ఈ అభిప్రాయంలో ఆధారం లేని వ్యాఖ్యలు అనేకం. మచ్చుకి రెండు :
౧. ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది.
ఆయన జీవితకాలం బోధించింది తత్వ శాస్త్రం. ఆయన సన్నిహితులకు , ఆయన కవిత్వం సీరియస్ గా చదివిన అందరికీ ఇది తెలిసిన విషయమే.
మరిన్ని వివరాలకు ఇంద్రగంటి గారి అమ్మాయి ఇస్మాయిల్ గారు బ్రతికుండగానే చిత్రీకరించిన ఆయన ఆత్మకథ DVD చూడండి. లేదా ” కవిత్వంలో నిశ్శబ్దం” వ్యాస సంపుటిలో రమణారెడ్డి గారికి ఇచ్చిన బదులు చూడండి.
౨. ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఎవడా పాఠకుడు? ఏమా కథ ?? సదరు పాఠకునికి ఇతర కవులు ఆమోద యోగ్యమన్న విషయం మీకెలా తెలిసింది ?? మీకేమైనా కర్ణ పిశాచి ఉందా ?? పై అభిప్రాయం మీ అభిప్రాయం లాగే ఉంది. తప్పు లేదు.పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
ఇక అసలు వ్యాసం విషయానికొస్తే -పొసగని విషయాలు అనేకం , మచ్చుకు రెండు :
౧.ప్రసార మాధ్యమాల పాత్రను అతిగా అంచనా వేశారు.
౨. శబ్దార్థాలను అర్థం చేసుకున్న తీరులో గందరగోళం ఉంది.,
” పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది. ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది. అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు. చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది. అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది. అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు. కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి, అందులో ప్రయోజనం వుందని గమనించి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్ ఒక్కడే.”
ప్రాచీన కాలం నుండి నానా విధాల మాధ్యమాలు వచ్చాయి: వెదురు బద్ద, గట్టి ఎముక,మట్టి పలక, పట్టు వస్త్రం ,తాటాకు..నానా రకాల కాగితాలు ,ఇప్పుడు ఈ రీడర్లు. మాధ్యమాలు కవికి ఎటువంటి
అవకాశాన్ని ఇవ్వవు.అవి కేవలం మాధ్యమాలే.పద్యం రూపు దిద్దుకోనేది కవి మనసులో.ఆ తర్వాత, ఏదో ఒక మాధ్యమం ద్వారా అది పాఠకుని మనసు చేరుతుంది. అంతవరకే దాని పాత్ర.పద్యం చేరవలసిన చోటు చేరిన తర్వాత మాధ్యమంతో ఇక పని లేదు. అది , పాఠకుని మనసులో స్వతంత్రంగా మనగలదు అన్నది మనకు అనుభవంలోని విషయం. ఆసక్తి ఉండాలే గాని, ఎన్నో పద్యాలు గుర్తుంటాయి.
కాబట్టి శబ్దం అప్రధాన మయ్యే ప్రసక్తే లేదు. అచ్చు యంత్రం రాక ముందు కూడా లేఖకులు ఉండే వారు , కావలసినన్ని ప్రతులు తయారయ్యేవి , చలామణీ లోకి వచ్చేవి. చైనా లోని సమాధులు తవ్విన ప్రతి సారి సదరు వ్యక్తికీ ఇష్టమైన పుస్తకాలూ పట్టు వస్త్రం పై రాసినవి దొరుకుతూనే ఉన్నాయి. ( క్రీ.పూ రెండవ శతాబ్దం నాటి ప్రతులు లభ్యం ) ఇంకా ముందుకు వెళితే వెదురు ( క్రీ.పూ నాల్గవ శతాబ్దం )కూడా వాడారు.( వాటి పరిష్కృత ప్రతులు నా దగ్గరున్నాయి.)
” తన కవిత్వంలో, శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు. ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే. కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు. భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్ అపూర్వంగా సాధించారు “
ఇస్మాయిల్ శబ్దానికి పట్టం కట్ట లేదు అంటే నిలువునా నిశ్శబ్దంలోకి దూకారని కాదు.మాటలు ఎక్కడ ఆపాలో గ్రహించారు. అక్కడి నుండి మౌనం ప్రవేశిస్తుంది.( అది తూర్పు దేశాల కవులు వేల ఏళ్లుగా
చేస్తున్నదే.). శబ్దాన్ని అనుసరించే ఉంటుంది అర్థం. కాబట్టే, ఇమేజ్ ని పదచిత్రం అన్నారు కాని అర్థ చిత్రం అనలేదు.
