“ఆ వెళ్ళాంలెండి! మరీ అర్ధరాత్రి మూడింటికే లేపి కార్లో కుదేస్తారు. ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు అది చూద్దాం ఇది చూద్దాం అంటూ హడావుడి పెడతారు. అయినా ఎక్కడ చూసినా అవే పరాఠాలు, అదే బటర్ చికెన్. ఏ లోకానికెళ్ళినా మీకు మాత్రం మందు పడాల్సిందే. మీ మందు కార్యక్రమం అయ్యేదాకా మేమంతా డిన్నర్ కోసం చూస్తూ చొంగలు కార్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు చూళ్ళేదూ?”
Category Archive: సంచికలు
ఉన్నట్టుండి
గోడమీంచి వూగని వూయల పైకి
దాని మీంచీ వూగే చిటారు కొమ్మపైకి ఎగిరింది
పిడికెడంత బరువుకే
కిందాకా తూగిన కొమ్మచివరన
చిన్ని పిట్ట పైకీ కిందకీ సంతోషాన తేలింది
ఎవరైనా చూశారేమో బహుశా
వేగం పెరిగిన శ్వాసలనీ
వెనక సీట్లో వేడిమినీ నీరెండలో ముంగురులనీ
గోళ్ళ చివర్ల నెత్తుటి ఎరుపునీ తిరిగిపోయే తారల మెరుపునీ
పల్చగా జారిన విశ్వాసాల కొనకంటి చూపులనీ
పూర్వం, ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చేది యోగక్షేమాలను తెలియజేస్తూ. వ్యక్తులు అవసరం మేరకు మాట్లాడేవారు. అంచేత ఏ వ్యక్తి అయినా అవతలివారికి ఎంత మేరకు అవసరమో అంతే తెలిసేవారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి వ్యక్తి సోషల్ మీడియాలో ‘ఎవైలబుల్’గా అందుబాటులో ఉంటున్నాడు. ప్రతిరోజు అనేక విషయాల మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వాటి మీద చర్చోపచర్చలు చేస్తున్నాడు.
నాకోసం ఎవరూ పుట్టినరోజులు జరపలేదు. కేక్ కోయలేదు. కేండిల్స్ వెలిగించి పాటలూ పాడలేదు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక అద్దం ముందు నిల్చుని చూసుకున్నాను. నా శరీరంలో మార్పులు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను నేను చూసుకొని మురిసిపోతూ చాలాసేపు నిల్చుని ఉండిపోయాను, ఆ రోజు సాయంత్రం పిన్ని కొట్టిన చెంపదెబ్బ తాలూకు గుర్తు కనిపిస్తూనే ఉన్నా పట్టించుకోకుండా.
పాశ్చాత్యులు హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలతో వ్యాసుడు రాసిన భారతాన్ని పోలుస్తారు. కేవలం ఉపరితలం మీద కనిపించవచ్చేమో కానీ లోతుగా పరిశీలిస్తే ఈ పోలిక సరికాదు. హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలు రెండింటికంటే భారతం రెట్టింపుకి మించి పొడుగు ఉంటుంది! భారత యుద్ధం మానవుల అత్యాశ వల్ల జరిగితే ట్రాయ్ యుద్ధం దేవతల చెలగాటాల వల్ల జరుగుతుంది.
మహమ్మదీయులీదేశమునకు వచ్చిన కొలదికాలములోనే మారిపోయిరి. ఈ దేశమునకు వచ్చిన ముసల్మానులు క్రౌర్యమును మతావేశమును వీడి సాత్వికులైరి. ఈ దేశములోని ఇస్లాము, విదేశములలోని ఇస్లాముకు భిన్నమైన మతముగా మార్పుజెందినది. అది భారతీయ సంస్కృతిని పొంది జాతీయ మతముగా మారినది. ఈ దేశపు మహమ్మదీయులు మనోవాక్కాయకర్మములగు భారతీయులుగనేయుండిరి.
వేద పండితుడు ప్లస్ సంస్కృత మాష్టారి కూతురిని పెళ్ళిచేసుకొని తప్పు చేశానని వెయ్యిన్నొక్కోమారు విచారించాడు ప్రద్యుమ్నుడు. ఈ విషయంపై చర్చను పొడిగిస్తే ఆమె వేదాలు, పురాణాలు చెబుతుందేమోనని భయపడ్డాడు కూడా. మొన్నీమధ్యనే ఒకడు దైవదూషణ చేసి బ్రహ్మరాక్షసుడైన కథను చెప్పింది. పైగా వర్క్ ఈజ్ గాడ్ అనీ, పనియే ప్రత్యక్షదైవం అనీ తేల్చిచెప్పింది.
చిత్రంగా వినిపించినా, ఈ సంకలనం కవిత్వ పాఠకుల కన్నా కవులకే ఎక్కువ అవసరం. ప్రస్తుతం తెలుగులో కవిత్వం రాస్తున్నవాళ్ళందరూ వాదాలకతీతంగా చదివి చూడాల్సిన పుస్తకమిది. ఈ కొత్త పోకడల కవిత్వ రీతులను అధ్యయనం చెయ్యాలి. మూసలు బద్దలు కొట్టిన తీరును గమనించాలి. వస్తువుతో కవి ఎంత నిజాయితీగా మమేకమైతే కొత్త అభివ్యక్తి వస్తుందో అర్థంచేసుకోవాలి.
