము కొందరికి లోకమున
తనయు లిత్తురు ముదము కొందరికి లోకమున
ఎవరి యానంద మవి వారి కగును నిన్ను
తలచు యానంద మది నాకగు స్వామి రంగవిఠల )
విధేయుడు – మోహన
నువ్వు గురించి kalyan గారి అభిప్రాయం:
07/03/2010 7:47 am
తల్లి నీకు మంచి భవిష్యత్తు ఉంది, ముందుకు వెళ్ళు, మంచి రచయిత నీలో ఉంది … కవిత నాకు చాలా నచ్చేసింది.
నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
07/03/2010 3:23 am
ఈ పుస్తకం గాని, అఫ్సర్ గారి పుస్తకం గాని చదవకుండా రాస్తున్న అభిప్రాయం ఇది. లైలా, రమ గార్ల అభిప్రాయాలు ఆలోచనా ప్రేరకాలుగా వుండటంతో చేస్తున్న సాహసం.
మామూలుగానే కవిత్వసమీక్ష కత్తిమీద సాము. దానికితోడు ఒక పత్రిక సంపాదకుడే ఆడా పాడా మద్దెల కొట్టా అన్నట్టు ఆ పని కూడ చెయ్యాల్సి వస్తే ఇంకా ఇరకాటం. చూస్తూ చూస్తూ బాగా తెలిసిన, తమ పత్రికలో అప్పుడప్పుడు ప్రచురిస్తున్న, ఒకరి రచనని గురించి ప్రతికూలంగా రాయలేరు. అదీ లబ్ధప్రతిష్టులైన రచయితలైతే మరీ కష్టం. ఇది వేలూరి గారి పరిస్థితిలో ఉన్న చిక్కు.
సాధారణంగా సమీక్షకులెవరైనా ఒక రచన గురించి వాళ్లు చూపే సానుభూతికీ, వాళ్లకీ ఆ రచయితకీ ఉన్న ప్రత్యక్ష పరిచయానికీ డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ (తెలుగు పదాలు గుర్తుకురావటం లేదు) ఉంటుందని నా నమ్మకం. అలాటి సానుకూల సమీక్షలలో నిజంగా అర్హమయే రచనలే లేవని అనలేము కాని చాలా తక్కువ శాతం. ఐతే మనకు తెలియని వారి గురించి ప్రతికూలంగా అనటం తేలిక కదా !
ఎవరి మెప్పు కోసమో రాసే కవిత్వంలో నిజాయితీ ఉండదని, అది మాటలపేర్పు తప్ప గుండెలోతుల్లోంచి వచ్చి పాఠకుల మనసు పొరల్ని స్పృశించలేదనీ చెప్పనక్కర్లేదు. అలా ఇతరుల మెప్పుని ఆశించకుండా రాసుకోగలిగే అవకాశం విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో వుండే రచయితలు/కవులకు ఉన్నది. (అలాటి వారిని ప్రోత్సహించటం “ఈమాట” మౌలికలక్ష్యాల్లో ముఖ్యమైందని మరోమారు గుర్తుచేసుకోవటం తప్పుకాకపోవచ్చు.) ఐతే దురదృష్టం ఏమిటంటే చాలా కొద్దిమంది – మహా ఐతే ఒక చేతి వేళ్లమీద లెక్కించగలిగేంత మంది – మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు భౌతికంగా ఎక్కడ వున్నా వాళ్ల ఊహాపాఠకులు మాత్రం ఆంధ్రదేశంలో వున్నవారే. వాళ్ల మెప్పు కోసమే వీళ్ల రాతలు. అందుకే వీటికీ అక్కడ వస్తున్న వాటికీ తేడా వుండదు – అవే భావాలు, అవే బాధలు, అవే విప్లవాలు, అవే వాదాలు, అవే నినాదాలు. అదే గాడి, అదే వేడి, అదే ఒరవడి.
ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ.