వెల్చేరు గారు ఈ వ్యాసంలో కవిత్వమ్లో ఉండే “నిశ్శబ్దాన్ని” నిర్వచించడంలో వెనకబడ్డారో.. లేక ఆయనకే ఆ విషయం లో సరైన స్పష్టత లేదో నాకు బోధపడలేదు గానీ మొత్తంగా ఇస్మాయిల్ ని కవిగా చూపించడంలో వెల్చేరు ఎక్కడో తోవమరిచినట్టున్నారు.
“క్లుప్తత” అన్నదానికి ఎక్కడైనా దానిదైన చోటుంది. కవిత్వం లోనూ జీవితం లోనూ కూడా!! జపనీయుల “హైకూ” లు ఇటువంటి క్లుప్తతతో బొమ్మలంటి రేఖాచిత్రాలని కవిత్వంగా గీసినవే!! అది ఒక తరహా కవిత్వం!
మాటలని మించిన మౌనానికి భాష లేదని నేనను గానీ అది “క్లుప్తత” అయితే కాదు. అదొక తాత్వికత. దాన్ని ఇస్మాయిల్ కవితలో ఎలా చూసారో మరింత వివరంగా వెల్చేరు చెప్పగలిగితే బాగుండేదేమో? అలాంటి కవి ఇస్మాయిల్ అవునో కాడో స్పష్టపడేది కూడాను.
ఇకపోతే కవిత్వంలో ” మాటల” ప్రయోజనం లేదని అనడానికి కూడా కుదరదు. విస్తరించ వలసిన చోట భావంలో “క్లుప్తత” అంతే చికాగ్గా ఉంటుంది.ఈ తారతమ్యం చూపించడంలో విమర్శకుడు విఫలమ్ కావడమ్ తరుచూ జరిగింది. ఇందుకు విమర్శకులు విమర్శకన్నా మించి కవులకి ఎక్కువ ప్రాధన్యం ఇవ్వడం ఒక కారణమ్ బహుశా!! వీళ్ళ మెచ్చుకోళ్ళలోనూ లేదా వీళ్ల దాటివేతలోనూ కూడా ఏ అంతస్సూత్రమూ కనిపించకపోవడం అన్నది విమర్శలోని పెద్ద లోపం !!
నారాయణరావు గారి అభిప్రాయాన్ని అనుసరించామా ” శ్రీశ్రీ” కవి కాడు. “తిలక్” కవి కాడు. అజంతా అసలే కాడు. అలాగే మరి కొందరు మిగతా కవులు కూడాను. శ్రీశ్రీ ” ఆహ:” తప్ప కవితా ఓ కవితా అన్నది కవితే కాకూడదు. అది శబ్ధమయమూ.. మాటల మయమూను. భాషని అతి చిక్కగా తన ఊహాచిత్రాలకి అతికించిన తిలక్ కవిత్వం ఈ లెఖ్ఖన వట్టి మాటల పోగులాగా మారిపోయే పరిస్థితి ఉంది మరి. ఒక కవిది ఒక తరహా కవిత్వం అని చెప్పడమ్ వేరు. అదులోని విశిష్టతని వివరించడమ్ వేరు. మాట ద్వారా ..ధ్వని ద్వారా అందవలసిన ఊహ దగ్గర కవిత్వంలో క్లుప్తతకీ నిశ్శబ్దానికీ పెద్దపీట వేయడమ్ వేరు.అది అన్ని చోట్లా నిజమ్ కాదు గనక. క్లుప్తతని ముందుకు తీసుకుని రావడం కోసం శబ్దశక్తిని తక్కువ చేయనఖ్ఖర లేదు. అయితే తన విమర్శనా శైలిలో ఇలాంటి దూకుడు విమర్శకునిగా వెల్చేరు చూపించడం కొత్త విషయమేమీ కాదు.