ఈ సంచికలో వినిపిస్తున్న పదహారు పాటలలో, ఒక్క రెండిటిని మినహాయిస్తే, అన్నీ ప్రైవేటు పాటలుగా రికార్డులపైన వచ్చినవి. వైజయంతిమాల సొంతంగా తెలుగులో ఇచ్చిన నాలుగు పాటల రికార్డులు, గాయని ఎమ్. కృష్ణకుమారి, గాయని బి. ఎన్. పద్మావతి పాడిన పాటలు. వీరి వివరాలు తెలిపితే సంతోషం.
క్రితం సంచికలోని గడినుడి-43కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేను మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-42 సమాధానాలు.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గిడుగు రామ్మూర్తి పంతులుగారిని కలుసుకున్న సందర్భాన్ని వ్యాసరూపంలో, వారి ప్రబుద్ధాంధ్ర పత్రికలో (డిసెంబరు10, 1935) ప్రకటించారు. ఆ వ్యాసపు పఠనరూపం ఇది.
అడ్డం ఇక్కడ తలగుడ్డ వేసేరంటే మీరనుకున్నది సాధిస్తారు (5) సమాధానం: కోటలోపాగా ఈ శుద్ధులు ఆచరించడం మేధాశక్తికి పరీక్షలు కాబోలు (7) సమాధానం: అష్టావధానములు […]
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
అభిరుచి, అధ్యయనం ఉన్న సంపాదకులు; భావనాగరిమ, రచనాపటిమ ఉన్న రచయితలు; ఆసక్తి గల పాఠకులతో తెలుగునాట పత్రికలకు స్వర్ణయుగమొకటి నడిచింది. అయితే రచనతో ఎదురైన సమస్యలకు ఏకపక్షంగా కత్తెర పట్టిన సంపాదకులు, తమ రచనలు వేరొకరు పరిష్కరించడం తమ ప్రతిభకు అవమానకరంగా భావించిన రచయితలు ఆనాడూ లేకపోలేరు. సాహిత్యం వ్యాపారమైన సమయంలోనే సాహిత్యంలో రాజకీయవాదాలూ ప్రబలమై ప్రచురణకర్తలే సంపాదకులూ అయినాక పత్రికల ఏకఛత్రాధిపత్యానికి రచయితలు, పాఠకులు తలొగ్గక తప్పలేదు. తిరస్కరణలు, ప్రచురణలూ ప్రశ్నార్థకంగా మారి, సమీక్షాపరిష్కరణల గురించిన సంభాషణ కొరవడిన ఆకాలం సంపాదకుల పట్ల ఔత్సాహిక రచయితలకు అపనమ్మకాన్ని మిగిల్చింది. క్రమేణా పత్రికాప్రాబల్యం కనుమరుగై సాంకేతిక సహకారంతో రచయితలే ప్రచురణకర్తలుగా మారిన ఈకాలం తామేది రాస్తే అదే సాహిత్యం అనే అహాన్ని నేటి రచయితలకు మిగిల్చింది. ఈ రెండు వైపరీత్యాల ఊగిసలాటలో ఏది సాహిత్యమో ఏది కాదో, అది ఏ ప్రమాణాలతో ప్రచురణకు నోచుకుంటోందో అర్థంకాని అయోమయ వాతావరణంలో తెలుగు సాహిత్యలోకం కూరుకుపోయింది. ఈ స్థితిలో వెబ్పత్రికలు వచ్చాయి. సాహిత్యాన్ని శ్రద్ధతో, గౌరవంతో సమీపించే రచయితలకు మునుపు సాధ్యపడని వేదికను ఇవి కల్పించాయి. ప్రచురణకు ముందుగానే రచయితకు తమ పరిష్కరణలకు కారణాలు చూపించడానికి సంపాదకులకు, ఆ మార్పుల పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించడానికి రచయితలకు, వెబ్ పత్రికలు సౌలభ్యాన్ని కలిగించాయి. అందువల్ల, రచనను మెరుగుపరిచి ప్రచురణ దాకా తెచ్చేందుకు సంపాదకులూ రచయితలూ కలిసికట్టుగా పనిచేయడానికి అవసరమైన ఆ సంభాషణ ఇప్పుడు సాధ్యమయింది. రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో దానికి అతి దగ్గరగా రచనను తీసుకువెళ్ళాలన్న సంపాదకుడి బాధ్యతను ఇది కొంత తేలిక చేస్తుంది. సంపాదకుడి ఆశయమూ రచనను మెరుగు పర్చడమేనని తమ వ్యాసంగం పట్ల గౌరవం ఉన్న రచయితలకూ ఇదే తెలియజేస్తుంది. సంపాదకులు-సమీక్షలు-పరిష్కరణ అనేవాటి గురించే కాక సాహిత్యం-సృజన-అభివ్యక్తి వంటి వాటిపట్ల రచయితలకు ఉన్న అపోహలు కూడా చెదరాలంటే ఇలాంటి సుహృద్భావ వాతావరణం ప్రస్తుతం తెలుగులో తప్పనిసరి. ఒక రచనను సంపాదకులు ఎంత శ్రద్ధగా పరిశీలించి పరిష్కరించి ప్రచురిస్తున్నారన్నదానిబట్టే సాహిత్యం పట్ల, రచయితల పట్ల వారికున్న గౌరవనిబద్ధతలు, అవి ఉండడంలోని అవసరం, అనివార్యత స్పష్టమవుతాయి. కాబట్టి, సంపాదకత్వమంటే కేవలం రచనలకు ఒక వేదికను ఇవ్వడం మాత్రమే కాదని తెలిసిన సంపాదకులు నేడు అవసరం. తమ అపరిపక్వ భావావేశాలకు తావివ్వడమే ప్రోత్సాహం అని అపోహపడే రచయితలు నేడు అనవసరం. సాహిత్యవ్యాసంగం ఒక నిరంతర అధ్యయనం అని తెలుసుకొని ఈ అవకాశాన్ని తెలుగు సాహిత్యకారులు ఎంతగా సద్వినియోగం చేసుకుంటారన్నది వారి వివేచనపై ఆధారపడివుంటుంది.