ఆంధ్రదేశంలో వున్న వారు ఎలాగూ రమ గారు చెప్పిన నానా ఒత్తిళ్ల మూలాన ఈ పని చెయ్యలేరు. ఆ ఒత్తిళ్లు లేని వారు వాటిని కొనితెచ్చుకుని మరీ ఆ ఇరుకు పరిధుల్లోనే గుడుగుడు కుంచాలాడుకోవటం ఎందుకు? విశాల ప్రపంచాన్ని చూశాక కూడ రచనలు చెయ్యబోయేసరికి ఉష్ట్ర దృష్టి ఎందుకు?
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
07/03/2010 2:24 am
ఇదేమరి విమర్శని తీసుకోలేకపోవడం అంటే . విమర్శ చేస్తే ఆ చేసిన వాళ్ళంతా భోగలాలసులు ..కష్టజీవుల కష్టాలు పట్టని వాళ్ళూ ..సమర్ధించిన వాళ్ళంతా వీర విప్లవవాదులూ అన్న బుకాయింపు. ఎన్నాళ్ళీ hipocracy?? విమర్శించిన వాళ్ళు పట్టుచీరల్లో తిరుగుతూంటే సమర్ధించినవాళ్ళూ గోచీలు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారా?? హంబక్ రాతలతో false arguments చేస్తూ ఎలా ఒప్పించగలరూ ?? ఏం రాస్తున్నారన్నదే కాదు ఎలా రాస్తున్నారన్నది ఇక్కడ విషయం. మనసుకి ఎక్కని రాతని ఓహో!! అని మెచ్చుకుందికి తెలుగుదేశాన కోకొల్లలున్నారు. విమర్శ అన్నది లేదు గనకే ఏది బాగులేదో ఎందుకు బాగులేదో ఎవరూ మాట్లాడడం లేదు గనకే పుట్టగొడుగుల్లా కవిత్వం పేర పుస్తకాలు పుట్టుకు వస్తున్నాయి. చెప్పిన వాళ్ళని తిట్టే కార్యక్రమం లేదా ఇప్పుడీ ఇస్మాయిల్ చేసిన పధ్ధతిలో ఇటువంటి కామెంట్స్ కి పూనుకోవడం వల్లనే ఆధునిక కవిత్వపు మంచిచెడ్డలు అన్నది ఎవరూ ముట్టని అంశం అయింది. ఆధునిక కవిత్వం అంటే ఒక హేళన అందువల్లనే స్థిరపడింది. తెలుగులో ఒక సామెత ఉంది “తలపాగా చుట్టుకోడం రాక తల వంకర అన్నాట్ట” అని. అలాంటిదే ఈ ఆధునిక కవితావ్యాపారంలో ఉన్నవాళ్ళవైఖరి. తమకి తోచదు. చెపితే ఆలోచన చేయరు. ఎవరన్నా ఒక కవితని పాఠకుల మనసులలోకి ఎలా బలంగా పంపించగలమా అని ఆలోచన చేయాలి అంతే గానీ బాగులేదని విమర్శించినవాళ్ళని పిల్లిశాపనార్ధాలు పెట్టడం కాదు. వెనకటికి ఒక విమర్శకుడు అంటూండే వాడు మనకి నచ్చంది మరొకరికి నచ్చవచ్చు అని. కానీ బాగున్న కవిత అది దేనిగురించిరాసినా ఎందరినో ఆకట్టుకోగలదు మరి. అలా ఆకట్టుకున్నవి నిలబడ్డాయి. ఆకట్టుకోలేనివి ఎవరెన్ని కితాబులిచ్చినా బోల్తాపడ్డాయి.
రమ.
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
07/03/2010 1:27 am
మానవల్లి రామకృష్ణ కవి అభిప్రాయపడినట్టుగా ఒక్క తుఖ్ఖాదేవి ని గురించిన వే కాదు రాయలని గురించి అనేకమైనవి కట్టుకధలే!! రాయలు విడిచిన ఒకానొక భార్య కంబం [రాయలసీమ ప్రాంతం] దగ్గర వంటరిగా బతికిందనీ ప్రజాహిత కార్యక్రమాలు చేసి జీవించిందనీ మాత్రమే ఉంది. [ఖమ్మం కాదు. ఖమ్మం తెలంగాణా ప్రాంతం, దీనినే పాతరోజుల్లో ఖమ్మంమెట్టు అని అనేవారు. ఖమ్మం వేరు కంబం వేరు.]