ఒక్కోసారి సాదా సీదా వచనంలో “మాటల్లో” సైతం మనసుని మేల్కొలిపే ఒక చిత్రిక పట్టిన భావం మృదువుగా తాకకపోదు. మాట అవసరమ్ ఎంత అని తెలిసి వాడగలగడమే కవితా నాణ్యతకి గుర్తు. అంతే గానీ పికాసా గీతల్లోలాగా మూడే మూడు మాటల్లో చిత్రం గీయడం కవికి అవసరం లేదు. కవి చిత్రకారుడి పాత్రలోకి వెళితే చిత్రకారుడు మాటల్లోంచి చెప్పినట్టు పాఠకునికి చెప్పాలీ అంటే ఎక్కువ రంగులు వాడాలి కాబోలు. అప్పుడక్కడ అదీ ఎబ్బెట్టుగానే ఉంటుంది కాదా??.
మాటకీ మాటకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం కవికి సహజంగా తెలుస్తుంది. అప్పుడే మంచి కవిత పుడుతుంది. సరైన మాటలు వాడటమే కవిత్వం!! అందువలన క్లుప్తతా.. నిశ్శబ్దమ్ కవితాస్వాదనకి చాలాసార్లు ప్రతిబంధకాలే అవుతాయి!!
ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది. తన భావ వ్యక్తీకరణకి ఆయన తెలుగు భాషని ఎన్నుకోవడమ్ అన్నది ఆయనకి మరి ఎందుకని అవసరం అయ్యిందో??
“సృజనల ప్రసారాల్లో భాష – అంటే వర్ణమాల, నిఘంటువు, ప్రతి పదార్ధ విశ్లేషణ మొదలైనవి, టెలిఫోన్ తీగెలు చేసే పని లాంటిదే చేస్తున్నాయి. భాష, ఆలోచన పకోడీలను, పళ్ళ రసాన్నీ కట్టిచ్చే పొట్లాల్లాంటివి. వాటిని విప్పి అవతల పారేసి, లోనున్నదాన్ని ఆస్వాదించవలసి ఉంది. ఈ అనుభవం ఆ సృజనే సాధించుకోవాలి తప్ప, దానిపైన మరిన్ని వివరణలతో ప్రయోజనం లేదని నా అనుమానం”
చాలా విలువైన మాట కనకప్రసాదు గారు. మీ తదుపరి వివరణ కోసం ఎదురుచూస్తూ..
ఈ మీ ఈమాటలో ఒకప్పుడు, అనగా బాగున్న రోజుల్లో చిక్కని ఉపదేశాల్లాంటి మంచి సరుకులు, అంతే చక్కని కామెంట్లు ఉండేవి. ఇప్పుడు ఉపదేశాల సంగతి ఎలాగున్నా కమెంట్లు మటుకు మతప్రబోధకులు చేసే “బ్రెయిన్ వాషింగ్” ఉపన్యాసాల్లాగా తయారైనాయి. ఆపైన “వాషింగ్” కాకపోగా “డ్రెయినింగు” ఎక్కువైపోయింది.
కొన్ని ఉపన్యాసాలు వింటే దెబ్బలూ, గాయాలు తగిలినా ఆ నొప్పులు అనుభవించటానికి బాగుంటాయి. మరి కొన్నేమో మొక్కపాటివారు అప్పుడెప్పుడో చెప్పినట్టు “అధ్యక్ష సమక్షమందు నిరక్షరకుక్షి నైన నేను, నా కుక్షింభరత్వము కొరకు ప్రత్యక్ష సాక్షీభూతముగా……” రీతిలో సాగుతుంటయి……
పత్రికను, మాబోటి పాఠకులని ఈ ప్రబోధకోపన్యాసాల కామెంట్ల నుండి రక్షించటానికి సంపాదకులకు శక్తి ప్రసాదించు మహాప్రభో!…..
విజ్ఞప్తి – ఒక వేళ ఈ కామెంటు కత్తిరించాలనుకుంటే, అసలు ప్రచురించకండి….
భవదీయుడు
వంశీ
[కామెంటు పెట్టి ఏం చేయాలో మాకూ దయచేసి చెప్పకండి – సం.]
ఒకే ఒక్క ఇస్మాయిల్ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
12/01/2010 4:49 pm
ఈ అభిప్రాయంలో ఆధారం లేని వ్యాఖ్యలు అనేకం. మచ్చుకి రెండు :
౧. ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది.
ఆయన జీవితకాలం బోధించింది తత్వ శాస్త్రం. ఆయన సన్నిహితులకు , ఆయన కవిత్వం సీరియస్ గా చదివిన అందరికీ ఇది తెలిసిన విషయమే.