ఐతే, ఏ దుర్ముహూర్తాన శ్రీశ్రీ సంపాదకుడంటే నాకింపారెడు భక్తి కలదు అని వెటకరించాడో, అది ఆయనకు ఏ అనుభవం అయో, కాకో, సరదాకో చెప్పాడో కాని అది పట్టుకుని కర్రసాము చేయడం ఒక అలవాటయింది కవులకూ రచయితలకూ. అసలే సాహిత్య విమర్శ మనకు మృగ్యం. అలాంటప్పుడు నేను రాసింది దిద్దడానికి నువ్వెవరు అనడం రానురానూ ఏ విమర్శనూ తీసుకోలేకపోవడానికి దారి తీసింది.
ఉన్నంతసేపు దిగులుగా ఉంటావు. నవ్వితే మాత్రం పిచ్చిదాన్లా నవ్వుతావేమ్మా, అన్నాడు నాన్న. రాత్రి దాదాపు స్పృహపోతూ తలపక్కకి వాలుస్తుంటే ఏవో ఇంజెక్షన్లు పొడిచేరు నాలుగు చోట్ల. ఇవ్వాళ తల ఎంత తేలిగ్గా ఉందో, ఏ పిచ్చి ఆలోచనలు లేకుండా. ఆ ఇంజెక్షన్లేవో రోజూ చేస్తే బాగుండు. రోజూ ఇంజెక్షన్లు కావాలనుకోవడం కంటే పిచ్చి ఆలోచన ఏముంది, అన్నాడు కొడుకు. నాకెందుకో ఇంటికన్నా ఇక్కడే హాయిగా ఉంది.
మన ఇలాకాలో మొనగాడిని
బంగారు పతకాల వేటగాడిని
ఏమనుకున్నావ్,మామయ్యంటే?
ఆ పురవీథుల్లో యువసింహాన్ని
నా బ్లాక్ అండ్ వైట్ కాలానికి
నేనే ఈస్టమన్ కలర్ హీరోని!
బయటి చలి వెన్నులో కూడా అనుభవమైంది. అటునుంచి ఎవరూ రావట్లేదని నిర్ధారణ కోసం ఒకసారి చెవిని మళ్ళీ కొంచెం ముందుకు వంచాడు. ఏ అలికిడీ లేదు. చల్లటి నీళ్ళలో అడుగు పెట్టేముందు అనుభవించే క్షణకాలపు తటపటాయింపు. నెమ్మదిగా కుడికాలు మోపాడు. ఏమీ తెలియలేదు. రెండో అడుగు కూడా పడ్డాక మొత్తం మనిషి బరువు పడటం వల్ల చెక్క క్రీక్మంది. ఒక క్షణం ఆగి, మళ్ళీ పైకి కదిలాడు.
ఇలాటి వర్షపురోజులు ఎలా గడిచేవి చిన్నప్పుడు?! స్కూలుకి అప్పటికప్పుడు సెలవు ప్రకటించేసేవారు. తడుచుకుంటూ ఇంటికెళ్ళేసరికి అమ్మ అననే అనేది, ‘వర్షం కాస్త తగ్గేక పిల్లల్ని వదలచ్చుకదా’ అంటూ. నీళ్ళోడుతున్న తల తుడిచి, పొడిబట్టలు మార్పించేది. నేను ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళటం చూసేకే అన్న స్కూల్ బ్యాగ్ గుమ్మంలోంచి లోపలికి విసిరి అమ్మ చేతికి అందకుండా పారిపోయేవాడు. ఆ చిన్ననాటి ప్రేమ ఏమయిపోయింది?