కట్టు కధలలోకెల్లా ముఖ్యమైనదీ తెలుగువారికి ప్రీతిపాత్రమైనదీ అయినది కృష్ణ్దదేవరాయలే ఆముక్తమాల్యదని రాసినవాడని నమ్మడం. ఇది పెద్దన విరచితమనీ తనకి అమిత స్నేహపాత్రుడైన రాయని పేర ఈ కృతిని అల్లసాని పెద్దనే రచించి పెట్టాడనీ అనేకానేక రుజువులతో ఇదివరలో ఎన్నో చర్చలు జరిగాయి. అయినా అదంతా భ్రాహ్మణుల కుట్ర అనీ కృష్ణరాయడే ఆముక్తమాల్యదని రాసినవాడనీ నమ్మి వాదించే వాళ్ళూ ఉన్నారు. కృతిని అంకితం పుచ్చుకున్నట్టుగానే కృతి రచనని కూడా కీర్తి కోసం రాజులు స్వీకరించిన దాఖలాలు అనేకం ఉన్నాయి.
ఇకపోతే దాసకూటములని ఏర్పరిచినది శ్రీపాదరాయలు. వ్యాసరాయలు/ లేదా వ్యాసతీర్థులు కాదు శ్రీపాదరాయలు వ్యాసరాయలవారికి గురువు. అన్నమాచార్యులవారికి సమకాలికుడు. సాళువ నరసింగనాయకునికి కూడా గురువు. చాలా వైభవోపేతమైన జీవితాన్ని గడిపిన సాధువు ఈయన.
రమ.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కెక్యూబ్ గారి అభిప్రాయం:
07/02/2010 10:45 pm
రమ, లైలా గార్లు మీరు కవిత్వంగా భావించే నాలుగు వాక్యాలు రాస్తే బాగుణ్ణు. ఎంతకాలం చీకటికి రంగులద్ది బతుకుతారు. లేని స్వర్గాన్ని ఊహించుకొని మత్తులో జోగడం కవిత్వమా? 90 శాతం బహిష్కృతుల గురించి, కోల్పోయిన దానిని గురించి, వేదనను పంచుకోవడం మీకు కవిత్వంగా కనపడదా?
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Ismail Penukonda గారి అభిప్రాయం:
07/02/2010 9:16 pm
@రవికిరణ్: నాజూకు మనుష్యులకు గరకుదనం నచ్చదుగా…
పట్టుచీరలు కట్టేవారికి పట్టుపురుగును చూస్తే ఛీదరింపేగా మరి!