మరిన్ని వివరాలకు ఇంద్రగంటి గారి అమ్మాయి ఇస్మాయిల్ గారు బ్రతికుండగానే చిత్రీకరించిన ఆయన ఆత్మకథ DVD చూడండి. లేదా ” కవిత్వంలో నిశ్శబ్దం” వ్యాస సంపుటిలో రమణారెడ్డి గారికి ఇచ్చిన బదులు చూడండి.
౨. ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఎవడా పాఠకుడు? ఏమా కథ ?? సదరు పాఠకునికి ఇతర కవులు ఆమోద యోగ్యమన్న విషయం మీకెలా తెలిసింది ?? మీకేమైనా కర్ణ పిశాచి ఉందా ?? పై అభిప్రాయం మీ అభిప్రాయం లాగే ఉంది. తప్పు లేదు.పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
ఇక అసలు వ్యాసం విషయానికొస్తే -పొసగని విషయాలు అనేకం , మచ్చుకు రెండు :
౧.ప్రసార మాధ్యమాల పాత్రను అతిగా అంచనా వేశారు.
౨. శబ్దార్థాలను అర్థం చేసుకున్న తీరులో గందరగోళం ఉంది.,
” పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది. ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది. అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు. చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది. అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది. అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు. కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి, అందులో ప్రయోజనం వుందని గమనించి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్ ఒక్కడే.”
ప్రాచీన కాలం నుండి నానా విధాల మాధ్యమాలు వచ్చాయి: వెదురు బద్ద, గట్టి ఎముక,మట్టి పలక, పట్టు వస్త్రం ,తాటాకు..నానా రకాల కాగితాలు ,ఇప్పుడు ఈ రీడర్లు. మాధ్యమాలు కవికి ఎటువంటి
అవకాశాన్ని ఇవ్వవు.అవి కేవలం మాధ్యమాలే.పద్యం రూపు దిద్దుకోనేది కవి మనసులో.ఆ తర్వాత, ఏదో ఒక మాధ్యమం ద్వారా అది పాఠకుని మనసు చేరుతుంది. అంతవరకే దాని పాత్ర.పద్యం చేరవలసిన చోటు చేరిన తర్వాత మాధ్యమంతో ఇక పని లేదు. అది , పాఠకుని మనసులో స్వతంత్రంగా మనగలదు అన్నది మనకు అనుభవంలోని విషయం. ఆసక్తి ఉండాలే గాని, ఎన్నో పద్యాలు గుర్తుంటాయి.
కాబట్టి శబ్దం అప్రధాన మయ్యే ప్రసక్తే లేదు. అచ్చు యంత్రం రాక ముందు కూడా లేఖకులు ఉండే వారు , కావలసినన్ని ప్రతులు తయారయ్యేవి , చలామణీ లోకి వచ్చేవి. చైనా లోని సమాధులు తవ్విన ప్రతి సారి సదరు వ్యక్తికీ ఇష్టమైన పుస్తకాలూ పట్టు వస్త్రం పై రాసినవి దొరుకుతూనే ఉన్నాయి. ( క్రీ.పూ రెండవ శతాబ్దం నాటి ప్రతులు లభ్యం ) ఇంకా ముందుకు వెళితే వెదురు ( క్రీ.పూ నాల్గవ శతాబ్దం )కూడా వాడారు.( వాటి పరిష్కృత ప్రతులు నా దగ్గరున్నాయి.)
” తన కవిత్వంలో, శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు. ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే. కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు. భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్ అపూర్వంగా సాధించారు “
ఇస్మాయిల్ శబ్దానికి పట్టం కట్ట లేదు అంటే నిలువునా నిశ్శబ్దంలోకి దూకారని కాదు.మాటలు ఎక్కడ ఆపాలో గ్రహించారు. అక్కడి నుండి మౌనం ప్రవేశిస్తుంది.( అది తూర్పు దేశాల కవులు వేల ఏళ్లుగా
చేస్తున్నదే.). శబ్దాన్ని అనుసరించే ఉంటుంది అర్థం. కాబట్టే, ఇమేజ్ ని పదచిత్రం అన్నారు కాని అర్థ చిత్రం అనలేదు.
తమ్మినేని యదుకుల భూషణ్.
విద్యాసుందరి గురించి G VENKAT గారి అభిప్రాయం:
12/01/2010 2:20 am
ఛాల భాగుంది. థాంక్స్
ఒకే ఒక్క ఇస్మాయిల్ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
12/01/2010 1:08 am
వెల్చేరు గారు ఈ వ్యాసంలో కవిత్వమ్లో ఉండే “నిశ్శబ్దాన్ని” నిర్వచించడంలో వెనకబడ్డారో.. లేక ఆయనకే ఆ విషయం లో సరైన స్పష్టత లేదో నాకు బోధపడలేదు గానీ మొత్తంగా ఇస్మాయిల్ ని కవిగా చూపించడంలో వెల్చేరు ఎక్కడో తోవమరిచినట్టున్నారు.
“క్లుప్తత” అన్నదానికి ఎక్కడైనా దానిదైన చోటుంది. కవిత్వం లోనూ జీవితం లోనూ కూడా!! జపనీయుల “హైకూ” లు ఇటువంటి క్లుప్తతతో బొమ్మలంటి రేఖాచిత్రాలని కవిత్వంగా గీసినవే!! అది ఒక తరహా కవిత్వం!
మాటలని మించిన మౌనానికి భాష లేదని నేనను గానీ అది “క్లుప్తత” అయితే కాదు. అదొక తాత్వికత. దాన్ని ఇస్మాయిల్ కవితలో ఎలా చూసారో మరింత వివరంగా వెల్చేరు చెప్పగలిగితే బాగుండేదేమో? అలాంటి కవి ఇస్మాయిల్ అవునో కాడో స్పష్టపడేది కూడాను.
ఇకపోతే కవిత్వంలో ” మాటల” ప్రయోజనం లేదని అనడానికి కూడా కుదరదు. విస్తరించ వలసిన చోట భావంలో “క్లుప్తత” అంతే చికాగ్గా ఉంటుంది.ఈ తారతమ్యం చూపించడంలో విమర్శకుడు విఫలమ్ కావడమ్ తరుచూ జరిగింది. ఇందుకు విమర్శకులు విమర్శకన్నా మించి కవులకి ఎక్కువ ప్రాధన్యం ఇవ్వడం ఒక కారణమ్ బహుశా!! వీళ్ళ మెచ్చుకోళ్ళలోనూ లేదా వీళ్ల దాటివేతలోనూ కూడా ఏ అంతస్సూత్రమూ కనిపించకపోవడం అన్నది విమర్శలోని పెద్ద లోపం !!
నారాయణరావు గారి అభిప్రాయాన్ని అనుసరించామా ” శ్రీశ్రీ” కవి కాడు. “తిలక్” కవి కాడు. అజంతా అసలే కాడు. అలాగే మరి కొందరు మిగతా కవులు కూడాను. శ్రీశ్రీ ” ఆహ:” తప్ప కవితా ఓ కవితా అన్నది కవితే కాకూడదు. అది శబ్ధమయమూ.. మాటల మయమూను. భాషని అతి చిక్కగా తన ఊహాచిత్రాలకి అతికించిన తిలక్ కవిత్వం ఈ లెఖ్ఖన వట్టి మాటల పోగులాగా మారిపోయే పరిస్థితి ఉంది మరి. ఒక కవిది ఒక తరహా కవిత్వం అని చెప్పడమ్ వేరు. అదులోని విశిష్టతని వివరించడమ్ వేరు. మాట ద్వారా ..ధ్వని ద్వారా అందవలసిన ఊహ దగ్గర కవిత్వంలో క్లుప్తతకీ నిశ్శబ్దానికీ పెద్దపీట వేయడమ్ వేరు.అది అన్ని చోట్లా నిజమ్ కాదు గనక. క్లుప్తతని ముందుకు తీసుకుని రావడం కోసం శబ్దశక్తిని తక్కువ చేయనఖ్ఖర లేదు. అయితే తన విమర్శనా శైలిలో ఇలాంటి దూకుడు విమర్శకునిగా వెల్చేరు చూపించడం కొత్త విషయమేమీ కాదు.
ఒక్కోసారి సాదా సీదా వచనంలో “మాటల్లో” సైతం మనసుని మేల్కొలిపే ఒక చిత్రిక పట్టిన భావం మృదువుగా తాకకపోదు. మాట అవసరమ్ ఎంత అని తెలిసి వాడగలగడమే కవితా నాణ్యతకి గుర్తు. అంతే గానీ పికాసా గీతల్లోలాగా మూడే మూడు మాటల్లో చిత్రం గీయడం కవికి అవసరం లేదు. కవి చిత్రకారుడి పాత్రలోకి వెళితే చిత్రకారుడు మాటల్లోంచి చెప్పినట్టు పాఠకునికి చెప్పాలీ అంటే ఎక్కువ రంగులు వాడాలి కాబోలు. అప్పుడక్కడ అదీ ఎబ్బెట్టుగానే ఉంటుంది కాదా??.