శ్రీకృష్ణదేవరాయలు గురించి mOhana గారి అభిప్రాయం:
07/02/2010 4:36 pm
జాషువ గారు “గబ్బిలము”లో గబ్బిలమును చూడుమన్న ప్రదేశాలలో హంపీక్షేత్రము కూడా ఉన్నది. ఆ సమయములో వారు వ్రాసిన పద్యాలు –
హంపీక్షేత్రముఁ జూచి పోవలయు నమ్మా తెల్గురాజ్యంపు నై-
లింప శ్రీల కొకానొకప్పు డది కేళీరంగ మేతద్రమా
శంపావల్లరు లాఱిపోయిన ప్రదేశంబందు నీ బందుగుల్
కొంప ల్గట్టి నివాస ముండెదరు నీకుం గూర్తు రానందమున్
పరదాపద్ధతి మాన్పిరో సిరికిఁ గుప్పల్ వోసి యంగళ్ల యం-
దురుమాణిక్యము లమ్మినా రచట మున్నో పక్షిణీ, మూరురా-
యరగండండు మహేంద్రవైభవముతో నాంధ్రక్షమామండలిన్
బరిపాలించిన నాఁటి పెంపును దలంపన్ మేను గంపించెడిన్
పగతు రసూయచేతఁ గరవాలములన్ దనువెల్లఁ జెండినన్
జిగిరిచియున్న యుగ్రనరసింహుని భీమదృగంచలంబులన్
బొగలుడి వోవలె దతని మ్రోల నిమేషము నిల్వఁజాలినన్
ఖగపతి నిన్ను ధైర్యవతిఁగా గణియింతురు వీరయోధులున్
ఏనికవంటి సానువు గణేశుని నున్నని బొజ్జమీఁదఁ గా
లూనఁగ లేదు తుమ్మెద తదుజ్జ్వలశిల్ప మఖండ తుంగభ-
ద్రానది కప్పగించుకొని దద్దమలైన తెలుంగువారి వి-
ద్యానగరాన జిందు మొక యశ్రుకణంబు నుపాయనంబుగన్
సరసుఁడు కృష్ణభూవిభుఁడు స్వారియొనర్చిన పారసీహుమా
దొరల ఖురాగ్రహల్యలను దున్నిన భూములలోన నాంధ్ర సుం-
దరు లొకనాఁడు నాటుకొనినారు దిగంత జయప్రదోహముల్
గరిసెల నించినా రురువుగా ఫలియించిన సుప్రతిష్ఠలన్
మూరురాయరగండఁ డూరేగ డీనాఁడు
విద్యానగర రాజవీథులందు
మేలైన పట్టుడేరా లెత్త రీనాఁడు
పారసీక గుఱాల బేరగాండ్రు
ఇనుపరోకళ్ల సాధన సేయ వీనాఁడు
కొమ్ము నిక్కిన భద్రకుంజరములు
తెలుఁగు స్కంధావారముల నిండ దీనాఁడు
మరఫిరంగుల తెల్లదొరల దండు
మణిమయంబైన యాంధ్రసామ్రాజ్య రథము
భువికిఁ గ్రుంగిన పదియు నాఱవ శతాబ్దిఁ
గృష్ణవిభు వీటఁ బ్రొద్దు గ్రుంకినది మొదలు
ఋషిఖగాంగన తెల్లవారినది లేదు
విధేయుడు – మోహన
అ, న్యాయం గురించి ఆనంద్ గారి అభిప్రాయం:
07/02/2010 4:22 pm
ఈ కథంతా ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇన్స్యూరెన్సు డబ్బు రాదూ అనే ప్రాతిపదిక మీద నడుస్తుంది. ఈ విషయం ఇండియాలో మాత్రమే కరెక్టు. అమెరికాలో పూర్తిగా కరెక్టు కాదు. పాలసీ తీసుకున్న ఒక యేడాది తర్వాత (ఈ పరిమితి ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలాగా వుండొచ్చు), ఆ పాలసీ తీసుకున్న మనిషి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఇన్స్యూరెన్సు కంపెనీ డబ్బు ఆ మనిషి కుటుంబానికి ఇచ్చి తీరాలి.
http://www.finweb.com/insurance/be-aware-of-these-life-insurance-clauses.html
The suicide clause is designed to prevent people who are contemplating taking their own lives from obtaining life insurance. To accomplish this, the clause states that if the insured commits suicide within a specified period of time, the policy will automatically be voided. The amount of time varies, but it’s usually the same length as the incontestable period: one or two years. The clause applies whether the insured is sane or insane at the time of the act.
Once the mandated period of time has elapsed, the insurance company must pay the claim even if the insured commits suicide. However, if suicide occurs while the time limit is still in effect, the company will usually only refund any premiums that the policy-owner has paid for the coverage. Accrued interest on the premiums typically won’t be refunded, as the company will use it to offset part of its costs in initially setting up the policy.
Although some states may not specifically mention the suicide clause in their laws, insurance companies generally use the silence as tacit permission to include the clause in their policies.