మాటకీ మాటకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం కవికి సహజంగా తెలుస్తుంది. అప్పుడే మంచి కవిత పుడుతుంది. సరైన మాటలు వాడటమే కవిత్వం!! అందువలన క్లుప్తతా.. నిశ్శబ్దమ్ కవితాస్వాదనకి చాలాసార్లు ప్రతిబంధకాలే అవుతాయి!!
ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది. తన భావ వ్యక్తీకరణకి ఆయన తెలుగు భాషని ఎన్నుకోవడమ్ అన్నది ఆయనకి మరి ఎందుకని అవసరం అయ్యిందో??
రమ.
దుప్పట్లో ముడుక్కున్నా గురించి madhurasree గారి అభిప్రాయం:
11/30/2010 6:53 am
తీసుకున్న వస్తువును శిల్ప పరంగా చెప్పడం సాహిత్య లక్షణం లక్షణం కోల్పొయింది
జీనో పేరడాక్సు గురించి Sowmya గారి అభిప్రాయం:
11/28/2010 11:52 am
“భక్తి తలకెక్కిన చరిత్రకారుడెవడో
రక్త సిక్తమైన ఆ మాంసపుముద్దని
ఎర్ర మందారఁవనో
మోదుగపూవనో కీర్తిస్తాడు.”
– నాకసలు పైదంతా వద్దు. ఇదొక్కటే చాలు! 🙂
ఏ నడలో ఏ ఎడలో! గురించి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం:
11/27/2010 6:27 am
చాలా విలువైన మాట కనకప్రసాదు గారు. మీ తదుపరి వివరణ కోసం ఎదురుచూస్తూ..
– సుబ్రహ్మణ్యం.
ప్రేమ కవితలు గురించి RAMAKRISHNA గారి అభిప్రాయం:
11/27/2010 1:17 am
చాల చాల బాగున్నై
నువ్వు గురించి srinivas గారి అభిప్రాయం:
11/26/2010 1:45 am
it is nice very good
కుతంత్రం గురించి Kumar N గారి అభిప్రాయం:
11/26/2010 1:25 am
Wonderful and ofcourse sweet too..I fell in love with the girl.
And Aruna Pappu’s comment is adorable
ఇస్మాయిల్ గారితో నా పరిచయం గురించి వంశీ గారి అభిప్రాయం:
11/25/2010 4:16 pm
ఈ మీ ఈమాటలో ఒకప్పుడు, అనగా బాగున్న రోజుల్లో చిక్కని ఉపదేశాల్లాంటి మంచి సరుకులు, అంతే చక్కని కామెంట్లు ఉండేవి. ఇప్పుడు ఉపదేశాల సంగతి ఎలాగున్నా కమెంట్లు మటుకు మతప్రబోధకులు చేసే “బ్రెయిన్ వాషింగ్” ఉపన్యాసాల్లాగా తయారైనాయి. ఆపైన “వాషింగ్” కాకపోగా “డ్రెయినింగు” ఎక్కువైపోయింది.
కొన్ని ఉపన్యాసాలు వింటే దెబ్బలూ, గాయాలు తగిలినా ఆ నొప్పులు అనుభవించటానికి బాగుంటాయి. మరి కొన్నేమో మొక్కపాటివారు అప్పుడెప్పుడో చెప్పినట్టు “అధ్యక్ష సమక్షమందు నిరక్షరకుక్షి నైన నేను, నా కుక్షింభరత్వము కొరకు ప్రత్యక్ష సాక్షీభూతముగా……” రీతిలో సాగుతుంటయి……
పత్రికను, మాబోటి పాఠకులని ఈ ప్రబోధకోపన్యాసాల కామెంట్ల నుండి రక్షించటానికి సంపాదకులకు శక్తి ప్రసాదించు మహాప్రభో!…..
విజ్ఞప్తి – ఒక వేళ ఈ కామెంటు కత్తిరించాలనుకుంటే, అసలు ప్రచురించకండి….
భవదీయుడు
వంశీ
[కామెంటు పెట్టి ఏం చేయాలో మాకూ దయచేసి చెప్పకండి – సం.]